AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్

ప్రభాస్

రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్‌గా ప్రస్తుతం సత్తా చాటుతున్నాడు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ కెరియర్ మారిపోయిందని చెప్పవచ్చు. అప్పటి వరకు మాస్ హీరోగా ఉన్న ప్రభాస్.. బాహుబలి మూవీతో పాన్ ఇండియా హీరో అయిపోయారు. ఆదిపురుష్ మూవీతో హీరోగా తనకున్న ఇమేజ్‌ను 360 డిగ్రీలు మార్చుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు రెబల్ స్టార్ మూవీస్ బిజినెస్ రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లకు చేరుకుందంటే ప్రభాస్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అభిమానులు ప్రభాస్‌ను డార్లింగ్‌గా పిలుచుకుంటారు.

1979 అక్టోబర్ 23న మద్రాసులో జన్మించారు ప్రభాస్. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు వారి కుటుంబ స్వగ్రామం. తన తల్లితండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు ప్రభాస్. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర, అడవి రాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు సినిమాలు టాలీవుడ్‌లో యంగ్ రెబల్ స్టార్ రేంజ్‌ను పెంచేశాయి. బిల్లా, ఏక్ నిరంజన్, డార్టింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, రెబెల్, మిర్చి మూవీస్‌తో టాలీవుడ్‌లో టాప్ యంగ్ హీరోస్ సరసన నిలిచాడు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. డిసెంబరు 22న రిలీజ్ కానున్న సాలార్‌తో పాటు ప్రాజెక్ట్ కె, స్పిరిట్ పాన్ ఇండియా మూవీస్‌పై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి.

కృష్ణంరాజుకు ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తేలు. దీంతో కృష్ణంరాజు సోదరుడు సూర్యనారాయణ రాజు కుమారుడైన ప్రభాస్.. కృష్ణంరాజు నటవారసుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ అవడానికి సోదరుడి కుమారుడే అయినా.. వీరిద్దరి మధ్య తండ్రీ కొడుకుల అనుబంధమే కొనసాగేది. అంతగా తన నట వారసుడి గురించి కృష్ణంరాజు.. గర్వపడేవారు. ప్రభాస్, కృష్ణంరాజు కలసి రెబల్ సినిమాలో కూడా యాక్ట్ చేశారు. ఇందులో తండ్రీకొడుకులుగా వారు నటించారు. నిజజీవితంలో కృష్ణంరాజు ప్రభాస్ కు పెదనాన్న కాగా.. ఈ చిత్రంలో మాత్రం.. ఇద్దరూ తండ్రీకొడుకుల్లా చేసిన నటన రెబల్ ఫ్యామిలీ ఫ్యాన్స్ కి ఒక విజువల్ ఫీస్ట్‌గా నిలిచింది. ఒకానొక సమయంలో ప్రభాస్ అల్టిమేట్ యాక్టింగ్ స్కిల్స్ తో హాలీవుడ్ రేంజ్ కి చేరారని స్వయానా కృష్ణంరాజు ఎంతో గర్వంగా చెప్పుకున్నారు.

ఇంకా చదవండి

Puri Jagannadh: జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. బ్యాంకాక్‌ ఆస్పత్రిలో వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు: పూరి

టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఓ స్టార్ హీరో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జస్ట్ ఆ హీరో స్నేహితుడినని చెప్పగానే బ్యాంకాక్ లో తనకు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారని సదరు హీరోపై ప్రశంసలు కురిపించారు పూరి.

KTR- Prabhas: ప్రభాస్‌కు ఫోన్ చేసిన కేటీఆర్.. ఎందుకో తెలుసా.?

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ది అండర్ 18 వరల్డ్’ గ్రూప్ పిల్లలతో సరదాగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పిల్లలతో కేటీఆర్ సరదాగా గడిపారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

Naga Durga: తెలుగులో ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఆయన సినిమాలో చిన్న పాత్ర దొరికినా చేస్తా: నాగ దుర్గ

తెలంగాణకు చెందిన ప్రముఖ ఫోక్ సింగర్ నాగ దుర్గ పేరు ఇప్పుడు నెట్టింట తెగ మార్మోగుతుంది. తెలుగులో ఆమె నటిస్తోన్న మొదటి సినిమా ప్రారంభం కావడం, దానికి 'ఇడుపు కాయితం' అని టైటిల్ పెట్టడం, అది కాస్తా వివాదంలో చిక్కుకుంది. దీంతో నాగదుర్గ పేరు కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Anushka Shetty : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కెమెరా ముందుకు వచ్చిన అనుష్క.. ప్రభాస్, రానాతో కలిసి ముచ్చట్లు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..

టాలీవుడ్ మూవీ లవర్స్ హృదయాలను దొచుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి. అరుంధతి, భాగమతి, బాహుబలి వంటి సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది స్వీటీ. కానీ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగిత తెలిసిందే. చివరగా ఘాటి చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చిన ఈ అమ్మడు.. ఆ తర్వాత సోషల్ మీడియాకు బ్రేక్ ప్రకటించింది. అలాగే మీడియాకు సైతం దూరంగా ఉంటుంది. తాజాగా చాలా కాలం తర్వాత కెమెరా ముందుకు వచ్చింది అనుష్క.

ప్రభాస్‌గారు మీరే ఆదుకోవాలి..! మా సినిమా ఆగిపోయింది.. ఊరిలో పరువు పోయింది సార్

పాపాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇదే టైటిల్‌తో మరో సినిమా తెరకెక్కడంతో.. టైటిల్ వివాదం తెలుగు సినీ పరిశ్రమలో తెరపైకి వచ్చింది..!

ఆ స్టార్ హీరో చేయిపెడితే రూ. 100కోట్లు వచ్చి పడతాయి.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

ప్రముఖ నటి సమంత ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఉమెన్ సెంట్రిక్ సినిమాల ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. సామ్ ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు .

Prabhas: అదే జరిగిగే ప్రభాస్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్.. డార్లింగ్ సినిమా రిలీజులపై క్రేజీ అప్డేట్

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేసేవన్నీ పాన్ ఇండియా సినిమాలే. అందులోనూ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రాలే. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2.. ఇలా ప్రభాస్ లైనప్ ఇప్పుడు బిజీ బిజీగా ఉంటోంది.

RGV Prabhas: నేను అడిగిన ప్రశ్నకు ప్రభాస్ ఇచ్చిన ఆన్సర్ విని ఆశ్చర్యపోయా.. రామ్ గోపాల్ వర్మ..

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకులలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఒకప్పుడు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన.. ఇప్పుడు దర్శకత్వానికి దూరంగా ఉంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. లేటేస్ట్ చిత్రాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తూనే.. మరోవైపు పలు విషయాలపై స్పందిస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వులో వర్మ చేసిన కామెంట్స్ ఇఫ్పుడు వైరలవుతున్నాయి.

స్టార్ హీరో నా భుజం మీద చెయ్యేసి ఆ మాట అన్నాడు.. నేను షాక్ అయ్యా..! మిర్చి మాధవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మిర్చి మాధవి తన కెరీర్, అలాగే ఓ స్టార్ హీరో అనుభవాలు, అలాగే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వంటి సవాళ్లపై మాట్లాడారు. ఓ స్టార్ హీరో తన పులిహోరను మెచ్చుకున్న సందర్భాన్ని, అలాగే ఆ స్టార్ హీరో షూటింగ్ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇండస్ట్రీలో నిజాయితీగా రాణించడంపై ఆమె తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Dhurandhar Director: ఫ్యాన్స్ పండగ చేస్కోండి.. ఆ టాలీవుడ్ స్టార్ హీరోతో ధురంధర్ డైరెక్టర్ నెక్ట్స్ సినిమా!

ఆదిత్య ధర్.. మొన్నటివరకు కేవలం బాలీవుడ్ లో మాత్రమే వినిపించిన.. కానీ ఇప్పుడు ఈ డైరెక్టర్ పేరు వరల్డ్ వైడ్ వినిపిస్తోంది. ఆయన తెరకెక్కించిన 'ధురంధర్', 'ధురంధర్ ది రివేంజ్' సినిమాలు వేల కోట్ల కలెక్షన్లు రాబట్టాయి. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాయి.

వారెవ్వా..! పౌర్ణమి సినిమాలో ప్రభాస్‌తో నటించింది ఈమేనా..!! ఎంత మారిపోయింది

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‏లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ పౌర్ణమి. ఈ మూవీ అప్పట్లో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో ప్రభాస్ సరసన త్రిష, ఛార్మీ హీరోయిన్లుగా నటించారు. గతంలో వర్షం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రభాస్, త్రిష జోడి.. మరోసారి పౌర్ణమి మూవీతో మెప్పించారు.

Rambha : ఇప్పుడున్న హీరోలలో ఆ ఇద్దరూ చాలా ఇష్టం.. వాళ్లిద్ధరితో కలిసి నటించాలని ఉంది.. రంభ..

15 ఏళ్ల వయసులోనే కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టింది హీరోయిన్ రంభ. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ...ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలతో కలిసి నటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.