AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

నారా చంద్రబాబు నాయుడు

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. తెలుగు దేశం పార్టీ(టీడీపీ) జాతీయ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమితో చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు నవ్యాంధ్రకు రెండోసారి సీఎం అయ్యారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత సాధించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు రెండుసార్లు, నవ్యాంధ్రకు రెండుసార్లు సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20 ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు.

చంద్రగిరిలో విద్యార్థి నాయ‌కుడిగా 1973లో చంద్రబాబు రాజ‌కీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన 1978లో ఆయన కాంగ్రెస్ (ఐ) పార్టీలో చేరారు. ఆ ఏడాది చంద్రగిరి నియోకజవర్గం నుంచి కాంగ్రెస్ (ఐ) టికెట్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 28 సంవత్సరాల వయస్సులో రాష్ట్రంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా ఘనత సాధించారు. 1980లో ఆయ‌న ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ (ఐ)లోనే చంద్రబాబు కొనసాగారు. 1983 ఎన్నిక‌ల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెంట్రామ నాయుడి చేతిలో ఓట‌మి త‌ర్వాత‌, ఆయ‌న కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

1995 నుండి 2004 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. తన హయాంలో హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2003లో అలిపిరి మందుపాతర పేలుడు ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. తన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్ ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మని వివాహం చేసుకోగా.. వారికి కుమారుడు దేవాన్ష్ ఉన్నారు.

యునైటెడ్ ఫ్రెంట్ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. ఏపీ రాజకీయ నాయకుడిగానే కాకుండా జాతీయ నాయకుడిగా చంద్రబాబు గుర్తింపు సాధించారు.

ఇంకా చదవండి

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ‘తల్లికి వందనం’ డబ్బులు జమ! దరఖాస్తుకు మరో ఛాన్స్!

ఏపీలోని 1వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం కింద ఆగస్టు 30న ₹13,000 నిధులు విడుదల కానున్నాయి. గతంలో సాంకేతిక సమస్యలతో లబ్ధి పొందని వారికి కూడా అదే రోజు జమ చేస్తారు. అర్హత ఉన్నవారు ఆగస్టు 25లోగా సచివాలయంలో దరఖాస్తు చేసుకొని, e-KYC సమస్యలను పరిష్కరించుకోవాలని విద్యాశాఖ సూచించింది.

Chiranjeevi Birthday: రక్తనిధి, నేత్ర నిధితో మానవత్వాన్ని చాటుకున్నారు.. చిరంజీవికి సీఎం చంద్రబాబు బర్త్‌డే విషెస్

ఇవాళ (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. దీంతో సినీ సెలబ్రిటీలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి బర్త్ డే విషెస్ చెప్పారు.

AP Assembly Live: మెగా డీఎస్సీ, రిజర్వేషన్లపై చర్చ.. ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రత్యక్ష ప్రసారం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో మెగా డీఎస్సీ-2025, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రాజకీయ రిజర్వేషన్లు సహా పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. మెగా డీఎస్సీపై మంత్రి నారా లోకేష్‌ సభలో ప్రకటన చేసి, నియామక ప్రక్రియను పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ ద్వారా వివరించనున్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.

దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలి.. మువ్వెన్నెల జెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అట్టహాసంగా నిర్వహించిన పరేడ్‌లో సీఎం చంద్రబాబు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. స్వాతంత్య్ర సమరయోధులకు నిజమైన నివాళి దేశ నిర్మాణమేనని అన్నారు.

Andhra Pradesh: వాళ్లది డీఎస్‌సీ.. వీళ్లది ఏపీపీఎస్‌సీ.. పరీక్షలను రౌండప్ చేసిన పాలిటిక్స్

ఏ ఫర్ ఆంధ్రా, పీ ఫర్ పాలిటిక్స్. పొలిటికల్లీ మాంచి డెన్సిటీ ఉండే రాష్ట్రంగా ఏపీకి ప్రత్యేక క్రెడిట్టే ఉంది. ఇక్కడ పార్టీలకు బీపీలు రైజవ్వడం ఎప్పుడూ కొత్తకాదు. కానీ, ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది ఏపీలో రాజకీయ చదరంగం. ఏ పార్టీ ఎప్పుడు ఏ పాచిక వేస్తుందో ఏ పార్టీకీ తెలీదు. ఎగస్పార్టీల్ని అనుక్షణం అణువణువూ చదువుతుండాల్సిందే. ఇక్కడ ప్రతీ ఇయరూ ఎలక్షన్ ఇయరే. ఓటుబ్యాంకులకు కన్నమెయ్యడం మీదే పార్టీలకు కన్ను. రాబోయే స్థానిక ఎన్నికలకు నగారా మోగకముందే, మందుగుండు సిద్ధం చేసుకుంటున్నాయి పార్టీలు. 2029కి ఇప్పటినుంచే వామప్ మ్యాచ్‌లకు ప్యాడ్లు కట్టుకుంటున్నాయి టీడీపీ-వైసీపీ. ఎలాగో డీటెయిల్డ్‌గా చూద్దాం.

CM Chanrababu: 76 ఏళ్ల వయస్సులోనూ ఇంత ఎనర్జీ ఎలా..? సీఎం చంద్రబాబు దినచర్య, డైట్ రహస్యం ఇదే..

76 ఏళ్ల వయసులోనూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో చురుగ్గా పనిచేయడం వెనుక ఆయన పాటించే క్రమశిక్షణ కీలకంగా కనిపిస్తోంది. యోగా, వ్యాయామం, మితాహారం, ప్రోటీన్‌కు ప్రాధాన్యత, సమయపాలన వంటి అలవాట్లు ఆయన లైఫ్‌స్టైల్‌లో భాగంగా ఉన్నాయి. చంద్రబాబు ఆరోగ్య జీవనశైలి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.

అద్దం.. ఓ దువ్వెన.. సీఎం సాబ్ స్టైలే మారిపోయింది..! ఒక్కసారిగా పాత జ్ఞాపకాల్లోకి చంద్రబాబు

అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జేబులోని దువ్వెన ఆసక్తికరంగా మారింది. వాష్‌రూమ్‌లో అద్దం కనిపించడంతో జేబులో నుంచి దువ్వెన తీసి తల దువ్వుకున్న చంద్రబాబు.. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అప్పట్లో జేబులో దువ్వెన పెట్టుకుని తిరగడం సాధారణమని, అద్దం కనిపించినప్పుడల్లా జుట్టును సరిచేసుకునేవాళ్లమని చెప్పడంతో ఈ దృశ్యం నెట్టింట వైరల్‌గా మారింది.

24 క్యారెట్స్ క్యాపిటల్.. అందరి అమరావతి.. అందమైన అమరావతి..

అమరావతి 2.0లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. 21.77 కిలోమీటర్ల సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌, ఎమ్మెల్యేలు-ఎమ్మెల్సీల భారీ నివాస సముదాయం ప్రారంభానికి సిద్ధమయ్యాయి. రోడ్లు, వంతెనలు, ప్రభుత్వ భవనాలు, నివాస సముదాయాలు, ఐటీ, టూరిజం ప్రాజెక్టులతో అమరావతి నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ప్రపంచస్థాయి మౌలిక వసతులతో అమరావతిని ఆధునిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి.

Andhra Pradesh: ఏపీలో వారందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.25 వేలు రిలీజ్.. చెక్ చేస్కోండి..

ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. నేతన్న సేవలో స్కీమ్ శుక్రవారం ప్రారంభించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని స్వయంగా తన చేతుల మీదుగా ప్రారంభించారు. చేనేతల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 వేలు విడుదల చేశారు.

Andhra: వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. రేపే ఖాతాల్లోకి రూ.25 వేలు జమ..

చేనేత కుటుంబాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘నేతన్న సేవలో’ పథకం కింద అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 71,536 కుటుంబాలకు మొత్తం రూ.179 కోట్ల సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఆకాశంలో అమరావతి..! రోప్‌వే.. లండన్ ఐ.. టూరిజం హబ్‌గా ఏపీ రాజధాని!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా.. పర్యాటకం, వినోదం, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ భవనాల నిర్మాణం వేగంగా సాగుతుండగా.. ఇప్పుడు నగరానికి ఐకానిక్ గుర్తింపునిచ్చే ప్రాజెక్టులపై ఫోకస్ పెంచింది.

Watch: ఎగిరే పక్షి.. అద్భుతం.. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం.. !

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ద్వారం తెరుచుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2026 ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, అరకు లోయ ప్రకృతి అందాలు, గిరిజన చుట్టిళ్ల వాస్తుశిల్పం, ఎగిరే పక్షి ఆకృతిని ప్రతిబింబించేలా టెర్మినల్ భవనాన్ని అత్యాధునికంగా నిర్మించారు.