AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ 2026

ఐపీఎల్ 2026

IPL అనేది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్. ఈ లీగ్ BCCI రిచ్ లీగ్‌గా పేరుగాంచింది. ఇది భారత క్రికెట్‌నే కాకుండా ప్రపంచ క్రికెట్‌ పరిస్థితి, దిశను మార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

IPL మొదటి సీజన్ 2008లో జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ లీగ్ నిర్వహిస్తున్నారు. ఐపీఎల్‌లో మొత్తం 10 జట్లు ఆడుతున్నాయి. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాల్గొంటున్నాయి.

ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక సార్లు ఐపీఎల్‌ను గెలుచుకున్నాయి. ఈ రెండు జట్లు తలో 5 సార్లు ట్రోఫీని అందుకున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ టోర్నీని రెండుసార్లు గెలుచుకుంది. కాగా, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఒక్కసారి ట్రోఫీని ముద్దాడాయి. ఇంతకు ముందు డెక్కన్ ఛార్జర్స్ జట్టు కూడా ఒకసారి ఐపీఎల్‌ను గెలుచుకుంది.

IPL ప్రతి సీజన్‌కు ముందు, ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి వేలం నిర్వహిస్తారు. అందులో జట్లు ఆటగాళ్ల కోసం వేలంలో పాల్గొంటాయి. IPL ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి మే వరకు జరుగుతుంది. మ్యాచ్‌లు భారతదేశంలోని అనేక నగరాల్లో నిర్వహిస్తుంటారు.

ఐపీఎల్‌ ప్రత్యేకత ఏమిటంటే, ఈ లీగ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లు పాల్గొనడం. అయితే, ఇందులో పాల్గొనేందుకు పాక్ ఆటగాళ్లకు అనుమతి లేదు. భారత్‌పై పాకిస్థాన్ చేస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలే ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది.

ఇంకా చదవండి

MI vs RCB : హార్దిక్ అవుట్.. సూర్య ఇన్.. రాయ్‌పూర్ పోరులో ముంబై కొత్త ప్లాన్

MI vs RCB : ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌కు ముందు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌నెస్‌పై ముంబై కీలక అప్‌డేట్ ఇచ్చింది. సూర్య జట్టులోకి వస్తుండగా హార్దిక్ రాకపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముంబై రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పరిస్థితి మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉంది.

  • Rakesh
  • Updated on: May 10, 2026
  • 8:54 am

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ గర్ల్‌ఫ్రెండ్ దొరికేసింది.. 15 ఏళ్లకే డేటింగ్ మొదలెట్టేశాడా?

Vaibhav Suryavanshi : గత కొద్ది రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో వైభవ్ ఒక అమ్మాయితో కలిసి ఉన్నట్లు కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల్లో వైభవ్‌కు ఉన్న క్రేజ్ చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ క్రమంలోనే వైభవ్ గర్ల్‌ఫ్రెండ్ ఎవరు? అనే ప్రశ్న గూగుల్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

  • Rakesh
  • Updated on: May 10, 2026
  • 8:29 am

IPL 2026 Points Table : ఉత్కంఠగా సాగుతున్న ప్లే ఆఫ్ పోరు.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి గుజరాత్ టైటాన్స్

IPL 2026 Points Table : ఒక్క గెలుపుతో ఐదో స్థానం నుంచి నేరుగా టాప్-2 లోకి దూసుకెళ్లి, ప్లే ఆఫ్ రేసులో ఉన్న ఇతర జట్లకు గుజరాత్ షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ ఇప్పుడు మూడో స్థానానికి పరిమితమైంది.

  • Rakesh
  • Updated on: May 10, 2026
  • 7:47 am

Vaibhav Suryavanshi : ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ!

Vaibhav Suryavanshi : కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రతిభను కనబరుస్తూ వేగంగా వంద సిక్సర్ల మైలురాయిని చేరుకుని వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు 817 బంతులతో ఉన్నప్పటికీ, వైభవ్ దానిని దాదాపు 300 బంతుల ముందే అధిగమించాడు.

  • Rakesh
  • Updated on: May 10, 2026
  • 7:14 am

Honey Trap IPL 2026 : హనీట్రాప్ నిజమేనా? ఒకే ఓవర్‌లో 11 బంతులు వేసిన ఆర్చర్.. షాక్‌లో ఫ్యాన్స్

Honey Trap IPL 2026 : ఆటగాళ్లపై వస్తున్న ఈ హనీట్రాప్ ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికే అప్రమత్తమైంది. లీగ్ సమగ్రతను కాపాడేందుకు 8 పేజీల కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. టీమ్ మేనేజర్ అనుమతి లేకుండా హోటల్ గదుల్లోకి అపరిచితులు రాకుండా నిషేధం విధించింది.

IPL 2026 : అర్ష్‌దీప్ సింగ్‌పై పంజాబ్ కింగ్స్ సీరియస్.. డ్రెస్సింగ్ రూమ్ రహస్యాల లీక్‌పై అత్యవసర సమావేశం

IPL 2026 : పంజాబ్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడైన అర్ష్‌దీప్ సింగ్‌కు సోషల్ మీడియాలో ఆరు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన తరచుగా డ్రెస్సింగ్ రూమ్, మైదానంలోని దృశ్యాలను వీడియోల రూపంలో తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తూ ఉంటారు.

ఐపీఎల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న కిలాడీలు.. అసలు వీరు వాడిన టెక్నిక్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఐపీఎల్ అంటే కేవలం పరుగుల వరద, వికెట్ల వేట మాత్రమే కాదు.. అదో భారీ వ్యాపార సామ్రాజ్యం. ఈ క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకుని కొందరు అక్రమార్కులు సామాన్య అభిమానులను మోసం చేయడం చూస్తూనే ఉంటాం. కానీ, ఏకంగా దేశ అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల పేర్లనే వాడుకుని, క్రికెట్ బోర్డులనే బురిడీ కొట్టించిన ఒక భారీ స్కామ్ ఇప్పుడు హైదరాబాద్‌లో కలకలం రేపింది.

RR vs GT : రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్.. రియాన్ పరాగ్ దూరం.. కెప్టెన్‌గా యువ సంచలనం యశస్వి జైస్వాల్

RR vs GT : రియాన్ పరాగ్ అందుబాటులో లేకపోవడంతో యాజమాన్యం యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌పై నమ్మకం ఉంచింది. టాస్ గెలిచిన అనంతరం జైస్వాల్ మాట్లాడుతూ, కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం పట్ల ఉత్సాహం వ్యక్తం చేశాడు. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 12 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉంది.

​India T20 Squad : ఆర్‌సీబీ నుంచి నలుగురు.. చెన్నై నుంచి ఒకరే.. టీమిండియా జట్టు ఇదే

​India T20 Squad : ​అశ్విన్ ఎంపిక చేసిన ఈ జట్టులో ఆశ్చర్యకరంగా బెంగళూరు జట్టు నుంచి నలుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. అయితే, అశ్విన్ సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ నుంచి కేవలం ఒక్క ఆటగాడిని మాత్రమే ఎంపిక చేయడం గమనార్హం.

ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా.. కెప్టెన్‌గా బ్యాడ్‌లక్కోడు.. ఆ స్టార్ ప్లేయర్లపై వేటు?

ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు ఆయిర్లాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. జూన్ నెలలో జరగనున్న ఈ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సెలక్షన్ కమిటీ వినూత్న నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ, యువ రక్తాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా 15 మంది సభ్యులతో కూడిన జట్టును సిద్ధం చేసినట్లు సమాచారం.

నికోలస్ పూరన్ గొడవకు అసలు కారణం ఇదా.. బాంబ్ పేల్చిన కృణాల్ పాండ్యా..!

Krunal Pandya Nicholas Pooran Fight: ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆటగాళ్ల మధ్య గొడవ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా కృణాల్ పాండ్యా, నికోలస్ పూరన్ మధ్య చోటుచేసుకున్న సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే, ఈ గొడవపై కృణాల్ స్పందిస్తూ అసలు నిజాన్ని వెల్లడించి అభిమానుల అనుమానాలను పటాపంచలు చేశాడు.

టీమిండియా టీ20 కెప్టెన్సీలో భారీ మార్పు.. సూర్యకు షాక్.. కొత్త సారథిగా ఎవరంటే?

భారత టీ20 క్రికెట్‌లో కొత్త శకం ప్రారంభం కాబోతోంది. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల కోసం భారత జట్టు సారథ్య బాధ్యతల్లో కీలక మార్పులు చేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోవడంతో, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శామ్సన్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం భారత క్రికెట్ భవిష్యత్తును మార్చేలా ఉంది.