చంద్రబాబు నాయుడు
నారా చంద్రబాబు నాయుడు
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. తెలుగు దేశం పార్టీ(టీడీపీ) జాతీయ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమితో చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు నవ్యాంధ్రకు రెండోసారి సీఎం అయ్యారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత సాధించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్కు రెండుసార్లు, నవ్యాంధ్రకు రెండుసార్లు సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20 ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు.
చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా 1973లో చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన 1978లో ఆయన కాంగ్రెస్ (ఐ) పార్టీలో చేరారు. ఆ ఏడాది చంద్రగిరి నియోకజవర్గం నుంచి కాంగ్రెస్ (ఐ) టికెట్పై పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 28 సంవత్సరాల వయస్సులో రాష్ట్రంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా ఘనత సాధించారు. 1980లో ఆయన ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ (ఐ)లోనే చంద్రబాబు కొనసాగారు. 1983 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెంట్రామ నాయుడి చేతిలో ఓటమి తర్వాత, ఆయన కాంగ్రెస్ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
1995 నుండి 2004 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. తన హయాంలో హైదరాబాద్లో ఐటీ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2003లో అలిపిరి మందుపాతర పేలుడు ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. తన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్ ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మని వివాహం చేసుకోగా.. వారికి కుమారుడు దేవాన్ష్ ఉన్నారు.
యునైటెడ్ ఫ్రెంట్ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. ఏపీ రాజకీయ నాయకుడిగానే కాకుండా జాతీయ నాయకుడిగా చంద్రబాబు గుర్తింపు సాధించారు.
Aquaculture: ఏపీలో ఆక్వా రైతుల దుస్థితికి కారణం ఏంటి..? గట్టెక్కేది ఎలా..?
అనాథ రొయ్యగా మారిన ఆంధ్రా రొయ్యకు మళ్లీ పూర్వ వైభవం దక్కే మార్గం ఉన్నట్టా? లేనట్టా? అని మొన్నటిదాకా అనుమానమేఘాలు. దిగాలు పడ్డ రొయ్యరైతును ఊరడించడాలే తప్ప, నిర్మాణాత్మక కార్యాచరణే లేకపోయింది. కానీ, రొయ్య సాగుకు పునరుజ్జీవం ఎంతో దూరంలో లేదనే సంకేతాలైతే ఇప్పుుడిప్పుడే కనిపిస్తున్నాయి. లోకల్గా కొనేనాధుడు లేక, ఎగుమతి చేసుకునే వీలులేక, మండుతున్న ఫీడు ధరలను భరించలేక.. అష్టకష్టాల్లో ఉన్న ఆక్వా కల్చర్కు ఊపిరిలూదడానికి ప్రభుత్వాల్లో రావల్సిన కదలిక వచ్చినట్టే ఉంది. ఏమిటా కదలిక? ఏపీ ఆర్థికసౌభాగ్యానికి ప్రధానమైన ఆసర అయ్యేనా ఆక్వాకు మళ్లీ మంచిరోజులు.. !
- Balaraju Goud
- Updated on: Jul 20, 2026
- 9:50 pm
తల్లీ – బిడ్డల కోసం సీఎం కొత్త కానుక.. త్వరలో రోడ్లపైకి ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలు
ఆంధ్రప్రదేశ్లో మాతా–శిశు సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు ప్రవేశపెట్టనున్న 'తల్లీ - బిడ్డ ఎక్స్ప్రెస్' నూతన వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం (జూలై 20) సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవల కోసం 500 ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
- Balaraju Goud
- Updated on: Jul 20, 2026
- 2:56 pm
ఉత్తరాంధ్ర గేమ్ ఛేంజర్.. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..
ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖకు 45 కిలోమీటర్ల దూరంలో 2,200 ఎకరాల్లో నిర్మించిన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు గేమ్ ఛేంజర్గా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
- Gopikrishna Meka
- Updated on: Jul 19, 2026
- 7:36 am
ఏపీలో కొలువుల జాతర.. 25 వేల ఉద్యోగాలు! ఏపీ ఆర్థిక రూపురేఖలు మార్చనున్న రామాయపట్నం పోర్టు..!
రామాయపట్నం పోర్టు అభివృద్ధిలో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రపంచస్థాయి సంస్థల భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో పోర్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి తొలి దశలోనే రూ.1,500 కోట్ల ముందస్తు ప్రీమియంతో పాటు దీర్ఘకాలిక ఆదాయం లభించనుంది. మరోవైపు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు, సుమారు 25 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల సృష్టికి ఈ పోర్టు వేదిక కానుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
- Eswar Chennupalli
- Updated on: Jul 15, 2026
- 4:49 pm
అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న ప్రతిష్టాత్మక 'వీబీజీ రామ్ జీ' (వికసిత్ భారత్ గ్రీన్ - రాష్ట్రీయ గ్రామీణ మౌలిక సదుపాయాలు) పథకం పేదల జీవితాలనే మార్చే పథకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లె సభ నుంచి VBG RAM G పథకాన్ని సీఎం చంద్రబాబు ఘనంగా ప్రారంభించారు. గతంలో నరేగా పథకం రాయలసీమ నుంచే ప్రారంభమైందని, ఇప్పుడు ఈ చారిత్రాత్మక పథకం కూడా ఇక్కడి నుంచే ఆవిష్కృతం కావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చేలా పథకాన్ని అమలు చేస్తామన్నారు.
- Balaraju Goud
- Updated on: Jul 2, 2026
- 1:42 pm
తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రలు, కేంద్ర మంత్రి సమక్షంలో ఆవిష్కృతం!
కర్ణాటకలోని విజయనగర జిల్లా పరిధిలోని తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో గురువారం ( జూన్ 25, 2026) ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రూ.51 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన 33 కొత్త స్పిల్ వే (క్రస్ట్) గేట్లను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కలిసి అధికారికంగా ప్రారంభించారు.
- Balaraju Goud
- Updated on: Jun 25, 2026
- 3:51 pm
ఏపీ చరిత్రలోనే సువర్ణ అధ్యాయం.. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో ప్రతిష్టాత్మక బంగారు గని ఉత్పత్తి దశకు చేరుకుంది. బుధవారం (జూన్ 24) ఈ భారీ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. రాయలసీమ గడ్డపై వెలుగు చూసిన ఈ బంగారు గని, రాబోయే రోజుల్లో భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయనుంది. దేశంలోనే ఏపీని అతిపెద్ద బంగారు సరఫరాదారుగా నిలబెట్టబోతోంది.
- Balaraju Goud
- Updated on: Jun 24, 2026
- 5:24 pm
ఏపీ మహిళలకు మరో శుభవార్త.. త్వరలో ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం?
ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకాన్ని మరింత విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం సాధారణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్న మహిళలకు త్వరలో ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మంత్రి తెలిపారు.
- Balaraju Goud
- Updated on: Jun 23, 2026
- 5:56 pm
రాయలసీమలో ‘పసిడి’ పంట.. స్వర్ణగిరిగా మారనున్న జొన్నగిరికి సీఎం చంద్రబాబు శ్రీకారం!
కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి ఇక దేశ గోల్డ్ మ్యాప్పై ప్రత్యేక గుర్తింపు పొందనుంది. ఒకప్పుడు కరవుతో అల్లాడిని రాయలసీమ ప్రాంతం ఇప్పుడు బంగారం ఉత్పత్తికి కేంద్రంగా మారుతోంది. దేశంలోనే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు జొన్నగిరిలో ప్రారంభం కానుండగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం (జూన్ 24) ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
- Balaraju Goud
- Updated on: Jun 23, 2026
- 4:50 pm
అన్నదాతలకు శుభవార్త.. సుఖీభవ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లో రూ.3,125 కోట్ల జమ!
ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత ఆర్థిక సాయాన్ని శనివారం (జూన్ 20) విడుదల చేయనుంది. రైతుల పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు లబ్ధి పొందనున్నారు.
- Balaraju Goud
- Updated on: Jun 19, 2026
- 4:23 pm
ఏపీలో బంగారం కొండలు.. రాయలసీమ నేలలో పసిడి భాండాగారం.. వెలికితీతకు సిద్ధం!
ఆంధ్రప్రదేశ్ త్వరలోనే దేశ బంగారు ఉత్పత్తి రంగంలో కీలక కేంద్రంగా మారబోతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే తొలి భారీ ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైంది. స్వాతంత్ర్యం తర్వాత ప్రైవేట్ రంగంలో ఏర్పాటు అవుతున్న అతిపెద్ద బంగారు గనిగా ఈ ప్రాజెక్టు ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.
- Eswar Chennupalli
- Updated on: Jun 18, 2026
- 6:07 pm
Andhra Pradesh: విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో మరో కీలక పరిణామం
విజయవాడకు చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేస్తూ, సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా, పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా భద్రపరచాలని సాయికృష్ణ తల్లి కోర్టును ఆశ్రయించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jun 18, 2026
- 9:44 am