Shaik Madar Saheb
Chief Sub-Editor, Politics, Hyper Local, Crime, Lifestyle, Health - TV9 Telugu
madarsaheb.shaik@tv9.comషేక్ మదార్ సాహెబ్, టీవీ9 తెలుగులో చీఫ్ సబ్-ఎడిటర్గా పనిచేస్తున్నాను. తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాలలో శిక్షణ పొంది 2016 నుంచి కెరీర్ను ప్రారంభించాను. గతంలో ఆంధ్రజ్యోతిలో సబ్ ఎటిటర్గా, జీ మీడియా (ఢిల్లీ) లో అసిస్టెంట్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా పనిచేశాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన పొలిటికల్, హైపర్ లోకల్, క్రైమ్, జాతీయం, అంతర్జాతీయం ఆర్టికల్స్ను అందిస్తాను. అలాగే హెల్త్, లైఫ్స్టైల్, ట్రెండింగ్, వైరల్కు సంబంధించిన ఆసక్తికర వార్తలను రాస్తాను.
దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్ రాకుండా చేసే ఇమ్యూనిటీ బూస్టర్.. ఈ కాలంలో డైలీ ఓ గ్లాస్ తాగండి..
వర్షాకాలంలో దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు, వైరల్ జ్వరాల నుంచి రక్షణ పొందేందుకు పాలు, బాదం, మిరియాలు, సొంటి, పసుపుతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఈ ఆరోగ్యకరమైన పానీయం ఎంతో ఉపయోగపడుతుంది. బాదంలో ఉన్న విటమిన్-ఈ, మిరియాలు, సొంటిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, పసుపులోని యాంటీసెప్టిక్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
- Shaik Madar Saheb
- Updated on: Jun 15, 2026
- 1:27 pm
వర్షాకాలం ఇవి రెండు ఇస్తే.. ఎండిపోయిన మల్లె చెట్టుకు కూడా పూలు విరగబూస్తాయ్
వర్షాకాలంలో మల్లె మొక్కలు పుష్కలంగా పూయాలంటే సరైన సంరక్షణతో పాటు పోషకాలు కూడా అవసరమని గార్డెనింగ్ నిపుణులు సూచిస్తున్నారు. గుడ్డు పెంకుల్లోని కాల్షియం వేర్లను బలోపేతం చేయగా, టీ పొడిలోని నైట్రోజన్ ఆకులను పచ్చగా ఉంచుతుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ మిశ్రమాన్ని వాడితే మల్లెతో పాటు విరజాజి, సన్నజాజి వంటి పూల మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరిగి ఎక్కువ పూలు పూస్తాయి.
- Shaik Madar Saheb
- Updated on: Jun 15, 2026
- 1:07 pm
జానూ ఎక్కడమ్మ.. ఏడు టవర్ల పరిధిలో 4,800 ఫోన్ కాల్స్పై ఫోకస్.. పవన్ ఆదేశాలతో రంగంలోకి హనుమాన్ టీమ్
కాకినాడ జిల్లా తుని మండలం దొండవాకలో అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు కొనసాగిస్తున్నారు. ఏడు సెల్ టవర్ల పరిధిలో నమోదైన 4,800 ఫోన్ కాల్స్ను విశ్లేషిస్తూ, అనుమానితులను విచారిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో అదనంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హనుమాన్ టీమ్ రంగంలోకి దిగగా, థర్మల్ డ్రోన్ల సహాయంతో తోటలు, కొండ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. చిన్నారి వెంట వెళ్లి తిరిగి వచ్చిన పెంపుడు శునకం మృతిపై కూడా ఫోరెన్సిక్ నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Jun 15, 2026
- 9:14 am
ఆసక్తికర పరిణామం.. ప్రధాని మోదీతో మీటింగ్.. సెల్ఫీతోపాటు దురంధర్ సాంగ్ పోస్ట్ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్లోని నైస్ నగరంలో నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ 2026 కార్యక్రమాన్ని ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో కలిసి ప్రారంభించారు. టెక్నాలజీ, ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, వాణిజ్య సహకారంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. ఈ సందర్భంగా భారత్ ప్రపంచానికి పరిష్కారాల కేంద్రంగా ఎదుగుతోందని ప్రధాని మోదీ పేర్కొనగా, 21వ శతాబ్దంలో భారతదేశం కీలక ప్రపంచ శక్తిగా అవతరించిందని మాక్రాన్ ప్రశంసించారు. ప్రధాని మోదీతో మాక్రాన్ తీసుకున్న సెల్ఫీ, 'ధురంధర్' చిత్రంలోని పాటను ఉపయోగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
- Shaik Madar Saheb
- Updated on: Jun 15, 2026
- 7:59 am
యుద్ధం ముగిసింది.. ఇంజన్లు స్టార్ట్ చేయండి.. ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు ధరలు
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు, అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 84 డాలర్లకు, డబ్ల్యూటీఐ ధర 80 డాలర్లకు చేరింది.
- Shaik Madar Saheb
- Updated on: Jun 15, 2026
- 7:04 am
కుక్క పోస్టుమార్టం రిపోర్ట్లో ఏం తేలనుంది.. జాహ్నవి కోసం రంగంలోకి పవన్ కల్యాణ్..
కాకినాడ జిల్లా తునిలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసు రోజురోజుకూ మిస్టరీగా మారుతోంది. ఎనిమిది రోజులుగా పాప ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు, స్థానికులు విస్తృతంగా గాలిస్తున్నారు. కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క మృతి చెందడంతో దానికి పోస్టుమార్టం నిర్వహించగా, నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Jun 14, 2026
- 2:13 pm
మటన్లోని ఈ పార్ట్ పోషకాల గని.. మద్యం తాగేటప్పుడు తింటే ఏమవుతుందో తెలుసా..?
మటన్ లివర్లో ఐరన్, ప్రోటీన్, విటమిన్ A, విటమిన్ B12, జింక్ వంటి కీలక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత నివారణ, కండరాల బలోపేతం, రోగనిరోధక శక్తి పెంపుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇందులో కొలెస్ట్రాల్ అధికంగా ఉండటంతో మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మద్యంతో కలిపి తినడం వల్ల కాలేయంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Jun 15, 2026
- 7:02 am
సకల దరిద్రాలను పోగొట్టే అరుదైన అమావాస్య.. ఆదివారం ఈ సమయంలో పూజలు చేస్తే తిరుగుండదు..
అధికమాసంలో ఆదివారంతో కూడిన అమావాస్య తిథి అత్యంత అరుదైనది.. విశేష శక్తి కలిగినది. శాస్త్రాల ప్రకారం, ఈ రోజు చేసే స్నానం సూర్యగ్రహణ స్నానంతో సమానమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే, కొద్దిగా జపం చేసినా అనంతమైన, అక్షయమైన ఫలితాలు కలుగుతాయని చెప్పబడింది. ఆదివారం అమావాస్యను "సిద్ధయోగం" అని కూడా వ్యవహరిస్తారు. ఈ రోజు చేసే సాధనలు జీవితంలో గొప్ప మలుపులు తెచ్చిపెడతాయి.
- Shaik Madar Saheb
- Updated on: Jun 14, 2026
- 12:17 pm
అమ్మమ్మల కాలంనాటి చికెన్ పులుసు రహస్యం.. ఇలా చేస్తే అస్సలు విరిగిపోకుండా.. ముక్క కూడా మెత్తగా..
ఆదివారం అంటే నాన్వెజ్ ప్రియులకు పండుగే. చికెన్తో ఎన్నో వంటకాలు చేసినా, నాటుకోడి లేదా బ్రాయిలర్ చికెన్తో చేసే పులుసు రుచికి ప్రత్యేక స్థానం ఉంటుంది. సరైన మసాలాలు, కాల్చిన ఎండుకొబ్బరి, జీడిపప్పు, ధనియాలు, యాలకులు, లవంగాలతో తయారుచేసే ఈ చికెన్ పులుసు అన్నం, బగారా రైస్, జీరా రైస్, చపాతీతో అద్భుతంగా ఉంటుంది.
- Shaik Madar Saheb
- Updated on: Jun 14, 2026
- 11:11 am
హమ్మయ్య.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటంతో పాటు ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు పిడుగులు, ఈదురుగాలుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jun 14, 2026
- 7:42 am
Gold Rates: బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో గోల్డ్ రేట్ తులం ఎంతుందంటే..
బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. భారీగా పెరిగిన తర్వాత పసిడి, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, డిమాండ్ తో గతంలో ఎన్నడూ లేని విధంగా పది గ్రాములు లక్షా 70 వేల వరకు పెరిగింది. ప్రస్తుతం లక్షా 49 వేల వరకు ఉంది. పెరిగిన అనంతరం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.
- Shaik Madar Saheb
- Updated on: Jun 14, 2026
- 6:41 am
మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తుండటంతో వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
- Shaik Madar Saheb
- Updated on: Jun 13, 2026
- 2:04 pm