AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ ప్రస్తుత భారత ప్రధాని. 2014 మేలో తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి దేశ ప్రధాని అయ్యారు. దేశ ప్రధాని కావడానికి ముందు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు.

నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో కూడా పనిచేశారు. ఆయన గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.

2014 లోక్‌సభలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధించింది. దీని తర్వాత, 2019లో కూడా బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ మళ్లీ భారత ప్రధాని అయ్యారు. 2014 నుంచి బీజేపీ మోదీ పేరును ప్రధాన అస్త్రంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించింది.

తన హయాంలో, ప్రధాని మోడీ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇది అయనపై దేశ ప్రజల్లో ఆదరణను మరింత పెంచింది. ఈ నిర్ణయాలలో పాకిస్థాన్‌లో సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ చట్టం అమలు మొదలైనవి ఉన్నాయి.

ఇంకా చదవండి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స ఎంతసేపు జరిగిందంటే..? ప్రధాని నుంచి ఫోన్

పదేళ్లుగా భుజాల నొప్పిని భరిస్తూనే ప్రజా జీవితాన్ని కొనసాగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఎట్టకేలకు శస్త్రచికిత్స జరిగింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ వైద్య నిపుణుల బృందం కుడి భుజానికి రొటేటర్ కఫ్ ఇంజ్యూరీపై మూడున్నర గంటల పాటు ఆపరేషన్ నిర్వహించింది. రెండు భుజాల్లోనూ తీవ్ర గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించగా... మరో భుజానికి రెండు నెలల తర్వాత శస్త్రచికిత్స చేయనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మెల్‌బోర్న్‌లో ప్రధాని మోదీ క్రికెట్ దౌత్యం.. స్టీవ్ వాకు 20 ఏళ్ల నాటి అరుదైన కానుక..!

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్రికెట్ దౌత్యంతో ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేశారు. తన మూడు రోజుల పర్యటనలో చివరి రోజైన శుక్రవారం (జూలై 10), ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వాకు ఒక అపురూపమైన, అరుదైన బహుమతిని అందజేశారు.

న్యూజిలాండ్ గడ్డపై తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని.. విమానాశ్రయంలో మోదీకి అపూర్వ స్వాగతం..!

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా చివరి దశలో న్యూజిలాండ్‌కు చేరుకున్నారు. శుక్రవారం (జూలై10) ఆయన ఆక్లాండ్ నగరంలో అడుగుపెట్టారు. ఒక భారత ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ స్వయంగా విమానాశ్రయానికి విచ్చేసి, ప్రధాని మోదీని ఆలింగనం చేసుకుని అత్యంత ఆత్మీయంగా, ఘనంగా స్వాగతం పలికారు.

PM Modi: మోదీ మరో సంచలనం.. ఆస్ట్రేలియా పర్యటనలో కీలక పరిణామం

PM Modi: ఆస్ట్రేలియా వార్తాపత్రిక ప్రధాని మోదీ పర్యటనను తన ముఖపత్రంలో ప్రచురించింది. "వాణిజ్యం, రక్షణ రంగాలలో మోదీ బహుమతులు తెచ్చారు" అని శీర్షిక పేర్కొంది. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన మరో ప్రముఖ వార్తాపత్రిక 'ది ఏజ్' కూడా ప్రధాని మోదీ పర్యటనను తన మొదటి..

భారత్-ఆస్ట్రేలియా స్నేహానికి భారతీయ సమాజమే బలమైన స్తంభం: ప్రధాని మోదీ

ఆస్ట్రేలియా పర్యటనలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మెల్‌బోర్న్‌లో అఖండ స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు భారీ సంఖ్యలో పాల్గొన్న ‘మెల్‌బోర్న్ మీట్స్ మోదీ’ కార్యక్రమంలో ప్రధాని మోదీ భారత్-ఆస్ట్రేలియా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాలోని భారతీయ సమాజం రెండు దేశాల మధ్య స్నేహ బంధానికి ముఖ్యమైన శక్తిగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు కేవలం ప్రభుత్వాల మధ్య మాత్రమే కాకుండా ప్రజల మధ్య అనుబంధంతో మరింత బలపడుతున్నాయని మోదీ వ్యాఖ్యలు స్పష్టం చేశాయి.

Video: ఇండోనేషియా గగనతలంలోకి ప్రధాని మోదీ విమానం.. ఎదురుగా ఫైటర్ జెట్స్.. ఆ తర్వాత సీన్ ఇదే!

మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిత ఇండోనేషియాకు చేరుకున్నారు. రాజధాని జకార్తాలో ఆయనకు ఇండోనేషియా ప్రభుత్వం అత్యంత ఘనంగా స్వాగతం పలికింది. విమానాశ్రయానికి స్వయంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో చేరుకుని ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలకడం ఈ పర్యటనకు ఉన్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పింది.

PM Modi: ఇండో-పసిఫిక్‌పై ప్రత్యేక దృష్టి.. నేటి నుంచే ప్రధాని మోదీ 3 దేశాల పర్యటన

PM Modi: పర్యటనలో రెండవ భాగంగా ప్రధాని మోదీ ఆస్ట్రేలియాను సందర్శించనున్నారు. అక్కడ ఆయన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి వార్షిక నాయకుల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో ద్వైపాక్షిక సహకారం పెరుగుతున్న అభివృద్ధిపై చర్చిస్తారని, రక్షణ సహకారం..

ఇండో-పసిఫిక్‌లో భారత్ వ్యూహాత్మక అడుగు.. మూడు దేశాల పర్యటనకు మోదీ శ్రీకారం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరు రోజుల విదేశీ పర్యటనకు సోమవారం (జూలై 06) శ్రీకారం చుట్టారు. జూలై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ వ్యూహాత్మక ఉనికిని మరింత విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, నూతన సాంకేతికత, విద్య, ఆర్థిక భాగస్వామ్యం, ప్రవాస భారతీయులతో అనుబంధం వంటి కీలక అంశాలు ఈ పర్యటనలో ప్రధాన చర్చాంశాలుగా ఉండనున్నాయి.

రాజస్థాన్ శిల్పకళతో జోధ్‌పూర్ ఎయిర్‌పోర్ట్ కొత్త రూపం.. మోదీ చేతుల మీదుగా ఆధునిక టెర్మినల్ ప్రారంభం

రాజస్థాన్‌లో కొత్త విమాన టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోధ్‌పూర్ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ టెర్మినల్ ప్రారంభంతో జోధ్‌పూర్ విమానాశ్రయానికి ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. సుమారు 23,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టెర్మినల్, ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా రూపుదిద్దుకుంది.

అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న ప్రతిష్టాత్మక 'వీబీజీ రామ్ జీ' (వికసిత్ భారత్ గ్రీన్ - రాష్ట్రీయ గ్రామీణ మౌలిక సదుపాయాలు) పథకం పేదల జీవితాలనే మార్చే పథకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లె సభ నుంచి VBG RAM G పథకాన్ని సీఎం చంద్రబాబు ఘనంగా ప్రారంభించారు. గతంలో నరేగా పథకం రాయలసీమ నుంచే ప్రారంభమైందని, ఇప్పుడు ఈ చారిత్రాత్మక పథకం కూడా ఇక్కడి నుంచే ఆవిష్కృతం కావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చేలా పథకాన్ని అమలు చేస్తామన్నారు.

మోదీ మార్క్ వ్యూహం..! వర్షాకాల సమావేశాల తర్వాతే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?

కేంద్రంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంటూ వస్తున్న ఊహాగానాలకు బ్రేక్ పడేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి మంత్రివర్గ మార్పుల కంటే కీలక చట్టాలను ఆమోదింపజేసుకోవడానికే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. జూలై మూడవ వారంలో బహుశా జూలై 20 నుండి ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాల ముగిసిన తర్వాత, అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ఈ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని సమాచారం.

PM Modi: ప్రధాని మోదీకి మరో అరుదైన ఘనత.. సెషెల్స్ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కారం..

పర్యావరణ పరిరక్షణలో విశేష కృషికి గాను ప్రధాని నరేంద్ర మోదీకి సెషెల్స్ దేశ అత్యున్నత అధ్యక్ష పురస్కారం 'గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్' లభించింది. ఈ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా మోదీ నిలిచారు. బ్లూ ఎకానమీ, వాతావరణ మార్పులపై పోరాటం, పర్యావరణ హిత కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని సెషెల్స్ ప్రభుత్వం ప్రదానం చేసింది.

రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకోవడానికి మీకు నెలకు ఎంత జీతం ఉండాలి?
రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకోవడానికి మీకు నెలకు ఎంత జీతం ఉండాలి?
వైభవ్ సూర్యవంశీకి ఊహించని షాక్.. 2028 టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
వైభవ్ సూర్యవంశీకి ఊహించని షాక్.. 2028 టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
థియేటర్‌లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు
థియేటర్‌లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు
టీ, కాఫీ కాకుండా ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో..
టీ, కాఫీ కాకుండా ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో..
చికెన్ పులావ్ రుచిగా.. పొడిపొడిగా.. రావాలంటే ఇలా చేసుకోండి
చికెన్ పులావ్ రుచిగా.. పొడిపొడిగా.. రావాలంటే ఇలా చేసుకోండి
పడుకోగానే నిద్ర పట్టడం లేదా? మిలిటరీ స్లీప్ మెథడ్‌ గురించి తెలుసా
పడుకోగానే నిద్ర పట్టడం లేదా? మిలిటరీ స్లీప్ మెథడ్‌ గురించి తెలుసా
అఖిల్ 'లెనిన్' సినిమాలో అదరగొట్టిన ఈ నటుడు ఎవరో తెలుసా?
అఖిల్ 'లెనిన్' సినిమాలో అదరగొట్టిన ఈ నటుడు ఎవరో తెలుసా?
1605 రోజుల తర్వాత టీమిండియా క్రికెట్ హిస్టరీలోనే చీకటి రోజు..!
1605 రోజుల తర్వాత టీమిండియా క్రికెట్ హిస్టరీలోనే చీకటి రోజు..!
గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
మళ్లీ రాజుకున్న మంటలు.. ఇరాన్ సంచలన నిర్ణయం.. రంగంలోకి అమెరికా
మళ్లీ రాజుకున్న మంటలు.. ఇరాన్ సంచలన నిర్ణయం.. రంగంలోకి అమెరికా