చంద్రబాబు నాయుడు
నారా చంద్రబాబు నాయుడు
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. తెలుగు దేశం పార్టీ(టీడీపీ) జాతీయ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమితో చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు నవ్యాంధ్రకు రెండోసారి సీఎం అయ్యారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత సాధించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్కు రెండుసార్లు, నవ్యాంధ్రకు రెండుసార్లు సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20 ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు.
చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా 1973లో చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన 1978లో ఆయన కాంగ్రెస్ (ఐ) పార్టీలో చేరారు. ఆ ఏడాది చంద్రగిరి నియోకజవర్గం నుంచి కాంగ్రెస్ (ఐ) టికెట్పై పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 28 సంవత్సరాల వయస్సులో రాష్ట్రంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా ఘనత సాధించారు. 1980లో ఆయన ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ (ఐ)లోనే చంద్రబాబు కొనసాగారు. 1983 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెంట్రామ నాయుడి చేతిలో ఓటమి తర్వాత, ఆయన కాంగ్రెస్ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
1995 నుండి 2004 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. తన హయాంలో హైదరాబాద్లో ఐటీ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2003లో అలిపిరి మందుపాతర పేలుడు ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. తన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్ ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మని వివాహం చేసుకోగా.. వారికి కుమారుడు దేవాన్ష్ ఉన్నారు.
యునైటెడ్ ఫ్రెంట్ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. ఏపీ రాజకీయ నాయకుడిగానే కాకుండా జాతీయ నాయకుడిగా చంద్రబాబు గుర్తింపు సాధించారు.
ప్రోటోకాల్ పక్కనబెట్టి.. ముఖ్యమంత్రి ఇంటికి ప్రధాని మోదీ.. సీఎం చంద్రబాబు భావోద్వేగం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అరుదైన, మధురమైన ఘట్టం ఆవిష్కృతమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి విచ్చేసి, వారి కుటుంబ సభ్యులతో కలిసి గడిపారు. ఈ ప్రత్యేక సందర్భంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఎంతో భావోద్వేగంగా స్పందించారు.
- Balaraju Goud
- Updated on: May 10, 2026
- 10:14 pm
హైదరాబాద్ వేదికగా ఏపీ రాజకీయం.. ప్రోటోకాల్ దాటిన స్నేహం.. మిత్రుల ఇళ్లకు మోదీ!
హైదరాబాద్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన రాజకీయంగా విస్తృత చర్చకు దారి తీసింది. సాధారణంగా ప్రధాని ఏ రాష్ట్రానికి వెళ్లినా అధికారిక కార్యక్రమాలకే పరిమితం కావడం ఆనవాయితీ. కానీ ఈసారి తెలంగాణ పర్యటనలో భాగంగా జూబ్లీహిల్స్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసాలకు మోదీ వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
- Eswar Chennupalli
- Updated on: May 10, 2026
- 7:09 pm
విశ్వకవి సాక్షిగా సరికొత్త చరిత్ర.. బెంగాల్లో నూతన శకం ఆరంభం.. సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో 2026, మే 9వ తేదీ ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోనుంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా బెంగాల్ గడ్డపై భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వం కొలువుదీరింది. కోల్కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కన్నుల పండువైన కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
- Balaraju Goud
- Updated on: May 9, 2026
- 3:03 pm
గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా, రాజకీయంగానూ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అమరావతిలో జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు ఒక దిశానిర్దేశంలా నిలిచింది. ప్రధానంగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామనే స్పష్టమైన సంకేతాన్ని ఇస్తూ, యంత్రాంగం అందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
- Eswar Chennupalli
- Updated on: May 7, 2026
- 9:33 pm
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైనస్ సమస్యతో శస్త్ర చికిత్స చేయించుకున్నారట.. దాని ప్రభావం కంటి మీద కూడా పడిందట. ఇంకేదో మరోసారి చికిత్స అవసరం అంటున్నారట.. గత కొన్ని రోజులుగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ఇలా రకరకాల ప్రచారాలు వినిపిస్తున్నాయి. కానీ అసలు ఏమైంది? ఏ శస్త్ర చికిత్స జరిగింది?
- Eswar Chennupalli
- Updated on: May 3, 2026
- 6:55 am
ప్రపంచమంతా గూగుల్లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు
విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ఐటీ ముఖచిత్రం సమూలంగా మారిపోనుంది. ఒకప్పుడు వలసలకు చిరునామాగా ఉన్న ఉత్తరాంధ్ర, ఇప్పుడు ప్రపంచానికి 'ఏఐ గేట్వే'గా అవతరించబోతోంది. ఈ మహాద్భుత ఘట్టానికి ఏప్రిల్ 28, 2026న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శ్రీకారం చుట్టారు.
- Balaraju Goud
- Updated on: Apr 28, 2026
- 1:15 pm
రేపు చంద్రబాబు పరిస్థితి కూడా అంతే: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దేశంలో BJPతో పొత్తుపెట్టుకున్న పార్టీల మనగడ ప్రశ్నార్థకమే.. అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్లో నితీష్ కుమార్, మహారాష్ట్రలో ఎక్నాథ్ షిండే పరిస్థితి చూస్తూనే ఉన్నామని.. రేపు టీడీడీ, చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే అవుతుందంటూ పేర్కొన్నారు
- Shaik Madar Saheb
- Updated on: Apr 18, 2026
- 4:38 pm
Nara Lokesh: చంద్రబాబు సంచలన నిర్ణయం.. వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్
టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి నారా లోకేష్కు ప్రమోషన్ దక్కింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా లోకేష్ ఉండగా.. వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ ఉండనున్నారు. ఈ మేరకు చంద్రబాబు ప్రకటన చేశారు.
- Venkatrao Lella
- Updated on: Apr 15, 2026
- 11:44 am
Tollywood: చంద్రబాబుతో ఉన్న ఈ బ్రదర్స్ ఇప్పుడు తెలుగులో ఫేమస్ హీరోలు.. ఎవరో గుర్తు పట్టారా?
సినిమా ఇండస్ట్రీ నేపథ్యమున్న కుటుంబం నుంచే ఈ అన్నదమ్ములు కూడా వచ్చారు. తండ్రి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇద్దరూ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. డిఫరెంట్ స్టోరీలు, సబ్జెక్టులతో ఎంచుకుంటూ టాలీవుడ్ లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారీ క్రేజీ బ్రదర్స్.
- Basha Shek
- Updated on: Apr 7, 2026
- 6:14 pm
దేశమంతా అమరావతికి మద్దతిస్తే.. మన వాళ్లే ఉనికి లేకుండా చేయాలని చూస్తున్నారుః చంద్రబాబు
సైబరాబాద్ సహా, అమరావతి నిర్మాణం కోసం భగవంతుడు అవకాశాలు కల్పించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని అమరావతిని అడ్డుకునేందుకు వైసీపీ ఎన్నో కుట్రలు చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజధాని అంటే నాలుగు ఆఫీసులు కడితే సరిపోదని, అమరావతిలో నవ నగరాల అభివృద్ధికి రూపకల్పన చేశామన్నారు. అమరావతిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు ప్లాన్ చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు.
- Balaraju Goud
- Updated on: Apr 3, 2026
- 2:13 pm
లోక్సభ ముందుకు ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లు.. మద్దతు పలికిన కాంగ్రెస్, వైసీపీ వాకౌంట్!
అమరావతి చట్టబద్ధతకు మరో కీలక అడుగు పడింది. ఇవాళ బుధవారం (ఏప్రిల్ 01, 2026 ) ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత లోక్సభ ముందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు తీసుకువచ్చారు. అయితే లోక్సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.
- Balaraju Goud
- Updated on: Apr 1, 2026
- 1:07 pm
Amaravati: అమరావతికి రాజముద్ర.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు.. లైవ్ వీడియో
పార్లమెంట్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ద్వారా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించనుంది కేంద్ర ప్రభుత్వం.. లోక్సభలో కేంద్రహోంశాఖ సహాయ మంద్రి నిత్యానంద రాయ్ బిల్లును ప్రవేశపెట్టారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత అంశంపై పార్లమెంట్లో చర్చ జరుగుతోంది. ఈ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 1, 2026
- 12:16 pm