తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 3 ఏళ్ల అనుభవం ఉంది. 2021లో ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం నుంచి పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం కోర్సు పూర్తి చేసి గ్రేట్ ఆంధ్రా డిజిటల్కు సబ్ ఎడిటర్గా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2022లో ప్రైమ్9 న్యూస్ ఛానల్ల్లో స్పీడ్ న్యూస్ బులిటెన్కు సబ్ ఎడిటర్గా పనిచేశాను. ఆ తరువాత 2023లో డైల్ తెలుగు డిజిటల్ విభాగంలో సబ్ ఎడిటర్, కంటెంట్ రైటర్గా ఉన్నాను. ప్రస్తుతం టీవీ9లో సబ్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.
CM Chandrababu: రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం..
ఏపీ అసెంబ్లీ నిరవదికంగా వాయిదా పడింది. మొత్తం అయిదు రోజుల పాటూ నిర్వహించిన సమావేశాల్లో భాగంగా అనేక అంశాలపై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. అసెంబ్లీ నోటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర విభజనతో సమస్యలు వచ్చాయన్నారు. గతంలో రూ. 200 పెన్షన్ రూ. 2000కు పెంచామని చెప్పారు. ఈసారి రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని చెప్పాం.. ఇస్తున్నామని వివరించారు.
- Srikar T
- Updated on: Jul 26, 2024
- 9:53 pm
Prahlad Joshi: కొత్త వివాదంలో కాంగ్రెస్.. ఆ ప్రాంతం పేరు మార్పును ఖండించిన కేంద్ర మంత్రి..
రామ్ నగర్ జిల్లా పేరును బెంగళూరు సౌత్ జిల్లాగా మార్చేందుకు కర్ణాటక మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు. బెంగళూరులోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలోని కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో రాం నగర్ అనే పేరు కలిగిన ప్రాంతాన్ని బెంగళూరు సౌత్ జిల్లాగా మారుస్తూ కేబినెట్ ఆమోదించింది.
- Srikar T
- Updated on: Jul 26, 2024
- 7:08 pm
CM Chandrababu: ఏపీ అసెంబ్లీలో ఆసక్తికరపరిణామం.. నవ్వులు పూయించిన సీఎం చంద్రబాబు..
ఏపీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబునాయుడు..గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై పెట్టిన కేసులను అసెంబ్లీ సాక్షిగా వివరించారు. ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో కేసులున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. గతప్రభుత్వం పనితీరును సీఎం చంద్రబాబు ఎండగడుతున్నారు. లిక్కర్ పాలసీ విధానంపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆ తరువాత రాష్ట్రంలో 2014-2019 మధ్య లా అండ్ ఆర్ఢర్ సజావుగా సాగేదన్నారు. గతం ఐదేళ్లలో అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదన్నారు.
- Srikar T
- Updated on: Jul 25, 2024
- 3:53 pm
KCR: ఈ రంగాలపై ప్రభుత్వం పాలసీ ఏంటి.. బడ్జెట్పై కేసీఆర్ కౌంటర్..
తెలంగాణ బడ్జెట్పై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. భట్టి పద్దు బడ్జెట్లాగా లేదు.. రాజకీయ ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు. బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందన్నారు. భట్టి విక్రమార్క బడ్జెట్ను నొక్కి నొక్కి చెప్పడం తప్ప వాస్తవం లేదన్నారు. రాష్ట్రం మీద, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద తమకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందన్నారు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం లేదని విమర్శించారు. ప్రతి ఒక్క అంశాన్ని కూలంకశంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసే బడ్జెట్ ఇది అని కౌంటర్ ఇచ్చారు.
- Srikar T
- Updated on: Jul 25, 2024
- 3:31 pm
Acne Tips: 40 ఏళ్లలో మొటిమలా.. సులువైన ఆయుర్వేద టిప్స్..
వయసు ముదురుతున్న కొద్దీ ముఖంపై ముడతలు సహజం. అయితే మొటిమలు కూడా వస్తూ ఉంటాయంటున్నారు చర్మవ్యాధి నిపుణులు. సాధారణంగా ముఖంపై మొటిమలు టీనేజర్స్ లో వస్తూ ఉంటాయి. వాటిని తొలగించుకోవడం కోసం నానా తిప్పలుపడుతూ ఉంటారు. అనేక క్రీములు, టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. ఆ వయసు వెళ్లిపోయిన వెంటనే మొటిమలు కూడా క్రమంగా కనుమరుగవుతూ ఉంటాయి. అవి తిరిగి 40 ఏళ్ల తరువాత మళ్ళీ వస్తాయంటున్నారు వైద్య నిపుణులు.
- Srikar T
- Updated on: Jul 24, 2024
- 6:31 pm
‘ప్రధానిని కలుద్దాం రండి’.. బీఆర్ఎస్కు మంత్రి భట్టి విక్రమార్క సవాల్..
తెలంగాణ అసెంబ్లీలో భట్టి విక్రమార్క ప్రాజెక్టులపై మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టు కట్టింది బీఆర్ఎస్ కాదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గోదావరి ఏడు మండలాల విలీనంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఏడు మండలాల విలీనంపై ఎలాంటి చర్చ జరగకుండానే రాష్ట్ర విభజన బిల్లు పాసైందన్నారు. లక్షలాది ఎకరాలు నీట మునగడానికి కారణం బీఆర్ఎస్ పార్టీయే అని విమర్శించారు. ఈ సందర్భంగానే సింగరేణి గనులపై కూడా స్పందించారు.
- Srikar T
- Updated on: Jul 24, 2024
- 8:16 pm
YS Jagan: ఢిల్లీలో ముగిసిన వైఎస్ జగన్ దీక్ష.. ఈ జాతీయ పార్టీ నేతల మద్దతు..
ఢిల్లీలో వైఎస్ జగన్ నిరసన దీక్ష ముగిసింది. దేశ వ్యాప్తంగా 8పార్టీల నేతల మద్దతు లభించింది. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మహారాష్ట్ర నుంచి ఉద్ధవ్ శివసేన, వెస్ట్ బెంగాల్ నుంచి టీఎంసీ, తమిళనాడు నుంచి ఏఐడీఎంకే, ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్ వాదీ పార్టీ, ఢిల్లీ, పంజాబ్ నుంచి ఆమ్ఆద్మీ పార్టీ ఇలా పలు పార్టీల నేతలు మద్దతు పలికారు.
- Srikar T
- Updated on: Jul 24, 2024
- 4:43 pm
Nara Lokesh: తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్ క్లారిటీ.. ఎంతమందికి ఇస్తారంటే..
తల్లికి వందనంపై మంత్రిలోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానాలు ఇచ్చారు. అమ్మకు వందనం పథకంపై వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూలుకు వెళ్తుంటే అంతమందికీ ఇస్తామన్నారు.
- Srikar T
- Updated on: Jul 24, 2024
- 3:19 pm
Supreme Court: నీట్ పరీక్ష రద్దుపై ముగిసిన విచారణ.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు..
నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్ అంశంపై విచారణ ముగియడంతో సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. నీట్ మళ్లీ నిర్వహించాలన్న విద్యార్థుల, పలువురు రాజకీయ నాయకుల డిమాండ్ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైన నేపథ్యంలో పిటిషన్ ను స్వీకరించింది సుప్రీం కోర్టు. ఆ విచారణ సందర్భంగా నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమేనని ధర్మాసనం నిర్ధారించింది.
- Srikar T
- Updated on: Jul 23, 2024
- 9:00 pm
Beauty Tips: తస్మాత్ జాగ్రత్త.. అందం కోసం వీటిని వాడుతున్నారా.. అంతే సంగతులు..
ఆధునిక యుగంలో ఫ్యాషన్ పరిపాటిగా మారిపోయింది. అనేక రసాయనాలను సౌందర్య సాధనాలుగా ఉపయోగిస్తున్నారు. అబ్బాయిలు ఈ మధ్య కాలంలో అందంపై కాస్త ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. ఆమ్మాయిలు అనాదిగా వీటిపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఇంట్లో ఏ చిన్నపాటి పార్టీ జరిగినా మేకప్ తప్పనిసరి అయిపోయింది. ఇలా చర్మ సౌందర్య సాధనాలు వాడటం మంచిదే అయినప్పటికీ వాటిని అధికంగా ఉపయోగిస్తే అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా వీటిని తరచూగా వాడకూడదు అంటున్నారు నిపుణులు.
- Srikar T
- Updated on: Jul 23, 2024
- 8:15 pm
Telangana: ‘అసెంబ్లీలో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తాం’.. కేంద్ర బడ్జెట్పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
కాంగ్రెస్, బీజేపీలకు చెరో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిపిస్తే.. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేపు పార్లమెంటులో కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని కోరారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంతో మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రాహుల్ గాంధీ తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడరా? అని ప్రశ్నించారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై సీఎం రేవంత్.. రాహుల్ గాంధీతో పార్లమెంటులో మాట్లాడించాలన్నారు. అలాగే ప్రధాని కార్యాలయం ముందు కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేయాలన్నారు.
- Srikar T
- Updated on: Jul 23, 2024
- 6:52 pm
CM Revanth: తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది.. బడ్జెట్పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల కక్ష పూరితంగా వ్యవహరించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 18సార్లు తాము మంత్రుల బృందంతో కలిసి రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి సమస్యలు తీర్చాలని కేంద్ర మంత్రులను కోరినట్లు తెలిపారు. చాలా సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర సమస్యలపై వివరించామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై స్పందించారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ది కోసం కేంద్రం ఆలోచన చేయడం లేదన్నారు.
- Srikar T
- Updated on: Jul 23, 2024
- 6:02 pm