AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

నారా చంద్రబాబు నాయుడు

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. తెలుగు దేశం పార్టీ(టీడీపీ) జాతీయ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమితో చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు నవ్యాంధ్రకు రెండోసారి సీఎం అయ్యారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత సాధించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు రెండుసార్లు, నవ్యాంధ్రకు రెండుసార్లు సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20 ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు.

చంద్రగిరిలో విద్యార్థి నాయ‌కుడిగా 1973లో చంద్రబాబు రాజ‌కీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన 1978లో ఆయన కాంగ్రెస్ (ఐ) పార్టీలో చేరారు. ఆ ఏడాది చంద్రగిరి నియోకజవర్గం నుంచి కాంగ్రెస్ (ఐ) టికెట్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 28 సంవత్సరాల వయస్సులో రాష్ట్రంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా ఘనత సాధించారు. 1980లో ఆయ‌న ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ (ఐ)లోనే చంద్రబాబు కొనసాగారు. 1983 ఎన్నిక‌ల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెంట్రామ నాయుడి చేతిలో ఓట‌మి త‌ర్వాత‌, ఆయ‌న కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

1995 నుండి 2004 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. తన హయాంలో హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2003లో అలిపిరి మందుపాతర పేలుడు ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. తన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్ ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మని వివాహం చేసుకోగా.. వారికి కుమారుడు దేవాన్ష్ ఉన్నారు.

యునైటెడ్ ఫ్రెంట్ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. ఏపీ రాజకీయ నాయకుడిగానే కాకుండా జాతీయ నాయకుడిగా చంద్రబాబు గుర్తింపు సాధించారు.

ఇంకా చదవండి

Andhra Politics: ఆంధ్రా పాలిటిక్స్‌ గురూ.. టాపిక్ ఏదైనా టాప్ లేచిపోవాల్సిందే..!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమవుతోంది.. ఈ తరుణంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. లండన్ తరహాలో ‘అమరావతి ఐ’.. గోవా తరహాలో ‘బీచ్ షాక్స్’..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు సాగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పర్యాటకం, ఉపాధి, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ప్రభుత్వం పలు సంచలన, కీలక అంశాలకు పచ్చజెండా ఊపింది. గోవా తరహాలో బీచ్ టూరిజం డెవలప్‌మెంట్, లండన్ తరహాలో 'అమరావతి ఐ' వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు ఉద్యోగులకు మేలు చేకూర్చే పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే చేతికి సొంతింటి తాళాలు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్..!

చాలా కాలంగా ఇళ్ల నిర్మాణం పూర్తి కాక, మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్న వేలాది మంది లబ్ధిదారులకు ఈ నిర్ణయం వల్ల నేరుగా ప్రయోజనం చేకూరనుంది. నిధుల విడుదలతో ఇళ్ల పంపిణీ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. గృహాల నిర్మాణం చివరి దశకు చేరుకోవడంతో, అతి త్వరలోనే లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను హ్యాండోవర్ చేసేందుకు అధికారులు కసరత్తులు ప్రారంభించారు.

తెలంగాణపై టీడీపీ, జనసేన ఫోకస్.. జూన్ 2న హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ కీలక సమావేశం

ఏపీలో పాగా వేసిన టీడీపీ, జనసేన పార్టీలు తమ తర్వాత టార్గెట్‌ తెలంగాణే అంటున్నాయి. గ్రామస్థాయి నుంచే టీడీపీని బలోపేతం చేసేదిశగా చర్యలు తీసుకుంటామని మహానాడు వేదికగా ఆ పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్‌ ప్రకటిస్తే.... జూన్ 2న హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ మీటింగ్ పెట్టడం చర్చనీయాంశమవుతోంది.

తెలుగుజాతి గౌరవం NTRకు ‘భారతరత్న’ ఇవ్వాలి.. మహానాడులో టీడీపీ ఏకగ్రీవ తీర్మానం!

తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (NTR) 103వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నెల్లూరులో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకల్లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు.

ఇది మా సంకల్పం.. ఇకపై మహిళలకు 33శాతం సీట్లు ఇస్తాం: మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన

టీడీపీ మహానాడు వేదికగా నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని విమర్శించిన లోకేష్.. మహిళా నాయకత్వమే భారత రాజకీయాల భవిష్యత్తు అని స్పష్టం చేశారు. “ఇది మా సంకల్పం.. ఇది మా కమిట్‌మెంట్” అంటూ చేసిన వ్యాఖ్యలు మహానాడు వేదికను మారుమోగించాయి.

TDP Mahanadu 2026: పసుపు పండగ.. టీడీపీ మహానాడు ప్రత్యక్ష ప్రసారం..

టీడీపీ మహానాడు 2026 మంగళగిరిలో ఘనంగా ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌కు నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా 1848 క్లస్టర్లలో ఎల్ఈడీ స్క్రీన్లతో మహానాడు ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశారు. రెండు రోజుల మహానాడులో మొత్తం 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టనుంది టీడీపీ.

CM Chandrababu: అకస్మాత్తుగా ఆగిన సీఎం చంద్రబాబు కాన్వాయ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఇదిగో వీడియో

కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఆగింది. భార్య భువనేశ్వరితో కలిసి కారు దిగి తాటి ముంజలు అమ్ముతున్న ఓ వ్యాపారి వద్దకు వెళ్లిన చంద్రబాబు.. ముంజలు రుచి చూస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సీఎం దంపతుల సరళత, సామాన్య ప్రజలతో మమేకమైన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Chandrababu: అన్నం తినడం పూర్తిగా మానేసిన ఏపీ సీఎం.. ఎక్కువగా ప్రొటీన్..

అన్నం తగ్గించి… ప్రోటీన్ పెంచితేనే ఆరోగ్యం బాగుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారు. రోజూ చేపలు, కంట్రోల్డ్ డైట్, హెల్త్ ట్రాకింగ్ టెక్నాలజీతో ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న ఆయన మాటలు ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. పూర్తి వివరాలు కథనంలో ...

ప్రజల ముంగిటకే ‘మినీ ల్యాబ్’.. 104 వాహనాల్లోనే 41 రకాల ఫ్రీ టెస్టులు.. సర్కార్ కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు భారీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ మెడికల్ యూనిట్ల (MMU) ద్వారా ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 104 వాహనాల ద్వారా అందించే సేవలపై స్పష్టమైన ఉత్తర్వులను జారీ చేసింది.

పొదుపు బాటలో టీడీపీ.. ఈసారి ‘డిజిటల్’ మహానాడు.. చంద్రబాబు కీలక నిర్ణయం..!

తెలుగుదేశం పార్టీ (TDP) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వార్షిక పండుగ 'మహానాడు'కు సంబంధించి మీరు అందించిన సమాచారం అటు పార్టీ శ్రేణుల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చగా మారింది. ప్రభుత్వపరంగా, పార్టీపరంగా అనవసర ఖర్చులను తగ్గించుకోవాలనే పొదుపు చర్యల్లో భాగంగానే అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ-డిజిటల్, ఆన్‌లైన్ మహానాడు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Andhra Pradesh: గుడ్ న్యూస్.. ఆంధ్రాలో కొత్త పింఛన్‌లు వీరికే.. ఇదిగో పూర్తి వివరాలు..

ఏపీలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేదలకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ, లివర్, గుండె సంబంధిత తీవ్ర సమస్యలతో బాధపడుతున్న వారికి 895 కొత్త పింఛన్‌లు మంజూరు చేసింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ భరోసా పథకం కింద డయాలసిస్ చేయించుకుంటున్న వారు, కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్నవారు, ద్వైపాక్షిక బోదకాలు, కుష్టు వంటి వ్యాధులతో బాధపడుతున్న అర్హులైన పేదలను ఈ పింఛన్ పరిధిలోకి తీసుకొచ్చారు.