చంద్రబాబు నాయుడు
నారా చంద్రబాబు నాయుడు
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. తెలుగు దేశం పార్టీ(టీడీపీ) జాతీయ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమితో చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు నవ్యాంధ్రకు రెండోసారి సీఎం అయ్యారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత సాధించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్కు రెండుసార్లు, నవ్యాంధ్రకు రెండుసార్లు సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20 ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు.
చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా 1973లో చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన 1978లో ఆయన కాంగ్రెస్ (ఐ) పార్టీలో చేరారు. ఆ ఏడాది చంద్రగిరి నియోకజవర్గం నుంచి కాంగ్రెస్ (ఐ) టికెట్పై పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 28 సంవత్సరాల వయస్సులో రాష్ట్రంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా ఘనత సాధించారు. 1980లో ఆయన ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ (ఐ)లోనే చంద్రబాబు కొనసాగారు. 1983 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెంట్రామ నాయుడి చేతిలో ఓటమి తర్వాత, ఆయన కాంగ్రెస్ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
1995 నుండి 2004 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. తన హయాంలో హైదరాబాద్లో ఐటీ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2003లో అలిపిరి మందుపాతర పేలుడు ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. తన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్ ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మని వివాహం చేసుకోగా.. వారికి కుమారుడు దేవాన్ష్ ఉన్నారు.
యునైటెడ్ ఫ్రెంట్ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. ఏపీ రాజకీయ నాయకుడిగానే కాకుండా జాతీయ నాయకుడిగా చంద్రబాబు గుర్తింపు సాధించారు.
ఇంకా చదవండిస్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుకు పరీక్షగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా ఓటు శాతం పెరగాలని లక్ష్యంగా పెట్టారు. ఓటు శాతం తగ్గితే ఎమ్మెల్యేల పనితీరుపై ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తూ, కూటమి సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారం, ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టడం, సోషల్ మీడియా వినియోగం, టెక్నాలజీపై దృష్టి పెట్టాలని సూచించారు.
- Shaik Madar Saheb
- Updated on: Sep 7, 2026
- 5:37 pm
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. కిలో ఉల్లి రూ.35కే! పప్పు, పామాయిల్పైనా ధరల తగ్గింపు!
ఆంధ్రప్రదేశ్లో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కిలో ఉల్లిపాయలను ₹35కే రైతు బజార్లలో విక్రయించనుంది. పామాయిల్పై ₹10 వరకు, కందిపప్పుపై కూడా ధరలు తగ్గించనుంది. ఇప్పటికే బియ్యం సరఫరా ద్వారా లక్ష మందికి పైగా లబ్ధి పొందారు. వినియోగదారులకు ఊరట కల్పించి, అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
- Balaraju Goud
- Updated on: Sep 4, 2026
- 10:22 am
పవన్కు చంద్రబాబు స్పెషల్ కాల్..! పుట్టినరోజున ఫోన్ చేసి ఏం చెప్పారంటే..?
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం కేరళలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్యంపై ఆరా తీశారు. పంచాయతీరాజ్, గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో పవన్ కృషిని చంద్రబాబు కొనియాడారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆయన నిబద్ధతను ప్రశంసించారు. మంత్రి నారా లోకేష్ కూడా పవన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
- Eswar Chennupalli
- Updated on: Sep 2, 2026
- 1:12 pm
ఏపీ ఖజానాకు ఫుల్ జోష్.. ఆగస్టులో పన్నుల రాబడి ఎన్ని వేల కోట్లు తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ ఖజానాకు శుభవార్త! ఆగస్టులో పన్నుల రాబడి రూ.25,449.80 కోట్లకు చేరి, గత ఏడాదితో పోలిస్తే 18.05% వృద్ధిని నమోదు చేసింది. పన్నుల వసూళ్లను పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖ AI, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. దీనివల్ల పన్నుల ఎగవేత తగ్గి, రాష్ట్ర ఆదాయానికి గణనీయమైన జోష్ లభిస్తోంది. ఇది ఖజానాకు బలమైన పునాది వేస్తోంది.
- Eswar Chennupalli
- Updated on: Sep 2, 2026
- 10:55 am
ఏజెన్సీలో తీవ్ర విషాదం.. మాత్రలు వికటించి గిరిజన చిన్నారి మృతి.. సీఎం కీలక ఆదేశాలు..
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా నివారణకు పంపిణీ చేసిన క్లోరోక్విన్ మాత్రల అనంతరం పలువురు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. 71 మందికి మాత్రలు పంపిణీ చేయగా.. 53 మంది అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో 46 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మడివి జమున (7) అనే చిన్నారి వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
- Anand T
- Updated on: Sep 2, 2026
- 6:40 am
Andhra Pradesh: ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం.. ప్రభుత్వం నుంచి బిగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే..?
ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు తీపికబురు అందించారు. ప్రస్తుతం కొన్ని బస్సులు మాత్రమే స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నారు. ఐదు కేటగిరీల బస్సుల్లో మాత్రమే ఇది వర్తింపచేస్తున్నారు. అయితే త్వరలో ఏసీ బస్సుల్లోనూ అమలు చేసేందుకు రంగం సిద్దమవుతోంది.
- Venkatrao Lella
- Updated on: Sep 1, 2026
- 8:51 pm
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ‘తల్లికి వందనం’ డబ్బులు జమ! దరఖాస్తుకు మరో ఛాన్స్!
ఏపీలోని 1వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం కింద ఆగస్టు 30న ₹13,000 నిధులు విడుదల కానున్నాయి. గతంలో సాంకేతిక సమస్యలతో లబ్ధి పొందని వారికి కూడా అదే రోజు జమ చేస్తారు. అర్హత ఉన్నవారు ఆగస్టు 25లోగా సచివాలయంలో దరఖాస్తు చేసుకొని, e-KYC సమస్యలను పరిష్కరించుకోవాలని విద్యాశాఖ సూచించింది.
- Balaraju Goud
- Updated on: Aug 22, 2026
- 6:11 pm
Chiranjeevi Birthday: రక్తనిధి, నేత్ర నిధితో మానవత్వాన్ని చాటుకున్నారు.. చిరంజీవికి సీఎం చంద్రబాబు బర్త్డే విషెస్
ఇవాళ (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. దీంతో సినీ సెలబ్రిటీలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి బర్త్ డే విషెస్ చెప్పారు.
- Basha Shek
- Updated on: Aug 22, 2026
- 12:59 pm
AP Assembly Live: మెగా డీఎస్సీ, రిజర్వేషన్లపై చర్చ.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో మెగా డీఎస్సీ-2025, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రాజకీయ రిజర్వేషన్లు సహా పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. మెగా డీఎస్సీపై మంత్రి నారా లోకేష్ సభలో ప్రకటన చేసి, నియామక ప్రక్రియను పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించనున్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.
- Shaik Madar Saheb
- Updated on: Aug 17, 2026
- 8:59 am
దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలి.. మువ్వెన్నెల జెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అట్టహాసంగా నిర్వహించిన పరేడ్లో సీఎం చంద్రబాబు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. స్వాతంత్య్ర సమరయోధులకు నిజమైన నివాళి దేశ నిర్మాణమేనని అన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Aug 15, 2026
- 1:41 pm
Andhra Pradesh: వాళ్లది డీఎస్సీ.. వీళ్లది ఏపీపీఎస్సీ.. పరీక్షలను రౌండప్ చేసిన పాలిటిక్స్
ఏ ఫర్ ఆంధ్రా, పీ ఫర్ పాలిటిక్స్. పొలిటికల్లీ మాంచి డెన్సిటీ ఉండే రాష్ట్రంగా ఏపీకి ప్రత్యేక క్రెడిట్టే ఉంది. ఇక్కడ పార్టీలకు బీపీలు రైజవ్వడం ఎప్పుడూ కొత్తకాదు. కానీ, ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది ఏపీలో రాజకీయ చదరంగం. ఏ పార్టీ ఎప్పుడు ఏ పాచిక వేస్తుందో ఏ పార్టీకీ తెలీదు. ఎగస్పార్టీల్ని అనుక్షణం అణువణువూ చదువుతుండాల్సిందే. ఇక్కడ ప్రతీ ఇయరూ ఎలక్షన్ ఇయరే. ఓటుబ్యాంకులకు కన్నమెయ్యడం మీదే పార్టీలకు కన్ను. రాబోయే స్థానిక ఎన్నికలకు నగారా మోగకముందే, మందుగుండు సిద్ధం చేసుకుంటున్నాయి పార్టీలు. 2029కి ఇప్పటినుంచే వామప్ మ్యాచ్లకు ప్యాడ్లు కట్టుకుంటున్నాయి టీడీపీ-వైసీపీ. ఎలాగో డీటెయిల్డ్గా చూద్దాం.
- Balaraju Goud
- Updated on: Aug 14, 2026
- 9:53 pm
CM Chanrababu: 76 ఏళ్ల వయస్సులోనూ ఇంత ఎనర్జీ ఎలా..? సీఎం చంద్రబాబు దినచర్య, డైట్ రహస్యం ఇదే..
76 ఏళ్ల వయసులోనూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో చురుగ్గా పనిచేయడం వెనుక ఆయన పాటించే క్రమశిక్షణ కీలకంగా కనిపిస్తోంది. యోగా, వ్యాయామం, మితాహారం, ప్రోటీన్కు ప్రాధాన్యత, సమయపాలన వంటి అలవాట్లు ఆయన లైఫ్స్టైల్లో భాగంగా ఉన్నాయి. చంద్రబాబు ఆరోగ్య జీవనశైలి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.
- Siva Nagaraju
- Updated on: Aug 13, 2026
- 7:11 pm