Shaik Madar Saheb
Chief Sub-Editor, Politics, Hyper Local, Crime, Lifestyle, Health - TV9 Telugu
madarsaheb.shaik@tv9.comషేక్ మదార్ సాహెబ్, టీవీ9 తెలుగులో చీఫ్ సబ్-ఎడిటర్గా పనిచేస్తున్నాను. తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాలలో శిక్షణ పొంది 2016 నుంచి కెరీర్ను ప్రారంభించాను. గతంలో ఆంధ్రజ్యోతిలో సబ్ ఎటిటర్గా, జీ మీడియా (ఢిల్లీ) లో అసిస్టెంట్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా పనిచేశాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన పొలిటికల్, హైపర్ లోకల్, క్రైమ్, జాతీయం, అంతర్జాతీయం ఆర్టికల్స్ను అందిస్తాను. అలాగే హెల్త్, లైఫ్స్టైల్, ట్రెండింగ్, వైరల్కు సంబంధించిన ఆసక్తికర వార్తలను రాస్తాను.
పాపం ప్రియాంక.. ఆఖరి ప్రయత్నంగా అప్నియా టెస్ట్.. రాజమండ్రి మెడికో హెల్త్ అప్డేట్ ఇదే..
రాజమండ్రిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రియాంక పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతుండగా, వైద్యులు బ్రెయిన్డెడ్ పరిస్థితిపై కుటుంబ సభ్యులకు వివరించినట్లు సమాచారం. చివరి ప్రయత్నంగా అప్నియా టెస్ట్ నిర్వహించేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. అయితే శరీరంలో సోడియం స్థాయిలు అధికంగా ఉండటంతో ముందుగా వాటిని నియంత్రించాల్సి ఉందని తెలుస్తోంది.
- Shaik Madar Saheb
- Updated on: Aug 8, 2026
- 1:43 pm
అందరూ చేసే మిస్టెక్ మీరు చేయొద్దు.. పాతకాలం పద్దతిలో చికెన్ వండితే నాటుకోడి కూరలా మారిపోయిద్ది..
బ్రాయిలర్ చికెన్తో చేసిన కూర నాటుకోడి కూరలా కమ్మగా, స్మోకీ ఫ్లేవర్తో రావాలంటే కొన్ని సంప్రదాయ చిట్కాలు పాటించాలి. చికెన్ను శుభ్రం చేసే విధానం నుంచి మసాలా తయారీ, గ్రేవీని నెమ్మదిగా ఉడికించడం వరకు ప్రతి దశలో జాగ్రత్తలు తీసుకుంటే రుచి మరింత పెరుగుతుంది. ముఖ్యంగా చికెన్ను మంటపై స్వల్పంగా కాల్చి శుభ్రం చేయడం, ప్రత్యేకమైన మసాలా పేస్ట్ తయారు చేయడం, తక్కువ మంటపై గ్రేవీలో ఉడికించడం వంటి పద్ధతులతో పండుగ వేళ ఇంట్లోనే కమ్మని కోడి కూరను తయారు చేసుకోవచ్చు.
- Shaik Madar Saheb
- Updated on: Aug 8, 2026
- 12:39 pm
పొట్ట కొవ్వు కరిగించి, బరువును తగ్గించే సూపర్ డ్రింక్.. ఈ బ్రహ్మాస్త్రం గురించి చాలా మందికి తెలియనే తెలియదు..
అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడేవారు ఆహార నియంత్రణతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా కడుపు నిండా కాకుండా పరిమిత మోతాదులో ఆహారం తీసుకోవడం, ఉప్పు-చక్కెర వినియోగాన్ని తగ్గించడం, చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం వంటి అలవాట్లు బరువు నియంత్రణకు సహాయపడతాయి.
- Shaik Madar Saheb
- Updated on: Aug 8, 2026
- 11:47 am
PM Modi: ఆనందంగా ఉంది.. ఢిల్లీ ఐఐటీలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. లైవ్ వీడియో
న్యూఢిల్లీలోని ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 3,000 మందికి పైగా పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. వీరిలో 587 మంది పీహెచ్డీ పరిశోధకులు ఉన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు రాష్ట్రపతి స్వర్ణ పతకం, డైరెక్టర్ స్వర్ణ పతకం సహా పలు ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రధాని మోదీ ప్రదానం చేయనున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Aug 8, 2026
- 12:02 pm
తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా.. ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కొత్త ట్విస్ట్.. రంగంలోకి సజ్జనార్..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు రోజుల పోలీస్ కస్టడీలో కీలక ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా “తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా” అంటూ దాటవేసినట్లు సమాచారం. దీంతో మరింత విచారణ కోసం మరోసారి కస్టడీకి కోరుతూ పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తును హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పర్యవేక్షిస్తున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Aug 8, 2026
- 9:56 am
30 రోజులు ఏది వద్దు.. ఉదయాన్నే ఇది ఓ గ్లాసు తాగండి.. వందల రోగాలను నయం చేసే పవర్..
జొన్న అంబలి మన పూర్వీకుల సంప్రదాయ ఆరోగ్య పానీయం. జొన్న పిండి, మజ్జిగతో తయారయ్యే ఈ అంబలిని ఎలా చేసుకోవాలి? ఇందులోని పోషకాలు, జీర్ణక్రియకు కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి. క్రమం తప్పకుండా నెల రోజుల పాటు తాగితే శరీరంలో వచ్చే మార్పులను స్పష్టంగా గమనించవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Aug 8, 2026
- 9:01 am
ఏపీలోని ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశంతో ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది.
- Shaik Madar Saheb
- Updated on: Aug 7, 2026
- 1:54 pm
బోనాల పండుగ వేళ ఇంట్లో ఇవి ఉండాల్సిందే.. మొక్కజొన్న మినప గారెలు ఇలా చేశారంటే రెండు ప్లేట్లు లాగిస్తారు..
బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేందుకు మొక్కజొన్న మినప గారెలు అద్భుతమైన సంప్రదాయ వంటకం. మినప పిండి, స్వీట్ కార్న్ పేస్ట్, ఉప్మా రవ్వ, అల్లం, పచ్చిమిర్చి కలయికతో తయారయ్యే ఈ గారెలు బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉంటాయి. బొంబాయి రవ్వ వల్ల ప్రత్యేకమైన క్రిస్పీనెస్ రావడంతో పాటు, స్వీట్ కార్న్ సహజమైన తీపి రుచిని అందిస్తుంది.
- Shaik Madar Saheb
- Updated on: Aug 7, 2026
- 1:19 pm
ముదురు మటన్ మెత్తగా ఉడకాలంటే ఇదొక్కటి తగిలించండి.. కుక్కర్ అవసరమే లేదు.. పళ్లు లేనేళ్లు కూడా ఈజీగా తింటారు..
మటన్ను ప్రెషర్ కుక్కర్ లేకుండానే మెత్తగా, రుచికరంగా వండడం సాధ్యమే. బొప్పాయి పేస్ట్, పెరుగు లేదా నిమ్మరసంతో మ్యారినేట్ చేయడం, మందపాటి గిన్నెలో నెమ్మదిగా ఉడికించడం వంటి చిట్కాలు పాటిస్తే మటన్ ఎంతో మృదువుగా తయారవుతుంది. బోనాల సందర్భంగా చేసే స్పెషల్ స్పైసీ మటన్ కర్రీకి సరైన మసాలాలు, కొత్తిమీర, పుదీనాతో అద్భుతమైన రుచి తీసుకురావచ్చు.
- Shaik Madar Saheb
- Updated on: Aug 7, 2026
- 1:39 pm
బోనాల పండుగ సూపర్ స్పెషల్.. బెల్లం అన్నం ఇలా చేశారంటే ఎప్పటికీ గుర్తుండిపోవాల్సిందే..
బోనాల పండుగలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే బెల్లం అన్నం తెలంగాణ సంప్రదాయంలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. బియ్యం, పెసరపప్పు, పాలు, బెల్లంతో సులభంగా తయారయ్యే ఈ ప్రసాదం రుచికరంగానే కాకుండా ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని కూడా కలిగి ఉంటుంది. సరైన కొలతలు, చిన్న చిన్న చిట్కాలతో ఇంట్లోనే బోనాల స్పెషల్ బెల్లం అన్నాన్ని సులభంగా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు.
- Shaik Madar Saheb
- Updated on: Aug 7, 2026
- 11:21 am
మత్తోన్మాదులు.. మెడికల్ విద్యార్థినిని 3 సార్లు కారుతో ఢీకొట్టారు.. సంచలన విషయాలు..
రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో కారును నడిపిన ఇద్దరు యువకులు స్కూటీని పలుమార్లు ఢీకొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో పీజీ మెడికల్ విద్యార్థిని ప్రియాంక తీవ్రంగా గాయపడగా, ఆమె స్నేహితుడు కూడా గాయాలపాలయ్యాడు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో ప్రమాదంపై వివిధ కోణాల్లో చర్చ జరుగుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Aug 7, 2026
- 8:19 am
Weather Alert: శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శుక్రవారం నుంచి వర్షాలు కొనసాగనున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షాలతో పాటు గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- Shaik Madar Saheb
- Updated on: Aug 7, 2026
- 7:27 am