![చంద్రబాబు నాయుడు](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/10/chandrababu-naidu-150-150.png)
చంద్రబాబు నాయుడు
నారా చంద్రబాబు నాయుడు
నారా చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుండి నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత సాధించారు. నారా చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20 ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు.
చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా 1973లో చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన 1978లో ఆయన కాంగ్రెస్ (ఐ) పార్టీలో చేరారు. ఆ ఏడాది చంద్రగిరి నియోకజవర్గం నుంచి కాంగ్రెస్ (ఐ) టికెట్పై పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 28 సంవత్సరాల వయస్సులో రాష్ట్రంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా ఘనత సాధించారు. 1980లో ఆయన ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ (ఐ)లోనే చంద్రబాబు కొనసాగారు. 1983 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెంట్రామ నాయుడి చేతిలో ఓటమి తర్వాత, ఆయన కాంగ్రెస్ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
1995 నుండి 2004 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. తన హయాంలో హైదరాబాద్లో ఐటీ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2003లో అలిపిరి మందుపాతర పేలుడు ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. తన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్ కు నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి తో వివాహం చేసి నందమూరి కుటుంబంతో మరింత అనుబంధం పెంచుకున్నాడు.
యునైటెడ్ ఫ్రెంట్ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. ఏపీ రాజకీయ నాయకుడిగానే కాకుండా జాతీయ నాయకుడిగా చంద్రబాబు గుర్తింపు సాధించారు.
CM Chandrababu: రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం..
ఏపీ అసెంబ్లీ నిరవదికంగా వాయిదా పడింది. మొత్తం అయిదు రోజుల పాటూ నిర్వహించిన సమావేశాల్లో భాగంగా అనేక అంశాలపై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. అసెంబ్లీ నోటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర విభజనతో సమస్యలు వచ్చాయన్నారు. గతంలో రూ. 200 పెన్షన్ రూ. 2000కు పెంచామని చెప్పారు. ఈసారి రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని చెప్పాం.. ఇస్తున్నామని వివరించారు.
- Srikar T
- Updated on: Jul 26, 2024
- 9:53 pm
AP Enquiry Times: గత అక్రమాలపై ఫోకస్.. వరుస శ్వేతపత్రాలతో విచారణకు సిద్ధమవుతున్న ఏపీ సర్కార్!
గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి మాటున అవినీతి జరిగిందా? అక్రమాలు, దోపిడీలు.. అంతకుమించి అనేలా పెరిగిపోయాయా? ప్రభుత్వం మారాక దస్త్రాల దగ్ధం ఘటనలు ఎందుకు పెరుగుతున్నాయి? మ్యాటర్ ఏదైనా మర్మమేంటోనన్న చర్చ నడుస్తోంది. ఇటు చంద్రబాబు ప్రభుత్వం మాత్రం.. నిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణకు ఆదేశిస్తోంది. ఏపీ గట్టుపై ఇప్పుడు ఎంక్వైరీల టైమ్ హీట్ పుట్టిస్తోంది
- Balaraju Goud
- Updated on: Jul 26, 2024
- 8:24 am
CM Chandrababu: శాంతిభద్రతలను సెట్రైట్ చేస్తాం.. లా అండ్ ఆర్డర్పై ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల
ఏపీలో వైట్ పేపర్స్ పరంపర కొనసాగుతోంది. శాంతిభద్రతల అంశంపై... అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే.. భవిష్యత్ కార్యాచరణపై స్పష్టతనిచ్చారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 25, 2024
- 7:16 pm
CM Chandrababu: ఏపీ అసెంబ్లీలో ఆసక్తికరపరిణామం.. నవ్వులు పూయించిన సీఎం చంద్రబాబు..
ఏపీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబునాయుడు..గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై పెట్టిన కేసులను అసెంబ్లీ సాక్షిగా వివరించారు. ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో కేసులున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. గతప్రభుత్వం పనితీరును సీఎం చంద్రబాబు ఎండగడుతున్నారు. లిక్కర్ పాలసీ విధానంపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆ తరువాత రాష్ట్రంలో 2014-2019 మధ్య లా అండ్ ఆర్ఢర్ సజావుగా సాగేదన్నారు. గతం ఐదేళ్లలో అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదన్నారు.
- Srikar T
- Updated on: Jul 25, 2024
- 3:53 pm
Chandrababu: చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. మద్యం అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశం
ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. లోతైన విచారణ తర్వాత అవసరమైతే ఈ అంశాన్ని ఈడీకీ సిఫార్సు చేస్తామని వివరించారు. మద్యం విక్రయాల్లో లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని.. దాని కోసం సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 24, 2024
- 5:13 pm
Nara Lokesh: తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్ క్లారిటీ.. ఎంతమందికి ఇస్తారంటే..
తల్లికి వందనంపై మంత్రిలోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానాలు ఇచ్చారు. అమ్మకు వందనం పథకంపై వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూలుకు వెళ్తుంటే అంతమందికీ ఇస్తామన్నారు.
- Srikar T
- Updated on: Jul 24, 2024
- 3:19 pm
Union Budget 2024: ఇది ఆరంభం మాత్రమే.. కేంద్ర బడ్జెట్పై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లు ప్రకటించడంపై అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. అమరావతికి ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. వెంటిలేటర్పై ఉన్న ఏపీకి ఆక్సిజన్ అందించి కేంద్రం బతికిస్తుందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని.. కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 23, 2024
- 5:29 pm
CM Chandrababu: అప్పటి వరకూ కూటమి కలిసే ఉంటుంది.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు..
అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించేవరకు కూటమి కలిసే ముందుకు సాగుతుందన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొత్తం ఐదు రోజులు సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు. సభకు వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్నికల ఫలితాలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
- Srikar T
- Updated on: Jul 23, 2024
- 3:21 pm
AP Assembly Live: రెండోరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. మొదటి గంట ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇచ్చారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. దీంతో.. తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలు సభ ముందు ఏకరువు పెట్టారు ఎమ్మెల్యేలు. మొదట నాడు నేడు కార్యక్రమంపై ప్రశ్నలడిగారు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్. ఏపీలో స్కూల్స్ పునరుద్ధరణలో భారీ అవకతవకలు జరిగాయన్నారు.
- Anil kumar poka
- Updated on: Jul 23, 2024
- 9:49 am
ఏపీలో ఫైళ్ల దగ్ధం ఘటనలపై దుమారం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. రంగంలోకి డీజీపీ..
మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనలో స్పష్టంగా కుట్రకోణం కనిపిస్తోందన్నారు డీజీపీ తిరుమలరావు. ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించడంతో.. క్లూస్టీమ్, డాగ్స్క్వాడ్ సాయంతో ఆధారాల సేకరిస్తున్నారు పోలీసులు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని ప్రాథమికంగా నిర్ధారించారు. కుట్ర కోణంపై డీజీపీ, సీఐడీ చీఫ్ ఆరా తీస్తున్నారు. నిన్న అర్ధరాత్రి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడంతో.. విలువైన రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు, సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి.
- Srikar T
- Updated on: Jul 22, 2024
- 7:40 pm
AP Assembly Sessions 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులంటే.. బీఏసీలో కీలక నిర్ణయం..
అసెంబ్లీ కమిటీ హాలులో బీఏసీ సమావేశం ముగిసింది. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలతోపాటూ ఎన్ని రోజులు సభ నిర్వహించాలన్నదానిపై కూడా చర్చించారు. ఈ సమావేశానికి స్పీకర్ తోపాటూ సీఎం చంద్రబాబు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఏపీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందకు సిద్దమయ్యారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో జూలై 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది.
- Srikar T
- Updated on: Jul 22, 2024
- 3:53 pm
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రత్యక్ష ప్రసారం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తారు.. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 22, 2024
- 10:20 am
AP Assembly: అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్!
ఏపీలో శాసనసభ సమావేశాలకు వేళయింది...! కొత్త ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న తొలి పూర్తి స్థాయి సమావేశాలు కావడంతో అందరి దృష్టి వీటిపై పడింది. ఈ అసెంబ్లీ సమావేశాలకు ఇరు పక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. గత ప్రభుత్వ పాలనపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే... సభ వేదికగా కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు వైసీపీ రెడీ అయ్యింది. అయితే అసెంబ్లీలో జగన్ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
- Shaik Madar Saheb
- Updated on: Jul 22, 2024
- 8:53 am
AP Politics: ఢిల్లీకి చేరిన గల్లీ రాజకీయం.. పార్లమెంటు వేదికగా టీడీపీ, వైసీపీ బిగ్ వార్..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయం దేశ రాజధాని ఢిల్లీకి చేరుతోంది. కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టేందుకు కొత్త ఫార్ములాతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు. దీనిపై తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఇక ఏపీలో వైసీపీ లీడర్లు, కేడర్పై జరుగుతున్న దాడులను పార్లమెంటులో ఎండగట్టేందుకు పార్టీ ఎంపీలతో వైఎస్ జగన్ వ్యూహం సిద్ధం చేశారు.
- Balaraju Goud
- Updated on: Jul 21, 2024
- 7:57 am
YS Jagan: ఢిల్లీలో నిరాహార దీక్షకు సిద్దమైన వైఎస్ జగన్.. ఈ అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం..
ఏపీలో అధికార ఎన్డీయే కూటమి, విపక్ష వైసీపీల మధ్య పీక్స్కు చేరిన పొలిటికల్ ఫైట్లో ఢిల్లీ ట్విస్ట్ ఆసక్తికరంగా మారింది. ఏపీలో అధికార కూటమి వర్సెస్ విపక్ష వైసీపీ పంచాయితీ.. ఇక ఢిల్లీకి చేరనుంది. పార్లమెంటు సమావేశాల కోసం టీడీపీ, వైసీపీ వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి.
- Srikar T
- Updated on: Jul 20, 2024
- 11:15 pm