ఐపీఎల్ 2026
IPL అనేది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్. ఈ లీగ్ BCCI రిచ్ లీగ్గా పేరుగాంచింది. ఇది భారత క్రికెట్నే కాకుండా ప్రపంచ క్రికెట్ పరిస్థితి, దిశను మార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
IPL మొదటి సీజన్ 2008లో జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ లీగ్ నిర్వహిస్తున్నారు. ఐపీఎల్లో మొత్తం 10 జట్లు ఆడుతున్నాయి. ఈ లీగ్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాల్గొంటున్నాయి.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక సార్లు ఐపీఎల్ను గెలుచుకున్నాయి. ఈ రెండు జట్లు తలో 5 సార్లు ట్రోఫీని అందుకున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ ఈ టోర్నీని రెండుసార్లు గెలుచుకుంది. కాగా, గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఒక్కసారి ట్రోఫీని ముద్దాడాయి. ఇంతకు ముందు డెక్కన్ ఛార్జర్స్ జట్టు కూడా ఒకసారి ఐపీఎల్ను గెలుచుకుంది.
IPL ప్రతి సీజన్కు ముందు, ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి వేలం నిర్వహిస్తారు. అందులో జట్లు ఆటగాళ్ల కోసం వేలంలో పాల్గొంటాయి. IPL ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి మే వరకు జరుగుతుంది. మ్యాచ్లు భారతదేశంలోని అనేక నగరాల్లో నిర్వహిస్తుంటారు.
ఐపీఎల్ ప్రత్యేకత ఏమిటంటే, ఈ లీగ్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లు పాల్గొనడం. అయితే, ఇందులో పాల్గొనేందుకు పాక్ ఆటగాళ్లకు అనుమతి లేదు. భారత్పై పాకిస్థాన్ చేస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలే ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది.
IPL 2026 : కోహ్లీ, వైభవ్లకు కాదు.. అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, టోర్నమెంట్ఇ వ్వాల్సింది.. నిజంగానే అన్యాయం జరిగిందా?
IPL 2026 : ఫైనల్ మ్యాచ్లో కూడా భువనేశ్వర్ కుమార్ తన 4 ఓవర్లలో కేవలం 29 రన్స్ ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. భీకర ఫామ్లో ఉన్న సాయి సుదర్శన్తో పాటు చివర్లో జేసన్ హోల్డర్ను అవుట్ చేసి గుజరాత్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు.
- Rakesh
- Updated on: Jun 1, 2026
- 7:40 pm
ICC Board Meeting : అర్థరాత్రి ఐసీసీ సంచలన నిర్ణయం.. ఆ దేశ క్రికెట్ బోర్డుపై తక్షణమే నిషేధం
ICC Board Meeting : ఐసీసీ తాజాగా ఒక ఊహించని నిర్ణయం తీసుకుని క్రీడా ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పటివరకు పలు ప్రపంచకప్ టోర్నమెంట్లలో పాల్గొన్న కెనడా క్రికెట్ బోర్డు పై ఐసీసీ తక్షణమే అమలులోకి వచ్చేలా సస్పెన్షన్ వేటు వేసింది.
- Rakesh
- Updated on: Jun 1, 2026
- 7:18 pm
IPL 2026 : ఆర్సీబీలో 17 ఏళ్ల తర్వాత అద్భుతం.. ఆడిన ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని లక్కీ హ్యాండ్
IPL 2026 : ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టును మట్టికరిపించి వరుసగా రెండోసారి ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫిని ముద్దాడింది. అయితే ఈ భారీ టోర్నమెంట్లో ఆర్సీబీ విజయం వెనుక ఒక ఆసక్తికరమైన మిరాకిల్ దాగి ఉంది. ఆ జట్టుకు చెందిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ ఈ సీజన్లో ఎవరూ ఊహించని ఒక అద్భుతమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
- Rakesh
- Updated on: Jun 1, 2026
- 6:31 pm
Team India : ఐపీఎల్ ముగిసింది.. జూన్ 6 నుంచే నాన్స్టాప్ క్రికెట్ ధమాకా.. పూర్తి షెడ్యూల్ ఇదే
Team India : ఐపీఎల్ వినోదం ముగియడంతో ఇక ఫ్యాన్స్ అందరి కళ్ళు అంతర్జాతీయ క్రికెట్పై పడ్డాయి. గత మార్చి నెలలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లు ఐపీఎల్లో బిజీగా ఉండటం వల్ల ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్లు ఆడలేదు. కానీ ఇప్పుడు ఐపీఎల్ ముగియడంతో వారం తిరక్కుండానే జూన్ 6 నుంచి భారత జట్టు మళ్లీ రంగంలోకి దిగుతోంది.
- Rakesh
- Updated on: Jun 1, 2026
- 5:40 pm
IPL 2026 : అన్న ఐదోసారి కప్ కొట్టినా ముఖం చాటేసిన హార్దిక్.. ఇద్దరి మధ్య గొడవలు మరింత పెరిగాయా ?
IPL 2026 : ఆర్సీబీ జట్టు ఐపీఎల్ 2026 ట్రోఫి గెలవడంతో కృణాల్ పాండ్యా ఐదోసారి ఛాంపియన్గా నిలిచినా, తమ్ముడు హార్దిక్ పాండ్యా అభినందించకపోవడం వల్ల ఇద్దరి మధ్య గొడవల రూమర్స్ ఎక్కువయ్యాయి. కి ఐపీఎల్ 2026 సీజన్ సాగుతున్న సమయంలోనే వీరిద్దరి బంధం దెబ్బతిందనే వార్తలు తెగ హల్చల్ చేశాయి.
- Rakesh
- Updated on: Jun 1, 2026
- 5:19 pm
Vaibhav Sooryavanshi : ఆ దేశంలో ఐపీఎల్ బ్యాన్.. అయినా వైభవ్ సూర్యవంశీపై కురుస్తున్న ప్రశంసల వర్షం
Vaibhav Sooryavanshi : పాకిస్తాన్లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం ఉన్నప్పటికీ, ఐపీఎల్ 2026 లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన 15 ఏళ్ల భారత సంచలనం వైభవ్ సూర్యవంశీపై పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ప్రశంసలు కురిపించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో పరుగుల వరద పారించాడు.
- Rakesh
- Updated on: Jun 1, 2026
- 5:02 pm
Team India Debut : వైభవ్ సూర్యవంశీతో పాటు బ్లూ జెర్సీ వేసుకోబోయే ఆ నలుగురు ఐపీఎల్ హీరోలు ఎవరంటే?
Team India Debut : ఐపీఎల్ 2026 లో సంచలన ప్రదర్శన చేసిన వైభవ్ సూర్యవంశీ, రసిఖ్ సలామ్, ప్రిన్స్ యాదవ్తో కూడిన ఐదుగురు యువ ఆటగాళ్లు త్వరలోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నారు. ఆ టాప్ 5 యంగ్ ప్లేయర్ల వివరాలు తెలుసుకుందాం.
- Rakesh
- Updated on: Jun 1, 2026
- 4:34 pm
IPL 2026 : ఇకపై మెగా లీగ్లో కనిపించని ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్లు.. ఆ లిస్ట్లో మన యార్కర్ కింగ్ కూడా
IPL 2026 : పీఎల్ అంటేనే కఠినమైన పోటీకి కేరాఫ్ అడ్రస్. ఇక్కడ ఫామ్లో ఉంటేనే ఆటగాళ్లకు విలువ, లేదంటే ఎంతటి స్టార్ క్రికెటర్ అయినా బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది. తాజాగా ముగిసిన సీజన్ కొంతమంది సీనియర్, స్టార్ ఆటగాళ్లకు కోలుకోలేని దెబ్బ తీసింది.
- Rakesh
- Updated on: Jun 1, 2026
- 4:22 pm
IPL 2026 : ఐపీఎల్ తెచ్చిన తంటా.. అంతర్జాతీయ క్రికెట్కు ఐదుగురు తోపు ప్లేయర్లు గుడ్బై
IPL 2026 : తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్ కొంతమంది సీనియర్ భారతీయ ఆటగాళ్లకు అస్సలు కలిసిరాలేదు. వయసు పైబడటం, ఫామ్ కోల్పోవడం, గాయాల బారిన పడటం వంటి కారణాల వల్ల ఐదుగురు స్టార్ ఇండియన్ క్రికెటర్లు త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- Rakesh
- Updated on: Jun 1, 2026
- 3:13 pm
IPL 2026 Final : ఇంతకీ వైభవ్ చెవిలో విరాట్ ఏం చెప్పాడు.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న లవ్లీ మూమెంట్
IPL 2026 Final : టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, ఈ సీజన్ సెన్సేషన్, 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ మధ్య జరిగిన అద్భుతమైన భేటీ. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో వీరిద్దరూ పంచుకున్న ఓ ప్రత్యేకమైన క్షణం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది.
- Rakesh
- Updated on: Jun 1, 2026
- 3:05 pm
IPL Final Venue Change: ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై ముదిరిన వివాదం.. బీసీసీఐపై డీకే శివకుమార్ ఫైర్..!
KSCA Tickets Controversy: సరిగ్గా ఫైనల్ మ్యాచ్కు ముందు కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ పాలిటిక్స్ను ఒక్కసారిగా హీటెక్కించాయి. క్రీడల్లో రాజకీయ జోక్యంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. మరి ఈ తీవ్ర విమర్శలపై ఐపీఎల్ యాజమాన్యం, బీసీసీఐ అధికారికంగా ఎలా స్పందిస్తుందో, ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
- Venkata Chari
- Updated on: Jun 1, 2026
- 1:40 pm
Video: కర్నూలులో రెచ్చిపోయిన ఆర్సీబీ ఫ్యాన్స్.. బస్సుపై రాళ్లదాడి.. రోడ్డుపై అర్థరాత్రి రచ్చ మాములుగా లేదుగా..!
Kurnool IPL Violence: అర్ధరాత్రి వేళ సీట్లలో నిద్రిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా జరిగిన ఈ దాడితో దిగ్భ్రాంతికి గురయ్యారు. అద్దాలు పగులుతూ లోపలికి రాళ్లు పడుతుండటంతో ప్రాణభయంతో కేకలు వేశారు. పిల్లలు, మహిళల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. కేవలం క్రికెట్ మ్యాచ్ గెలిచినందుకు ఇలా సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- Venkata Chari
- Updated on: Jun 1, 2026
- 3:27 pm