Shaik Madar Saheb
Chief Sub-Editor, Politics, Hyper Local, Crime, Lifestyle, Health - TV9 Telugu
madarsaheb.shaik@tv9.comషేక్ మదార్ సాహెబ్, టీవీ9 తెలుగులో చీఫ్ సబ్-ఎడిటర్గా పనిచేస్తున్నాను. తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాలలో శిక్షణ పొంది 2016 నుంచి కెరీర్ను ప్రారంభించాను. గతంలో ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్గా, జీ మీడియా (ఢిల్లీ) లో అసిస్టెంట్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా, సీనియర్ కంటెంట్ రైటర్గా పనిచేశాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన పొలిటికల్, హైపర్ లోకల్, క్రైమ్, జాతీయం, అంతర్జాతీయం ఆర్టికల్స్ను అందిస్తాను. అలాగే లైఫ్స్టైల్, హెల్త్, ట్రెండింగ్, వైరల్కు సంబంధించిన ఆసక్తికర వార్తలను రాస్తాను.
Nepal Floods: నేపాల్ శిథిల చిత్రం.. ప్రపంచాన్ని కదిలించిన విచలిత దృశ్యం..
భారీ వరదలతో అతలాకుతలమైన నేపాల్ను మరో ముప్పు వెంటాడుతోంది. హిమనదం కూలిపోవడంతో ఏర్పడిన వరదల తర్వాత నేపాల్–టిబెట్ సరిహద్దులో కొత్తగా ఏర్పడిన నీటి సరస్సు పొంగిపొర్లుతుండటంతో మరోసారి ఫ్లాష్ఫ్లడ్ ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే వందలాది మంది మృతి చెందగా, భారీ సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. రెస్క్యూ బృందాలు సైతం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి
- Shaik Madar Saheb
- Updated on: Aug 28, 2026
- 9:40 pm
వాల్మీకీ కుంభకోణంలో ఆరోపణలు.. కాంగ్రెస్ మంత్రి నాగేంద్ర రాజీనామా..
వాల్మీకి అభివృద్ధి సంస్థలో నిధుల దుర్వినియోగం ఆరోపణలు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ మంత్రి బి. నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. ఆరోపణలు రావడంతో ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ఆదివాసీ వర్గానికి చెందిన తనను బీజేపీ టార్గెట్ చేసిందని ఆరోపించారు నాగేంద్ర. సీబీఐ, ఈడీ సంస్థలతో వేధిస్తున్నారని కంటతడి పెట్టారు.
- Shaik Madar Saheb
- Updated on: Aug 28, 2026
- 8:59 pm
పాయసం చిక్కబడుతోందా..? ఈ ఒక్క టిప్ పాటిస్తే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ! అస్సలు మర్చిపోలేరు..
పండుగలు, శుభకార్యాల సమయంలో సులభంగా చేసుకునే స్వీట్లలో సేమియా పాయసం ప్రత్యేకమైనది. అయితే పాయసం మరీ చిక్కగా కాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో రావాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటించాలి. సేమియాను నెయ్యిలో లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించి, మరిగించిన పాలు, నీటితో ఉడికించి.. పంచదార, యాలకుల పొడి, కుంకుమపువ్వు, డ్రై ఫ్రూట్స్ జోడిస్తే కమ్మటి రుచితో సేమియా పాయసం సిద్ధమవుతుంది.
- Shaik Madar Saheb
- Updated on: Aug 28, 2026
- 6:19 pm
పాతకాలం నాటి నల్ల బంగారం.. మిరియాల రసం ఇలా తాగరంటే జలుబు, దగ్గు దెబ్బకు పరార్..
మిరియాలు మన వంటింట్లో ఉండే ముఖ్యమైన మసాలాల్లో ఒకటి. ముఖ్యంగా వర్షాకాలంలో మిరియాల చారు తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతు గరగర వంటి సమస్యల్లో ఉపశమనం కలగవచ్చని చెబుతారు. మిరియాల్లోని పైపెరిన్తో పాటు పలు పోషకాలు, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఆహారంలో మితంగా మిరియాల పొడి చేర్చుకోవడం జీర్ణక్రియకు తోడ్పడవచ్చు. అయితే అధికంగా తీసుకుంటే కడుపులో మంట లేదా అసౌకర్యం కలిగే అవకాశం ఉండటంతో పరిమితంగా తీసుకోవడం మంచిది.
- Shaik Madar Saheb
- Updated on: Aug 28, 2026
- 6:01 pm
Chicken: కోడి కూర నీచు వాసన లేకుండా కమ్మగా రావాలంటే ఇలా చేయండి.. పాతకాలం నాటి స్టైల్..
చికెన్ కూర వండినప్పుడు నీచు వాసన వస్తోందా? గ్రేవీ కూడా చిక్కగా, రుచిగా రావడం లేదా? అయితే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. చికెన్ను పసుపుతో శుభ్రం చేసి, ముందుగా నూనెలో బాగా వేయించి, ఉల్లిపాయ-అల్లం వెల్లుల్లి మసాలాలను పచ్చివాసన పోయేలా మగ్గిస్తే కమ్మటి రుచి వస్తుంది. చివర్లో సరైన మోతాదులో మసాలాలు, నీళ్లు వేసి ఉడికిస్తే అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే చికెన్ కర్రీ సిద్ధమవుతుంది.
- Shaik Madar Saheb
- Updated on: Aug 28, 2026
- 4:27 pm
తులసి మొక్క పచ్చగా, గుబురుగా పెరగాలంటే ఇది ఒక చెంచా ఇవ్వండి.. అస్సలు తిరుగుండదు..
తులసి మొక్క పచ్చగా, ఆరోగ్యంగా, గుబురుగా పెరగాలంటే సరైన మట్టి, డ్రైనేజీ, సూర్యరశ్మి, నీటిపారుదలతో పాటు క్రమం తప్పకుండా ప్రూనింగ్ చేయడం ఎంతో ముఖ్యం. ప్రతి 15 రోజులకు సాఫ్ట్ ప్రూనింగ్, డెడ్ హెడ్డింగ్ చేయడంతో పాటు సేంద్రీయ ఎరువులు ఉపయోగిస్తే తులసి మొక్క దట్టంగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే అధికంగా నీరు పోయడం, తీవ్రమైన ఎండలో ఉంచడం వంటి తప్పులను నివారించాలి.
- Shaik Madar Saheb
- Updated on: Aug 28, 2026
- 3:15 pm
హిమగిరుల్లో ప్రళయం.. వేల బతుకులు నేలమట్టం.. రాకాసి ముప్పెనకు అసలు కారణమేంటి?
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భారీ వరదలు హిమాలయాల్లో పెరుగుతున్న విపత్తు ముప్పును మరోసారి బయటపెట్టాయి. గ్లేషియర్లు కరగడం, హిమ సరస్సులు విస్తరించడం, మంచు-కొండచరియలు విరిగిపడటం, ఆకస్మికంగా నదులు ఉప్పొంగడం వంటి కారణాలు ఫ్లాష్ ఫ్లడ్స్కు దారితీస్తున్నాయి. భోటేకోషి, త్రిశూలి నదీ లోయల్లో జరిగిన విధ్వంసం నేపథ్యంలో సిక్కిం, అరుణాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లడఖ్తో పాటు పశ్చిమ బెంగాల్, అసోం వంటి ప్రాంతాలకూ భవిష్యత్తులో ముప్పు ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Aug 27, 2026
- 10:00 pm
Vijayawada: ప్రేమించింది.. పెళ్లి చేసుకోమంటూ వెంటపడింది.. పాపం ఆ ప్రియుడు..
విజయవాడలో ప్రేమ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి నేరుగా తన ప్రియుడు సాయి చందు వద్దకు వెళ్లి వెంటనే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదని అతడు చెప్పడంతో ఆమెను రైల్వే స్టేషన్కు తీసుకెళ్లాడు.
- Shaik Madar Saheb
- Updated on: Aug 27, 2026
- 9:02 pm
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం..
హైదరాబాద్ నగర ప్రజలకు జలమండలి కీలక అలర్ట్ జారీ చేసింది. బండ్లగూడ ఎక్స్ రోడ్ వద్ద బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనుల నేపథ్యంలో కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్–III రింగ్ మెయిన్–I పరిధిలో 24 గంటల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.
- Shaik Madar Saheb
- Updated on: Aug 27, 2026
- 8:08 pm
ఇదొక్కటి వేస్తే ఎంత ముదురు మటన్ అయినా.. ఇట్టే మెత్తగా ఉడికిపోయిద్ది..
మటన్ వండేటప్పుడు ముక్కలు మెత్తగా ఉడకకపోవడం, గ్రేవీ రుచిగా రాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయా? అయితే కొన్ని సింపుల్ కిచెన్ టిప్స్ పాటిస్తే ముదురు మటన్ కూడా మెత్తగా, రుచికరమైన గ్రేవీతో తయారవుతుంది. పచ్చి బొప్పాయి పేస్ట్, సరైన మసాలాలు, మటన్ను ముందుగా మగ్గించడం వంటి చిట్కాలతో ఇంట్లోనే నోరూరించే మటన్ కర్రీని సులభంగా తయారు చేసుకోవచ్చు.
- Shaik Madar Saheb
- Updated on: Aug 27, 2026
- 8:20 pm
పక్కా పల్లెటూరి స్టైల్లో నోరూరించే కమ్మనైన గోంగూర పచ్చడి.. చివరకు అదే హైలెట్..
ఆంధ్రుల ఆహార సంస్కృతిలో గోంగూర పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది. గోంగూర, టమాటాలు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, వెల్లుల్లి, ఉల్లిపాయలతో పల్లెటూరి స్టైల్లో ఈ పచ్చడిని సులభంగా తయారు చేసుకోవచ్చు.
- Shaik Madar Saheb
- Updated on: Aug 27, 2026
- 5:11 pm
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాలకు రెయిన్ అలర్ట్..
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
- Shaik Madar Saheb
- Updated on: Aug 27, 2026
- 3:48 pm