తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 3 ఏళ్ల అనుభవం ఉంది. 2021లో ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం నుంచి పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం కోర్సు పూర్తి చేసి గ్రేట్ ఆంధ్రా డిజిటల్కు సబ్ ఎడిటర్గా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2022లో ప్రైమ్9 న్యూస్ ఛానల్ల్లో స్పీడ్ న్యూస్ బులిటెన్కు సబ్ ఎడిటర్గా పనిచేశాను. ఆ తరువాత 2023లో డైల్ తెలుగు డిజిటల్ విభాగంలో సబ్ ఎడిటర్, కంటెంట్ రైటర్గా ఉన్నాను. ప్రస్తుతం టీవీ9లో సబ్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.
PM Modi: పోలాండ్లో ప్రధాని మోదీ.. తెలుగుదేశం జెండాలతో ఘన స్వాగతం..
భారత ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ పర్యటన కొనసాగుతోంది. ఆయన తొలిసారి పోలాండ్ చేరుకున్న నేపథ్యంలో అక్కడ నివాసముంటున్న తెలుగువారు పీఎం మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ముందుకు వచ్చారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు భారత ప్రధాని మోదీ రాకతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టీడీపీ జెండాలతో ఘన స్వాగతం పలికారు.
- Srikar T
- Updated on: Aug 21, 2024
- 10:13 pm
ఏపీలో ఉద్యోగాల జాతర.. పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఆ సంస్థ..
ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ఐటీ శాఖ మంత్రి లోకేష్, ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఉదయం ఫాక్స్ కాన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు.
- Srikar T
- Updated on: Aug 19, 2024
- 7:42 pm
హైదరాబాద్లో కుండపోత.. అప్పటి వరకూ బయటకు రావొద్దన్న జీహెచ్ఎంసీ
హైదరాబాద్ సిటీలో మళ్లీ కుండపోత వర్షం.. ఉరుము లేదు.. మెరుపు లేదు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది. సిటీలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై చీకట్లు కమ్మేశాయి.
- Srikar T
- Updated on: Aug 19, 2024
- 5:55 pm
Telangana: కేసీఆర్, కేటీఆర్, కవితకు ఆ పదవులు ఖాయం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వాఖ్యలు చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని తెలిపారు. దీంతో పాటూ ఆ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు ఎలాంటి పదవులు వరిస్తాయోకూడా చెప్పేశారు.
- Srikar T
- Updated on: Aug 16, 2024
- 3:51 pm
ఆ పథకానికి విరాళాలు ఇవ్వండి.. అకౌంట్ వివరాలు వెల్లడించిన సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి గుడివాడలోని అన్న క్యాంటిన్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. పేదల కడుపు నింపే ఈ పథకంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
- Srikar T
- Updated on: Aug 15, 2024
- 10:18 pm
Telangana: బీఆర్ఎస్లోకి వచ్చేందుకు సిద్దంగా కొందరు నేతలు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్ఘనపూర్ జెట్పీటీసీ మార్పాక రవి, మాజీ ఎంపిపి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి చేరారు. వారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
- Srikar T
- Updated on: Aug 15, 2024
- 9:26 pm
వాడు మనిషి కాదు మానవ మృగం.. వైద్యురాలి హత్యాచారం కేసులో సంచలన విషయాలు..
కోల్కత్తాకు చెందిన జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ అమానవీయ ఘటనకు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత హత్యగా గుర్తించినప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్టులో అత్యాచారంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- Srikar T
- Updated on: Aug 13, 2024
- 6:56 pm
Watch Video: ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు.. వెలుగులోకి ముఖ్య సమస్యలు..
ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అకస్మిక తనిఖీ చేశారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
- Srikar T
- Updated on: Aug 13, 2024
- 2:42 pm
ఆ తెలుగు నటికి అరుదైన గౌరవం.. ఢిల్లీ నుంచి ప్రత్యేక ఆహ్వానం..
ప్రఖ్యాత కూచిపూడి నృత్యకారిణి, తెలుగు నటి సంధ్యారాజుకు అరుదైన గౌరవం లభించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే సదావకాశం వరించింది. 77వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో నిర్వహించే `ఎట్ హోమ్`సెలబ్రేషన్స్ కి ఆహ్వానిస్తూ లేఖ అందింది.
- Srikar T
- Updated on: Aug 12, 2024
- 10:26 pm
‘నా అవయవాలు దానం చేస్తున్న’.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిజ్ఙ..
హైదరాబాద్లో అవయవదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామినేని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర అదనపు డీజీపీ, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు. మన దేశంలో ఎవరైనా మరణించిన తర్వాత వారి దేహాలను ఖననం లేదా దహనం చేస్తుంటారని తెలిపారు.
- Srikar T
- Updated on: Aug 12, 2024
- 8:00 pm
వారెవ్వా.. ఇదికదా అసలైన అవినీతి అంటే.. విజిలెన్స్ సోదాల్లో షాకింగ్ నిజాలు..
విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో మాజీ సివిల్ ఇంజనీర్ అడ్డంగా దొరికిపోయాడు. ఆదాయానికి మించి ఆస్తులు పోగేసినట్లు సోదాల్లో బయటపడిందా. భువనేశ్వర్ లోని రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖలో సివిల్ ఇంజనీర్ గా పనిచేసి పదవీవిరమణ పొందిన తారా ప్రసాద్ మిశ్రను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
- Srikar T
- Updated on: Aug 12, 2024
- 7:04 pm
మహారాష్ట్రలో ఆ ఇరునేతల మధ్య విభేదాలు.. అర్థరాత్రి ఉద్రిక్త వాతావరణం..
మహారాష్ట్రలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ థాక్రే కాన్వాయ్ని అడ్డుకున్నారు కొందరు ఎంఎన్ఎస్ కార్యకర్తలు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని థానేలో అర్థరాత్రి ఉద్దవ్ థాక్రే వర్సెస్ రాజ్ థాక్రే వర్గాల మధ్య స్వల్ప ఘర్షణలు చెలరేగాయి.
- Srikar T
- Updated on: Aug 11, 2024
- 7:57 am