![ఐపీఎల్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/01/whatsapp-image-2023-12-18-at-1336521.jpeg)
ఐపీఎల్
IPL అనేది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్. ఈ లీగ్ BCCI రిచ్ లీగ్గా పేరుగాంచింది. ఇది భారత క్రికెట్నే కాకుండా ప్రపంచ క్రికెట్ పరిస్థితి, దిశను మార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
IPL మొదటి సీజన్ 2008లో జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ లీగ్ నిర్వహిస్తున్నారు. ఐపీఎల్లో మొత్తం 10 జట్లు ఆడుతున్నాయి. ఈ లీగ్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాల్గొంటున్నాయి.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక సార్లు ఐపీఎల్ను గెలుచుకున్నాయి. ఈ రెండు జట్లు తలో 5 సార్లు ట్రోఫీని అందుకున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ ఈ టోర్నీని రెండుసార్లు గెలుచుకుంది. కాగా, గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఒకసారి గెలిచాయి. ఇంతకు ముందు డెక్కన్ ఛార్జర్స్ జట్టు కూడా ఒకసారి ఐపీఎల్ను గెలుచుకుంది. అయితే, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా ఈ టైటిల్ దక్కించుకోలేకపోయింది.
IPL ప్రతి సీజన్కు ముందు, ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి వేలం నిర్వహిస్తారు. అందులో జట్లు ఆటగాళ్ల కోసం వేలంలో పాల్గొంటాయి. IPL ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి మే వరకు జరుగుతుంది. మ్యాచ్లు భారతదేశంలోని అనేక నగరాల్లో నిర్వహిస్తుంటారు.
ఐపీఎల్ ప్రత్యేకత ఏమిటంటే, ఈ లీగ్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లు పాల్గొనడం. అయితే, ఇందులో పాల్గొనేందుకు పాక్ ఆటగాళ్లకు అనుమతి లేదు. భారత్పై పాకిస్థాన్ చేస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలే ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది.
IPL 2025: ఆ ముగ్గురి దెబ్బకు డిప్రెషన్లోకి ముంబై ఫ్రాంచైజీ.. వదులుకోలేరు, నిలుపుకోలేరు.. ఇదెక్కడి తలనొప్పి..
IPL 2025: ఈసారి IPL మెగా వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వవచ్చు. కానీ, ఈ ఎంపిక కోసం కొంత మొత్తం నిర్ణయించనున్నారు. ఇందులో మొత్తం నలుగురిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఉన్న ముంబై ఇండియన్స్ ఎవరిని రిటైన్ చేస్తుందనేది ఇప్పుడు క్యూరియాసిటీగా మారింది.
- Venkata Chari
- Updated on: Jul 24, 2024
- 12:02 pm
IPL 2025: రీ ఎంట్రీకి సిద్ధమైన ప్రపంచకప్ విజేత.. ఛాంపియన్ జట్టులోకి ఆగయా?
Yuvraj Singh: టీమ్ ఇండియాకు 2 ప్రపంచకప్లు అందించడంలో కీలక పాత్ర పోషించిన సిక్సర్ కింగ్ యువరాజ్ సింగ్ ఇప్పుడు ఐపీఎల్లో పునరాగమనం చేయబోతున్నాడు. మీడియా కథనాల ప్రకారం, యువరాజ్ సింగ్ గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్ కావచ్చని సమాచారం.
- Venkata Chari
- Updated on: Jul 24, 2024
- 8:42 am
IPL 2025: కేకేఆర్కి కాదు.. కోచ్గా ద్రవిడ్ ఏ జట్టుతో జర్నీ చేయనున్నాడో తెలుసా?
Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ గురించి కీలక న్యూస్ బయటకు వస్తోంది. ఈ వార్త అతని కొత్త పాత్రకు సంబంధించినది. టీమిండియాతో పదవీకాలం ముగిసిన తర్వాత.. ఇప్పుడు తాను నిరుద్యోగిగా ఉన్నానని, కొత్త ఉద్యోగం కావాలని రాహుల్ ద్రవిడ్ చేసిన ప్రకటన చాలా చర్చనీయాంశమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనపై పలు ఊహాగానాలు వచ్చాయి. కేకేఆర్లో చేరవచ్చని కూడా వార్తలు వచ్చాయి. కానీ, తాజా నివేదిక తర్వాత ఆ ఊహాగానాలన్నింటికీ తెరపడినట్లే.
- Venkata Chari
- Updated on: Jul 23, 2024
- 1:25 pm
IPL 2025: మెగా వేలానికి ముందే ముగ్గురు కెప్టెన్లకు షాక్.. గుడ్బై చెప్పనున్న ఫ్రాంచైజీలు.. లిస్టులో షాకింగ్ ప్లేయర్
IPL చివరి మెగా వేలం 2022 సీజన్కు ముందు జరిగింది. ఆ సమయంలో అనేక జట్లు కొత్త కెప్టెన్లను నియమించాయి. అయితే, దీని తర్వాత, తదుపరి 3 సీజన్లలో పెద్దగా మార్పు కనిపించలేదు. కానీ, ఈసారి ఈ కెప్టెన్లను విడుదల చేయవచ్చు అని తెలుస్తోంది. వారిలో కొందరు మంచి వ్యక్తిగత ప్రదర్శనతో ఆకట్టుకున్న వారు కూడా ఉన్నారు. కానీ, వారి నాయకత్వంలో జట్టు విజయవంతం కాలేదు.
- Venkata Chari
- Updated on: Jul 22, 2024
- 12:49 pm
LPL 2024: 34 బంతుల్లో 241 స్ట్రైక్రేట్.. 8 ఫోర్లు, 6 సిక్సర్లతో ప్రీతి జింటా ఫేవరేట్ ప్లేయర్ ఊచకోత..
Galle Marvels vs Jaffna Kings: లంక ప్రీమియర్ లీగ్ 2024 చివరి మ్యాచ్ కొలంబోలో గాలె మార్వెల్స్, జాఫ్నా కింగ్స్ మధ్య జరిగింది. జులై 21 ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన భానుక రాజపక్సే సంచలనం సృష్టించాడు. 34 బంతుల్లో 241 స్ట్రైక్ రేట్తో 82 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో దుమ్మురేపాడు.
- Venkata Chari
- Updated on: Jul 22, 2024
- 9:46 am
IPL 2025: ఢిల్లీ ఫ్లైట్ దిగిన రిషభ్ పంత్.. ధోనితో కలిసి ట్రావెలింగ్కి రెడీ?
MS Dhoni - Rishabh Pant: 43 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోని వచ్చే సీజన్లో CSK తరపున ఆడటం సందేహమే. అయితే, అతను చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మెంటార్ లేదా కోచ్గా కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది. కొత్త జట్టును నిర్మించేందుకు ధోనీ తెరవెనుక సన్నాహాలు కూడా ప్రారంభించాడు.
- Venkata Chari
- Updated on: Jul 22, 2024
- 9:22 am
IPL 2025: కావ్య మారన్ని ఛాంపియన్గా నిలబెట్టాడు.. కట్చేస్తే.. మరో జట్టును విజేతగా చేసేందుకు సిద్ధం.. ఎవరంటే?
Lucknow Super Giants: ఐపీఎల్ 2025కి ముందు భారత అనుభవజ్ఞుడైన క్రికెటర్ ఈ లీగ్కి తిరిగి రావచ్చు. 2016లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ఐపీఎల్ ఛాంపియన్గా మార్చడంలో ఈ అనుభవజ్ఞుడు కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిపై కన్నేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు.. త్వరలోనే తమ జట్టులోకి చేర్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
- Venkata Chari
- Updated on: Jul 21, 2024
- 6:54 pm
IPL 2025: ఫ్రాంచైజీలతోపాటు ఆటగాళ్లకూ గుడ్న్యూస్ చెప్పిన బీసీసీఐ.. రూ. 120 కోట్లతో మెగా వేలానికి..
IPL 2025: ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ప్రతి ఫ్రాంచైజీ ఈ వేలానికి ముందు కొంతమంది ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోగలదు. అలాగే మిగతా ఆటగాళ్లందరినీ విడుదల చేయాల్సి ఉంది. విడుదలైన ఆటగాళ్లు మెగా వేలంలో కనిపించనున్నారు.
- Venkata Chari
- Updated on: Jul 21, 2024
- 2:56 pm
IPL 2025: లక్నోకు గుడ్బై చెప్పనున్న కేఎల్ రాహుల్.. ఖర్చీఫ్ వేసిన కోహ్లీ టీం..
IPL 2025: కేఎల్ రాహుల్ IPLలో RCB తరపున మొత్తం 19 మ్యాచ్లు ఆడాడు. అతను 14 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసి 4 అర్ధసెంచరీలతో మొత్తం 417 పరుగులు చేశాడు. ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన రాహుల్ ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్లో ఉన్నాడు. అయితే, త్వరలో జరగనున్న మెగా వేలానికి ముందే ఎల్ఎస్జీ జట్టు నుంచి తప్పుకుంటాడనే వార్తలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
- Venkata Chari
- Updated on: Jul 21, 2024
- 2:17 pm
IPL 2025: లక్నో సారథిగా రోహిత్.. చెన్నై చేరిన పంత్.. మెగా వేలానికి ముందే మారిన ఫ్రాంచైజీల రూపురేఖలు?
IPL 2025 సీజన్కు ముందే మెగా వేలం నిర్వహించాల్సి ఉంది. ఎప్పటిలాగే అన్ని జట్ల రూపురేఖలు మారనున్నాయి. అయితే, గత సీజన్లకు భిన్నంగా ఈసారి జట్లలోని ఆటగాళ్లు మాత్రమే మారే అవకాశం ఉంది. అనేక జట్ల కెప్టెన్సీలో ఏకకాలంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.
- Venkata Chari
- Updated on: Jul 21, 2024
- 7:24 am
IPL 2025: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. ముంబై కెప్టెన్గా ఔట్.. కొత్త సారథిగా ఎవరంటే?
IPL 2025: ఐపీఎల్ సీజన్-18 కోసం మెగా వేలం నిర్వహించనుంది. ఈ మెగా వేలానికి ముందు ప్రతి ఫ్రాంచైజీకి కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోవడానికి అనుమతి ఉంది. దీని ప్రకారం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ముగ్గురు భారతీయులను రిటైన్ చేయాలని నిర్ణయించుకుంటే, హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమవడం ఖాయం.
- Venkata Chari
- Updated on: Jul 20, 2024
- 5:48 pm
IPL 2025: అమ్మకానికి గుజరాత్ టైటాన్స్.. కన్నేసిన అదానీ గ్రూప్.. డీల్ ఎన్ని కోట్లంటే?
Gujarat Titans Stake Sale: మూడేళ్ల క్రితం, ఐపీఎల్లో గుజరాత్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ ఆఫర్ చేసింది. ఇందుకోసం అదానీ గ్రూప్ 5,100 కోట్లు బిడ్డింగ్ చేసింది. కానీ, సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ రూ.5625 కోట్లతో గుజరాత్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయగలిగింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ తన వాటాను విక్రయించేందుకు సిద్ధమైంది.
- Venkata Chari
- Updated on: Jul 20, 2024
- 2:42 pm
Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్కు బ్యాడ్న్యూస్.. పాంటింగ్ తర్వాత.. రిషబ్ పంత్ ఔట్?
IPL 2025 Mega Auction: రోడ్డు ప్రమాదం కారణంగా ఏడాది పాటు క్రికెట్కు దూరంగా ఉన్న రిషబ్ పంత్, ఐపీఎల్ 2024 నుంచే తిరిగి క్రికెట్ మైదానంలోకి వచ్చాడు. తిరిగి వచ్చిన వెంటనే ఢిల్లీకి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి జట్టుకు శుభారంభం అందించాడు. అయితే, ఢిల్లీ మరోసారి ప్లేఆఫ్కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఈ క్రమంలో పాంటింగ్ మొదటి బాధితుడిగా మారాడు. అతను జట్టుకు రాజీనామా చేయాల్సి వచ్చింది. పాంటింగ్ నిష్క్రమణను ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో రిషబ్ పంత్ గురించిన హాడావుడి మొదలైంది.
- Venkata Chari
- Updated on: Jul 15, 2024
- 9:40 pm
Delhi Capitals: ఆసీస్ దిగ్గజానికి బిగ్ షాకిచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆ పదవి నుంచి తొలగింపు..
Ricky Ponting: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు రికీ పాంటింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. 2016లో అతను జట్టుకు ప్రధాన కోచ్గా నియమితుడయ్యాడు. అయితే, ఇప్పుడు ఫ్రాంచైజీ అతనిని ఈ పదవి నుంచి తొలగించాలని నిర్ణయించుకుంది. దీంతో రికీ పాంటింగ్కు బిగ్ షాక్ తగిలినట్లైంది. కోట్లలో నష్టం కూడా వాటిల్లనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అతనికి ఒక సీజన్కు రూ. 3.5 కోట్లు ఇస్తుంది. పాంటింగ్ పదవీ విరమణ చేసిన వెంటనే, అతని కోట్ల రూపాయల జీతం ఆగిపోతుంది.
- Venkata Chari
- Updated on: Jul 13, 2024
- 8:02 pm
అలాంటివాడే కావాలంటోన్న కావ్యా మారన్, ప్రీతి జింటా.. తాడో పేడో తేల్చుకుంటామంటోన్న ముద్దుగుమ్మలు..
IPL 2025 Auction: టీ20 క్రికెట్లో బంతితో మ్యాచ్లు గెలవగల సత్తా ఉన్న ఇలాంటి ఆటగాడు IPL 2025 వేలంలోకి ప్రవేశిస్తే, కావ్య మారన్, ప్రీతి జింటా ముందుగా రంగంలోకి దిగుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే జరిగితే ఇలాంటి ప్లేయర్ను కొనుగోలు చేయడంలో ప్రీతి, కావ్య మధ్య ఎవరు గెలుస్తారో చూడాలి.
- Venkata Chari
- Updated on: Jul 12, 2024
- 5:27 pm