AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shaik Madar Saheb

Shaik Madar Saheb

Chief Sub-Editor, Politics, Hyper Local, Crime, Lifestyle, Health - TV9 Telugu

madarsaheb.shaik@tv9.com

షేక్ మదార్ సాహెబ్, టీవీ9 తెలుగులో చీఫ్ సబ్‌-ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాలలో శిక్షణ పొంది 2016 నుంచి కెరీర్‌ను ప్రారంభించాను. గతంలో ఆంధ్రజ్యోతిలో సబ్ ఎటిటర్‌గా, జీ మీడియా (ఢిల్లీ) లో అసిస్టెంట్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సంబంధించిన పొలిటికల్, హైపర్‌ లోకల్, క్రైమ్, జాతీయం, అంతర్జాతీయం ఆర్టికల్స్‌ను అందిస్తాను. అలాగే హెల్త్, లైఫ్‌స్టైల్, ట్రెండింగ్, వైరల్‌కు సంబంధించిన ఆసక్తికర వార్తలను రాస్తాను.

Read More
ఎండాకాలం అయినా.. వర్షాకాలం అయినా.. దీన్ని కొట్టే మొనగాడు ఫుడ్ లేనేలేదు మావ.. ఈ సీజన్‌లో..

ఎండాకాలం అయినా.. వర్షాకాలం అయినా.. దీన్ని కొట్టే మొనగాడు ఫుడ్ లేనేలేదు మావ.. ఈ సీజన్‌లో..

వర్షాకాలం రోగాల బారి నుండి కాపాడే ఆరోగ్యకరమైన రాగి అంబలిని తీసుకోవడం చాలా మంచిది. ఈ అంబలి జీర్ణక్రియకు అత్యంత మేలు చేస్తుంది, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి ఎంపిక. శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, వెంట్రుకలు, చర్మానికి కూడా ఆరోగ్యాన్నిస్తుంది. రాగిలో కాల్షియం, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి..

అందరూ చేసే మిస్టెక్ మీరు చేయొద్దు.. నిమ్మకాయ పులిహోర పుల్లంగా, కారంగా రావాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి..

అందరూ చేసే మిస్టెక్ మీరు చేయొద్దు.. నిమ్మకాయ పులిహోర పుల్లంగా, కారంగా రావాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి..

నిమ్మకాయ పులిహోర, దక్షిణ భారతదేశంలో ఒక ప్రసిద్ధ సాంప్రదాయ వంటకం. దీనిని సులువుగా, తక్కువ సమయంలో, తక్కువ పదార్థాలతో తయారుచేసుకోవచ్చు. పుల్లపుల్లగా, కారంకారంగా ఉండే ఈ పులిహోరను ఉదయం అల్పాహారంగా లేదా మధ్యాహ్న భోజనంగా ఆస్వాదించవచ్చు. పోపు దినుసులు, నిమ్మకాయ రసంతో ఈ వంటకం మరింత రుచిగా ఉంటుంది.

అబ్బ.. ఎంత చల్లని కబురో.. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

అబ్బ.. ఎంత చల్లని కబురో.. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలు, మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా, తెలంగాణలోనూ మరో ఒకటి రెండు రోజుల్లో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవడంతోపాటు, ఉష్ణోగ్రతల తగ్గుదల నమోదయ్యే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

తేల్చుకుందాం రా..! రెండేళ్లు Vs పదేళ్లు.. ఇష్యూ ఏదైనా బస్తీ మే సవాల్

తేల్చుకుందాం రా..! రెండేళ్లు Vs పదేళ్లు.. ఇష్యూ ఏదైనా బస్తీ మే సవాల్

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తన రెండున్నరేళ్ల పాలనను బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనతో పోల్చుతూ బహిరంగ సవాల్ విసిరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం, ధాన్యం కొనుగోళ్లు, నీటి పంపకాల వంటి కీలక అంశాలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఆరోపణలు-ప్రత్యారోపణలు ముదురుతున్నాయి. 2028 ఎన్నికల లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు ప్రజా సమస్యలనే అస్త్రంగా చేసుకుని రాజకీయ సమరానికి సిద్ధమవుతున్నాయి.

అమ్మమ్మల కాలం నాటి పాత రుచి.. పచ్చి చేపల పులుసు ఇలా చేస్తే ముక్క విరగదు..

అమ్మమ్మల కాలం నాటి పాత రుచి.. పచ్చి చేపల పులుసు ఇలా చేస్తే ముక్క విరగదు..

ఆదివారం స్పెషల్‌గా చేపల కూర చేయాలనుకుంటున్నారా? అమ్మమ్మల కాలం నాటి పాత పద్ధతిలో పచ్చి చేపల పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. చేప ముక్కలు అస్సలు విరగకుండా, రిచ్‌గా, స్పైసీగా, చింతపండు రుచితో నోరూరించే చేపల పులుసు తయారీ చిట్కాలు ఈ కథనంలో తెలుసుకోండి. బ్యాచిలర్స్ కూడా సులభంగా చేసుకునే ఈ సంప్రదాయ రెసిపీ మీ భోజనానికి ప్రత్యేక రుచిని అందిస్తుంది.

సీజన్ వచ్చేసింది.. అస్సలు వదలొద్దు.. చింత చిగురుతో ఆ సమస్యల చింతే ఉండదు..

సీజన్ వచ్చేసింది.. అస్సలు వదలొద్దు.. చింత చిగురుతో ఆ సమస్యల చింతే ఉండదు..

చింత చిగురులో విటమిన్ సి, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. కీళ్ల నొప్పులు, మధుమేహం, చర్మ సౌందర్యం, రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలోనూ చింత చిగురు ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఆరోగ్యమే మహాభాగ్యం.. చికెన్ తిన్న తర్వాత ఈ పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తినొద్దు..

ఆరోగ్యమే మహాభాగ్యం.. చికెన్ తిన్న తర్వాత ఈ పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తినొద్దు..

చికెన్ ప్రోటీన్ సమృద్ధిగా ఉండే పోషకాహారమైనప్పటికీ, దానిని తిన్న వెంటనే కొన్ని ఆహారాలను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు, అధిక చక్కెర కలిగిన స్వీట్లు, సిట్రస్ పండ్లు, నూనెలో వేయించిన స్నాక్స్‌ను చికెన్ తిన్న వెంటనే తీసుకోవడం వల్ల అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Dry Fish: ఎండు చేపలతో ఈ వ్యాధులకు బై బై చెప్పొచ్చు.. అలాంటి వారు మాత్రం తినకూడదు..

Dry Fish: ఎండు చేపలతో ఈ వ్యాధులకు బై బై చెప్పొచ్చు.. అలాంటి వారు మాత్రం తినకూడదు..

ఎండుచేపలు రుచికరమైన ఆహారమే కాకుండా కాల్షియం, ఫాస్ఫరస్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలతో ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచడం, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం, రక్తప్రసరణను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అయితే అధిక సోడియం కారణంగా గుండె జబ్బులు, రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవాలి.

హమ్మయ్య.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

హమ్మయ్య.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు అందింది. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణలోని మరిన్ని ప్రాంతాలకు కూడా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌తో పాటు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా వచ్చే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

Andhra Politics: ఆంధ్రా పాలిటిక్స్‌ గురూ.. టాపిక్ ఏదైనా టాప్ లేచిపోవాల్సిందే..!

Andhra Politics: ఆంధ్రా పాలిటిక్స్‌ గురూ.. టాపిక్ ఏదైనా టాప్ లేచిపోవాల్సిందే..!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమవుతోంది.. ఈ తరుణంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.

రైతన్నలకు అలర్ట్.. వర్షాలు పడే ముందు ఇలా చేస్తే భూసారం అమాంతం పెరుగుతుంది..

రైతన్నలకు అలర్ట్.. వర్షాలు పడే ముందు ఇలా చేస్తే భూసారం అమాంతం పెరుగుతుంది..

రుతుపవనాల రాకతో ఖరీఫ్ సీజన్‌కు రైతులు సిద్ధమవుతున్న వేళ, భూసారాన్ని పెంచేందుకు సహజ పద్ధతులను అనుసరించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం వల్ల నేల బలహీనపడి పంటలు తెగుళ్లకు గురవుతున్నాయని చెబుతున్నారు. పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువులు, జీవామృతం, ఘనజీవామృతం వంటి సేంద్రియ పద్ధతులు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని పేర్కొంటున్నారు.

వ్యాధుల సీజన్ వచ్చేస్తోంది.. ఇంట్లో ఈ ఒక్క మొక్క ఉంటే డాక్టర్ అవసరమే ఉండదు..!

వ్యాధుల సీజన్ వచ్చేస్తోంది.. ఇంట్లో ఈ ఒక్క మొక్క ఉంటే డాక్టర్ అవసరమే ఉండదు..!

వర్షాకాలం ప్రారంభంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు పెరిగే సమయంలో వాము ఆకు మొక్క సహజ ఔషధంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణశక్తిని మెరుగుపరచడం, గ్యాస్, అజీర్ణం సమస్యలను తగ్గించడం, శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం కలిగించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. వాము ఆకుల రసం, ఆవిరి పీల్చడం ద్వారా జలుబు, కఫం, ముక్కు దిబ్బడ తగ్గుతాయని చెబుతున్నారు.