Ram Naramaneni
Assistant News Editor, Political, Hyper Local, Trending, Human Interest - TV9 Telugu
ramu.naramaneni@tv9.comతెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2017లో మహా న్యూస్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2019 ఫిబ్రవరిలో టీవీ9 తెలుగు డిజిటల్ విభాగంలో సబ్ ఎడిటర్గా చేరాను. అక్కడే 2022 మార్చి నుంచి చీఫ్ సబ్ ఎడిటర్గా, 2024 ఏప్రిల్ నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. పొలిటికల్, హైపర్ లోకల్, ఎంటర్టైన్మెంట్, క్రైమ్, ట్రెండింగ్, వైరల్ ఆర్టికల్స్ ఎక్కువగా అందిస్తూ ఉంటాను.
YouTuber Anvesh: అన్వేష్కు మూడింది.. ప్రముఖ నటి ఫిర్యాదుతో పంజాగుట్ట పీఎస్లో కేసు నమోదు..
నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి, అదే పనిగా పెట్టుకుంటే ఏమీ కాదనుకుంటున్నారా? విదేశాల్లో కూర్చుని కారుకూతలు కూస్తే ఎవరూ పట్టించుకోరని అనుకుంటున్నారా? ఇలాంటివాళ్లు ఒక ఒళ్లు దగ్గర పెట్టుకునే టైమొచ్చింది. పోలీస్ కేసులు ఇలాంటి వాళ్లను వదలవు. తాజాగా యూట్యూబర్ అన్వేష్పై హైదరాబాద్లో కేసు నమోదు అయింది.
- Ram Naramaneni
- Updated on: Dec 31, 2025
- 1:19 pm
Draksharamam: శివలింగం ధ్వంసం కేసులో కీలక అప్ డేట్… అందుకే చేశాడట..!
ద్రాక్షారామం భీమేశ్వరాలయంలో కోనేటి శివలింగం ధ్వంసం ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. అర్చకుడిపై కోపంతోనే శివలింగాన్ని ధ్వంసం చేసినట్టు అనుమానితుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టు సమాచారం. CC ఫుటేజ్ ఆధారంగా తోటపేటకు చెందిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఘటనపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
- Ram Naramaneni
- Updated on: Dec 31, 2025
- 11:44 am
Tollywood: రాజబాబు కొడుకులు ఉండే ఇల్లు ఎన్ని కోట్లంటే..! వారి లెవల్ ఏంటో తెలుసా..?
హాస్యనటుడు రాజబాబు పిల్లలు మహేష్ బాబు, నాగేంద్ర బాబులు తండ్రిని కోల్పోయినప్పటికీ, తల్లి ప్రోత్సాహంతో అమెరికాలో అద్భుత విజయం సాధించారు. బీఎస్సీ కంప్యూటర్స్ చదివి, సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి, జీపీఎస్ సాఫ్ట్వేర్ అభివృద్ధి చేశారు. చిట్టి బాబు తన కుటుంబ సభ్యులు కూడా ఉన్నత విద్యతో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడినట్లు వివరించారు.
- Ram Naramaneni
- Updated on: Dec 31, 2025
- 11:03 am
Nimesulide: నైమెసులైడ్పై కేంద్రం నిషేధం.. 100 మిల్లీగ్రాములకుపైగా డోస్లకు తక్షణమే బ్రేక్
నొప్పి, జ్వర నివారణకు వాడే నైమెసులైడ్ మందులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 100 మిల్లీగ్రాములకుపైగా డోస్ ఉన్న తక్షణ విడుదల నైమెసులైడ్ మాత్రలు, సిరపుల తయారీ, విక్రయాలు, పంపిణీపై తక్షణమే నిషేధం విధించింది. ఈ మందులు ఆరోగ్యానికి ముప్పుగా మారే అవకాశాలున్నాయని, సురక్షిత ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది.
- Ram Naramaneni
- Updated on: Dec 31, 2025
- 10:30 am
Senior NTR: ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ అలవాట్లు ఎలా ఉండేవంటే..?
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితంలోని ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆయన దినచర్య, వ్యాయామం, భోజనపు అలవాట్లు, వ్యసనాలకు దూరం, భక్తి భావన, అంకితభావంతో కూడిన పనితీరు, అలాగే తన వారసులు సినీరంగంలో ఎలా కొనసాగుతున్నారో ఫుల్ డీటేల్స్ మీ కోసం ...
- Ram Naramaneni
- Updated on: Dec 31, 2025
- 8:47 am
Topi Amma: అసలు ఎవరు ఈ టోపీ అమ్మ ? మీకు తెలియని అసలు నిజం ఇదే..
అరుణాచలంలో టోపీ అమ్మగా ప్రసిద్ధి చెందిన పళని అమ్మ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు ఆమెను అవధూతగా భావిస్తే, మరికొందరు సాధారణ వ్యక్తిగా చూస్తారు. ప్రతిరోజూ 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ చేసే ఆమె జీవితం, భక్తుల నమ్మకాలు, ఆమెకు ఎదురయ్యే ఇబ్బందులను ఈ కథనంలో తెలుసుకుందాం...
- Ram Naramaneni
- Updated on: Dec 31, 2025
- 8:58 am
Telangana: తెలుగింట కృష్ణవేణికి ‘ఆది’ అక్కడే.. రెండు రాష్ట్రాల రాజకీయాలకూ ‘ఆజ్యం’ అక్కడే!
'శిశువుకు దక్కని స్థన్యం' అనే ఓ గొప్ప సాహితీ ప్రయోగం చేశారు శ్రీశ్రీ. పాలమూరు జిల్లాకు సరిగ్గా సరిపోయే పదబంధం అది. కృష్ణవేణి తెలుగింట అడుగుపెట్టేది పాలమూరు జిల్లాలోనే. ఆ పాలమూరు నేలను ఒరుసుకుంటూ తుంగభద్ర ప్రవహిస్తుంది. భీమా నది పారుతుంది. సాధారణంగా కృష్ణమ్మ స్పర్శ ఉన్న ప్రతి ప్రాంతం పచ్చగా ఉంటుంది. ఒక్క పాలమూరు తప్ప. కృష్ణానది పరవళ్లు ఉన్నా.. కరువు మాత్రమే కనిపించే జిల్లా 'పాలమూరు'. కాలక్రమంలో వలస కూలీలు అనడం మానేసి పాలమూరు కూలీ అనేవాళ్లు. వీళ్లు ఉండని ప్రాంతం లేదు, వలస వెళ్లని కాలం లేదు, అక్కడి కరువుపై రాయని కవి లేడు. తీరని వెతలు.. తీరం లేని పయనాలు పాలమూరు జిల్లా వాసులవి. సరిగ్గా ఈ పాయింట్తోనే ప్రత్యేక రాష్ట్ర పోరాటం మొదలైంది. నీటి కోసం తెలుగు రాష్ట్రాల మధ్య కొట్లాటకు కారణమైంది. రాష్ట్రమైతే విడిపోయింది గానీ.. పాలమూరు బతుకు మాత్రం అలాగే ఉంది. అందుకే, మళ్లీ అదే పాయింట్ ఇప్పుడు రాజకీయాంశం అయింది. 'పాలమూరులో తట్టెడు మట్టి ఎత్తలేదు' అనే స్టేట్మెంట్ నుంచి మరోసారి పొలిటికల్ సెగ రగిలింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ చుట్టూనే రాజకీయం నడుస్తోంది. ఎన్టీఆర్, చంద్రబాబు నుంచి కేసీఆర్, రేవంత్ దాకా అందరి పేర్లూ వినిపిస్తున్నది ఆ 'పాలమూరు' చుట్టే. రెండు రాష్ట్రాలు.. ఐదు పార్టీల మధ్య యుద్ధమూ ఆ 'పాలమూరు' చుట్టే. తెలంగాణ చరిత్రలో రాజకీయాలు నడిచిందీ పాలమూరు చుట్టూనే. ఇంతకీ.. పాలమూరు సెంట్రిక్గా ఇప్పుడెందుకని రాజకీయాన్ని తీసుకొచ్చారు? అక్కడి నీళ్లలో నిప్పులెందుకు పోస్తున్నారు?
- Ram Naramaneni
- Updated on: Dec 24, 2025
- 9:54 pm
Hyderabad: ఒరెయ్ ప్రభాకర్.. ఇన్ని రాష్ట్రాల పోలీసుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నావ్..
ఏపీ, తెలంగాణ పోలీసులకు చాలెంజ్గా మారిన మోస్ట్ వాంటెడ్ నిందితుడు బత్తుల ప్రభాకర్.. ఇప్పుడు తమిళనాడు పోలీసులకు కూడా సవాల్ విసిరాడు. ఫలితంగా.. చోరీల చాలెంజ్లతో మూడు రాష్ట్రాలను ముప్పుతిప్పులు పెడుతున్నాడు. రెండు నెలల క్రితం విజయవాడ పోలీసుల కళ్లు గప్పి పరారైన బత్తుల ప్రభాకర్.. తమిళనాడులో మరో చోరీతో ప్రత్యక్షమవడం సంచలనంగా మారింది. మరి.. బత్తుల ప్రభాకర్ ఎపిసోడ్లో వాట్ నెక్ట్స్...?
- Ram Naramaneni
- Updated on: Dec 24, 2025
- 9:44 pm
Ashwini Vaishnaw: ఆ విషయంలో రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
ఫాక్స్కాన్లో భారీ ఉద్యోగాల కల్పనను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ విజయాన్ని గుర్తించినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. .. ..
- Ram Naramaneni
- Updated on: Dec 24, 2025
- 7:47 pm
Telangana Shakuntala: పునర్జన్మలు నిజమైతే తెలంగాణ శకుంతల కోరిక ఇదే..
దివంగత నటి తెలంగాణ శకుంతల జీవితం, కుటుంబం, నట ప్రస్థానంపై ఈ ప్రత్యేక కథనం. సినిమాల్లో శక్తివంతమైన నటనతో భయపెట్టిన ఆమె, నిజ జీవితంలో మాత్రం ఎంతో నిరాడంబరంగా జీవించారు. మరాఠీ కుటుంబ నేపథ్యం ఉన్న శకుంతల గారి ఇంటి విశేషాలు, కుటుంబ సభ్యుల పరిచయాలు, ఆమెలోని గొప్ప కళాకారిణిని ఈ కథనంలో ఆవిష్కరిస్తున్నాం.
- Ram Naramaneni
- Updated on: Dec 24, 2025
- 4:37 pm
Kalpana Ray: మనల్ని ఎంతో నవ్వించింది.. కానీ ఆమె జీవితం కన్నీటి ప్రయాణం.. అంత్యక్రియలకు డబ్బుల్లేక
తెలుగు చిత్రసీమలో నాలుగు దశాబ్దాలకు పైగా హాస్యనటిగా ప్రేక్షకులను నవ్వించిన కల్పనారాయ్ జీవితం దుర్భర దారిద్ర్యం, మోసాలతో నిండి విషాదంగా ముగిసింది. అనాథగా పెరిగి, నాటకరంగం నుండి సినిమాల్లోకి ప్రవేశించిన ఆమె చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులతో సతమతమై, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సాయంతో అంత్యక్రియలు జరిగాయి.
- Ram Naramaneni
- Updated on: Dec 24, 2025
- 3:42 pm
Bangladesh: బానిసత్వాన్ని తెంచి స్వాతంత్ర్యం ఇప్పిస్తే.. భారత్నే టార్గెట్ చేస్తారా?
1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయి స్వంతంత్ర దేశంగా ఏర్పడినప్పుడు... ఓ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ చేసిన కామెంట్స్ను గుర్తు చేసుకోవాలిక్కడ. 'మహా అయితే ఓ 30 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉంటుంది బంగ్లాదేశ్! మరో పాకిస్తాన్లా బంగ్లాదేశ్ మారకపోతే చూడండి. అక్కడి మంతఛాందసవాదం భారత్ చేసిన త్యాగాన్ని మరిచిపోయేలా చేస్తుంది. ఆ విషయాన్ని భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, బంగ్లాదేశ్తో ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి '.. అని 54 ఏళ్ల క్రితం ఆ ఆర్మీ అధికారి అన్న మాటలు ఇవాళ నిజమయ్యాయ్. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను దేశం నుంచి వెళ్లగొట్టడానికి ముందు.. అక్కడి వాట్సాప్ యూనివర్సిటీల్లో చెప్పుకున్న పాఠం ఒక్కటే. 'ముజీబుర్ రెహ్మాన్ మనకి స్వాతంత్య్రం తేలేదు.. పాకిస్తాన్ నుంచి భారతే మనల్ని విడగొట్టింది' అని. షేక్ ముజీబుర్ రెహ్మాన్, షేక్ హసీనాని దేశ ద్రోహులుగా యువతరం మనసులో ముద్ర వేసేశారు. బంగ్లాదేశ్కి భారత్ మొదటి శత్రువు అని నూరిపోశారు. సో, అంతా ఓ ప్లాన్ ప్రకారమే జరుగుతూ వస్తోంది. భారత్పై ద్వేషం ఉంటే.. బంగ్లాలోని హిందువులనే ఎందుకు టార్గెట్ చేయాలి? ఎక్కడ టచ్ చేస్తే భారత్ రియాక్ట్ అవుతుందో తెలుసు కాబట్టి. బంగ్లాదేశ్లో ఓ భారత వ్యతిరేకిని చంపేస్తే.. అందుకు ప్రతీకారంగా హిందువులను చంపుతున్నారంటే... బంగ్లాదేశ్ ఓ క్లియర్ సిగ్నల్ పంపిస్తోందనే అర్ధం. పాకిస్తాన్-చైనా అండ చూసుకుని.. రెచ్చిపోతోందని తెలుస్తూనే ఉంది. బట్.. ఇక్కడ తెలియాల్సింది బంగ్లాదేశ్లో ఈ మార్పు ఎక్కడ, ఎందుకు, ఎలా మొదలైందనేదే. భారత్పై అంతగా విషం కక్కడానికి కారణం ఏంటనేదే. బంగ్లాదేశ్లో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతోందో చెప్పుకుంటూనే ఈనాటి పరిస్థితికి కారణమైన చరిత్రను కూడా చెప్పుకుందాం
- Ram Naramaneni
- Updated on: Dec 23, 2025
- 9:45 pm