తోట నరసింహం
తోట నరసింహం ఆంధ్ర ప్రదేశ్కు చెందిన కీలక నేత.. 1962 జూన్ 6న తోట వరహాలయ్య, పద్మాక్షమ్మ దంపతులకు జన్మించారు.. 1986 నవంబరు 25న తోట సరస్వతి (వాణి) తో వివాహమైంది. నరసింహం దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాపు సామాజికవర్గ నేతల్లో తోట నరసింహం ఒకరు.. జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు తెలుగుదేశం నుంచి రెండు సార్లు (2004-09, 2009-14) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకసారి మంత్రిగా పనిచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఎన్నికలో సమీప వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పై గెలుపొందిన తోట నరసింహం.. లోక్సభలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన తోట నరసింహం.. జగ్గంపేట నుంచి పోటీచేసి గెలుపొందారు. 2024లో కూడా జగ్గంపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా తోట నరసింహం పోటీచేస్తున్నారు. జగ్గంపేటలో టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రు పోటీచేస్తున్నారు.
Phase | Date | State | Seat |
---|---|---|---|
1 | April 19, 2024 | 21 | 102 |
2 | April 26, 2024 | 13 | 89 |
3 | May 07, 2024 | 12 | 94 |
4 | May 13, 2024 | 10 | 96 |
5 | May 20, 2024 | 8 | 49 |
6 | May 25, 2024 | 7 | 57 |
7 | Jun 01, 2024 | 8 | 57 |