AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

నారా చంద్రబాబు నాయుడు

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. తెలుగు దేశం పార్టీ(టీడీపీ) జాతీయ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమితో చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు నవ్యాంధ్రకు రెండోసారి సీఎం అయ్యారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత సాధించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు రెండుసార్లు, నవ్యాంధ్రకు రెండుసార్లు సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20 ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు.

చంద్రగిరిలో విద్యార్థి నాయ‌కుడిగా 1973లో చంద్రబాబు రాజ‌కీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన 1978లో ఆయన కాంగ్రెస్ (ఐ) పార్టీలో చేరారు. ఆ ఏడాది చంద్రగిరి నియోకజవర్గం నుంచి కాంగ్రెస్ (ఐ) టికెట్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 28 సంవత్సరాల వయస్సులో రాష్ట్రంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా ఘనత సాధించారు. 1980లో ఆయ‌న ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ (ఐ)లోనే చంద్రబాబు కొనసాగారు. 1983 ఎన్నిక‌ల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెంట్రామ నాయుడి చేతిలో ఓట‌మి త‌ర్వాత‌, ఆయ‌న కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

1995 నుండి 2004 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. తన హయాంలో హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2003లో అలిపిరి మందుపాతర పేలుడు ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. తన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్ ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మని వివాహం చేసుకోగా.. వారికి కుమారుడు దేవాన్ష్ ఉన్నారు.

యునైటెడ్ ఫ్రెంట్ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. ఏపీ రాజకీయ నాయకుడిగానే కాకుండా జాతీయ నాయకుడిగా చంద్రబాబు గుర్తింపు సాధించారు.

ఇంకా చదవండి

Naravaripalle Sankranti Celebrations: మనవళ్ల ఆటల పోటీలకు ఫిదా అయిన సీఎం చంద్రబాబు దంపతులు.. ఇదిగో ఫొటోలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లిలో కోలాహలంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. గ్రామస్తులను సీఎం దంపతులు ఆప్యాయంగా పలకరించారు. క్రీడా పోటీలను ఆసక్తిగా తిలకించారు. నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో రంగవల్లులు, ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు..ఈ క్రీడల్లో లోకేష్‌ కుమారుడు దేవాన్ష్‌ పాల్గొన్నారు. ఆటల్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం చేయనున్నారు.. సీఎం చంద్రబాబు ఇంటి దగ్గరే ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈనెల 15 వరకు నారావారిపల్లిలోనే సీఎం కుటుంబం ఉంటుంది.

CM Chandrababu: అమరావతి ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచానికే స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్‌గా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లో 25.3% పెట్టుబడుల వృద్ధి, లక్షల ఉద్యోగాల కల్పన, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, సమగ్ర నీటి నిర్వహణ వంటి కీలక విజయాలను ఆయన వెల్లడించారు. విశాఖలో డేటా హబ్, అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుతో రాష్ట్రం గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించిందని తెలిపారు.

  • Phani CH
  • Updated on: Jan 12, 2026
  • 5:48 pm

AP Budget 2026: బడ్జెట్ సమావేశాలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. ఈ అంశాలపైనే ప్రత్యేక చర్చ

రాష్ట్ర బడ్జెట్‌ ఎలా ఉండాలి ? ఏ శాఖకు ఎంత నిధులు కేటాయించాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రాబోయే నిధులు అంచనాలు, లెక్కలు ఎలా ఉండొచ్చు. ఇలాంటి అంశాలపై కీలక సమీక్ష నిర్వహించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్ర సహకారం.. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై అధికారులతో చర్చించనున్నారు.

AP – TG: పరిష్కారం దిశగా ఏపీ, తెలంగాణ నీటి వివాదాలు..! చంద్రబాబు, రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి మంటలు తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇతర నేతల మాటలు ఎలా ఉన్నా.. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు సామరస్యపూర్వక పరిష్కారమే బెటరని కామెంట్ చేయడం కొత్త సరికొత్త చర్చకు దారి తీస్తోంది. నేతలు.. చర్చలకు సిద్ధమని సంకేతాలివ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

సముద్రంలో కలిసే జలాలు ఉపయోగించుకుంటే తప్పేంటి..? నీటిపై రాజకీయాలు వద్దుః సీఎం చంద్రబాబు

నీటి వివాదం.. PPP విధానం.. దుర్గగుడి పవర్ కట్‌ అంశం.. పెట్టుబడుల విషయం.. ఇలా ఒక్కటేంటి ఎన్నో ఆసక్తికర విషయాలను మంత్రులతో చర్చించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ భేటీ తర్వాత కీలక అంశాలపై మంత్రులతో చర్చించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇటీవల ఏపీ, తెలంగాణ మధ్య తలెత్తిన జలవివాదంపై ప్రధానంగా మాట్లాడారు.

CM Chandrababu Naidu: అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకున్న చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయోధ్య చేరుకుని, బాలరాముడిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ దర్శనం తనకు ఎంతో శాంతిని, అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీరాముడి విలువలు, ఆదర్శాలు కాలాతీతమైనవని, అవి సమాజంలోని ప్రతి ఒక్కరికీ నిరంతరం స్ఫూర్తినిస్తాయని ఆయన స్పష్టం చేశారు.

  • Phani CH
  • Updated on: Dec 28, 2025
  • 7:32 pm

CM Chandrababu Naidu: జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల అభ్యంతరాల మేరకు స్వల్ప మార్పులు చేస్తూ, నెల్లూరు జిల్లాలో గూడూరు కొనసాగింపు, మార్కాపురం జిల్లాకు దొనకొండ, కురిచేడులను ఖరారు చేశారు. అయితే, జనగణన నేపథ్యంలో గ్రేటర్ విజయవాడ, తిరుపతి ఏర్పాటును ప్రస్తుతానికి వాయిదా వేశారు. తుది నోటిఫికేషన్ ఈ నెల 31న వెలువడనుంది.

  • Phani CH
  • Updated on: Dec 27, 2025
  • 10:10 pm

Chandrababu Naidu: ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవం.. భార్య భువనేశ్వరిపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 2047 నాటికి మనం నెంబర్ వన్ గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన బల్లగుద్ది చెప్పారు. ఈ వేడుకల్లో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కూడా పాల్గొన్నారు.

Andhra: నెల్లూరులోనే గూడురు.. జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆరోజే తుది నోటిఫికేషన్..

త్వరలోనే కొత్త జిల్లాలు.. ప్రతిపాదనల్లో స్వల్ప మార్పులు కొత్త సంవత్సరంలో ఏపీ ముఖచిత్రంలో కొత్త జిల్లాలు ఆవిర్భవించబోతున్నాయి. ఇందుకు సంబంధించిన బ్లూప్రింట్‌కు సీఎం చంద్రబాబు స్వల్ప మార్పులు సూచించారు. ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయాలు ఉంటాయని పదే పదే చెబుతున్న చంద్రబాబు.. ఈ అంశంలో ప్రభుత్వ నిర్ణయాలు ఆ విధంగానే ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు.

CM Chandrababu Naidu: కొత్త టెక్నాలజీ తీసుకొచ్చే బాధ్యత మాది

అమరావతిలో జరిగిన క్వాంటం టాక్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు టెక్ విద్యార్థులతో మాట్లాడారు. 50,000 మంది క్వాంటం ట్రైనింగ్‌కు నమోదు చేసుకోగా, లక్ష మంది నిపుణులను తయారు చేయడమే లక్ష్యమన్నారు. కొత్త టెక్నాలజీ తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత అని, కెరియర్‌ను నిర్మించుకోవడం విద్యార్థుల బాధ్యత అని సూచించారు.

  • Phani CH
  • Updated on: Dec 23, 2025
  • 6:47 pm

పార్టీ పదవుల భర్తీ స్పీడప్.. టీడీపీ జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు.. ఇదిగో లిస్ట్..!.

పార్టీ పదవుల భర్తీని తెలుగుదేశం పార్టీ స్పీడప్ చేసింది. పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైంది. ఇప్పటికే జాబితాను కూడా రెడీ చేసింది. ఆ సమాచారాన్ని ఎమ్మెల్యేలు, జిల్లా నేతలకు ఇప్పటికే పార్టీ పంపించినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో టీడీపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించనుంది. ఇంతకీ.. పదవులు దక్కబోతున్న ఆ నేతలెవరు?

CM Chandrababu: ఏపీలో సంక్రాంతి నుంచి అన్ని సేవలూ ఆన్ లైన్ లోనే

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి నుండి అన్ని ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌లో అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. డ్రోన్ సేవల విస్తరణకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, ఆర్టీసీ సేవలు, పరిశుభ్రత మెరుగుపరచాలని సూచించారు.

  • Phani CH
  • Updated on: Dec 10, 2025
  • 5:39 pm