నరేంద్ర మోదీ
నరేంద్ర మోదీ ప్రస్తుత భారత ప్రధాని. 2014 మేలో తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి దేశ ప్రధాని అయ్యారు. దేశ ప్రధాని కావడానికి ముందు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు.
నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో కూడా పనిచేశారు. ఆయన గుజరాత్లోని వాద్నగర్లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.
2014 లోక్సభలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధించింది. దీని తర్వాత, 2019లో కూడా బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ మళ్లీ భారత ప్రధాని అయ్యారు. 2014 నుంచి బీజేపీ మోదీ పేరును ప్రధాన అస్త్రంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించింది.
తన హయాంలో, ప్రధాని మోడీ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇది అయనపై దేశ ప్రజల్లో ఆదరణను మరింత పెంచింది. ఈ నిర్ణయాలలో పాకిస్థాన్లో సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ చట్టం అమలు మొదలైనవి ఉన్నాయి.
ఇంకా చదవండి‘నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్ సంకల్ప్’ అభియాన్కు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ
దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ 'నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్ సంకల్ప్' అభియాన్కు శ్రీకారం చుట్టారు. 100 వారాల పాటు కొనసాగే ఈ దేశవ్యాప్త ప్రచారంలో యువత, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి.
- Ram Naramaneni
- Updated on: Aug 2, 2026
- 11:20 am
ఎయిర్ పోర్ట్ లాంచ్.. ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం!
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉత్తరాంధ్రకు రావడం తన అదృష్టమని పేర్కొంటూ, ఈ విమానాశ్రయం ఆంధ్ర యువత భవిష్యత్తుకు లాంచ్ప్యాడ్గా నిలుస్తుందన్నారు. 13 వేల మంది గిరిజన మహిళల థింసా నృత్యాన్ని ప్రశంసించిన మోదీ, చంద్రబాబు విజన్ను అభినందించారు.
- SN Pasha
- Updated on: Aug 1, 2026
- 1:40 pm
Watch: ఎగిరే పక్షి.. అద్భుతం.. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం.. !
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ద్వారం తెరుచుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2026 ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, అరకు లోయ ప్రకృతి అందాలు, గిరిజన చుట్టిళ్ల వాస్తుశిల్పం, ఎగిరే పక్షి ఆకృతిని ప్రతిబింబించేలా టెర్మినల్ భవనాన్ని అత్యాధునికంగా నిర్మించారు.
- Balaraju Goud
- Updated on: Aug 1, 2026
- 12:52 pm
ప్రధాని మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ జాతికి అంకితం..
విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (ఆగస్టు 1) ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
- Balaraju Goud
- Updated on: Aug 1, 2026
- 11:48 am
Watch: ప్రపంచ రికార్డు థింసాతో ప్రధానికి గ్రాండ్ వెల్కమ్.. భోగాపురం మెరిసింది..
విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆకాశం నుంచి చూస్తే అద్భుతంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు విమానాశ్రయ ప్రాంగణంలో వేలాది మంది గిరిజన కళాకారులు సంప్రదాయ థింసా నృత్యం ప్రదర్శించారు.
- Balaraju Goud
- Updated on: Aug 1, 2026
- 11:12 am
ప్రధాని మోదీకి థింసా నృత్యంతో స్వాగతం..! ఏకంగా 13,500 మందితో..
విశాఖలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఆయనకు 13,500 మంది గిరిజన మహిళలు, బాలికలు థింసా నృత్యంతో ఘన స్వాగతం పలకనున్నారు. తెలుగు సంస్కృతి ప్రతిబింబించే కళాఖండాలతో విమానాశ్రయాన్ని అలంకరించగా, బహిరంగ సభలో ప్రధాని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు.
- SN Pasha
- Updated on: Aug 1, 2026
- 8:12 am
PM Modi in AP Live: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. ఇది, ఇప్పటి తరం విమానాశ్రయం.. దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్.. జెన్జీకి తగ్గట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ, న్యూయెస్ట్ ఐడియాలజీతో రూపుదిద్దుకుంది. ప్రపంచస్థాయి ప్రమాణాలు-వసతులు ఈ ఎయిర్పోర్ట్ సొంతం. మొత్తం, రూ.5,640 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. 36 నెలల టార్గెట్ పెట్టుకుని నిర్మాణం ప్రారంభిస్తే.. 31 నెలల రికార్డు టైమ్లోనే పూర్తిచేశారు.
- Balaraju Goud
- Updated on: Aug 1, 2026
- 2:15 pm
ఆ విద్యార్థులను క్షమిస్తున్నా.. వారికి మార్గనిర్దేశం అవసరం: ప్రధాని మోదీ
తనను, దివంగత తల్లిని దూషించిన విద్యార్థులను క్షమిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వారిని శిక్షించడం కంటే సరైన మార్గం చూపించాలని పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని కోరుతూ, జీరో ఎఫ్ఐఆర్ నేపథ్యం లో ఈ వ్యాఖ్యలు చేశారు.
- SN Pasha
- Updated on: Aug 1, 2026
- 9:01 am
ఇన్స్ట్రాగ్రామ్ వేదికగా మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ.. ఈసారి ఏమన్నారంటే..?
దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రవేశ పరీక్షల్లో వరుసగా వెలుగుచూసిన పేపర్ లీక్ ఘటనలకు కేంద్రం అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (Prevention of Unfair Means) సవరణ బిల్లు–2026 కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. బుధవారం (జూలై 29) లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు, గురువారం (జూలై 30) రాజ్యసభలో కూడా మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. 'ఇండియా' కూటమికి చెందిన పలు ప్రతిపక్ష పార్టీలు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసినప్పటికీ బిల్లు ఆమోదం పొందింది.
- Balaraju Goud
- Updated on: Jul 31, 2026
- 7:32 am
PM Modi: పశ్చిమాసియాలో భీకర యుద్ధం.. CCSతో ప్రధాని మోదీ అత్యవసర భేటీ.. కీలక సూచనలు..
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసరంగా కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం నిర్వహించారు. ఇంధన భద్రత, ఎరువుల సరఫరా, నిత్యావసర వస్తువుల లభ్యత, విదేశాల్లోని భారతీయుల రక్షణ వంటి అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 30, 2026
- 8:02 pm
Anti-Paper Leak Bill 2026: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం.. కీలక నిబంధనలు ఇవే..
యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో సభ్యులు బిల్లుకు ఆమోదం తెలిపారు. కాగా, విపక్షాల సవరణలు విగిపోయాయి.. బిల్లు ఆమోదం అనంతరం విపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ రేపటికి వాయిదా పడింది. పరీక్షా పేపర్ లీక్ కు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకునేలా Anti-Paper Leak Bill 2026 రూపొందించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 29, 2026
- 7:26 pm
ఆగస్టు 17 నుంచి విశాఖ విమానాశ్రయం నుంచి సేవలు నిలిపివేత.. కేంద్రం ఆదేశాలు జారీ!
ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారం కానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి భోగాపురం విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రకటించింది.
- Balaraju Goud
- Updated on: Jul 29, 2026
- 11:52 am