AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Naramaneni

Ram Naramaneni

Assistant News Editor, Political, Hyper Local, Trending, Human Interest - TV9 Telugu

ramu.naramaneni@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2017లో మహా న్యూస్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2019 ఫిబ్రవరిలో టీవీ9 తెలుగు డిజిటల్ విభాగంలో సబ్ ఎడిటర్‌గా చేరాను. అక్కడే 2022 మార్చి నుంచి చీఫ్ సబ్ ఎడిటర్‌గా, 2024 ఏప్రిల్ నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. పొలిటికల్, హైపర్ లోకల్, ఎంటర్టైన్మెంట్, క్రైమ్, ట్రెండింగ్, వైరల్ ఆర్టికల్స్ ఎక్కువగా అందిస్తూ ఉంటాను.

Read More
Vikram Travels: విక్రమ్ ట్రావెల్స్ నిర్వాకం.. గంటల తరబడి హైవేపై బస్సులోని ప్రయాణీకులు..

Vikram Travels: విక్రమ్ ట్రావెల్స్ నిర్వాకం.. గంటల తరబడి హైవేపై బస్సులోని ప్రయాణీకులు..

ముంబయి నుంచి జగ్గయ్యపేటకు వస్తున్న విక్రమ్ ట్రావెల్స్ బస్సు పూణే–వాకాడ్ వద్ద అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రయాణీకులు రాత్రి వేళ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక లోపం కారణంగా బస్సు హైవేపై గంటల తరబడి నిలిచిపోయినా, కంపెనీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటంతో ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు.

Vande Mataram: చరిత్ర తవ్వుకుంటున్న బీజేపీ-కాంగ్రెస్! మధ్యలో నెహ్రూ..RSS.

Vande Mataram: చరిత్ర తవ్వుకుంటున్న బీజేపీ-కాంగ్రెస్! మధ్యలో నెహ్రూ..RSS.

వందేమాతరం గీతంపై ఈ జనరేషన్‌కు తెలియని విషయాలు చాలా ఉన్నాయ్. 1875 నవంబర్ 7న.. వందేమాతరం గీతం పుట్టింది. బంకించంద్ర ఛటర్జీ ఆ గీతాన్ని కంపోజ్ చేసినప్పుడు రెండు చరణాలే ఉన్నాయ్ అనేది కొందరి వాదన. ఇప్పుడు మనమంతా పాడుకుంటున్నది కూడా ఆ రెండు చరణాలే. 1882లో బంకించంద్ర ఛటర్జీ రాసిన 'ఆనంద్ మఠ్' నవలలో వందేమాతరం గీతం పూర్తిస్థాయిలో ఉంటుంది. అంటే.. ఇప్పుడు పాడుకుంటున్న రెండు చరణాలకు తోడు మరో ఆరు చరణాలు ఉన్నాయ్. మరి.. వాటినెందుకు పాడడం లేదిప్పుడు? ఆ విషయాన్నే హైలెట్ చేస్తోంది బీజేపీ. మిగతా చరణాలు ఇప్పుడు పాడుకోలేకపోవడానికి కారణం.. నెహ్రూనే అంటోంది. ఒక అడుగు ముందుకేసి.. నెహ్రూ ఈ దేశానికి ద్రోహం చేశారని కామెంట్ చేసింది. అన్నదెవరో కాదు.. సాక్షాత్తు ప్రధాని మోదీ. రియాక్ట్ అయిన కాంగ్రెస్.. స్వాతంత్ర్యం కోసం 12 ఏళ్లు జైలుకు వెళ్లిన వ్యక్తి నెహ్రూ అని కౌంటర్ ఇచ్చింది. మరో అడుగు ముందుకేసి.. RSSను తీసుకొచ్చింది. ఈ దేశ స్వాతంత్ర్య సమరంలో RSS పాత్రేంటని నిలదీసింది. ఇంతకీ.. ఇప్పుడెందుకొచ్చిందీ గొడవ? వందేమాతరంపైనా, RSSపైనా పార్లమెంట్‌లో చర్చ ఎందుకు జరుగుతోంది? బెంగాల్ రాజకీయ నేపథ్యం ఉందా? ఆ డిటైల్స్ డిటైల్డ్‌గా తెలుసుకుందాం ....

Mahesh Vitta: ఇండస్ట్రీలో అబ్బాయిలను కూడా కమిట్‌మెంట్ అడుగుతారు.. ఓపెన్ అయిన మహేష్ విట్టా

Mahesh Vitta: ఇండస్ట్రీలో అబ్బాయిలను కూడా కమిట్‌మెంట్ అడుగుతారు.. ఓపెన్ అయిన మహేష్ విట్టా

తెలుగు చిత్ర పరిశ్రమలో "కమిట్‌మెంట్ కల్చర్"పై మహేష్ విట్టా ఆవేదన వ్యక్తం చేశారు. టాలీవుడ్‌లో కొత్తగా అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలు ఎదుర్కొంటున్న పరిస్థితులపై మహేష్ విట్టా కీలక వ్యాఖ్యలు చేశారు. టాలెంట్ ఉన్నా, కొందరు దుష్ప్రభావాలకు లోనై కెరీర్ పాడు చేసుకుంటున్నారని ఆయన చెప్పారు.

Kishan Reddy: రాహుల్ గాంధీ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు : కిషన్ రెడ్డి

Kishan Reddy: రాహుల్ గాంధీ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు : కిషన్ రెడ్డి

రాహుల్ గాంధీకి ఎన్నికల వ్యవస్థపై సరైన అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ కామెంట్ చేశారు. ఓటర్ లిస్ట్ సవరణ కోసం జరిగే SIR ప్రక్రియ సాధారణమని, దీనివల్ల బీజేపీకి లాభం అయ్యిందన్న ఆరోపణలు ఎక్కడా నిరూపితం కాలేదని చెప్పారు.

Tollywood: యూట్యూబ్ నుంచి నెలకు రూ.30 లక్షల ఆదాయం కొల్లగొట్టిన నటీమణి..

Tollywood: యూట్యూబ్ నుంచి నెలకు రూ.30 లక్షల ఆదాయం కొల్లగొట్టిన నటీమణి..

యూట్యూబ్ నుంచి లక్షలు సొమ్ము కొల్లగొట్టడం సాధ్యమేనా..? రెగ్యులర్‌గా యూట్యూబ్‌లో నార్మల్ కంటెంట్ అప్ డేట్ చేస్తూ ఓ పెద్ద కంపెనీ ప్రాఫిట్స్ రేంజ్‌లో మనీ సంపాదించడం కుదురుతుందా అంటే.. అవుననే అంటున్నారు నటి శ్రీవాణి దంపతులు. ఆ డీటేల్స్ ఈ కథనంలో తెలుసుకుందాం...

Chalaki Chanti: “వాళ్లు సర్వనాశనం అవుతారు.. ఇది నేను కడుపు మంటతో పెడుతున్న శాపం”

Chalaki Chanti: “వాళ్లు సర్వనాశనం అవుతారు.. ఇది నేను కడుపు మంటతో పెడుతున్న శాపం”

నటుడు చలాకీ చంటి తన ఆరోగ్య పుకార్లపై, కెరీర్ అడ్డంకులపై తీవ్రంగా స్పందించారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో తనపై తప్పుడు వార్తలు రాశారని, కొందరు తన ఎదుగుదలను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి శాపాలు పెట్టారు. ఇండస్ట్రీలో అవకాశాలు కోల్పోవడానికి గల కారణాలను వివరిస్తూ, తనపై వచ్చిన ఇగో ప్రచారాన్ని ఖండించారు.

Telangana: మూడు సెషన్స్‌, ఆరు పెట్టుబడులుగా గ్లోబల్‌ సమ్మిట్‌

Telangana: మూడు సెషన్స్‌, ఆరు పెట్టుబడులుగా గ్లోబల్‌ సమ్మిట్‌

మూడు సెషన్స్‌, ఆరు పెట్టుబడులన్నట్లు సూపర్‌డూపర్‌ సక్సెస్‌ అయ్యింది తెలంగాణ రైజింగ్‌-2025 గ్లోబల్‌ సమ్మిట్‌. ప్రతినిధుల అభిప్రాయాలు, సూచనలతో ఫలప్రదంగా ముగిశాయి రెండోరోజు సెషన్స్‌. ఉదయం 10గంటలనుంచే మొదలైన ప్యానల్‌ డిస్కషన్స్‌లో అన్ని అంశాలను కూలంకషంగా చర్చించడంతో విలువైన సూచనలొచ్చాయి. ..

Viral Video: అడవిలో పోరాటం ఇట్టా ఉంటది.. మొదటి సీన్ ఇది.. అంతిమంగా..

Viral Video: అడవిలో పోరాటం ఇట్టా ఉంటది.. మొదటి సీన్ ఇది.. అంతిమంగా..

బోట్స్వానాలోని ఛోబే పార్క్‌లో చోటు చేసుకున్న ఓ ఘటన అటవీ ప్రపంచంలో సర్వైవల్ కోసం జరిగే పోరాటన్ని తెలియజేసింది. రోసెలైన్ కెర్జోసే ఈ వీడియోను రికార్డు చేశారు. అరుదైన జీవుల పోరాటం ఇందులో కెమెరా కంటికి చిక్కింది. ఒక కొండచిలవ.. తొలుత ఓ హనీ బ్యాడ్జెర్‌ను చుట్టేయగా, ఇంతలో ఒక నక్క అక్కడికి వచ్చింది. ఆ తర్వాత మరో నక్క కూడా జోక్యం చేసుకుంది. ఆహారం కోసం జరిగిన ఈ త్రిముఖ పోరాటంలో చివరికి ఎవరు నెగ్గారు..?

Kishan Reddy: బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం

Kishan Reddy: బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం

తెలంగాణలో ప్రతిపక్షాలపై అణిచివేత ధోరణి కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ సోషల్ మీడియా కన్వీవర్ అరెస్ట్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. తంలో బీఆర్‌ఎస్ చేసిన అదే నిర్బంధ పాలనను ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగిస్తోందన్నారు.. ..

Prasad Behara: “పనిమనిషిని ఇంటిమనిషిలా చూసుకుంటే బాగా గడ్డి పెట్టింది..”

Prasad Behara: “పనిమనిషిని ఇంటిమనిషిలా చూసుకుంటే బాగా గడ్డి పెట్టింది..”

నటుడు, యూట్యూబర్ ప్రసాద్ బెహరా తన ఇంట్లోని పనిమనిషితో ఎదురైన సంఘటన గురించి వివరించారు. విడాకుల తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు పనిమనిషిని కుటుంబ సభ్యురాలిగా చూసుకున్నానని, అధిక జీతంతో పాటు అన్నీ సమకూర్చినా, ఆమె తన వాచీలను దొంగిలించిందని తెలిపారు. ఈ అనుభవం తనలో మనుషులను నమ్మే గుణాన్ని మార్చివేసిందని ప్రసాద్ బెహరా చెప్పుకొచ్చారు.

Punch Prasad: తన రెండు కీడ్నీలు పాడవడానికి రీజన్ ఏంటో చెప్పిన పంచ్ ప్రసాద్..

Punch Prasad: తన రెండు కీడ్నీలు పాడవడానికి రీజన్ ఏంటో చెప్పిన పంచ్ ప్రసాద్..

జబర్దస్త్ కమెడియన్ పంచు ప్రసాద్ తన కిడ్నీ సంబంధిత సమస్యలు, డయాలసిస్ ప్రక్రియ, ఆత్మహత్య ఆలోచనలు, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్.. వంటి వ్యక్తిగత పోరాటాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ కష్టకాలంలో తన భార్య, జబర్దస్త్ జడ్జిలు నాగబాబు, రోజా.. సహచర కమెడియన్స్ గెటప్ శ్రీను, రాంప్రసాద్‌తో పాటు మల్లెమాల సంస్థ అందించిన అండదండల గురించి వివరించారు.

Actor Dileep: కేరళలోని ఎర్నాకుళం కోర్టులో నటుడు దిలీప్‌కు ఊరట..

Actor Dileep: కేరళలోని ఎర్నాకుళం కోర్టులో నటుడు దిలీప్‌కు ఊరట..

కేరళలో సంచలనం సృష్టించిన 2017 నాటి నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను కోర్టు నిర్దోశిగా ప్రకటించింది. ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. కాగా తన ఇమేజ్‌ను, కెరీర్‌ను నాశనం చేయడానికే తన పేరును ఈ కేసులోకి లాగారని దిలీప్ కోర్టు బయట మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.