AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ ప్రస్తుత భారత ప్రధాని. 2014 మేలో తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి దేశ ప్రధాని అయ్యారు. దేశ ప్రధాని కావడానికి ముందు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు.

నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో కూడా పనిచేశారు. ఆయన గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.

2014 లోక్‌సభలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధించింది. దీని తర్వాత, 2019లో కూడా బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ మళ్లీ భారత ప్రధాని అయ్యారు. 2014 నుంచి బీజేపీ మోదీ పేరును ప్రధాన అస్త్రంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించింది.

తన హయాంలో, ప్రధాని మోడీ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇది అయనపై దేశ ప్రజల్లో ఆదరణను మరింత పెంచింది. ఈ నిర్ణయాలలో పాకిస్థాన్‌లో సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ చట్టం అమలు మొదలైనవి ఉన్నాయి.

ఇంకా చదవండి

చమురు, గ్యాస్‌ నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని రోజులకు సరిపడ ముడి చమురు ఉందంటే..?

గల్ఫ్‌ దేశాల్లో యుద్దం కారణంగా భారత్‌లో పెట్రో ఉత్పత్తుల సంక్షోభంపై కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తోంది. చమురు, గ్యాస్‌ నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. భారత్‌ దగ్గర ప్రస్తుతం 100 మ మిలియన్‌ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. ప్రత్యామ్నాయాలపై కూడా కేంద్రం దృష్టి పెట్టింది.

యుఎఇ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏమి చర్చించారో తెలుసా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్ దాడులను ప్రధాని మోదీ ఖండించారు. భారతదేశం ఉద్రిక్తతలను తగ్గించడం, ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని సమర్థిస్తుందని పేర్కొన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాత్రి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) తో సమావేశమయ్యారు.

మోసం చేయడంలో డీఎంకే మంత్రుల మధ్య పోటీ.. కాంగ్రెస్-డీఎంకేపై ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (మార్చి 1) రెండు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పుదుచ్చేరిలో రూ. 2,700 కోట్లు, తమిళనాడులో రూ. 4,400 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. తమిళనాడులో కొత్తగా నిర్మించిన ఎనిమిది అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు, మూడు కొత్త ఆల్ ఇండియా రేడియో FM రిలే ట్రాన్స్మిటర్లను కూడా ఆయన ప్రారంభించారు.

PM Modi: ప్రజలకు ప్రశాంతమైన జీవితాన్ని అందించడమే లక్ష్యం: ప్రధాని మోదీ

PM Modi: ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వ సేవలో చేరిన యువత అందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని మోదీ అన్నారు. కాలుష్య రహిత రవాణా ప్రపంచంలోనే అతిపెద్ద సవాలు అని, వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రధాన పాత్ర పోషిస్తాయని కూడా తెలిపారు. పుదుచ్చేరి ..

PM Modi: రంజీలో జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!

Jammu and Kashmir Ranji Trophy: జమ్మూ కాశ్మీర్ తమ తొలి రంజీ ట్రోఫీని సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఆ జట్టుపై ప్రశంసల జల్లు కురిపించారు. లోయలో పెరుగుతున్న క్రీడా ప్రతిభను ఈ విజయం చాటిచెబుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Watch: విందుకు ప్రధాని మోదీని ఆహ్వానించి ఆశ్చర్యపరిచిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు!

ఇజ్రాయెల్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ ఆహ్వానం మేరకు రెండు రోజుల పాటు ఇజ్రాయెల్‌లో మోదీ పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌లో మోదీ ప్రసంగించారు. ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌లో మోదీకి ఘనంగా సన్మానం జరిగింది. ఇక, రెండు దేశాల మధ్య 10 బిలియన్‌ డాలర్ల రక్షణ ఒప్పందాలు జరిగాయి.

PM Modi: ప్రధాని మోదీకి ‘స్పీకర్‌ ఆఫ్‌ ది కనెసెట్‌ మెడల్‌’తో సత్కారం.. ప్రపంచంలోనే తొలి నేతగా..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇజ్రాయెల్‌ పార్లమెంట్.. ‘స్పీకర్‌ ఆఫ్‌ ది కనెసెట్‌ మెడల్‌’తో ఘనంగా సత్కరించింది. ఇజ్రాయెల్ కనెసెట్‌ అందించే అత్యున్నత పురస్కారం ఇదే.. భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేసినట్లు పార్లమెంట్ కనెసెట్‌ తెలిపింది.

Video Viral: ప్రధాని మోదీ పాకెట్ స్క్వేర్ రంగుపై నెతన్యాహు ఫన్నీ రియాక్షన్.. నవ్వు ఆపుకోలేకపోయారు..!

అంతర్జాతీయ రాజకీయాల్లో, ప్రధాన నిర్ణయాలు, ఒప్పందాలు, వ్యూహాత్మక ప్రకటనలు తరచుగా ఆకర్షిస్తాయి. కానీ కొన్నిసార్లు, కెమెరాలు దౌత్యానికి అతీతంగా, మానవ సంబంధాలను చెప్పే క్షణాన్ని కూడా తెలియజేస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌కు వచ్చినప్పుడు ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమైంది. విమానాశ్రయంలోని ఒక చిన్న క్షణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ.. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ కలిగిన నేతగా రికార్డ్!

75 ఏళ్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఆర్థిక సంస్కరణలు, బలమైన విదేశాంగ విధానం, నిర్ణయాత్మక పరిపాలనతో మోదీ, భారత్‌ను గ్లోబల్ స్టేజ్‌పై శక్తివంతమైన దేశంగా నిలబెట్టారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా నిలిచారు. ఇక తాజాగా ప్రధాని మోదీ పేరుకు మరో ప్రత్యేకమైన రికార్డు సొంతమైంది.

PM Modi: విజయ్‌ దేవరకొండ తల్లిదండ్రులకు ప్రధాని మోదీ లేఖ

నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ కోటలో ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, వధూవరుల తల్లిదండ్రులకు ఆత్మీయ లేఖ రాశారు. వారి కొత్త అధ్యాయానికి శుభాకాంక్షలు తెలుపుతూ, సప్తపది స్ఫూర్తితో జీవితాంతం స్నేహితులుగా కొనసాగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో రిసెప్షన్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి.

  • Phani CH
  • Updated on: Feb 25, 2026
  • 5:31 pm

సప్తపదితో జీవితాంతం ఆనందంగా ఉండండి.. విజయ్, రష్మికాకు ప్రధాని మోదీ విషెస్

ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరపడింది. దక్షిణాదిలో ఇన్నాళ్లు తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టకుండా ఉన్న రష్మిక, విజయ్ ఇటీవల తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించారు. రష్మిక, విజయ్ వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఈ నెల 26న జరగనుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం.. త్రివర్ణ మయమైన ఇజ్రాయెల్ పార్లమెంటు భవనం..!

ఇజ్రాయెల్‌లోని ప్రముఖ పత్రిక జెరూసలేం పోస్ట్ తన మొదటి పేజీలో "నమస్తే మోదీ" అనే శీర్షికతో ఆయన ఫోటోను ప్రచురించింది. పర్యటనకు ముందు, ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌లో తన రెండు రోజుల అధికారిక పర్యటన గురించి తెలియజేశారు. భారతదేశం - ఇజ్రాయెల్ బలమైన, బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయని, ఇది గత కొన్ని సంవత్సరాలుగా గణనీయంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు.