AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

నారా చంద్రబాబు నాయుడు

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. తెలుగు దేశం పార్టీ(టీడీపీ) జాతీయ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమితో చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు నవ్యాంధ్రకు రెండోసారి సీఎం అయ్యారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత సాధించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు రెండుసార్లు, నవ్యాంధ్రకు రెండుసార్లు సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20 ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు.

చంద్రగిరిలో విద్యార్థి నాయ‌కుడిగా 1973లో చంద్రబాబు రాజ‌కీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన 1978లో ఆయన కాంగ్రెస్ (ఐ) పార్టీలో చేరారు. ఆ ఏడాది చంద్రగిరి నియోకజవర్గం నుంచి కాంగ్రెస్ (ఐ) టికెట్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 28 సంవత్సరాల వయస్సులో రాష్ట్రంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా ఘనత సాధించారు. 1980లో ఆయ‌న ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ (ఐ)లోనే చంద్రబాబు కొనసాగారు. 1983 ఎన్నిక‌ల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెంట్రామ నాయుడి చేతిలో ఓట‌మి త‌ర్వాత‌, ఆయ‌న కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

1995 నుండి 2004 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. తన హయాంలో హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2003లో అలిపిరి మందుపాతర పేలుడు ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. తన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్ ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మని వివాహం చేసుకోగా.. వారికి కుమారుడు దేవాన్ష్ ఉన్నారు.

యునైటెడ్ ఫ్రెంట్ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. ఏపీ రాజకీయ నాయకుడిగానే కాకుండా జాతీయ నాయకుడిగా చంద్రబాబు గుర్తింపు సాధించారు.

ఇంకా చదవండి

Vetlapalem Blast: ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?

వెలుగుపూల కెమికల్‌ పగడ.. వేట్లపాలెంను చీకటి చేసేసింది. పచ్చని గోదావరి తీరాన్ని మరో శివకాశిలా మరుభూమిగా మార్చేసింది. ఎంత ఘోరం..ఎంత విషాదం...? ఈ దారుణం వెనుక నిర్లక్ష్యం ఎవరిది? ముప్ఫై... నలభై... నలభై ఐదు... యాభై.. యాభై ఐదు... ఇవి నెంబర్లు కాదు. అన్ని అడుగుల దూరం మృతదేహాలు చెల్లాచెదురగా పడ్డాయంటే పేలుడు తీవ్రత ఎంతో అర్ధం చేసుకోవచ్చు. వేట్లపాలెం ఘటన బాధితుల్లో సామాన్యులే ఎక్కువ. రెక్కాడితే గాని బతుకు బండి నడవని అభాగ్యుల జీవితాలను బుగ్గి పాలు చేసింది ఎవరి నిర్లక్ష్యం?..

CM Chandrababu: సొంతింటి కోసం ఎదురుచూస్తున్నవారికి సీఎం చంద్రబాబు భారీ శుభవార్త.. స్థలం కూడా ఫ్రీ.. ఎప్పటినుంచంటే..?

శుక్రవారం అసెంబ్లీలో పేదలకు ఇళ్ల కేటాయింపుపై సీఎం చంద్రబాబు మాాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త ఇళ్ల మంజూరు, ఉచితంగా స్థలాలు కేటాయింపుపై క్లారిటీ ఇచ్చారు. కొత్తగా ఇంటి కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇక స్థలాలు లేనివారికి స్థలాలను కూడా ఉచితంగా కేటాయిస్తామన్నారు.

ఏపీ అసెంబ్లీలో సెగలు పుట్టించిన ‘కల్లీ నెయ్యి’.. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీ అసెంబ్లీ తొమ్మిదవ రోజు మంగళవారం 'కల్లీ నెయ్యి' సెగలు పుట్టించింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల లడ్డూ కల్తీ అంశంపై ఏపీ శాసనసభలో హై-వోల్టేజ్ క్రియేట్ చేసింది. ఒకవైపు భక్తుల సెంటిమెంట్.. మరోవైపు వ్యాపార భాగస్వామ్యాల చుట్టూ తిరుగుతున్న ఆరోపణల నేపథ్యంలో.. అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీ ప్రజలకు తీపి కబురు చెప్పిన ప్రభుత్వం.. ఏడాదిన్నరలోగా ప్రతి ఇంటికి..!

గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదివారం సీఎం క్యాంప్ కార్యాలయంలో కీలక సహకార ఒప్పందం కుదిరింది. సుమారు 5 లక్షల గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఫైబర్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్-ఏబీఎన్‌పీ అమలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

Amaravati: అమరావతి నిర్మాణ పనులు వేగవంతం.. కేబినెట్ సబ్‌కమిటీ సిఫార్సులకు CRDA ఆమోదం..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 58వ సీఆర్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా CRDA కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సబ్‌కమిటీ చేసిన వివిధ సిఫార్సులకు CRDA ఆమోదం తెలిపింది.

అన్నదాతలకు ఏపీ సర్కార్ మరో గుడ్‌న్యూస్.. మరో 46 వేల వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లు!

అన్నదాతల శ్రేయస్సే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. రైతులకు ఆర్థిక భారం నుంచి ఉపశమనం కల్పిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 22,30,703 ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా మంత్రి ప్రకటించారు.

Chandrababu – Tummala: ఆ ఐదు గ్రామాల కోసం.. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ..

ఆ ఐదు గ్రామాల అంశంతో పాటు పలు సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబును కలిసి చర్చించారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వీటితో పాటు పలు ఇతర అంశాలను ఏపీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పెద్దవాగు ప్రాజెక్టు, రైల్వేలైన్లు, నేషనల్‌ హైవేలపై ఏపీ ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు.

AP Budget: రాష్ట్ర బడ్జెట్‌లో శాఖల వారీగా.. వివిధ సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలకు కేటాయింపులు

ఎన్నో సవాళ్లు ఉన్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో రాష్ట్రం చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి జరిగిందని మంత్రి పయ్యావుల కేశశ్ అన్నారు. ఇప్పటి వరకు ఏం సాధించాం... ఇంకా ఏం సాధించాలనే అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందించామని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ బడ్జెట్‌ను తీర్చిదిద్దామన్నారు.

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. వైసీపీ నిరసన, వాకౌట్.. లైవ్ వీడియో

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. మొదటి రోజు.. గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. సభ పనిదినాలు, బడ్జెట్ తేదీలపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి మొదటి వారం వరకు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.

Andhra Pradesh: హెల్దీ-వెల్దీ-హ్యాపీ.. అడుగులు పడుతున్నాయా..? ఏపీ డేటా కంప్లీట్ పిక్చర్ ఏం చెబుతోంది..

'స్వర్ణాంధ్ర-2047'కి పది సూత్రాలు. ఇదే అంశంపై మంత్రులు, అధికారులతో పెద్ద డిస్కషనే జరిగింది. ఆ సుదీర్ఘ సమావేశంలో ఎన్నో అంశాలు వచ్చినా.. కొన్ని టాపిక్స్ ఇంట్రస్టింగ్‌గా అనిపించాయి. అందులో ఒకటి పాప్యులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ. మొన్నామధ్య ఆర్‌బీఐ ఓ రిపోర్ట్‌ ఇచ్చింది. అందులో అత్యంత చర్చనీయాంశమైన విషయం.. జనాభా సంక్షోభం..

CM Chandrababu Naidu: సూపర్ 6 సక్సెస్! ప్రతి ఇంటికీ పథకం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధి, విశాఖ ఉక్కు లాభాలపై మాట్లాడారు. పాలనలో "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" ఆవశ్యకతను నొక్కి చెప్పారు. సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, పాత చట్టాలను సమీక్షించాలని సూచించారు. సమాజానికి మేలు చేసే ఫలితాల ఆధారిత పాలనకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.

  • Phani CH
  • Updated on: Feb 9, 2026
  • 1:58 pm

సీఎం చంద్రబాబు చొరవతో స్వాతంత్రం వచ్చిన 78 ఏళ్ళకు ‘వెలుగు’లోకి వచ్చిన గ్రామం..!

స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటిన తరువాత నల్లమల అటవీ ప్రాంతం మారుమూల పల్లె పాలుట్ల గిరిజన తండాలో సోలార్‌ విద్యుత్‌ కాంతులు విరజిమ్మాయి... దశాబ్దాలుగా చీకట్లోనే మగ్గుతున్న అడవిపుత్రుల కోసం 3 కోట్లతో ప్రతి ఇంటికీ సోలార్ ప్యానెల్స్ అమర్చడంతో గ్రామంలో విద్యుత్‌ సౌకర్యం ఏర్పడింది..