Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

నారా చంద్రబాబు నాయుడు

నారా చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుండి నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత సాధించారు. నారా చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20 ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు.

చంద్రగిరిలో విద్యార్థి నాయ‌కుడిగా 1973లో చంద్రబాబు రాజ‌కీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన 1978లో ఆయన కాంగ్రెస్ (ఐ) పార్టీలో చేరారు. ఆ ఏడాది చంద్రగిరి నియోకజవర్గం నుంచి కాంగ్రెస్ (ఐ) టికెట్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 28 సంవత్సరాల వయస్సులో రాష్ట్రంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా ఘనత సాధించారు. 1980లో ఆయ‌న ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ (ఐ)లోనే చంద్రబాబు కొనసాగారు. 1983 ఎన్నిక‌ల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెంట్రామ నాయుడి చేతిలో ఓట‌మి త‌ర్వాత‌, ఆయ‌న కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

1995 నుండి 2004 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. తన హయాంలో హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2003లో అలిపిరి మందుపాతర పేలుడు ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. తన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్ కు నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి తో వివాహం చేసి నందమూరి కుటుంబంతో మరింత అనుబంధం పెంచుకున్నాడు.

యునైటెడ్ ఫ్రెంట్ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. ఏపీ రాజకీయ నాయకుడిగానే కాకుండా జాతీయ నాయకుడిగా చంద్రబాబు గుర్తింపు సాధించారు.

ఇంకా చదవండి

ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీకే ! దాదాపు అభ్యర్థి ఖరారు.. ఎవరంటే?

తెలుగు తంబి అన్నామలై.. అదేంటి? అంటే తమిళ తంబి అనాలి.. లేదంటే తెలుగు తమ్ముడు అనాలి. తెలుగు తంబీ అంటున్నారేంటి అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది..ఈ సీటును భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని నిర్ణయించింది ఎన్డీయే కూటమి. బీజేపీ ఏమో తమిళనాడు నేత, మాజీ పోలీస్‌ అధికారి అన్నామలైని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించాలని డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది. అందుకే అన్నామలై తెలుగు తంబీ అయిపోతున్నారు.

Amaravati NTR Statue: స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం.. ఎన్ని అడుగులంటే..

అమరావతి నగర అభివృద్ధిలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే మరో పని చేయాలని నిర్ణయించింది. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రాజకీయ నాయకుడు, దిగ్గజ నటుడు స్వర్గియ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్మారకంగా భారీ విగ్రహాన్ని నీరుకొండ గ్రామం వద్ద ఏర్పాటు చేయనుంది.

CM Chandrababu: ప్రేమంటే ఇదే.. చంద్రబాబుకు అక్కడున్న ఇమేజ్ డిఫరెంట్.. వీడియో చూస్తే ఫిదానే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్ల ఇక్కడి ప్రజలు అభిమానమే వేరు. చూపే ఆదరణ డిఫరెంట్. 1989 నుంచి వరుసగా ఎనిమిదోసారి ఓటు వేసి అసెంబ్లీకి పంపిన కుప్పం ప్రజలకు చంద్రబాబు పట్ల అపారమైన ప్రేమ ఉంది. అంతేకాకుండా.. ఇక్కడి ప్రజలతో చంద్రబాబుకు కూడా అంతే ఆప్యాయత, ప్రేమ ఉంది..

CBN Birthday: బాబు@75.. అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షల వెల్లువ

ఆహా.. ఏమి అభిమానం.. ఏమి సంబరం.. మీ అభిమానం సల్లగుండా.. అనే రేంజ్‌లో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు అభిమానులు. పండుగ వాతావరణంలో తమ నాయకుడి బర్త్‌డేను ఎవరికి తోచిన రీతిలో వాళ్లు సెలబ్రేట్ చేసుకున్నారు. అభిమానులు, సెలబ్రిటీలు సైతం తమ అభిమానాన్ని చాటుకున్నారు. 

ఆర్థికంగా చితికిపోయినా రాష్ట్రాన్ని ఆదుకోండి.. ఆర్థిక సంఘానికి ఏపీ సీఎం విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌కు అండగా.. అభివృద్ధికి ఊతమిచ్చేలా సాయం చేయాలని ఆర్థిక సంఘానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. 10 నెలలుగా తీసుకున్న చర్యలు.. అమలు చేసిన విధానాలను వివరించారు. అలాగే రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచనలను వివరిస్తూ వీడియో ప్రదర్శించారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబు ఫ్యామిలీతో కలిసి జన్మదిన వజ్రోత్సవం.. ఏ దేశంలో తెలుసా..?

75 ఏళ్ల వయసు అంటే ఒక రాజకీయ నాయకుడి జీవితంలోనే కాక, ఏ వ్యక్తిగత జీవితానికైనా ఒక మైలురాయి. అంతటి ఘనత గల సందర్భాన్ని రాష్ట్ర రాజధాని అమరావతిలో కాదు, విదేశాల్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్‌గా జరుపుకోవాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున నాయకులు, శ్రేణులు, అభిమానులు, రాజకీయ ప్రదర్శనలు జరగకుండా ఉండేందుకు ఇదే సరైన మార్గమని ఆయన భావించినట్టు తెలిసింది.

Andhra Pradesh: 3 గంటల పాటు సాగిన ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 3 గంటల పాటు సాగిన ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆ ఆర్డినెన్స్‌ ద్వారా జిల్లాలవారీగా జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తారు. వేట నిషేధకాలంలో మత్స్యకారులకు ఇచ్చే సాయం 20 వేలకు పెంచింది ప్రభుత్వం. ఏప్రిల్ 26న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.

AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం.. చర్చకు రానున్న అమరావతి ఫేజ్ 2!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. అమరావతి సహా ఏపీ అభివృద్ధి అంశాలపై ప్రధానంగా చర్చించేందుకు ఏపీ మంత్రివర్గం మరోసారి సమావేశం కానుంది. మరి ఆ ఎజెండాలో ఉన్న అంశాలేంటి? అమరావతికి సంబంధించి ప్రభుత్వ ప్రణాళికలేంటి? తెలుసుకుందాం.

Amaravati 2.0: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. మరో 44 వేల ఎకరాల భూ సేకరణకు సన్నద్ధం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటోంది. అమరావతిని ఒక సమగ్ర, ప్రగతిశీల రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. రాజధానిలో పెరుగుతున్న అవసరాలు, కీలక పౌర సదుపాయాలకు స్థలాభావం కారణంగా మరో 44,676 ఎకరాల భూమి సమీకరణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

టెంపుల్ టూరిజంగా ఒంటిమిట్ట.. రామరాజ్యం తేవాలన్నదే నా ఆకాంక్షః సీఎం చంద్రబాబు

ఒంటిమిట్టను టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇక్కడికి వచ్చే భక్తులు రెండు మూడు రోజులు ఉండేలా సకల సదుపాయాలు కల్పిస్తామన్నారు. కడప జిల్లా, ఒంటిమిట్టలో జరిగిన శ్రీసీతారాముల కళ్యాణోత్సవంలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొని స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.