AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ ప్రస్తుత భారత ప్రధాని. 2014 మేలో తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి దేశ ప్రధాని అయ్యారు. దేశ ప్రధాని కావడానికి ముందు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు.

నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో కూడా పనిచేశారు. ఆయన గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.

2014 లోక్‌సభలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధించింది. దీని తర్వాత, 2019లో కూడా బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ మళ్లీ భారత ప్రధాని అయ్యారు. 2014 నుంచి బీజేపీ మోదీ పేరును ప్రధాన అస్త్రంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించింది.

తన హయాంలో, ప్రధాని మోడీ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇది అయనపై దేశ ప్రజల్లో ఆదరణను మరింత పెంచింది. ఈ నిర్ణయాలలో పాకిస్థాన్‌లో సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ చట్టం అమలు మొదలైనవి ఉన్నాయి.

ఇంకా చదవండి

తమిళనాడు స్వేచ్ఛ, మార్పును కోరుకుంటోంది.. డీఎంకేకు కౌంట్‌డౌన్ ప్రారంభంః ప్రధాని మోదీ

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయాలు ఉపందుకున్నాయి. ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనే మధురాంతకంలో నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈసందర్భంగా డీఎంకే పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా విమర్శించారు.

యువతరానికి బీజేపీ బాధ్యతలు.. కొత్త అధ్యక్షుడిగా అతి పిన్న వయస్కుడైన నితిన్ నబిన్..!

భారతీయ జనతా పార్టీ (BJP) సీనియర్ నాయకుడు నితిన్ నబిన్ ఆ పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుత అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా స్థానంలో ఆయన ఈ ఉన్నత పదవిని చేపట్టారు. అత్యల్ప స్థాయి నుంచి ప్రారంభమై, జాతీయ స్థాయికి చేరుకున్న విస్తృతమైన అంతర్గత ఎంపిక ప్రక్రియ ఫలితంగా ఈ నియామకం జరిగింది. 45 సంవత్సరాల వయసులో ఆ పదవిని నిర్వహించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచారు.

పొంగల్ వేడుకల్లో ప్రధాని.. దేశ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొంగల్ జరుపుకున్నారు. దేశవాసులందరికీ పొంగల్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ఈ పండుగ ప్రకృతి, కుటుంబం, సమాజం మధ్య సమతుల్యతను నెలకొల్పడానికి మార్గాన్ని చూపుతుందని అన్నారు. ఆయన కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ ఇంటికి వెళ్లి అన్ని ఆచారాలతో పూజలు చేశారు.

PM Modi: ఫ్రెడరిక్ మెర్జ్ తో కలిసి కైట్ ఫెస్టివల్‌ లో పాల్గొన్న ప్రధాని మోదీ

అహ్మదాబాద్‌లోని సబర్మతీ రివర్ ఫ్రంట్‌ వద్ద అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ పాల్గొన్నారు. ఇద్దరు నేతలు భారత్, జర్మనీ జాతీయ పతాకాల పోలికలతో ఉన్న పతంగులను ఎగురవేశారు. ఇది ఇరు దేశాల మధ్య మైత్రికి ప్రతీకగా నిలిచింది. అహ్మదాబాద్‌లోని సబర్మతీ నదీ తీరం వద్ద అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ సందడి నెలకొంది.

  • Phani CH
  • Updated on: Jan 12, 2026
  • 5:37 pm

‘మతపరమైన ఉగ్రవాదులు చరిత్ర పుటలకు పరిమితం..’ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో ప్రధాని మోదీ

"ఈ రోజు, యావత్ దేశం, నలుమూలల నుండి విచ్చేసిన లక్షలాది మంది ప్రజలు మనతో చేరారు. వారందరికీ జై సోమనాథ్ అశీస్సులు ఉంటాయి. ఈ సమయం అద్భుతం, ఈ వాతావరణం అద్భుతం, ఈ వేడుక అద్భుతం. ఒక వైపు, మహాదేవుడు, మరోవైపు, సముద్రపు అలలు, సూర్యకిరణాలు, మంత్రాల ప్రతిధ్వని, ఈ విశ్వాసం ఉప్పెన, ఈ దైవిక వాతావరణంలో సోమనాథ్ భక్తుల ఉనికి.. ఈ సందర్భాన్ని గొప్పగా.. దివ్యంగా మారుస్తున్నాయి" అని ప్రధాని మోదీ అన్నారు.

PM Modi: చేతిలో త్రిశూలం.. నుదిటిపై తిలకం.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ వేడుకల్లో ప్రధాని మోదీ..

భారతీయ నాగరికత ఎదురుదెబ్బలను తట్టుకుని నిలబడిన ధైర్యానికి నిలువెత్తు సాక్ష్యం సోమనాథ్ క్షేత్రం. సరిగ్గా వెయ్యేళ్ల క్రితం సోమనాథ్ ఆలయంపై జరిగిన మొదటి దాడికి గుర్తుగా, ఆ చారిత్రక ఘట్టాన్ని సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌గా మారుస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు రోజుల గుజరాత్ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఆధ్యాత్మికత, అభివృద్ధి మేళవింపుగా సాగుతున్న ఈ పర్యటనలో ఎన్నో విశేషాలు నెలకొన్నాయి.

సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. ఓంకార మంత్రం జపించిన నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు రోజుల గుజరాత్ పర్యటనను శనివారం సోమనాథ్‌లో ప్రారంభించారు. శనివారం సాయంత్రం రాజ్‌కోట్ నుండి హెలికాప్టర్‌లో అక్కడికి చేరుకున్న ఆయన అక్కడ రోడ్ షో నిర్వహించారు. ప్రధానిని చూడటానికి రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరారు. జనవరి 10 నుండి 12 వరకు ప్రధాని మోదీ గుజరాత్‌లో పర్యటిస్తారు.

భారతదేశంలో తయారు చేసే ప్రతిదీ, ప్రపంచం కోసమే అయ్యి ఉండాలిః ప్రధాని మోదీ

కాలక్రమేణా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం పెరుగుతోంది. ఇంతలో, 2026 ఫిబ్రవరిలో భారతదేశంలో AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నిర్వహించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సమ్మిట్‌ను ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం (జనవరి 08) ఉదయం లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో భారత AI స్టార్టప్‌లతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

భారతదేశాన్ని తక్కువ అంచనా వేయకండి.. బ్రిటన్ – జపాన్‌లను అధిగమిస్తోంది.. త్వరలోనే..!

భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ 2027 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుందని అంచనా వేసింది. పెట్టుబడి బ్యాంకు భారతదేశ వాస్తవ GDP వృద్ధి 2027 ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

PM Modi: భారత్ వైపు ప్రపంచం చూపు.. విశ్వాసానికి ప్రతీక సోమనాథ్‌ ఆలయం.. ప్రధాని మోదీ ప్రత్యేక వ్యాసం..

సోమనాథ్‌ ఆలయం.. ఈ పేరు తలచుకుంటే చాలు మన హృదయాలు, మనసులలో సగర్వభావన నిండిపోతుంది. శతాబ్దాల పాటు విదేశీ దాడులు, ధ్వంశాలు జరిగినా కూడా సోమనాథ్‌ ఆలయం.. భారతీయుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. పశ్చిమతీరంలో గుజరాత్‌లో ప్రభాస్‌ పాటణ్‌ వద్ద కొలువైన ఈ మహత్తర ఆలయం.. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇదొకటి..

వరి సాగులో చైనాను అధిగమించిన భారత్.. కొత్తగా 184 పంట రకాలు ఆవిష్కరణ.. త్వరలోనే..

ప్రపంచంలో అత్యధికంగా బియ్యం ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ నంబర్ 1 స్థానానికి చేరింది. భారత్ ప్రపంచానికి బియ్యం ఇచ్చే స్థితిలో ఉంది. వ్యవసాయ రంగంలో శక్తి వంతమైన భారత్ గా రూపుదిద్దుకుంటుంది.. ప్రధాని మోదీ నేతృత్వంలో వికసిత భారత మహా యజ్ఞం జరుగుతుంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం ఒక విత్తనంగా ఉందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్..

అంబరాన్నంటుతున్న న్యూ ఇయర్‌ సంబరాలు.. దేశప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

సరికొత్త లైటింగ్స్​, లేజర్‌ షోలు, టపాసుల మోతలు, కేక్‌ కటింగ్‌లు, యువత ఉత్సాహం నడుమ కొత్త సంవత్సరం 2026 ఘనంగా ప్రారంభమైంది. నూతన సంవత్సర వేడుకలు అంతటా అట్టహాసంగా జరిగాయి. ప్రపంచ దేశాలతో పాటు దేశవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. కొత్త ఆశలు, ఆశయాలతో హ్యాపీ న్యూ ఇయర్‌ అంటూ 2026కి ఘన స్వాగతం పలికారు.