చంద్రబాబు నాయుడు
నారా చంద్రబాబు నాయుడు
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. తెలుగు దేశం పార్టీ(టీడీపీ) జాతీయ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమితో చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు నవ్యాంధ్రకు రెండోసారి సీఎం అయ్యారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత సాధించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్కు రెండుసార్లు, నవ్యాంధ్రకు రెండుసార్లు సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20 ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు.
చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా 1973లో చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన 1978లో ఆయన కాంగ్రెస్ (ఐ) పార్టీలో చేరారు. ఆ ఏడాది చంద్రగిరి నియోకజవర్గం నుంచి కాంగ్రెస్ (ఐ) టికెట్పై పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 28 సంవత్సరాల వయస్సులో రాష్ట్రంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా ఘనత సాధించారు. 1980లో ఆయన ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ (ఐ)లోనే చంద్రబాబు కొనసాగారు. 1983 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెంట్రామ నాయుడి చేతిలో ఓటమి తర్వాత, ఆయన కాంగ్రెస్ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
1995 నుండి 2004 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. తన హయాంలో హైదరాబాద్లో ఐటీ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2003లో అలిపిరి మందుపాతర పేలుడు ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. తన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్ ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మని వివాహం చేసుకోగా.. వారికి కుమారుడు దేవాన్ష్ ఉన్నారు.
యునైటెడ్ ఫ్రెంట్ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. ఏపీ రాజకీయ నాయకుడిగానే కాకుండా జాతీయ నాయకుడిగా చంద్రబాబు గుర్తింపు సాధించారు.
ఏపీలో భయపెడుతున్న కొత్త రకం వ్యాధి.. అప్రమత్తమైన సర్కార్.. అధికారులతో సీఎం సమీక్ష
మూడేళ్ల కిందట ఢిల్లీ, తమిళనాడును షేక్ చేసిన స్క్రబ్ టైఫస్ జ్వరాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టెన్షన్ పెడుతున్నాయి. నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ వ్యాధి ఎంత సీరియస్, ముదిరితే ఏమవుతుంది? డాక్టర్లు ఏమంటున్నారు?
- Balaraju Goud
- Updated on: Dec 3, 2025
- 7:44 am
AP Cabinet: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. వారి కోసం ఫైనాన్స్ కార్పొరేషన్.. కేబినెట్ నిర్ణయాలివే
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ కేబినెట్ అజెండాలోని 26 అంశాలకు ఆమోదం తెలిపింది. ఖరీఫ్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు అవసరాల కోసం మార్క్ఫెడ్ ద్వారా 5 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారెంటీ కల్పించే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- Shaik Madar Saheb
- Updated on: Nov 29, 2025
- 7:14 am
అమరావతిలో పురుడుపోసుకున్న ఆర్థిక నగరి.. ఉద్యోగ, ఉపాధి లక్ష్యంగా ‘రాజధాని’!
రాజధానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్.. అమరావతిని 'మహానగరం'గా మార్చడానికి ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం. ఊరికే మాటల్లో లేదా ప్రాసెస్. ఆల్రడీ అడుగులు పడ్డాయ్. అటు విజయవాడ, ఇటు గుంటూరు మధ్యలో అమరావతి. రాజధానికి ఆనుకుని ఉన్న మంగళగిరి, తాడేపల్లి. వీటన్నింటినీ కలిపి భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా మహానగరంగా డెవలప్ చేయబోతోంది ప్రభుత్వం. అందుకే, మరో ల్యాండ్ పూలింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్.
- Balaraju Goud
- Updated on: Nov 28, 2025
- 9:50 pm
AP New Districts: ఏపీలో 29కి జిల్లాల సంఖ్య.. కొత్తగా ఏర్పడే 3 జిల్లాల భౌగోళిక స్వరూపం ఇలా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. మార్కాపురం, మదనపల్లె జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మార్పు చేర్పులకు ఆమోదాన్ని తెలియచేశారు.
- Shaik Madar Saheb
- Updated on: Nov 26, 2025
- 7:18 am
Watch: శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. లైవ్ వీడియో..
శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సహా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వారితోపాటు.. పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
- Shaik Madar Saheb
- Updated on: Nov 23, 2025
- 10:27 am
Andhra Pradesh: ఈ నెల 30న సీఎస్ పదవీ విరమణ..! తదుపరి చీఫ్ సెక్రటరీ ఎవరో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నవంబర్ 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయనకు మరో మూడు నెలల పాటు కొనసాగింపు ఇవ్వాలా లేదా అనే అంశంపై కూటమి ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. చివరికి తదుపరి సీఎస్ ఎవరనే ఉత్కంఠ తొలగింది. ఈ నెలాఖరుకు ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ రిటైర్ అవ్వనున్నారు. ఈ నేపధ్యంలో తదుపరి సీఎస్ ఎవరు అన్నదానిపై గత కొద్దిరోజులుగా చర్చలు నడిచాయి.
- Eswar Chennupalli
- Updated on: Nov 22, 2025
- 9:23 am
ఏకంగా ముఖ్యమంత్రికే నోటీసులు పంపిన ఇన్స్పెక్టర్.. చివరికి ట్విస్ట్ ఇదే..!
పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను సర్వీసుల నుంచి తొలగిస్తూ.. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ డిస్మిస్ చేశారు. డీఐజీ ఆదేశాలతో క్రమశిక్షణ చర్యలలో భాగంగా శంకరయ్యను విధుల నుంచి తొలగిస్తున్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వు్లు జారీ చేశారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం శంకరయ్య వీఆర్లో ఉన్నారు.
- Balaraju Goud
- Updated on: Nov 22, 2025
- 7:53 am
రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. పంచ సూత్రాలతో సరికొత్త ఫ్లాన్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 24 నుంచి రైతన్నా మీ కోసం కార్యక్రమం చేపట్టనుంది. వ్యవసాయ రంగంలో సమూల మార్పు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాగును లాభసాటిగా మార్చేందుకు పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై దృష్టి పెట్టింది.
- Balaraju Goud
- Updated on: Nov 21, 2025
- 7:24 am
వేదిక ఏదైనా టార్గెట్ అదే.. రేరెస్ట్ సిట్యువేషన్ని హోంమంత్రి అమిత్ షా ఇలా వాడేసుకున్నారా?
మార్చి 31, 2026.. దేశంలో వామపక్ష తీవ్రవాదానికి ఎండ్కార్డ్ పడాల్సిన రోజు. ఆ తర్వాత నక్సలిజం అనే శబ్దమే నిషిద్ధం. కేంద్ర హోంమంత్రి జారీ చేసిన హుకుం ఇది..! మహా అయితే నాలుగు నెలలే గ్యాప్ ఉంది. మరి, లక్ష్యానికి మనం ఎంత దూరంలో ఉన్నాం.. నాకిప్పుడే తెలియాలి అంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్షా. అందుకోసం అనఫీషియల్గా ఓ స్పెషల్ సెట్టింగ్ ఏర్పాటు చేసుకున్నారా?
- Balaraju Goud
- Updated on: Nov 21, 2025
- 7:03 am
సత్యసాయి బాబా ప్రేమ సూత్రాలు ప్రపంచం మొత్తం వినిపిస్తున్నాయిః ప్రధాని మోదీ
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు ఇవాళ్టి నుంచి 23 వరకు ఘనంగా జరగనున్నాయి. పుట్టపర్తి పురవీధులు సాయి నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి బాబా నిలిచారన్నారు.
- Balaraju Goud
- Updated on: Nov 19, 2025
- 1:24 pm