చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

నారా చంద్రబాబు నాయుడు

నారా చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుండి నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత సాధించారు. నారా చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20 ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు.

చంద్రగిరిలో విద్యార్థి నాయ‌కుడిగా 1973లో చంద్రబాబు రాజ‌కీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన 1978లో ఆయన కాంగ్రెస్ (ఐ) పార్టీలో చేరారు. ఆ ఏడాది చంద్రగిరి నియోకజవర్గం నుంచి కాంగ్రెస్ (ఐ) టికెట్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 28 సంవత్సరాల వయస్సులో రాష్ట్రంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా ఘనత సాధించారు. 1980లో ఆయ‌న ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ (ఐ)లోనే చంద్రబాబు కొనసాగారు. 1983 ఎన్నిక‌ల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెంట్రామ నాయుడి చేతిలో ఓట‌మి త‌ర్వాత‌, ఆయ‌న కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

1995 నుండి 2004 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. తన హయాంలో హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2003లో అలిపిరి మందుపాతర పేలుడు ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. తన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్ కు నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి తో వివాహం చేసి నందమూరి కుటుంబంతో మరింత అనుబంధం పెంచుకున్నాడు.

యునైటెడ్ ఫ్రెంట్ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. ఏపీ రాజకీయ నాయకుడిగానే కాకుండా జాతీయ నాయకుడిగా చంద్రబాబు గుర్తింపు సాధించారు.

ఇంకా చదవండి

‘ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుంది’.. సజ్జల రామకృష్ణా రెడ్డి కామెంట్స్..

వైసీపీ అధికారంలోకి రాబోతుందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో ఇదే కూటమి జతకట్టిందని గుర్తు చేశారు. కాపు సామాజిక వర్గం ఓట్లను గంపగుత్తగా చంద్రబాబుకు వేయించాలని పవన్ కళ్యాణ్ విశ్వప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు కోసమే పవన్ తాపత్రయపడుతున్నారని చురకలంటించారు.

  • Srikar T
  • Updated on: Apr 24, 2024
  • 4:49 pm

EC on Babu: టీడీపీ అధినేతపై ఏపీ సీఈవో మీనా సీరియస్‌.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి మీనా సీరియస్‌ అయ్యారు. నోటీసులకు చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని సీఈవో.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

TDP-Janasena-BJP: ఏపీలో కూటమిలో రెబల్స్ భయం.. పలు చోట్ల పోటీకి సిద్ధం అవుతున్న నేతలు!

కూటమిలో ట్రబుల్స్‌ కొనసాగుతున్నాయి. నాలుగు స్థానాల్లో గొడవలు ఇంకా చల్లారలేదు. మరోవైపు కూటమి పార్టీలను రెబల్స్‌ గుబుల్‌ వెంటాడుతోంది. కావలిలో టీడీపీ రెబల్‌, గన్నవరంలో బీజేపీ రెబల్‌.. ఆయా పార్టీల గుండెల్లో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నారు. ఇక బీజేపీలో కూడా అనపర్తి టపాసులు పేలుతున్నాయి.

Andhra TDP: ఐదుగురు ఔట్.. అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన చంద్రబాబు.. లాస్ట్ మినట్‌లో వారికి నో ఛాన్స్‌..

ఆంధ్రప్రదేశ్ టీడీపీలో అసలు ఏం జరుగుతోంది..? ఇప్పటికే పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్‌సభ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ముందుగా ప్రకటించిన అభ్యర్థులను కాదని.. కొత్తగా మరొకరికి భీఫాంలు ఇస్తోంది. ప్రస్తుతం ఐదు స్థానాలకు అభ్యర్థులను మార్చినా..ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటం పార్టీ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది..

Chiranjeevi: కూటమి అభ్యర్థులకు చిరంజీవి సపోర్ట్.. ఓటు వేయండంటూ..! వీడియో వైరల్

సుదీర్ఘ కాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి రాజకీయ తెరపైకి వచ్చారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో కాకుండా తన తమ్ముడు పవన్ కళ్యాణ్‎కు మద్దతు తెలుపుతూ ఒక వీడియో చేశారు. ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడటం మంచి పరిణామమన్నారు. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం తన చిరకాల మిత్రుడు సీఎం రమేష్, పంచగళ్ల రమేష్ అని చెప్పారు.

  • Srikar T
  • Updated on: Apr 21, 2024
  • 11:10 am

చంద్రబాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. ఎన్నికల అఫిడవిట్లో ఆసక్తికర అంశాలు..

టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. ఎన్నికల సందర్భంగా నామినేషన్‌ వేయడంతో చంద్రబాబు ఆస్తులు- అప్పులు వ్యవహారం బట్టబయలు అవుతోంది. గత ఎన్నికల నాటికి.. ఇప్పటికి చంద్రబాబు ఆస్తులు 39శాతం పెరగడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ.. 2019లో చంద్రబాబు ఆస్తుల విలువ ఎంత?.. ఇప్పుడు ఎంత?.. 39 శాతం పెరుగుదల వెనకున్న లాజిక్‌ ఏంటి?

  • Srikar T
  • Updated on: Apr 21, 2024
  • 8:10 am

ఆ సీటు విషయంలో కొనసాగుతున్న మీమాంస.. కూటమిలో గందరగోళం..

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టిక్కెట్‌ విషయంలో సస్పెన్స్‌ కొనసాగుతోందా.? టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తోన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలో ఆశలు సన్నగిల్లుతున్నాయా..? బీజేపీలో జాయిన్‌ కావాలని పురందేశ్వరి, చేరమని చంద్రబాబు నల్లమిల్లికి సలహా ఇచ్చారా.? ఇంతకీ.. నల్లమిల్లి ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు.? అనుచరుల ఆదేశాలతో ఇండిపెండెంట్‌గా బరిలో దిగడం ఖాయమా?

  • Srikar T
  • Updated on: Apr 21, 2024
  • 8:12 am

Andhra Pradesh: ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న ఫ్యామిలీ మేటర్స్‌

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఏపీ రాజకీయాల్లో ప్రచారహోరు పెరిగింది. ఓట్ల వేటలో ఉన్న నేతలు.. ప్రత్యర్థులపై విమర్శలకు పదును పెంచుతున్నారు. పవన్‌ టార్గెట్‌గా సీఎం జగన్‌ చేసిన విమర్శలతో.. భార్యల పంచాయితీ మరోసారి పొలిటికల్‌ తెరమీదకొచ్చింది. ఏపీ పాలిటిక్స్‌లో ఫ్యామిలీ మేటర్స్‌పై రచ్చ.. కామనే అయినా... ఎన్నికల వేళ ప్రచారస్త్రంగా మారడం చర్చనీయాంశంగా మారింది.

కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి..

జెండాలు జతకట్టాయి, అధినేతలు చేతులు కలిపారు, కలిసి సీట్లు పంచుకున్నారు.. కానీ కీలకమైన కోఆర్డినేషన్‌ను వదిలేశారు. అదే ఇప్పుడు కూటమిలో కల్లోలం రేపుతోంది. నామినేషన్లవేళ ఎక్కడికక్కడ లుకలుకలు బయటపడుతున్నాయి. ప్రత్యర్థుల సంగతి ఏమోగాన.. స్వపక్షంలోనే పోటీని ఎదుర్కొంటున్నారు కూటమి అభ్యర్థులు. నామినేషన్ల పర్వం మొదలైనా కూటమిలో కుంపట్లు మాత్రం ఇంకా చల్లారడం లేదు.

  • Srikar T
  • Updated on: Apr 20, 2024
  • 6:43 am

టీడీపీలో ఆ సీట్లు మార్పున‌కు నిర్ణ‌యం.. ఎల్లుండి అభ్య‌ర్ధుల‌కు బీ – ఫారం లు అంద‌జేత‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‎లో ఎన్నిక‌ల హ‌డావుడి ఊపందుకుంది. నిన్నటి నుంచి నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభం కావ‌డంతో రాజ‌కీయ వేడి మ‌రింత పెరిగింది. ఇప్ప‌టికే మొద‌టి రోజు అసెంబ్లీకి 236 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. లోక్ స‌భకు 46 నామినేష‌న్లు దాఖ‌ల‌యిన‌ట్లు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ముకేష్ కుమార్ మీనా ప్ర‌క‌టించారు. అయితే ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్ధులు రాబోయే మూడు నాలుగు రోజుల్లో నామినేష‌న్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

  • MP Rao
  • Updated on: Apr 19, 2024
  • 2:50 pm

Andhra Pradesh: రాయి తంత్రం ఎవరిది..? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో హీటెక్కుతున్న రాజకీయం!

ఇప్పటికే రాయి వెనక మిస్టరీతో సలసల కాగుతున్న ఏపీ రాజకీయాల్లో... మరోసారి కులం ముచ్చట తెరమీదకు వచ్చింది. వంగావీటి మోహన రంగా స్మరణ మళ్లీ మొదలైంది. ఆయన వారసత్వంపై మరోసారి పొలిటికల్‌ రచ్చకు నాంది పడింది. ప్రజాగళం సభలో తాజాగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన కామెంట్సే దీనికి ప్రధాన కారణమైంది.

Note for Vote Case: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. ఏం జరగబోతోంది..?

ఓటుకు నోటు కేసుపై గురువారం విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునివ్వనుంది...? ఏడేళ్ల విచారణకు గురువారం ఫుల్‌స్టాప్‌ పడనుందా...? కేసులో చంద్రబాబు పాత్రపై క్లారిటీ వస్తుందా...?

Skill Development Case: చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. షరతులు ఉల్లంఘించారంటున్న సీఐడీ

ఎన్నికల సంగ్రామం ఉధృతంగా జరుగుతున్న ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ గండం పొంచి ఉంది. బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ పిటిషన్ వేయడం ఉత్కంఠ రేపుతోంది. సీఐడీ ఇప్పుడే ఎందుకీ పిటిషన్ వేసింది ? అనేదీ రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.

Srikakulam: చంద్రబాబు బస చేసిన చోట ఆసక్తికర ఘటన.. అతన్ని చూసి బయటికి వచ్చేసిన మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెరిగింది. నామినేషన్ల పర్వం మొదలు కానుండటంతో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు చంద్రబాబు నాయుడు. అయితే చంద్రబాబు బస చేసిన పలాస టీడీపీ కార్యాలయం వద్ద ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అనుకోని సొంత పార్టీ ప్రత్యర్థులు ఎదురెదురయ్యాయి. అధినేత సమక్షంలో ముఖం చాటేశారు.

2024 ఎన్నికలు టీడీపీ భవిష్యత్తును డిసైడ్ చెయ్యబోతున్నాయా? చంద్రబాబు సీఎం కాకపోతే మున్ముందు పార్టీ పరిస్థితి ఏంటి?

ఏపీలో మే 13న జరగబోయే ఎన్నికలు చంద్రబాబు రాజకీయ భవిష్యత్తునే కాదు ఆయన పార్టీ భవిష్యత్తును కూడా నిర్ణయించబోతున్నాయా..?. ఈ విషయం ఆయనకు కూడా బాగా తెలుసా...? అందుకేనా అంతగా కష్టబడుతున్నారు..? ఒక వేళ ఆయన అనుకున్న ఫలితం రాకపోతే... వాట్ నెక్ట్స్...?