Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్

ఐపీఎల్

IPL అనేది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్. ఈ లీగ్ BCCI రిచ్ లీగ్‌గా పేరుగాంచింది. ఇది భారత క్రికెట్‌నే కాకుండా ప్రపంచ క్రికెట్‌ పరిస్థితి, దిశను మార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

IPL మొదటి సీజన్ 2008లో జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ లీగ్ నిర్వహిస్తున్నారు. ఐపీఎల్‌లో మొత్తం 10 జట్లు ఆడుతున్నాయి. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాల్గొంటున్నాయి.

ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక సార్లు ఐపీఎల్‌ను గెలుచుకున్నాయి. ఈ రెండు జట్లు తలో 5 సార్లు ట్రోఫీని అందుకున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ టోర్నీని రెండుసార్లు గెలుచుకుంది. కాగా, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఒకసారి గెలిచాయి. ఇంతకు ముందు డెక్కన్ ఛార్జర్స్ జట్టు కూడా ఒకసారి ఐపీఎల్‌ను గెలుచుకుంది. అయితే, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా ఈ టైటిల్ దక్కించుకోలేకపోయింది.

IPL ప్రతి సీజన్‌కు ముందు, ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి వేలం నిర్వహిస్తారు. అందులో జట్లు ఆటగాళ్ల కోసం వేలంలో పాల్గొంటాయి. IPL ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి మే వరకు జరుగుతుంది. మ్యాచ్‌లు భారతదేశంలోని అనేక నగరాల్లో నిర్వహిస్తుంటారు.

ఐపీఎల్‌ ప్రత్యేకత ఏమిటంటే, ఈ లీగ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లు పాల్గొనడం. అయితే, ఇందులో పాల్గొనేందుకు పాక్ ఆటగాళ్లకు అనుమతి లేదు. భారత్‌పై పాకిస్థాన్ చేస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలే ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది.

ఇంకా చదవండి

IPL 2025: హైదరాబాద్‌లో SRH, లక్నో మధ్య మ్యాచ్‌.. మోత మోగించనున్న తమన్

ఉప్పల్ స్టేడియంలో తమన్ మ్యూజికల్ ఈవెంట్. అది కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ - లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌కి ముందు. క్రికెట్ ఫ్యాన్స్‌కి డబుల్ కిక్ అన్నమాట. మరికొన్ని గంటల్లో జరిగే మ్యూజిక్ విత్ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

IPL 2025: పోటుగాడురా పంత్.! డకౌట్‌లోనూ డబ్బుల సంపాదనే.. మ్యాచ్‌కు ఎన్ని కోట్లంటే.?

లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్ మొదటి మ్యాచ్ లో ఓటమి పాలైంది. రిషభ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరించిన ఈ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది. మొదటి మ్యాచ్ లో డకౌట్ అయినా.. రిషభ్ పంత్ ఒక్కో మ్యాచ్ సంపాదన ఎంతంటే..

ఛాంపియన్స్‌ ట్రోఫీ సెలెక్షన్‌.. డైరెక్ట్‌గా రోహిత్‌ శర్మపై సిరాజ్‌ కామెంట్స్‌! ఏమన్నాడంటే..?

చాంపియన్స్ ట్రోఫీలో ఎంపిక కాలేకపోవడంపై మొహమ్మద్ సిరాజ్ స్పందిస్తూ, రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం సరైనదేనని అన్నారు. దుబాయ్ పిచ్‌లకు అనుగుణంగా జట్టును ఎంపిక చేశారని తెలిపారు. ఐపీఎల్‌లో సిరాజ్ అద్భుత ప్రదర్శన చేసి, భవిష్యత్తు సిరీస్‌లలో టీమిండియాకు తిరిగి రాగలడా అనేది చూడాలి. రోహిత్ శర్మ సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడానికి కారణాలను వివరించారు.

  • SN Pasha
  • Updated on: Mar 26, 2025
  • 1:36 pm

IPL 2025: ఆ టీమ్‌కు షాక్‌.. పిచ్‌ మార్చమని అడిగిన కెప్టెన్‌! ఛల్‌.. నేను మార్చను పో అన్న పిచ్‌ క్యూరేటర్‌!

ఐపీఎల్ 2025లో ఆర్సీబీతో ఓడిన తర్వాత, కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానె ఏడెన్ గార్డెన్స్ పిచ్ మార్పు కోసం విజ్ఞప్తి చేశాడు. అయితే, పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ ఈ వినతిని తిరస్కరించాడు. పిచ్ స్వభావాన్ని మార్చేందుకు అనుమతి లేదని, 2015 నుండి పిచ్ ఇదే స్థితిలో ఉందని ఆయన తెలిపారు.

  • SN Pasha
  • Updated on: Mar 26, 2025
  • 1:03 pm

Ashutosh Sharma: అడ్డిగుడ్డి బ్యాటింగ్‌.. వీడికి ఆటే రాదని అవమానించారు! సంచలన నిజాలు వెల్లడించిన హెడ్‌ కోచ్‌

ఐపీఎల్ 2025లో అశుతోష్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి మ్యాచ్‌లోనే 31 బంతుల్లో 66 పరుగులు సాధించి ఢిల్లీని విజయం సాధించేలా చేశాడు. అయితే రంజీ ట్రోఫీలో ముందు సెలెక్టర్లు అవకాశం ఇవ్వలేదు, బ్యాటింగ్ తెలియదని కూడా అన్నారు. కానీ, అశుతోష్ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. రైల్వేస్ జట్టు కోసం రంజీ ట్రోఫీలో సెంచరీ సాధించాడు.

  • SN Pasha
  • Updated on: Mar 26, 2025
  • 12:08 pm

Chahal Dhanashree: ముంబైలో వేరే కాపురం..! చాహల్‌-ధనశ్రీ విడాకులకు కారణమైన సంచలన నిజం!

యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులకు నిజ కారణం ముంబైలో నివాసం విషయంలో వచ్చిన విభేదాలేనని తెలుస్తోంది. ధనశ్రీ ముంబైలో కాపురం పెట్టుకోవాలని కోరుకున్నా, చాహల్ హర్యానాలో తల్లిదండ్రులతో ఉండాలని నిర్ణయించుకోవడంతో వారి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఈ వివాదం చివరకు విడాకులకు దారితీసింది.

  • SN Pasha
  • Updated on: Mar 26, 2025
  • 11:57 am

PBKS vs GT: మ్యాక్స్‌వెల్‌కు పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ క్షమాపణలు! కారణం ఏంటంటే..?

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించాడు. అయితే, సాయి సుదర్శన్ క్యాచ్ డ్రాప్ చేయడంతో గ్లెన్ మ్యాక్స్ వెల్ కి క్షమాపణ చెప్పాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • SN Pasha
  • Updated on: Mar 26, 2025
  • 10:44 am

IPL 2025: 16 బంతుల్లో 44 రన్స్‌తో దుమ్మురేపాడు.. కానీ, సొంత టీమ్‌ ఫ్యాన్స్‌ నుంచి పచ్చి బూతులు! ఎందుకంటే..?

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. శశాంక్ సింగ్ 16 బంతుల్లో 44 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేసే అవకాశాన్ని ఇవ్వకపోవడంతో అభిమానులు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. శశాంక్ అయితే తనకు స్ట్రైక్ అవసరమని, అయ్యర్ అలా చెప్పాడని స్పష్టం చేశాడు.

  • SN Pasha
  • Updated on: Mar 26, 2025
  • 10:13 am

IPL 2025: ఒక్క వికెట్‌ కూడా తీయకుండానే పంజాబ్‌ను గెలిపించాడు! వీడు మామూలోడు కాదు..

ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్‌పై గెలిచింది. విజయ్ కుమార్ వైశాఖ్ అనే ఇంపాక్ట్ ప్లేయర్, తన అద్భుత బౌలింగ్ తో గుజరాత్‌ను 15, 17 ఓవర్లలో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి అదుపులో ఉంచాడు. అతని కీలక పాత్ర వలన పంజాబ్ విజయం సాధించింది. అయితే అతను ఒక్క వికెట్ తీయలేదు.

  • SN Pasha
  • Updated on: Mar 26, 2025
  • 9:13 am

MS Dhoni: IPLలో ఆ రూల్‌ అవసరం లేదు.. ధోని షాకింగ్‌ కామెంట్స్‌! నేను అలాంటి ప్లేయర్‌ను కాదంటూ..

ఐపీఎల్ లోని కొత్త ఇంపాక్ట్ ప్లేయర్ నియమం గురించి మహేంద్ర సింగ్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రారంభంలో ఈ నియమం అవసరం లేదని భావించినప్పటికీ, ఇది ఆటలో పెను మార్పులు తీసుకొచ్చిందని అంగీకరించాడు. ఈ నియమం వల్ల అధిక స్కోర్లు నమోదు అవుతున్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నప్పటికీ, ధోని ఆటగాళ్ళ ఆక్రమణాత్మకతే దానికి కారణమని అభిప్రాయపడ్డాడు.

  • SN Pasha
  • Updated on: Mar 26, 2025
  • 8:43 am