AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Naramaneni

Ram Naramaneni

Assistant News Editor, Political, Hyper Local, Trending, Human Interest - TV9 Telugu

ramu.naramaneni@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2017లో మహా న్యూస్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2019 ఫిబ్రవరిలో టీవీ9 తెలుగు డిజిటల్ విభాగంలో సబ్ ఎడిటర్‌గా చేరాను. అక్కడే 2022 మార్చి నుంచి చీఫ్ సబ్ ఎడిటర్‌గా, 2024 ఏప్రిల్ నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. పొలిటికల్, హైపర్ లోకల్, ఎంటర్టైన్మెంట్, క్రైమ్, ట్రెండింగ్, వైరల్ ఆర్టికల్స్ ఎక్కువగా అందిస్తూ ఉంటాను.

Read More
పొంగులేటి వర్సెస్ బీఆర్ఎస్  పాత పగ.. కొత్త సెగ!

పొంగులేటి వర్సెస్ బీఆర్ఎస్ పాత పగ.. కొత్త సెగ!

అసెంబ్లీ సెషన్స్ ముగిసినా సరే.. తెలంగాణ రాజకీయాల్లో ఓ కొత్త సెషన్ నడుస్తోందిప్పుడు. అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్ధం సాధారణం. కాని, మంత్రి వర్సెస్ మాజీల చుట్టూ మాత్రమే ఎడతెగని పొలిటికల్ వార్ జరగడం.. కాస్త అసాధారణం. అందులోనూ గత మూడునాలుగు రోజులుగా నడుస్తోందీ ఎపిసోడ్. మంత్రి పొంగులేటి టార్గెట్‌గా మాజీ మంత్రులు కేటీఆర్ అండ్ హరీష్ విరుచుకుపడుతున్నారు. ఇటు మంత్రి పొంగులేటికి అండగా మంత్రులతో పాటు ముఖ్యమంత్రే రంగంలోకి దిగారు. ఆరోపణలు చేయడం, ఆ తరువాత ఆ టాపిక్‌కు ఎండ్ కార్డ్ పడడం వెరీ కామన్. కాని, పొంగులేటి ఇష్యూలో అలా జరగడం లేదు ఎందుకని? పొలిటికల్‌గా మొదలైన దాడి ఏకంగా ఫ్యామిలీ దాకా వెళ్లింది. ఎందుకని? పైకి కనిపిస్తున్నంత చిన్న ఇష్యూ కాదిది. ఖమ్మం ఖిల్లాపై మొదలైన ఓ రాజకీయ రగడ.. హైదరాబాద్ శివారులోని వట్టినాగులపల్లి వరకు వచ్చిందంటే.. ఈ కథ చిన్నది కాదు. పాత పగపై కొత్త యుద్ధం చేస్తున్నట్టే లెక్క. గత రెండున్నరేళ్ల పాలనలో ఎన్నో స్కామ్‌లు జరిగాయని ఆరోపిస్తున్న బీఆర్ఎస్‌కు.. ఇప్పటివరకు సరైన సాంకేతిక ఆధారాలు లభించలేదు. బట్.. పొంగులేటి క్రషర్ల వ్యవహారంలో గతంలో జారీ అయిన నోటీసులు, జరిమానాల ఆధారాలు దొరకడంతో దీనిని ప్రభుత్వంపై 'అవినీతి' ముద్ర వేయడానికి సరైన ఆయుధంగా బీఆర్ఎస్ భావిస్తోందా? ఇంతకీ.. మంత్రి పొంగులేటి ఇష్యూలో ఏం జరిగింది? బీఆర్ఎస్ ఎందుకని ఇంత ప్రెస్టీజియస్‌గా తీసుకుంది? వెనకున్న కథేంటి?

Vikarabad: శంకరెడ్డిపల్లి తండాలో విపత్కర పరిస్థితి.. తాగునీరు లేక అల్లాడిపోతున్న జనం..

Vikarabad: శంకరెడ్డిపల్లి తండాలో విపత్కర పరిస్థితి.. తాగునీరు లేక అల్లాడిపోతున్న జనం..

తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడుస్తున్న గిరిజనులు… మిషన్ భగీరథ ఉన్నా నీరు రాక తండాల్లో తీవ్ర ఎద్దడి. వికారాబాద్ జిల్లా శంకరెడ్డిపల్లి తండాలో బోరు ఎండిపోవడంతో ప్రజలు నానాకష్టాలు పడుతున్నారు. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి ...

ఈ జనరేషన్‌లో అతను అరుదైన వ్యక్తి.. యువ హీరోపై రమాప్రభ ప్రశంసలు

ఈ జనరేషన్‌లో అతను అరుదైన వ్యక్తి.. యువ హీరోపై రమాప్రభ ప్రశంసలు

నటి రమాప్రభ జూనియర్ ఎన్టీఆర్ అసాధారణ పరిణతి, జ్ఞానంపై తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. చిన్న వయసులో అంత లోతైన ఫిలాసఫీ, ఆత్మవిశ్వాసం జన్మజన్మల సుకృతమని ఆమె అభిప్రాయపడ్డారు. మరణించిన నాగేశ్వరరావుగారి అంత్యక్రియల వద్ద జరిగిన ఆధ్యాత్మిక అనుభవాన్ని, అలాగే ప్రస్తుత సమాజంలో బంధాలు, స్నేహాల పట్ల ఆమె నిరాశను పంచుకున్నారు.

చాలా ఏళ్ల పాటు నూకల అన్నం తిని బతికాడు.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ యాక్టర్..

చాలా ఏళ్ల పాటు నూకల అన్నం తిని బతికాడు.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ యాక్టర్..

చమ్మక్ చంద్ర తన చిన్ననాటి పేదరికం, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి పడిన అపారమైన కష్టాలను పంచుకున్నారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, చదువులో వెనుకబాటు, డ్యాన్స్ క్లాసులతో జీవనం, విజయ్ గారి ఆశ్రయం, పదేళ్ల నిరీక్షణ తర్వాత జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపు ఆయన జీవితాన్ని ఎలా మార్చిందో వివరించారు. తన నేటి విజయం జబర్దస్త్ వల్లేనని భావోద్వేగంగా తెలిపారు.

Boti: సింపుల్ ట్రిక్స్.. బోటీని ఇలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చు..

Boti: సింపుల్ ట్రిక్స్.. బోటీని ఇలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చు..

బోటి శుభ్రపరచడం చాలా కష్టమైన పనిగా చాలా మంది భావిస్తారు. అయితే, ఈ గైడ్ ఇంట్లోనే సులభమైన చిట్కాలతో బోటిని (మేక పొట్ట, పేగులు) ఎలా శుభ్రం చేయాలో వివరిస్తుంది. పేగులను లోపలికి తిప్పి, పొట్టను వేడి నీటిలో శుభ్రం చేయడం ద్వారా ఎటువంటి దుర్వాసన లేకుండా రుచికరమైన బోటిని సిద్ధం చేసుకోవచ్చు.

“ఆ పిల్లాడి సినిమాలన్నీ డౌన్ టూ ఎర్త్ ఉంటాయండి.. నాకు చాలా ఇష్టం”

“ఆ పిల్లాడి సినిమాలన్నీ డౌన్ టూ ఎర్త్ ఉంటాయండి.. నాకు చాలా ఇష్టం”

సీనియర్ నటి సత్యప్రియ ఓ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ, సౌందర్యలతో నరసింహ సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. ఆమె తన అభిమాన నటులను వెల్లడిస్తూ, తెలుగు చిత్ర పరిశ్రమలో తిరిగి నటించాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. పిల్లలు సుస్థిరపడగా, ఆమె సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.

ఇది తెలియక ఇన్నాళ్లు ముంత మసాలా టేస్ట్ చాలా మిస్సయ్యారండి

ఇది తెలియక ఇన్నాళ్లు ముంత మసాలా టేస్ట్ చాలా మిస్సయ్యారండి

ముంత మసాలా, లేదా బొరుగుల మిక్స్చర్, ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే రుచికరమైన స్నాక్. తక్కువ ఖర్చుతో ఐదు నిమిషాల్లో తయారయ్యే ఈ వంటకం, వరి పేలాలు, కార్న్ ఫ్లేక్స్, వేరుశనగ పప్పులు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలతో కూడిన మిశ్రమం. కుటుంబ సభ్యులు ఎంతో ఇష్టపడే ఈ టేస్టీ స్ట్రీట్ ఫుడ్ ఇంటి వద్దే సిద్ధం చేసుకోండి.

ఐదు రాష్ట్రాల్లో హామీల హోళీ! లక్షల కోట్లతో ఖజానా ఖాళీ!

ఐదు రాష్ట్రాల్లో హామీల హోళీ! లక్షల కోట్లతో ఖజానా ఖాళీ!

తమిళనాడు నుంచి అసోం వరకు.. కేరళం నుంచి బెంగాల్ వరకు.. ఐదు రాష్ట్రాల్లో ఒక వింత ధోరణి ప్రబలుతోంది! దాని పేరు.. 'ఉచితం'! అక్షరం నేర్పే విద్య.. ప్రాణం పోసే వైద్యం.. ఆకలి తీర్చే పౌష్టికాహారం.. ఇదీ ప్రజల భవిష్యత్తు కోసం చేసే నిజమైన సంక్షేమం! కానీ.. ఓటు కోసం కురిపిస్తున్న ఫ్రిజ్‌లు, ఎన్నికల వేళ పంచుతున్న ల్యాప్‌టాప్‌లు, ఖాతాల్లో వేస్తున్న వేల రూపాయల నగదు.. ఇది కాదు కదా సంక్షేమానికి అర్థం. ఒక పేదవాడికి సైకిల్ కొనివ్వడం 'ఉచితం' అనుకుంటే.. అదే సైకిల్‌పై తను కూరగాయలు అమ్ముకుని బతకేలా చేయడం 'సంక్షేమం'. ఒకరికి చేపను వండి పెట్టడం 'ఉచితం'.. అదే అతనికి చేపలు పట్టడం నేర్పించడం 'సంక్షేమం'. ఈ డిఫరెన్స్ ఎందుకు మరిచిపోతున్నాయి పార్టీలు? 'శ్రీలంక దివాళా తీసినట్టు'.. అనే మాట వాడుతుంటారు ఉచితాలు విన్నప్పుడల్లా? ఎందుకో తెలుసా. ఎన్నికల్లో గెలవడం కోసం పన్నులు భారీగా తగ్గించి, మితిమీరిన రాయితీలు ఇచ్చారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. కానీ ఉచితాల కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. అప్పులు తీర్చలేక, విదేశీ కరెన్సీ లేక.. చివరికి పెట్రోల్, పాలు, మందులు, కనీసం పేపర్ కొనడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి వచ్చింది. ఆనాడు శ్రీలంకలో ఆహార ద్రవ్యోల్బణం 90 శాతం దాటిపోయింది. అప్పుడు వినిపించిన బ్రేకింగ్.. 'శ్రీలంక దివాళా'. రాష్ట్రాలను ఆ స్థితికి తీసుకెళ్దామనుకుంటున్నాయా ఈ పార్టీలు? ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏయే పార్టీ ఎలాంటి హామీలు ఇచ్చింది? దాని వల్ల రాష్ట్రాల ఖజానాపై పడుతున్న భారం ఎంత? ఉచిత హామీలే నిజంగా పార్టీలను గెలిపిస్తున్నాయా?

సుష్మా భూపతి నెల ఆదాయం తెలిస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే..

సుష్మా భూపతి నెల ఆదాయం తెలిస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే..

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు మస్త్ సంపాదిస్తున్నారు. బ్రాండ్స్ ప్రమోట్ చేయడం, యూట్యూబ్ వీడియోలు చేయడం.. వివిధ షోలలో పాల్గొనడం వాళ్లకు మంచి ఇన్‌కం సోర్స్‌గా మారింది. ఇన్ఫ్లుయెన్సర్ సుష్మా భూపతి తన నెలవారీ సంపాదన గురించి, అలాగే తన జీవితాశయాల గురించి పంచుకున్నారు.

Jabardasth: 20 ఎకరాల పొలం.. 200 కోట్ల ఆస్తి.. జబర్దస్త్ రిచ్చెస్ట్ కమెడియన్..!

Jabardasth: 20 ఎకరాల పొలం.. 200 కోట్ల ఆస్తి.. జబర్దస్త్ రిచ్చెస్ట్ కమెడియన్..!

జబర్దస్త్ స్టార్ కొమరక్క తన రూ.200 కోట్ల ఆస్తి వెనుక ఉన్న నిజాలను వెల్లడించారు. తండ్రి భూమి అమ్మిన తర్వాత, స్వంతంగా భూమి కొనాలనే తపనతో అహర్నిశలు శ్రమించి, ప్రతి రూపాయిని తెలివిగా భూమిలో పెట్టుబడిగా పెట్టారు. హోటల్‌లో పనిచేసి, చిన్నప్పటి నుండి కష్టపడి, వ్యసనాలకు దూరంగా ఉంటూ ఈ స్థాయికి చేరుకున్న తన ప్రయాణాన్ని వివరించారు.

దుర్భర పరిస్థితుల్లో ఉంటే చిరు ఆర్థిక సాయం.. చివరికి అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేక..

దుర్భర పరిస్థితుల్లో ఉంటే చిరు ఆర్థిక సాయం.. చివరికి అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేక..

హాస్యనటి మమత (అసలు పేరు ఝాన్సీ రాణి) జీవిత ప్రయాణం నాటకాలతో మొదలై, హాస్యనటిగా గుర్తింపు పొందింది. హీరోయిన్‌గా ఎదగాలనే ఆశతో మలయాళ చిత్రాల్లో శృంగారభరిత పాత్రలు చేయడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. చివరి దశలో తీవ్ర దారిద్ర్యాన్ని అనుభవించి, 2003 అక్టోబర్ 23న కన్నుమూశారు. ఆమె విషాద జీవితం ఎందరినో కంటతడి పెట్టిస్తుంది.

Andhra: పిల్లలిద్దరూ లండన్‌లో వెల్ సెటిల్డ్.. అయినా ఎందుకు ఆంటీ ఈ పనులు

Andhra: పిల్లలిద్దరూ లండన్‌లో వెల్ సెటిల్డ్.. అయినా ఎందుకు ఆంటీ ఈ పనులు

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముండ్రు పద్మ అనే మహిళ తన ఇంట్లో దొంగతనం జరిగిందని, బంగారం దోచేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు జరిపిన దర్యాప్తులో ఇది బీమా సొమ్ము కోసం ఆమె ఆడిన నాటకమని తేలింది. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా ఆమె డ్రామాను రట్టు చేయగా, పద్మ నేరాన్ని అంగీకరించింది.