AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ ప్రస్తుత భారత ప్రధాని. 2014 మేలో తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి దేశ ప్రధాని అయ్యారు. దేశ ప్రధాని కావడానికి ముందు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు.

నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో కూడా పనిచేశారు. ఆయన గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.

2014 లోక్‌సభలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధించింది. దీని తర్వాత, 2019లో కూడా బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ మళ్లీ భారత ప్రధాని అయ్యారు. 2014 నుంచి బీజేపీ మోదీ పేరును ప్రధాన అస్త్రంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించింది.

తన హయాంలో, ప్రధాని మోడీ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇది అయనపై దేశ ప్రజల్లో ఆదరణను మరింత పెంచింది. ఈ నిర్ణయాలలో పాకిస్థాన్‌లో సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ చట్టం అమలు మొదలైనవి ఉన్నాయి.

ఇంకా చదవండి

Tanikella Bharani:’నేను రాముణ్ణి, కృష్ణుణ్ణి చూడలేదు కానీ’.. ప్రధాని మోడీపై తనికెళ్ల భరణి ఇంట్రెస్టింగ్ పోస్ట్

ప్రముఖ నటుడు, దర్శక రచయిత తనికెళ్ల భరణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 200కు పైగా సినిమాల్లో నటించిన ఆయన ఎన్నో గొప్ప పాత్రలకు ప్రాణం పోశారు. ప్రస్తుతం సహాయక నటుడిగా బిజీ బిజీగా ఉంటోన్న తనికెళ్ల భరణి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రత్యేకంగా కలిశారు.

ప్రోటోకాల్ పక్కనబెట్టి.. ముఖ్యమంత్రి ఇంటికి ప్రధాని మోదీ.. సీఎం చంద్రబాబు భావోద్వేగం!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అరుదైన, మధురమైన ఘట్టం ఆవిష్కృతమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి విచ్చేసి, వారి కుటుంబ సభ్యులతో కలిసి గడిపారు. ఈ ప్రత్యేక సందర్భంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఎంతో భావోద్వేగంగా స్పందించారు.

PM Modi – Pawan Kalyan : అంతా ఒకే ఫ్రేమ్‌లో.. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో ప్రధాని మోదీ.. స్పెషల్ అట్రాక్షన్ గా మార్క్ శంకర్..

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసాలకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు, పవన్‌ ఇళ్లకు వెళ్లారు. ముందుగా పవన్ ఇంటికి వెళ్లిన ప్రధాని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల సైనస్ కారణంగా పవన్ కు శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ ను పరామర్శించారు.

యుద్ధం ఏదైనా.. భారం పడనివ్వను.. రైతులకు, దేశ ప్రజలకు ప్రధాని మోదీ గ్యారెంటీ..!

హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధ మేఘాలు దేశంపై చూపుతున్న ప్రభావాన్ని వివరిస్తూనే, సామాన్యుడిపై భారం పడకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచం ఎన్నో సవాళ్లను, సంక్షోభాలను ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

PM Modi: బంగారం, పెట్రోల్‌, డీజిల్‌ వాడకంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

PM Modi: సొంత వాహనాల కంటే వీలైనంత వరకు మెట్రో రైళ్లు, బస్సులు వంటి ప్రజారవాణా వ్యవస్థలను ఉపయోగించాలని సూచించారు. పర్యావరణ హితమైన, పొదుపైన ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలు మళ్లాలని కోరారు. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించాలన్నారు. ఆఫీసులకు వెళ్లడం తగ్గించి..

హైదరాబాద్ వేదికగా ఏపీ రాజకీయం.. ప్రోటోకాల్ దాటిన స్నేహం.. మిత్రుల ఇళ్లకు మోదీ!

హైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన రాజకీయంగా విస్తృత చర్చకు దారి తీసింది. సాధారణంగా ప్రధాని ఏ రాష్ట్రానికి వెళ్లినా అధికారిక కార్యక్రమాలకే పరిమితం కావడం ఆనవాయితీ. కానీ ఈసారి తెలంగాణ పర్యటనలో భాగంగా జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసాలకు మోదీ వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణకు రెట్టింపు నిధులు కావాలా? అయితే ‘మేరే సే జోడో’.. రేవంత్‌కు ప్రధాని మోదీ ఆఫర్!

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా "మేరే సే జోడో" (నాతో జతకట్టండి) అనే మాట మార్మోగిపోతోంది. ప్రధాని మోదీ చేసిన "మేరే సే జోడో" కామెంట్స్‌ తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. హైదరాబాద్‌లోని HICCలో రూ. 9,377 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సరికొత్త రాజకీయ చర్చకు దారితీసింది.

PM Modi: బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉంటేనే మంచిది.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

బెంగాల్‌ తరహాలోనే తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ పరేడ్‌ గ్రౌండ్స్‌ సభలో ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇక బీజేపీ అధికారంలోకి వస్తుందనీ, ప్రతి కార్యకర్తలో ఆ జోష్‌ కనిపిస్తోందని ప్రధాని మోదీ, కార్యకర్తల జయజయధ్వానాల మధ్య చెప్పారు.

PM Modi: ప్రధాని మోదీ పర్యటన వేళ ఒక్కసారిగా కలకలం.. ప్రయాణ మార్గంలో జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం

బెంగళూరు నగర పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించనున్న మార్గం సమీపంలో జిలిటిన్ స్టిక్స్ లభ్యం కావడంతో బెంగళూరులో భారీ భద్రతా హెచ్చరిక జారీ అయింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈవెంట్ వేదికకు వెళ్లే మార్గానికి సమీపంలో, కగ్గలిపుర ప్రాంతంలోని తాతగుణి వద్ద పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

PM Modi Live: సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ నివాసాలకు ప్రధాని మోదీ.. లైవ్ వీడియో

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ప్రధానికి ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. తెలంగాణ గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లాతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తదితరులు ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలికారు.

PM Modi in Hyderabad Highlights: పెట్రోల్‌, డీజిల్‌ వాడకంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

PM Modi Hyderabad Visit Updates Highlights in Telugu: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ కు చేరుకున్నారు. అక్పడ మోదీని ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి, గవర్నర్ శుక్లాలు మోదీని స్వాగతం పలికారు. బేగంపేట్ నుంచి నేరుగా HICCకి బయలుదేరారు మోదీ..

హైదరాబాద్‌లో మోదీ టూర్.. మరో అశ్వమేధ యాగానికి ట్రయల్ రన్! ఆ గ్యాప్‌లో ఏం జరగనుంది..

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయనగా.. ప్రధాని మోదీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఏదో యాధృచ్చికంగా ఫిక్స్ చేసిన షెడ్యూల్ కాదిది. ప్రధానిగా మూడోసారి గెలిచిన తరువాత తొలిసారి తెలంగాణలో అడుగుపెడుతున్న క్షణం ఇది. ఆ అడుగు మామూలుగా ఉండకూడదనుకున్నారో ఏమో.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాకనే తెలంగాణలో ముహూర్తం ఉండాలని ముందుగా నిర్ణయించుకున్నారు.