AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

నారా చంద్రబాబు నాయుడు

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. తెలుగు దేశం పార్టీ(టీడీపీ) జాతీయ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమితో చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు నవ్యాంధ్రకు రెండోసారి సీఎం అయ్యారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత సాధించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు రెండుసార్లు, నవ్యాంధ్రకు రెండుసార్లు సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20 ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు.

చంద్రగిరిలో విద్యార్థి నాయ‌కుడిగా 1973లో చంద్రబాబు రాజ‌కీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన 1978లో ఆయన కాంగ్రెస్ (ఐ) పార్టీలో చేరారు. ఆ ఏడాది చంద్రగిరి నియోకజవర్గం నుంచి కాంగ్రెస్ (ఐ) టికెట్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 28 సంవత్సరాల వయస్సులో రాష్ట్రంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా ఘనత సాధించారు. 1980లో ఆయ‌న ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ (ఐ)లోనే చంద్రబాబు కొనసాగారు. 1983 ఎన్నిక‌ల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెంట్రామ నాయుడి చేతిలో ఓట‌మి త‌ర్వాత‌, ఆయ‌న కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

1995 నుండి 2004 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. తన హయాంలో హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2003లో అలిపిరి మందుపాతర పేలుడు ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. తన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్ ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మని వివాహం చేసుకోగా.. వారికి కుమారుడు దేవాన్ష్ ఉన్నారు.

యునైటెడ్ ఫ్రెంట్ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. ఏపీ రాజకీయ నాయకుడిగానే కాకుండా జాతీయ నాయకుడిగా చంద్రబాబు గుర్తింపు సాధించారు.

ఇంకా చదవండి

తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రలు, కేంద్ర మంత్రి సమక్షంలో ఆవిష్కృతం!

కర్ణాటకలోని విజయనగర జిల్లా పరిధిలోని తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో గురువారం ( జూన్ 25, 2026) ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రూ.51 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన 33 కొత్త స్పిల్ వే (క్రస్ట్) గేట్లను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కలిసి అధికారికంగా ప్రారంభించారు.

ఏపీ చరిత్రలోనే సువర్ణ అధ్యాయం.. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో ప్రతిష్టాత్మక బంగారు గని ఉత్పత్తి దశకు చేరుకుంది. బుధవారం (జూన్ 24) ఈ భారీ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. రాయలసీమ గడ్డపై వెలుగు చూసిన ఈ బంగారు గని, రాబోయే రోజుల్లో భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయనుంది. దేశంలోనే ఏపీని అతిపెద్ద బంగారు సరఫరాదారుగా నిలబెట్టబోతోంది.

ఏపీ మహిళలకు మరో శుభవార్త.. త్వరలో ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం?

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకాన్ని మరింత విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం సాధారణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్న మహిళలకు త్వరలో ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మంత్రి తెలిపారు.

రాయలసీమలో ‘పసిడి’ పంట.. స్వర్ణగిరిగా మారనున్న జొన్నగిరికి సీఎం చంద్రబాబు శ్రీకారం!

కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి ఇక దేశ గోల్డ్ మ్యాప్‌పై ప్రత్యేక గుర్తింపు పొందనుంది. ఒకప్పుడు కరవుతో అల్లాడిని రాయలసీమ ప్రాంతం ఇప్పుడు బంగారం ఉత్పత్తికి కేంద్రంగా మారుతోంది. దేశంలోనే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు జొన్నగిరిలో ప్రారంభం కానుండగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం (జూన్ 24) ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

అన్నదాతలకు శుభవార్త.. సుఖీభవ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లో రూ.3,125 కోట్ల జమ!

ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత ఆర్థిక సాయాన్ని శనివారం (జూన్ 20) విడుదల చేయనుంది. రైతుల పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు లబ్ధి పొందనున్నారు.

ఏపీలో బంగారం కొండలు.. రాయలసీమ నేలలో పసిడి భాండాగారం.. వెలికితీతకు సిద్ధం!

ఆంధ్రప్రదేశ్ త్వరలోనే దేశ బంగారు ఉత్పత్తి రంగంలో కీలక కేంద్రంగా మారబోతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే తొలి భారీ ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైంది. స్వాతంత్ర్యం తర్వాత ప్రైవేట్ రంగంలో ఏర్పాటు అవుతున్న అతిపెద్ద బంగారు గనిగా ఈ ప్రాజెక్టు ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.

Andhra Pradesh: విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్‌ కేసులో మరో కీలక పరిణామం

విజయవాడకు చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేస్తూ, సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా, పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా భద్రపరచాలని సాయికృష్ణ తల్లి కోర్టును ఆశ్రయించారు.

Andhra: స్వర్ణాంధ్ర దిశగా పన్నెండో అడుగు.. పడుతూ లేస్తూనే ప్రగతి వైపు..!

రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంపై విస్తృత చర్చ జరుగుతోంది. రాజధాని లేకుండా ప్రారంభమైన రాష్ట్ర ప్రయాణం రాజకీయ మార్పులు, పాలనా విధానాల ప్రభావంతో ఎన్నో మలుపులు తిరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అమరావతి పునర్నిర్మాణం, భారీ పెట్టుబడుల ఆకర్షణ, పోలవరం ప్రాజెక్టు పురోగతి, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను ప్రభుత్వం విజయాలుగా చెబుతోంది.

తిరుపతిలో కూటమి గర్జన.. రెండేళ్ల పాలనపై ప్రజల ముందుకు ప్రోగ్రెస్ కార్డ్!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తిరుపతి వేదికగా శుక్రవారం (జూన్ 12) భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. "2 ఏళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం" పేరుతో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. గత రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రజలకు సమగ్ర నివేదిక అందించేందుకు ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది.

PM Modi: ప్రపంచం ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంటోంది: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్‌ సమావేశంలో 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యంపై చర్చించారు. మానవాభివృద్దిపై దృష్టి పెట్టాలని మోదీ పిలపునిచ్చారు. ఉపాధి అవకాశాలు పెరగాలంటే యువత నైపుణ్యాలను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో జీడీపీపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు మోదీ.

21వ శతాబ్దపు నవభారత దార్శనికుడు.. నరేంద్ర మోదీ నాయకత్వంపై చంద్రబాబు ప్రశంసల జల్లు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ అధ్యక్షుడు శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు రాసిన ఒక ప్రత్యేక వ్యాసం ఇటీవల ప్రముఖ పత్రికలో ప్రచురితమైంది. భారతదేశానికి అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా పనిచేసిన ప్రధానమంత్రిగా జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించనున్న ప్రధాని నరేంద్ర మోదీ మైలురాయిపై చంద్రబాబు నాయుడు ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ సాధించిన ఈ ఘనత ఆయన నాయకత్వం, దార్శనికతపై భారత ప్రజలు ఉంచిన అచంచలమైన విశ్వాసానికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు.

Andhra Politics: ఆంధ్రా పాలిటిక్స్‌ గురూ.. టాపిక్ ఏదైనా టాప్ లేచిపోవాల్సిందే..!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమవుతోంది.. ఈ తరుణంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.

తిరుమల అద్భుత సంప్రదాయం.. శ్రీవారిని మొదట దర్శించేది ఎవరో తెలుసా?
తిరుమల అద్భుత సంప్రదాయం.. శ్రీవారిని మొదట దర్శించేది ఎవరో తెలుసా?
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఎక్కువ తింటే కొవ్వు పెరుగుతుందా..!
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఎక్కువ తింటే కొవ్వు పెరుగుతుందా..!
సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌‌తో రానున్న రామ్ పోతినేని
సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌‌తో రానున్న రామ్ పోతినేని
గ్యాస్ కస్టమర్లకు లాస్ట్ ఛాన్స్.. వెంటనే ఈ పని పూర్తి చేయకపోతే..
గ్యాస్ కస్టమర్లకు లాస్ట్ ఛాన్స్.. వెంటనే ఈ పని పూర్తి చేయకపోతే..
అరటి ఆకుపై గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? షాకింగ్ సీక్రెట్
అరటి ఆకుపై గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? షాకింగ్ సీక్రెట్
బోటి కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి.. స్మెల్ రాదు..
బోటి కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి.. స్మెల్ రాదు..
ఏఐని నమ్మితే కొంపముంచింది.. మళ్లీ ఇంజనీర్లను ఉద్యోగాల్లోకి ..
ఏఐని నమ్మితే కొంపముంచింది.. మళ్లీ ఇంజనీర్లను ఉద్యోగాల్లోకి ..
తులం బంగారం రూ.3 లక్షలకు చేరుతుందా? ధరల పెరుగుదల వెనుక అసలు ఇవే!
తులం బంగారం రూ.3 లక్షలకు చేరుతుందా? ధరల పెరుగుదల వెనుక అసలు ఇవే!
పసిప్రాణంపై ప్రయోగం.. చిన్నారి కంటిచూపు మాయం!
పసిప్రాణంపై ప్రయోగం.. చిన్నారి కంటిచూపు మాయం!
ఉద్యోగం రాలేదని బాధపడుతున్నారా? 3గంటల్లో రూ. 2350 సంపాదించే ఐడియా
ఉద్యోగం రాలేదని బాధపడుతున్నారా? 3గంటల్లో రూ. 2350 సంపాదించే ఐడియా