చంద్రబాబు నాయుడు
నారా చంద్రబాబు నాయుడు
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. తెలుగు దేశం పార్టీ(టీడీపీ) జాతీయ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమితో చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు నవ్యాంధ్రకు రెండోసారి సీఎం అయ్యారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత సాధించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్కు రెండుసార్లు, నవ్యాంధ్రకు రెండుసార్లు సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20 ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు.
చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా 1973లో చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన 1978లో ఆయన కాంగ్రెస్ (ఐ) పార్టీలో చేరారు. ఆ ఏడాది చంద్రగిరి నియోకజవర్గం నుంచి కాంగ్రెస్ (ఐ) టికెట్పై పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 28 సంవత్సరాల వయస్సులో రాష్ట్రంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా ఘనత సాధించారు. 1980లో ఆయన ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ (ఐ)లోనే చంద్రబాబు కొనసాగారు. 1983 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెంట్రామ నాయుడి చేతిలో ఓటమి తర్వాత, ఆయన కాంగ్రెస్ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
1995 నుండి 2004 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. తన హయాంలో హైదరాబాద్లో ఐటీ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2003లో అలిపిరి మందుపాతర పేలుడు ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. తన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్ ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మని వివాహం చేసుకోగా.. వారికి కుమారుడు దేవాన్ష్ ఉన్నారు.
యునైటెడ్ ఫ్రెంట్ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. ఏపీ రాజకీయ నాయకుడిగానే కాకుండా జాతీయ నాయకుడిగా చంద్రబాబు గుర్తింపు సాధించారు.
Amaravathi: అమరావతి రైతులు ఎగిరి గంతేసే వార్త.. వారందరికీ నేడు జాక్పాట్ ఛాన్స్.. ప్రభుత్వం నుంచి బిగ్ అనౌన్స్మెంట్
అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త తెలిపింది. భూములిచ్చిన రైతులకు శుక్రవారం ప్లాట్లను కేటాయించనుంది. ఇటీవల భూములిచ్చిన రైతుల బ్యాంకు రుణాలను రూ.1.50 లక్షల్లోపు మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. ఇప్పుడు మరో శుభవార్త అందించింది. నేడు ప్లాట్ల కేటాయింపు జరగనుంది.
- Venkatrao Lella
- Updated on: Jan 23, 2026
- 7:16 am
Chandrababu: ప్రతిపక్షంలోకి వెళ్లడానికి సిద్ధంగా లేము.. రౌడీయిజం చేస్తామంటే తాట తీస్తా.. ఇక్కడుంది CBN..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కోరారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ నిలబెట్టారని, బీసీలు, మహిళల కోసం సంస్కరణలు తెచ్చారని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ ప్రతిపక్షంలోకి వెళ్ళదని స్పష్టం చేశారు. కొంతమంది రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తున్నారని, రాష్ట్రంలో రౌడీయిజం చేస్తే ఊరుకోమని చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jan 18, 2026
- 7:37 pm
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సీఎం చంద్రబాబు నాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, తెలుగు సంప్రదాయాల ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా భోగి, సంక్రాంతి పండుగల విశిష్టత, పూర్వీకులను స్మరించుకోవడం మన బాధ్యత అని ఉద్ఘాటించారు. పూర్వీకులను గౌరవించకపోతే మనుషులకు, జంతువులకు తేడా లేదని పేర్కొన్నారు. కుప్పం నుండి రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు కూడా వెల్లడించారు.
- Samatha J
- Updated on: Jan 16, 2026
- 4:07 pm
కోడి పందేలు, జల్లికట్టు వారసత్వంగా వచ్చినవే.. చిన్నప్పుడు అన్నీ చూశాః చంద్రబాబు
అందరికీ పుట్టిన ఊరు జన్మభూమిపై మమకారం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మధ్యకాలంలో ఆర్థిక అసమానతలు ఎక్కువయ్యాయని అందుకే పీ4 ను తీసుకొచ్చామన్నారు. 10 లక్షల కుటుంబాలను పీ4 ద్వారా దత్తత తీసుకున్నామన్నారు. సంక్రాంతి రైతుల పండుగని, పెద్దల పండుగ గా పూర్వీకులకు పూజలు చేసుకుని నివాళులు అర్పించాలన్నారు.
- Raju M P R
- Updated on: Jan 16, 2026
- 1:33 pm
గంగిరెద్దుల ప్రదర్శనను తిలకించిన తాత.. ఎడ్ల బండిపై ఆకట్టుకున్న మనవడు..!
తిరుపతి జిల్లాలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లి సందడిగా మారింది. సంక్రాంతి పండుగ జోష్ కొనసాగుతోంది. పెద్దపండుగకు నాలుగు రోజులు పాటు నారావారిపల్లిలోనే బసచేసిన నారా-నందమూరి కుటుంబాలు సంక్రాంతిని సందడిగా జరుపుకుంటున్నాయి. ఇందులో భాగంగానే నారావారిపల్లిలో కుటుంబసభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.
- Raju M P R
- Updated on: Jan 16, 2026
- 1:11 pm
Naravaripalle Sankranti Celebrations: మనవళ్ల ఆటల పోటీలకు ఫిదా అయిన సీఎం చంద్రబాబు దంపతులు.. ఇదిగో ఫొటోలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లిలో కోలాహలంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. గ్రామస్తులను సీఎం దంపతులు ఆప్యాయంగా పలకరించారు. క్రీడా పోటీలను ఆసక్తిగా తిలకించారు. నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో రంగవల్లులు, ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు..ఈ క్రీడల్లో లోకేష్ కుమారుడు దేవాన్ష్ పాల్గొన్నారు. ఆటల్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం చేయనున్నారు.. సీఎం చంద్రబాబు ఇంటి దగ్గరే ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈనెల 15 వరకు నారావారిపల్లిలోనే సీఎం కుటుంబం ఉంటుంది.
- Raju M P R
- Updated on: Jan 13, 2026
- 4:02 pm
CM Chandrababu: అమరావతి ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచానికే స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్గా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లో 25.3% పెట్టుబడుల వృద్ధి, లక్షల ఉద్యోగాల కల్పన, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, సమగ్ర నీటి నిర్వహణ వంటి కీలక విజయాలను ఆయన వెల్లడించారు. విశాఖలో డేటా హబ్, అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుతో రాష్ట్రం గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించిందని తెలిపారు.
- Phani CH
- Updated on: Jan 12, 2026
- 5:48 pm
AP Budget 2026: బడ్జెట్ సమావేశాలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. ఈ అంశాలపైనే ప్రత్యేక చర్చ
రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉండాలి ? ఏ శాఖకు ఎంత నిధులు కేటాయించాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రాబోయే నిధులు అంచనాలు, లెక్కలు ఎలా ఉండొచ్చు. ఇలాంటి అంశాలపై కీలక సమీక్ష నిర్వహించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్ర సహకారం.. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై అధికారులతో చర్చించనున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Jan 11, 2026
- 8:58 pm
AP – TG: పరిష్కారం దిశగా ఏపీ, తెలంగాణ నీటి వివాదాలు..! చంద్రబాబు, రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి మంటలు తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇతర నేతల మాటలు ఎలా ఉన్నా.. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు సామరస్యపూర్వక పరిష్కారమే బెటరని కామెంట్ చేయడం కొత్త సరికొత్త చర్చకు దారి తీస్తోంది. నేతలు.. చర్చలకు సిద్ధమని సంకేతాలివ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
- Shaik Madar Saheb
- Updated on: Jan 9, 2026
- 9:08 pm
సముద్రంలో కలిసే జలాలు ఉపయోగించుకుంటే తప్పేంటి..? నీటిపై రాజకీయాలు వద్దుః సీఎం చంద్రబాబు
నీటి వివాదం.. PPP విధానం.. దుర్గగుడి పవర్ కట్ అంశం.. పెట్టుబడుల విషయం.. ఇలా ఒక్కటేంటి ఎన్నో ఆసక్తికర విషయాలను మంత్రులతో చర్చించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ తర్వాత కీలక అంశాలపై మంత్రులతో చర్చించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇటీవల ఏపీ, తెలంగాణ మధ్య తలెత్తిన జలవివాదంపై ప్రధానంగా మాట్లాడారు.
- Balaraju Goud
- Updated on: Jan 8, 2026
- 8:52 pm
CM Chandrababu Naidu: అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకున్న చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయోధ్య చేరుకుని, బాలరాముడిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ దర్శనం తనకు ఎంతో శాంతిని, అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీరాముడి విలువలు, ఆదర్శాలు కాలాతీతమైనవని, అవి సమాజంలోని ప్రతి ఒక్కరికీ నిరంతరం స్ఫూర్తినిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
- Phani CH
- Updated on: Dec 28, 2025
- 7:32 pm
CM Chandrababu Naidu: జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల అభ్యంతరాల మేరకు స్వల్ప మార్పులు చేస్తూ, నెల్లూరు జిల్లాలో గూడూరు కొనసాగింపు, మార్కాపురం జిల్లాకు దొనకొండ, కురిచేడులను ఖరారు చేశారు. అయితే, జనగణన నేపథ్యంలో గ్రేటర్ విజయవాడ, తిరుపతి ఏర్పాటును ప్రస్తుతానికి వాయిదా వేశారు. తుది నోటిఫికేషన్ ఈ నెల 31న వెలువడనుంది.
- Phani CH
- Updated on: Dec 27, 2025
- 10:10 pm