నరేంద్ర మోదీ
నరేంద్ర మోదీ ప్రస్తుత భారత ప్రధాని. 2014 మేలో తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి దేశ ప్రధాని అయ్యారు. దేశ ప్రధాని కావడానికి ముందు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు.
నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో కూడా పనిచేశారు. ఆయన గుజరాత్లోని వాద్నగర్లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.
2014 లోక్సభలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధించింది. దీని తర్వాత, 2019లో కూడా బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ మళ్లీ భారత ప్రధాని అయ్యారు. 2014 నుంచి బీజేపీ మోదీ పేరును ప్రధాన అస్త్రంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించింది.
తన హయాంలో, ప్రధాని మోడీ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇది అయనపై దేశ ప్రజల్లో ఆదరణను మరింత పెంచింది. ఈ నిర్ణయాలలో పాకిస్థాన్లో సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ చట్టం అమలు మొదలైనవి ఉన్నాయి.
చిరుతల రాకతో భారతదేశం చరిత్రను తిరగరాసిందిః ప్రధాని నరేంద్ర మోదీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 4, గురువారం అంతర్జాతీయ చిరుత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో మధ్యప్రదేశ్ మూడు సంవత్సరాల క్రితం చిరుత ప్రాజెక్ట్ బహుమతిని అందుకుంది. సెప్టెంబర్ 17, 2022న తన పుట్టినరోజున ప్రధాన మోదీ కునో పాల్పూర్లో చిరుతలను విడుదల చేశారు.
- Balaraju Goud
- Updated on: Dec 4, 2025
- 10:08 am
PM Modi: వారి జీవితం స్ఫూర్తిదాయకం.. సేంద్రీయ వ్యవసాయం గురించి ప్రధాని మోదీ ఏమన్నారంటే..
సేంద్రీయ వ్యవసాయం ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతున్న ఈ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక ముఖ్యమైన సందేశాన్ని దేశంతో పంచుకున్నారు. కోయంబత్తూరులో నవంబర్ 19న జరిగిన సౌత్ ఇండియా నేచురల్ ఫార్మింగ్ సమ్మిట్ 2025లో పాల్గొన్న ప్రధాని మోదీ.. అక్కడి అనుభవాన్ని సుధీర్ఘంగా లింక్డిన్ ఖాతాలో పోస్ట్ చేశారు. భారత వ్యవసాయం భవిష్యత్తు సేంద్రీయ వ్యవసాయంతోనే వెలుగొందుతుందని చెప్పారు.
- Shaik Madar Saheb
- Updated on: Dec 3, 2025
- 3:12 pm
ఢిల్లీలో కొనసాగుతున్న తెలంగాణ సీఎం రేవంత్ పర్యటన.. ప్రధాని మోదీ, రాహుల్తో భేటీ
పాతికేళ్ల టార్గెట్.. ఫ్యూచర్కు రోడ్ మ్యాప్. తెలంగాణ రైజింగ్ 2047 అంటే.. రాష్ట్ర భవిష్యత్తుకే విజన్ డాక్యుమెంట్ అంటోంది రేవంత్ సర్కార్. రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం అయ్యేలా పక్కా ప్రణాళికలు రచిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వ. అతి త్వరలోనే జరగబోయే గ్లోబల్ సమ్మిట్.. గ్రాండ్గా జరగాలి. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్ప దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా అతిరథ మహారథులను హైదరాబాద్కు ఆహ్వానిస్తున్నారు.
- Balaraju Goud
- Updated on: Dec 3, 2025
- 2:11 pm
భారత్కు రష్యా ప్రెసిడెంట్ పుతిన్.. పర్యటన వెనుక అసలు కారణం అదేనా..?
పుతిన్ భారత్ టూర్ని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. రెండ్రోజుల పర్యటన కోసం భారతదేశానికి వస్తున్నారు రష్యా అధ్యక్షుడు. 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో వాణిజ్యం, రక్షణ తదితర అంశాలపై రెండు దేశాల అగ్రనేతలు చర్చించనున్నారు. రష్యా-భారత్ మధ్య కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. భారత్పై అమెరికా సుంకాలు విధించిన నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది పుతిన్ పర్యటన.
- Balaraju Goud
- Updated on: Dec 3, 2025
- 8:25 am
Lok Bhavan: రాజ్భవన్ కాదు.. ఇక నుంచి లోక్ భవన్.. ఈ పేర్ల మార్పు వెనుక అసలు కథ ఇదే..
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.. ముఖ్యంగా.. పాలన భావన కేవలం పరిపాలనాపరమైనది కాదు. ఇది సాంస్కృతిక వైభవాన్ని తెలపడంతోపాటు.. నైతికమైనది అని గుర్తుచేసేలా.. వలసవాద పేర్లు, చిహ్నాలను రద్దు చేస్తోంది..
- Shaik Madar Saheb
- Updated on: Dec 2, 2025
- 4:29 pm
Parliament Winter Session Live: దుమ్ముదుమారమే.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. లైవ్ వీడియో
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.. ఇప్పటికే అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధం అయ్యాయి.. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 11 కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతుంది. కేంద్ర ఎక్సైజ్ సవరణ బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు పార్లమెంట్ సమావేశాలకు విపక్షాలు అడ్డుపడొద్దని ప్రధాని మోదీ కోరారు.
- Shaik Madar Saheb
- Updated on: Dec 1, 2025
- 11:11 am
Parliament Winter Session: రేపట్నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లులు ఇవే!
ఢిల్లీ వాయు కాలుష్యం ఈసారి పార్లమెంట్ను కమ్మేయనుంది.. అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రజలు శ్వాసించాలంటే భయపడేలా ఉన్న వాయు నాణ్యత గురించి దేశ అత్యున్నత చట్ట సభ అయిన పార్లమెంట్లో చర్చ పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తనున్నాయి. సోమవారం మొదలై డిసెంబర్ 19 వరకు 15 సిట్టింగుల్లో జరిగే సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి.
- Gopikrishna Meka
- Updated on: Nov 30, 2025
- 12:59 pm
ప్రపంచంలో ఎత్తైన రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోవాలో శుక్రవారం (నవంబర్ 28) పర్యటించారు. ఈ సందర్భంగా గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగలి జీవోత్తమ మఠంలో 77 అడుగుల ఎత్తైన రాముడి కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మఠం 550వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన "సార్ధ పంచశతమానోత్సవ్" వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. రామాయణ థీమ్ పార్క్ గార్డెన్ను కూడా ఆయన ప్రారంభించారు.
- Balaraju Goud
- Updated on: Nov 28, 2025
- 5:04 pm
PM Modi: టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్లతో ప్రధాని మోదీ భేటీ.. ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?
PM Modi meets Indian Women's blind T20 World Cup champions: దీపిక టి.సి. సారథ్యంలోని భారత జట్టు, ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో నేపాల్ను ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో 27 బంతుల్లో 44 పరుగులు చేసిన ఫులా సరెన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ టోర్నమెంట్ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాయి.
- Venkata Chari
- Updated on: Nov 27, 2025
- 8:57 pm
అరుదైన ఖనిజాల కోసం కేంద్ర సంచలన నిర్ణయం.. ఆమోదం తెలిపిన మోదీ సర్కార్..!
దేశ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా కేంద్ర కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఒకేసారి నాలుగు ప్రధాన నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దేశంలో అరుదైన-భూమి అయస్కాంతాల దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. అలాగే మహారాష్ట్ర-గుజరాత్ ప్రజలకు ప్రత్యేక బహుమతులు ప్రకటించారు.
- Balaraju Goud
- Updated on: Nov 26, 2025
- 4:59 pm