Ram Naramaneni
Assistant News Editor, Political, Hyper Local, Trending, Human Interest - TV9 Telugu
ramu.naramaneni@tv9.comతెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2017లో మహా న్యూస్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2019 ఫిబ్రవరిలో టీవీ9 తెలుగు డిజిటల్ విభాగంలో సబ్ ఎడిటర్గా చేరాను. అక్కడే 2022 మార్చి నుంచి చీఫ్ సబ్ ఎడిటర్గా, 2024 ఏప్రిల్ నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. పొలిటికల్, హైపర్ లోకల్, ఎంటర్టైన్మెంట్, క్రైమ్, ట్రెండింగ్, వైరల్ ఆర్టికల్స్ ఎక్కువగా అందిస్తూ ఉంటాను.
Telangana: తెలుగింట కృష్ణవేణికి ‘ఆది’ అక్కడే.. రెండు రాష్ట్రాల రాజకీయాలకూ ‘ఆజ్యం’ అక్కడే!
'శిశువుకు దక్కని స్థన్యం' అనే ఓ గొప్ప సాహితీ ప్రయోగం చేశారు శ్రీశ్రీ. పాలమూరు జిల్లాకు సరిగ్గా సరిపోయే పదబంధం అది. కృష్ణవేణి తెలుగింట అడుగుపెట్టేది పాలమూరు జిల్లాలోనే. ఆ పాలమూరు నేలను ఒరుసుకుంటూ తుంగభద్ర ప్రవహిస్తుంది. భీమా నది పారుతుంది. సాధారణంగా కృష్ణమ్మ స్పర్శ ఉన్న ప్రతి ప్రాంతం పచ్చగా ఉంటుంది. ఒక్క పాలమూరు తప్ప. కృష్ణానది పరవళ్లు ఉన్నా.. కరువు మాత్రమే కనిపించే జిల్లా 'పాలమూరు'. కాలక్రమంలో వలస కూలీలు అనడం మానేసి పాలమూరు కూలీ అనేవాళ్లు. వీళ్లు ఉండని ప్రాంతం లేదు, వలస వెళ్లని కాలం లేదు, అక్కడి కరువుపై రాయని కవి లేడు. తీరని వెతలు.. తీరం లేని పయనాలు పాలమూరు జిల్లా వాసులవి. సరిగ్గా ఈ పాయింట్తోనే ప్రత్యేక రాష్ట్ర పోరాటం మొదలైంది. నీటి కోసం తెలుగు రాష్ట్రాల మధ్య కొట్లాటకు కారణమైంది. రాష్ట్రమైతే విడిపోయింది గానీ.. పాలమూరు బతుకు మాత్రం అలాగే ఉంది. అందుకే, మళ్లీ అదే పాయింట్ ఇప్పుడు రాజకీయాంశం అయింది. 'పాలమూరులో తట్టెడు మట్టి ఎత్తలేదు' అనే స్టేట్మెంట్ నుంచి మరోసారి పొలిటికల్ సెగ రగిలింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ చుట్టూనే రాజకీయం నడుస్తోంది. ఎన్టీఆర్, చంద్రబాబు నుంచి కేసీఆర్, రేవంత్ దాకా అందరి పేర్లూ వినిపిస్తున్నది ఆ 'పాలమూరు' చుట్టే. రెండు రాష్ట్రాలు.. ఐదు పార్టీల మధ్య యుద్ధమూ ఆ 'పాలమూరు' చుట్టే. తెలంగాణ చరిత్రలో రాజకీయాలు నడిచిందీ పాలమూరు చుట్టూనే. ఇంతకీ.. పాలమూరు సెంట్రిక్గా ఇప్పుడెందుకని రాజకీయాన్ని తీసుకొచ్చారు? అక్కడి నీళ్లలో నిప్పులెందుకు పోస్తున్నారు?
- Ram Naramaneni
- Updated on: Dec 24, 2025
- 9:54 pm
Hyderabad: ఒరెయ్ ప్రభాకర్.. ఇన్ని రాష్ట్రాల పోలీసుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నావ్..
ఏపీ, తెలంగాణ పోలీసులకు చాలెంజ్గా మారిన మోస్ట్ వాంటెడ్ నిందితుడు బత్తుల ప్రభాకర్.. ఇప్పుడు తమిళనాడు పోలీసులకు కూడా సవాల్ విసిరాడు. ఫలితంగా.. చోరీల చాలెంజ్లతో మూడు రాష్ట్రాలను ముప్పుతిప్పులు పెడుతున్నాడు. రెండు నెలల క్రితం విజయవాడ పోలీసుల కళ్లు గప్పి పరారైన బత్తుల ప్రభాకర్.. తమిళనాడులో మరో చోరీతో ప్రత్యక్షమవడం సంచలనంగా మారింది. మరి.. బత్తుల ప్రభాకర్ ఎపిసోడ్లో వాట్ నెక్ట్స్...?
- Ram Naramaneni
- Updated on: Dec 24, 2025
- 9:44 pm
Ashwini Vaishnaw: ఆ విషయంలో రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
ఫాక్స్కాన్లో భారీ ఉద్యోగాల కల్పనను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ విజయాన్ని గుర్తించినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. .. ..
- Ram Naramaneni
- Updated on: Dec 24, 2025
- 7:47 pm
Telangana Shakuntala: పునర్జన్మలు నిజమైతే తెలంగాణ శకుంతల కోరిక ఇదే..
దివంగత నటి తెలంగాణ శకుంతల జీవితం, కుటుంబం, నట ప్రస్థానంపై ఈ ప్రత్యేక కథనం. సినిమాల్లో శక్తివంతమైన నటనతో భయపెట్టిన ఆమె, నిజ జీవితంలో మాత్రం ఎంతో నిరాడంబరంగా జీవించారు. మరాఠీ కుటుంబ నేపథ్యం ఉన్న శకుంతల గారి ఇంటి విశేషాలు, కుటుంబ సభ్యుల పరిచయాలు, ఆమెలోని గొప్ప కళాకారిణిని ఈ కథనంలో ఆవిష్కరిస్తున్నాం.
- Ram Naramaneni
- Updated on: Dec 24, 2025
- 4:37 pm
Kalpana Ray: మనల్ని ఎంతో నవ్వించింది.. కానీ ఆమె జీవితం కన్నీటి ప్రయాణం.. అంత్యక్రియలకు డబ్బుల్లేక
తెలుగు చిత్రసీమలో నాలుగు దశాబ్దాలకు పైగా హాస్యనటిగా ప్రేక్షకులను నవ్వించిన కల్పనారాయ్ జీవితం దుర్భర దారిద్ర్యం, మోసాలతో నిండి విషాదంగా ముగిసింది. అనాథగా పెరిగి, నాటకరంగం నుండి సినిమాల్లోకి ప్రవేశించిన ఆమె చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులతో సతమతమై, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సాయంతో అంత్యక్రియలు జరిగాయి.
- Ram Naramaneni
- Updated on: Dec 24, 2025
- 3:42 pm
Bangladesh: బానిసత్వాన్ని తెంచి స్వాతంత్ర్యం ఇప్పిస్తే.. భారత్నే టార్గెట్ చేస్తారా?
1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయి స్వంతంత్ర దేశంగా ఏర్పడినప్పుడు... ఓ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ చేసిన కామెంట్స్ను గుర్తు చేసుకోవాలిక్కడ. 'మహా అయితే ఓ 30 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉంటుంది బంగ్లాదేశ్! మరో పాకిస్తాన్లా బంగ్లాదేశ్ మారకపోతే చూడండి. అక్కడి మంతఛాందసవాదం భారత్ చేసిన త్యాగాన్ని మరిచిపోయేలా చేస్తుంది. ఆ విషయాన్ని భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, బంగ్లాదేశ్తో ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి '.. అని 54 ఏళ్ల క్రితం ఆ ఆర్మీ అధికారి అన్న మాటలు ఇవాళ నిజమయ్యాయ్. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను దేశం నుంచి వెళ్లగొట్టడానికి ముందు.. అక్కడి వాట్సాప్ యూనివర్సిటీల్లో చెప్పుకున్న పాఠం ఒక్కటే. 'ముజీబుర్ రెహ్మాన్ మనకి స్వాతంత్య్రం తేలేదు.. పాకిస్తాన్ నుంచి భారతే మనల్ని విడగొట్టింది' అని. షేక్ ముజీబుర్ రెహ్మాన్, షేక్ హసీనాని దేశ ద్రోహులుగా యువతరం మనసులో ముద్ర వేసేశారు. బంగ్లాదేశ్కి భారత్ మొదటి శత్రువు అని నూరిపోశారు. సో, అంతా ఓ ప్లాన్ ప్రకారమే జరుగుతూ వస్తోంది. భారత్పై ద్వేషం ఉంటే.. బంగ్లాలోని హిందువులనే ఎందుకు టార్గెట్ చేయాలి? ఎక్కడ టచ్ చేస్తే భారత్ రియాక్ట్ అవుతుందో తెలుసు కాబట్టి. బంగ్లాదేశ్లో ఓ భారత వ్యతిరేకిని చంపేస్తే.. అందుకు ప్రతీకారంగా హిందువులను చంపుతున్నారంటే... బంగ్లాదేశ్ ఓ క్లియర్ సిగ్నల్ పంపిస్తోందనే అర్ధం. పాకిస్తాన్-చైనా అండ చూసుకుని.. రెచ్చిపోతోందని తెలుస్తూనే ఉంది. బట్.. ఇక్కడ తెలియాల్సింది బంగ్లాదేశ్లో ఈ మార్పు ఎక్కడ, ఎందుకు, ఎలా మొదలైందనేదే. భారత్పై అంతగా విషం కక్కడానికి కారణం ఏంటనేదే. బంగ్లాదేశ్లో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతోందో చెప్పుకుంటూనే ఈనాటి పరిస్థితికి కారణమైన చరిత్రను కూడా చెప్పుకుందాం
- Ram Naramaneni
- Updated on: Dec 23, 2025
- 9:45 pm
Nidhi Agarwal: నిధి హార్ట్ గోల్డ్ అబ్బా.. ఘటనపై పోలీసులు కేసు పెట్టమంటే..?
అభిమానం హద్దులు దాటితే.. ఫ్యాన్స్ను చూస్తేనే భయపడే పరిస్థితి వస్తే.. ఇటీవల హీరోయిన్ నిధి అగర్వాల్కి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ గుంపు నుంచి ఎలాగోలా బయటపడి కారెక్కేవరకూ ఎంత భయపడిందో ఆమె ఫేస్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అయితే ఈ ఘటనపై తాజాగా ఆమెను పోలీసులు అప్రోచ్ అయ్యారు.
- Ram Naramaneni
- Updated on: Dec 23, 2025
- 4:36 pm
Tollywood: తెలుగు వెండితెర తొలి అందగాడు.. ఆ పనితో 53 ఏళ్లకే ప్రేగులు మాడి..
తెలుగు సినిమా బంగారు కాలంలో యువతరాన్ని ఆకట్టుకున్న నటుడు హరనాథ్. జమీందారీ కుటుంబంలో పుట్టి, ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. స్టార్డమ్ను చూసినప్పటికీ, వ్యసనాలకు లోబడి తన ప్రతిభకు తగిన స్థానాన్ని పొందలేకపోయారు. ఎన్.టి.ఆర్, జమున వంటివారితో ఆయనకున్న సంబంధాలు, చివరి రోజుల్లో ఆయన పరిస్థితి ఈ కథనంలో.
- Ram Naramaneni
- Updated on: Dec 23, 2025
- 3:55 pm
Tollywood: 28 రోజుల్లో షూటింగ్ కంప్లీట్.. కట్ చేస్తే కలెక్షన్ల సునామీ.. అన్నగారి బ్లాక్ బాస్టర్
ఎన్టీఆర్ నటించిన డ్రైవర్ రాముడు చిత్రం 45 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో, 265వ చిత్రంగా ఎన్టీఆర్ నటించారు. కేవలం 28 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. అనేక కేంద్రాలలో వంద రోజులు ఆడి, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.
- Ram Naramaneni
- Updated on: Dec 23, 2025
- 2:20 pm
Telangana: ప్రాజెక్టుల నిర్లక్ష్యం.. ఎవరి పాపం… ఎవరి లోపం?
బాస్ ఈజ్ బ్యాక్.. ఈ డైలాగే వినిపిస్తోంది బీఆర్ఎస్ క్యాడర్ నిండా. 'సమయం లేదు మిత్రమా.. సమరం కోసం సిద్ధం' అంటూ ఏ చర్చకైనా సై అంటోంది కాంగ్రెస్. మొత్తంగా ఐదు అంశాలపై 'నువ్వా-నేనా' అని మాటల యుద్ధం చేస్తున్నాయి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. ఒకటి డీపీఆర్ మ్యాటర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరి హయాంలో కేంద్రం నుంచి వాపస్ వచ్చిందనేది మొదటి అంశం. ఇక రెండోది.. ఏపీతో అంటకాగి నీళ్లను అప్పగించారనే వాదన. జగన్తో వాటాలు పంచుకున్నది కేసీఆరే కదా అని కాంగ్రెస్... చంద్రబాబుతో కలిసి నీళ్లను ఆంధ్రాకు వదులుతున్నారని బీఆర్ఎస్ వాదించుకుంటున్నాయి. ఇక మూడో అంశం.. ఆయకట్టుకు ఎవరెన్ని నీళ్లిచ్చారని. కాళేశ్వరంతో ఎకరం కూడా తడవలేదని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. 17 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన విషయం నిరూపిస్తామంటోంది బీఆర్ఎస్. ఇక నాలుగో అంశం.. ఎవరి హయాంలో ఎక్కువ పంట పండింది? ధాన్యం ఉత్పత్తిలో రికార్డులు సృష్టించిందే కాంగ్రెస్ హయాంలో అని అధికార పార్టీ అంటుంటే.. అసలు దానికి ఆజ్యం పోసిందే కేసీఆర్ హయాంలో అని ప్రతిపక్షం కౌంటర్ ఇస్తోంది. ఇక ఐదోది.. తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందన్న అంశం. కేసీఆర్ ప్రెస్మీట్ గానీ.. కౌంటర్గా సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్, అటు బీజేపీ నాయకులు ఇచ్చిన సమాధానాలు గానీ ఈ ఐదు అంశాల చుట్టూనే తిరిగాయి. ఇంతకీ.. నీటి వాటాల లెక్కల్లో వాస్తవాలేంటి? ఎవరి హయాంలో ప్రాజెక్టులపై నిర్లక్ష్యం జరిగింది? ప్రతిపక్షం ఆరోపణలేంటి, అధికార పార్టీ సమాధానమేంటి?
- Ram Naramaneni
- Updated on: Dec 22, 2025
- 9:00 pm
Tollywood: ఒకప్పుడు చిత్రం శ్రీనుకు మేకప్ వేసేవాడు.. ఆపై టాప్ యాక్టర్.. ఇప్పుడు సంచలన దర్శకుడు
నటుడు, దర్శకుడు వేణు యెల్దండి తన సినీ ప్రస్థానంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిత్రం శ్రీను వద్ద టచప్ బాయ్గా, అసిస్టెంట్గా ప్రారంభమైన తన కెరీర్, రోజుకు కేవలం 50 రూపాయల జీతంతో సాగిందని వివరించారు. తోటివారితో అప్పటి, ఇప్పటి బంధాలను, నటుడిగా, దర్శకుడిగా మారిన తర్వాత వచ్చిన మార్పులను ఆయన ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.
- Ram Naramaneni
- Updated on: Dec 22, 2025
- 4:17 pm
Subramanya Swamy: గర్భంతో ఉన్న స్త్రీలు సుబ్రమణ్య జననం చదివితే.. పుట్టే సంతానానికి తిరుగుండదు..!
సుబ్రమణ్య జననం, షణ్ముఖోత్పత్తి కథ అత్యంత శక్తివంతమైన ఘట్టం. గర్భిణీ స్త్రీలు దీనిని పారాయణ చేస్తే ఉత్తమ సంతానం కలుగుతుందని, ప్రసవ సమస్యలు ఉండవని విశ్వాసం. శివుడి తేజస్సు నుంచి.. అగ్ని, గంగ, రెల్లు దుబ్బుల ద్వారా సుబ్రమణ్యుడు జన్మించిన వృత్తాంతాన్ని వివరించే ఈ కథ శ్రవణం వలన మోక్షం సిద్ధిస్తుందని ప్రతీతి.
- Ram Naramaneni
- Updated on: Dec 22, 2025
- 3:48 pm