AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

నారా చంద్రబాబు నాయుడు

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. తెలుగు దేశం పార్టీ(టీడీపీ) జాతీయ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమితో చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు నవ్యాంధ్రకు రెండోసారి సీఎం అయ్యారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత సాధించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు రెండుసార్లు, నవ్యాంధ్రకు రెండుసార్లు సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20 ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు.

చంద్రగిరిలో విద్యార్థి నాయ‌కుడిగా 1973లో చంద్రబాబు రాజ‌కీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన 1978లో ఆయన కాంగ్రెస్ (ఐ) పార్టీలో చేరారు. ఆ ఏడాది చంద్రగిరి నియోకజవర్గం నుంచి కాంగ్రెస్ (ఐ) టికెట్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 28 సంవత్సరాల వయస్సులో రాష్ట్రంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా ఘనత సాధించారు. 1980లో ఆయ‌న ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ (ఐ)లోనే చంద్రబాబు కొనసాగారు. 1983 ఎన్నిక‌ల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెంట్రామ నాయుడి చేతిలో ఓట‌మి త‌ర్వాత‌, ఆయ‌న కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

1995 నుండి 2004 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. తన హయాంలో హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2003లో అలిపిరి మందుపాతర పేలుడు ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. తన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్ ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మని వివాహం చేసుకోగా.. వారికి కుమారుడు దేవాన్ష్ ఉన్నారు.

యునైటెడ్ ఫ్రెంట్ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. ఏపీ రాజకీయ నాయకుడిగానే కాకుండా జాతీయ నాయకుడిగా చంద్రబాబు గుర్తింపు సాధించారు.

ఇంకా చదవండి

CM Chandrababu Naidu: జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల అభ్యంతరాల మేరకు స్వల్ప మార్పులు చేస్తూ, నెల్లూరు జిల్లాలో గూడూరు కొనసాగింపు, మార్కాపురం జిల్లాకు దొనకొండ, కురిచేడులను ఖరారు చేశారు. అయితే, జనగణన నేపథ్యంలో గ్రేటర్ విజయవాడ, తిరుపతి ఏర్పాటును ప్రస్తుతానికి వాయిదా వేశారు. తుది నోటిఫికేషన్ ఈ నెల 31న వెలువడనుంది.

  • Phani CH
  • Updated on: Dec 27, 2025
  • 10:10 pm

Chandrababu Naidu: ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవం.. భార్య భువనేశ్వరిపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 2047 నాటికి మనం నెంబర్ వన్ గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన బల్లగుద్ది చెప్పారు. ఈ వేడుకల్లో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కూడా పాల్గొన్నారు.

Andhra: నెల్లూరులోనే గూడురు.. జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆరోజే తుది నోటిఫికేషన్..

త్వరలోనే కొత్త జిల్లాలు.. ప్రతిపాదనల్లో స్వల్ప మార్పులు కొత్త సంవత్సరంలో ఏపీ ముఖచిత్రంలో కొత్త జిల్లాలు ఆవిర్భవించబోతున్నాయి. ఇందుకు సంబంధించిన బ్లూప్రింట్‌కు సీఎం చంద్రబాబు స్వల్ప మార్పులు సూచించారు. ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయాలు ఉంటాయని పదే పదే చెబుతున్న చంద్రబాబు.. ఈ అంశంలో ప్రభుత్వ నిర్ణయాలు ఆ విధంగానే ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు.

CM Chandrababu Naidu: కొత్త టెక్నాలజీ తీసుకొచ్చే బాధ్యత మాది

అమరావతిలో జరిగిన క్వాంటం టాక్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు టెక్ విద్యార్థులతో మాట్లాడారు. 50,000 మంది క్వాంటం ట్రైనింగ్‌కు నమోదు చేసుకోగా, లక్ష మంది నిపుణులను తయారు చేయడమే లక్ష్యమన్నారు. కొత్త టెక్నాలజీ తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత అని, కెరియర్‌ను నిర్మించుకోవడం విద్యార్థుల బాధ్యత అని సూచించారు.

  • Phani CH
  • Updated on: Dec 23, 2025
  • 6:47 pm

పార్టీ పదవుల భర్తీ స్పీడప్.. టీడీపీ జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు.. ఇదిగో లిస్ట్..!.

పార్టీ పదవుల భర్తీని తెలుగుదేశం పార్టీ స్పీడప్ చేసింది. పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైంది. ఇప్పటికే జాబితాను కూడా రెడీ చేసింది. ఆ సమాచారాన్ని ఎమ్మెల్యేలు, జిల్లా నేతలకు ఇప్పటికే పార్టీ పంపించినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో టీడీపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించనుంది. ఇంతకీ.. పదవులు దక్కబోతున్న ఆ నేతలెవరు?

CM Chandrababu: ఏపీలో సంక్రాంతి నుంచి అన్ని సేవలూ ఆన్ లైన్ లోనే

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి నుండి అన్ని ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌లో అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. డ్రోన్ సేవల విస్తరణకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, ఆర్టీసీ సేవలు, పరిశుభ్రత మెరుగుపరచాలని సూచించారు.

  • Phani CH
  • Updated on: Dec 10, 2025
  • 5:39 pm

Andhra: వారసులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ.100కే భూముల రిజిస్ట్రేషన్..

చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారసత్వ భూమి రిజిస్ట్రేషన్‌ను కేవలం రూ.100 కే చేయాలని నిర్ణయం తీసుకుంది. రూ.10 లక్షల లోపు విలువ గల వారసత్వ ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ఇకపై కేవలం రూ.100 మాత్రమే వసూలు చేయనున్నారు.

Scrub Typhus: వామ్మో.. ఏపీలో పెరుగుతున్న స్క్రబ్‌ టైఫస్‌ కేసులు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

 కొన్నింటికి.. నివారణే మందు. అంటే.. అసలు రాకుండా చూసుకోవడమే బెటర్‌..! ఇప్పుడు అలాంటి యుద్ధాన్నే స్క్రబ్‌ టైఫస్‌పై ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రాన్ని వణికిస్తున్న ఈ వ్యాధిపై అవేర్‌నెస్‌ వార్‌ అనౌన్స్‌ చేసింది. స్క్రబ్‌ టైఫస్‌ బ్యాక్టీరియా.. నివారణ, నియంత్రణ కోసం.. దాని మూల కారణాలపై దృష్టిపెట్టింది ప్రభుత్వం.

Andhra Pradesh: మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 48గంటల్లోనే అకౌంట్‌లో రూ.8లక్షలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు కీలక నిర్ణయం తీసుకుంది. స్త్రీ నిధి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు తక్కువ వడ్డీకి రూ.1 లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణాలు అందిస్తోంది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మీ పథకాలతో పిల్లల విద్య, వివాహాలకు ఆర్థిక చేయూత లభిస్తుంది. 48 గంటల్లోనే ఖాతాల్లో జమ, రుణగ్రహీత మరణిస్తే రద్దు సౌకర్యం వంటివి మహిళలకు పూర్తి ఆర్థిక భరోసా కల్పిస్తాయి.

ఏపీలో భయపెడుతున్న కొత్త ర‌కం వ్యాధి.. అప్రమత్తమైన సర్కార్.. అధికారులతో సీఎం సమీక్ష

మూడేళ్ల కిందట ఢిల్లీ, తమిళనాడును షేక్‌ చేసిన స్క్రబ్ టైఫస్ జ్వరాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టెన్షన్ పెడుతున్నాయి. నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ వ్యాధి ఎంత సీరియస్, ముదిరితే ఏమవుతుంది? డాక్టర్లు ఏమంటున్నారు?

AP Cabinet: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. వారి కోసం ఫైనాన్స్ కార్పొరేషన్.. కేబినెట్ నిర్ణయాలివే

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ కేబినెట్‌ అజెండాలోని 26 అంశాలకు ఆమోదం తెలిపింది. ఖరీఫ్‌లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు అవసరాల కోసం మార్క్‌ఫెడ్‌ ద్వారా 5 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారెంటీ కల్పించే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

అమరావతిలో పురుడుపోసుకున్న ఆర్థిక నగరి.. ఉద్యోగ, ఉపాధి లక్ష్యంగా ‘రాజధాని’!

రాజధానికి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్.. అమరావతిని 'మహానగరం'గా మార్చడానికి ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం. ఊరికే మాటల్లో లేదా ప్రాసెస్. ఆల్రడీ అడుగులు పడ్డాయ్. అటు విజయవాడ, ఇటు గుంటూరు మధ్యలో అమరావతి. రాజధానికి ఆనుకుని ఉన్న మంగళగిరి, తాడేపల్లి. వీటన్నింటినీ కలిపి భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా మహానగరంగా డెవలప్ చేయబోతోంది ప్రభుత్వం. అందుకే, మరో ల్యాండ్ పూలింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్.