Ram Naramaneni
Assistant News Editor, Political, Hyper Local, Trending, Human Interest - TV9 Telugu
ramu.naramaneni@tv9.comతెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2017లో మహా న్యూస్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2019 ఫిబ్రవరిలో టీవీ9 తెలుగు డిజిటల్ విభాగంలో సబ్ ఎడిటర్గా చేరాను. అక్కడే 2022 మార్చి నుంచి చీఫ్ సబ్ ఎడిటర్గా, 2024 ఏప్రిల్ నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా, 2025 నవంబర్ నుంచి న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. పొలిటికల్, హైపర్ లోకల్, ఎంటర్టైన్మెంట్, క్రైమ్, వ్యవసాయ సంబంధిత కథనాలు, రైతుల విజయాలకు సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కువగా అందిస్తూ ఉంటాను.
Vijayasai Reddy: ఏపీలో కొత్త పార్టీ! విజయసాయిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ!
విజయసాయి రిటర్న్స్... విత్ కొత్త పార్టీ. యస్. మీరు చదువుతున్నది నిజమే! విజయసాయి రెడ్డి మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. రాజకీయాల్లోకి కొత్త పార్టీతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ కొత్త పార్టీని శ్రావణ మాసంలో లాంచింగ్ చేస్తారని సమాచారం. పార్టీ ఏర్పాటుకు ఈ మాజీ ఎంపీ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మహిళలు, రైతులు, యువత లక్ష్యంగా పార్టీ అజెండా ఉంటుందని చెబుతున్నారు. టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా వస్తానంటున్నారు విజయసాయిరెడ్డి.
- Ram Naramaneni
- Updated on: Aug 3, 2026
- 5:49 pm
నాగుపాము vs రక్తపింజర ఎదురుపడితే..? ఎవరిది పైచేయి.. భీకర పోరాటమేనా..?
నాగుపాము, రక్తపింజర (రస్సెల్స్ వైపర్) ఎదురుపడితే భీకరంగా పోరాడతాయని చాలామంది భావిస్తారు. అయితే ప్రకృతిలో అలాంటి ఘర్షణలు చాలా అరుదు. ప్రమాదాన్ని తప్పించుకుని ప్రాణాలను కాపాడుకోవడానికే ఈ రెండు విషపూరిత పాములు ఎక్కువగా ప్రయత్నిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరంగా తెలుసకుందాం పదండి ..
- Ram Naramaneni
- Updated on: Aug 3, 2026
- 4:16 pm
ఇంట్లో కొబ్బరి నూనె చేయడం ఇంత ఈజీ అని తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు
సహజసిద్ధమైన, స్వచ్ఛమైన కొబ్బరి నూనెను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి. కొబ్బరిని ముక్కలుగా కోసి, పాలు తీసి, ఫ్రీజర్లో పెట్టి, చివరకు మీడియం మంటపై ఉడికించడం ద్వారా సువాసనభరితమైన నూనెను పొందవచ్చు. జుట్టు, చర్మానికి ప్రయోజనకరమైన ఈ 100% స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారీ విధానాన్ని తెలుసుకోండి.
- Ram Naramaneni
- Updated on: Aug 3, 2026
- 4:08 pm
చోరీ చేసిన 15 రోజుల తర్వాత సొత్తు తిరిగి ఇచ్చిన దొంగలు.. కానీ వాటిని మాత్రం ఇవ్వలేమంటూ లెటర్
చోరీ చేసిన సొత్తును రెండు వారాల తర్వాత తిరిగి ఇచ్చిన దొంగలు కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించారు. రూ.6.50 లక్షల విలువైన బంగారం, నగదును ఇంటి ఆవరణలో పడేసి, రూ.22 వేలే ఖర్చు చేశామని, చేసిన తప్పుకు క్షమించాలని 'సారీ' లేఖ కూడా వదిలి వెళ్లడం చర్చనీయాంశమైంది.
- Ram Naramaneni
- Updated on: Aug 3, 2026
- 1:20 pm
Hyderabad: హైదరాబాద్.. 435 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం
435 ఏళ్ల చరిత్రను సొంతం చేసుకున్న హైదరాబాద్ నేడు ప్రపంచ ప్రఖ్యాత మహానగరంగా వెలుగొందుతోంది. 1591లో మహ్మద్ కులీ కుతుబ్ షా స్థాపించిన ఈ నగరం కుతుబ్షాహీలు, నిజాంలు, స్వాతంత్ర్యం అనంతర ప్రభుత్వాల కృషితో విద్య, వైద్యం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఐటీ రంగాల్లో విశేష అభివృద్ధి సాధించింది. చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూనే ఆధునికతను అందిపుచ్చుకున్న హైదరాబాద్ భారతదేశంలోనే అత్యంత ప్రాధాన్యమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది.
- Ram Naramaneni
- Updated on: Aug 3, 2026
- 11:54 am
Telangana: భారీ సైజులో ఉన్న ఆవులకు ఎంత రేటు చెబున్నారంటే..?
పెబ్బేరు ఆవుల సంతలో భారీ సైజు ఆవుల విక్రయానికి వచ్చాయి. ఒకటి నలభై రోజుల కోడి దూడతో, మరొకటి ఆరు నెలల చూడితో ఉన్నాయి. విక్రయదారుడు జవ్వాయిపల్లి బాలకృష్ణ, కొల్లాపూర్ మండల్, నాగర్ కర్నూల్ జిల్లా వాసి. ప్రతి శనివారం పెబ్బేరులో ఈ సంత జరుగుతుంది.
- Ram Naramaneni
- Updated on: Aug 3, 2026
- 11:16 am
ఉదయం హడావిడిలో కూడా ఈజీగా అప్పటికప్పుడు ఇలా చేసుకోండి..
ఉదయం హడావిడిలో సులువుగా చేసుకోగలిగే ఇన్స్టంట్ రవ్వ అప్పం తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం. నూనె వాడకుండానే మెత్తటి అప్పాలను తయారు చేసుకోవచ్చు. అప్పాలకు సరైన రుచిని అందించే టమాటా చట్నీని కూడా ఈ రెసిపీలో కలిపి నేర్చుకోవచ్చు. అల్పహారానికి ఇది చక్కటి ఎంపిక..
- Ram Naramaneni
- Updated on: Aug 2, 2026
- 12:29 pm
అసలు యాంజియోగ్రామ్ అంటే ఏమిటి? ఎన్ని రకాలు..? ఎప్పుడు చేస్తారు..
యాంజియోగ్రామ్ కేవలం గుండెకే కాకుండా, మెదడు, కాలేయం, మూత్రపిండాలు, కాళ్లు వంటి శరీరంలోని వివిధ భాగాలకు రక్తనాళాల పరిస్థితిని తెలుసుకోవడానికి చేసే పరీక్ష. సీటీ యాంజియోగ్రామ్, ఎంఆర్ యాంజియోగ్రామ్, క్యాథ్ యాంజియోగ్రామ్ వంటి రకాలు ఉన్నాయి. ప్రతిదానికీ దానిదైన ప్రక్రియ, ప్రయోజనాలు, పరిమితులు ఉంటాయి. ఏ యాంజియోగ్రామ్ సరైనదో డాక్టర్ నిర్ణయిస్తారు.
- Ram Naramaneni
- Updated on: Aug 2, 2026
- 12:11 pm
‘నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్ సంకల్ప్’ అభియాన్కు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ
దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ 'నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్ సంకల్ప్' అభియాన్కు శ్రీకారం చుట్టారు. 100 వారాల పాటు కొనసాగే ఈ దేశవ్యాప్త ప్రచారంలో యువత, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి.
- Ram Naramaneni
- Updated on: Aug 2, 2026
- 11:20 am
కుండ పెరుగు ప్రత్యేకత ఏంటి..? దాని వల్ల లాభాలేంటి..?
కుండ పెరుగు కేవలం సంప్రదాయ ఆహారం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి మేలు చేసే సహజమైన ప్రోబయోటిక్ ఫుడ్ కూడా. మట్టి కుండలో తోడు పెట్టడం వల్ల పెరుగు చిక్కగా, రుచిగా తయారవుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడం, శరీరానికి చల్లదనం అందించడం, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మట్టి కుండ వల్ల పోషకాలు గణనీయంగా పెరుగుతాయనే శాస్త్రీయ ఆధారాలు లేవు.
- Ram Naramaneni
- Updated on: Aug 2, 2026
- 10:52 am
Tollywood: రూ. 600 కోట్లు దానం చేసిన నటుడు.. కానీ ఎవరూ మాట్లాడరు..
సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పించిన డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి నిజ జీవితంలో వేలాది మంది సినీ కార్మికుల పాలిట దేవుడు. 10 ఎకరాల తన భూమిని దానం చేసి, ప్రభుత్వ సహకారంతో చిత్రపురి కాలనీ ఏర్పాటుకు ఆయన కృషి చేశారు. నేడు వందల కోట్ల విలువైన ఆ భూమి వేలాది కుటుంబాలకు ఆశ్రయం కల్పించింది. అద్దె కష్టాల నుంచి విముక్తిని ప్రసాదించిన ఈ మహానుభావుడి సేవలు మరవలేనివి.
- Ram Naramaneni
- Updated on: Aug 2, 2026
- 10:35 am
చెన్నైలో వెల్లివిరిసిన వాహిని స్టూడియో.. అది ఎవరిది..? చివరకు ఏమైంది..
మద్రాసులో తెలుగు సినిమా మూలాలకు గుండెకాయైన వాహిని స్టూడియో అద్భుత ప్రయాణం ఇది. మూలా నారాయణస్వామి స్థాపించిన ఈ స్టూడియో నాగిరెడ్డి విజయా సంస్థతో కలిసి విజయా-వాహినిగా రూపాంతరం చెంది, దక్షిణ భారత చిత్రాల నిర్మాణానికి కేంద్రంగా మారింది. ఎందరో సినీ దిగ్గజాలకు నెలవై, మూడు షిఫ్టుల్లో నిరంతరం సందడిగా ఉండే ఈ స్టూడియో, తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు మారడంతో వైభవాన్ని కోల్పోయి, చివరకు చరిత్రలో కలిసిపోయింది.
- Ram Naramaneni
- Updated on: Aug 2, 2026
- 10:17 am