నరేంద్ర మోదీ
నరేంద్ర మోదీ ప్రస్తుత భారత ప్రధాని. 2014 మేలో తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి దేశ ప్రధాని అయ్యారు. దేశ ప్రధాని కావడానికి ముందు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు.
నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో కూడా పనిచేశారు. ఆయన గుజరాత్లోని వాద్నగర్లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.
2014 లోక్సభలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధించింది. దీని తర్వాత, 2019లో కూడా బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ మళ్లీ భారత ప్రధాని అయ్యారు. 2014 నుంచి బీజేపీ మోదీ పేరును ప్రధాన అస్త్రంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించింది.
తన హయాంలో, ప్రధాని మోడీ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇది అయనపై దేశ ప్రజల్లో ఆదరణను మరింత పెంచింది. ఈ నిర్ణయాలలో పాకిస్థాన్లో సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ చట్టం అమలు మొదలైనవి ఉన్నాయి.
ఇంకా చదవండిప్రపంచ పవర్ఫుల్ దేశాల సరసన భారత్.. జాబితా నుంచి అమెరికా ఔట్..!
కిర్గిజిస్థాన్లోని SCO సదస్సులో భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. బెలారస్ అధ్యక్షుడు చైనా, రష్యా పక్కన భారత్ను మూడు కీలక శక్తులలో ఒకటిగా పేర్కొన్నారు, అమెరికాను జాబితా నుండి మినహాయించారు. ఉగ్రవాదంపై మోడీ స్పష్టమైన వైఖరి, ఇరాన్ సమస్యపై దౌత్యం, పుతిన్తో భేటీ భారత్ పెరుగుతున్న అంతర్జాతీయ ప్రభావాన్ని చాటాయి. ఈ పరిణామాలు భారత్ వ్యూహాత్మక ప్రాధాన్యతను పెంచాయి.
- Balaraju Goud
- Updated on: Sep 2, 2026
- 2:07 pm
ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు.. ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్!
షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సందేశం ఇచ్చారు. ఉగ్రవాదం విషయంలో పొరుగు దేశాలపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండా, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, నియామకాలు, తీవ్రవాద భావజాలాన్ని ప్రేరేపించడం, సురక్షిత స్థావరాలు వంటి మొత్తం వ్యవస్థను కూల్చివేయాలని ఆయన అన్నారు. షాంఘై సహకార సంస్థ (SCO) 26వ శిఖరాగ్ర సమావేశం కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో జరిగింది.
- Balaraju Goud
- Updated on: Sep 1, 2026
- 1:16 pm
ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక సందేశం.. పుతిన్కు సూటిగా చెప్పిన మాట ఇదే!
అంతర్జాతీయం: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కీలక సందేశం ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో జరిగిన భేటీలో.. “అంతులేని యుద్ధం నుంచి యుద్ధం ముగింపు వైపు పయనించాలి” అని స్పష్టం చేశారు. యుద్ధం కొనసాగే ప్రతి రోజు మానవాళిని వెనక్కి నెడుతోందని, శాంతి వైపు వేసే ప్రతి అడుగు ప్రపంచానికి కొత్త ఆశను కలిగిస్తుందని పేర్కొన్నారు.
- Balaraju Goud
- Updated on: Sep 1, 2026
- 8:43 am
ఉజ్బెకిస్తాన్లో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం.. భారత్కు ఉజ్బెకిస్తాన్ ఎందుకు కీలకం?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తాన్ పర్యటనకు అపూర్వ స్వాగతం లభించింది. భారత్కు ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మకంగా ఎందుకు కీలకమో ఈ ఆర్టికల్ వివరిస్తుంది. యురేనియం, బంగారం, సహజ వాయువు వంటి అపారమైన ఖనిజ, ఇంధన సంపదతో ఉజ్బెకిస్తాన్, భారతదేశ శక్తి భద్రత, కీలక ఖనిజాల అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ద్వైపాక్షిక సంబంధాలను, వాణిజ్యాన్ని బలోపేతం చేయనుంది.
- Balaraju Goud
- Updated on: Aug 30, 2026
- 9:33 am
SCO సదస్సులో ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్.. ఉగ్రవాదంపై పోరాటం, మధ్య ఆసియా భాగస్వామ్యం!
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్థాన్ పర్యటనలో భాగంగా SCO శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, అతివాదం ప్రాంతీయ శాంతికి ముప్పుగా నిలుస్తున్నాయని, వీటిని సమూలంగా నిర్మూలించడానికి SCO దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని మోదీ స్పష్టం చేశారు. మధ్య ఆసియాతో వాణిజ్యం, కనెక్టివిటీ, వ్యూహాత్మక సంబంధాల బలోపేతమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం.
- Balaraju Goud
- Updated on: Aug 29, 2026
- 12:46 pm
దేశవ్యాప్తంగా ఘనంగా రక్షాబంధన్.. చిన్నారులతో రాఖీ కట్టించుకున్న ప్రధాని మోదీ
తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా రక్షాబంధన్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఢిల్లీలోని పాఠశాలల చిన్నారులు ప్రధానికి రాఖీలు కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు. చిన్నారులతో మోదీ సరదాగా ముచ్చటించి, దేశ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
- Balaraju Goud
- Updated on: Aug 28, 2026
- 2:23 pm
PM Modi: నేపాల్ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు.. బాలెన్షాకు ప్రధాని మోదీ ఫోన్.. సాయం చేస్తామని భరోసా..
నేపాల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా రసువా జిల్లాలో భారీ నష్టం జరిగింది. వేలాది మంది గల్లంతైనట్లు సమాచారం కాగా, వారిలో 105 మంది భారతీయులు ఉన్నారు. వరదలపై ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి, భారత్ తరఫున పూర్తి సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
- Shaik Madar Saheb
- Updated on: Aug 26, 2026
- 5:42 pm
దేశ యువతకు ప్రధాని మోదీ కీలక సందేశం.. ఖేలో ఇండియా డైలాగ్లో దిశానిర్దేశం..!
జాతీయ క్రీడా దినోత్సవం-2026 సందర్భంగా దేశ యువతతో మాట్లాడనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. .గురువారం (ఆగస్టు 27) ఖేలో ఇండియా డైలాగ్ - ఖేల్ కీ బాత్ ప్రధాని మోదీ కే సాథ్ కార్యక్రమంలో యువతతో వర్చువల్గా మాట్లాడనున్నారు. దేశవ్యాప్తంగా 1,500కు పైగా విద్యా సంస్థల్లో ఏకకాలంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి జిల్లాలోని రెండు కళాశాలల్లో యువ సంవాద్ నిర్వహిస్తారు.
- Gopikrishna Meka
- Updated on: Aug 26, 2026
- 11:54 am
PM CARES Fund ఖాతా తెరిచారు.. రూ.8,452 కోట్లపై ఆసక్తికర లెక్కలు!
2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎం కేర్స్ ఫండ్ ఆడిట్ నివేదిక విడుదలైంది. మార్చి 31, 2025 నాటికి ఫండ్లో రూ.8,452.95 కోట్లు నిల్వలు ఉన్నాయి. ఇందులో అధిక భాగం ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉంది. విరాళాలు తగ్గినప్పటికీ, వడ్డీ ఆదాయం వల్ల మొత్తం నిధి పెరిగింది. రూ.87.85 లక్షల వ్యయం, రూ.324.65 కోట్ల రీఫండ్ కీలక ఆర్థిక వివరాలు.
- Balaraju Goud
- Updated on: Aug 18, 2026
- 6:34 pm
నితిన్ నబిన్ కొత్త టీమ్ రెడీ.. పురందరేశ్వరీ, వసుంధర రాజేకు కీలక బాధ్యతలు..!
బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. కీలక పదవుల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. వసుంధర రాజే, రామ్ మాధవ్, పురంధేశ్వరి వంటి వారికి ఉపాధ్యక్ష పదవులు లభించాయి. స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్కు కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే, కొత్త టీమ్లో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కకపోవడం చర్చనీయాంశమైంది. ఇది పార్టీ భవిష్యత్ వ్యూహాలను ప్రతిబింబిస్తుంది.
- Balaraju Goud
- Updated on: Aug 17, 2026
- 3:41 pm
ప్రోటోకాల్ పక్కబెట్టి.. జన సమూహంలోకి ప్రధాని మోదీ.. విద్యార్థులతో కరచాలనం
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంపై ఆయన కీలక ప్రసంగం చేశారు. యువత పాత్రను తెలియజేస్తూ.. ప్రధాని మోదీ, అనంతరం చిన్నారులు, ఎన్సీసీ క్యాడెట్లతో కరచాలనం చేసి ముచ్చటించి వారిలో స్ఫూర్తి నింపారు.
- Balaraju Goud
- Updated on: Aug 15, 2026
- 11:24 am
2047 వికసిత్ భారత్కు ప్రధాని మోదీ ‘సప్తధార’.. దేశ భవిష్యత్తును మార్చే ఏడు శక్తులివే!
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దేశ ప్రగతికి కొత్త శక్తి ప్రవాహాలు అవసరమని పేర్కొంటూ.. ఏడు ప్రధాన రంగాలపై ప్రత్యేక దృష్టి సారించే ‘సప్తధార’ సంస్కరణల చట్రాన్ని ఆవిష్కరించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాంగణం నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. రాబోయే ఐదేళ్ల నుంచి ఏడేళ్లలో ఈ ఏడు రంగాల సమిష్టి శక్తితో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
- Balaraju Goud
- Updated on: Aug 15, 2026
- 11:12 am