నరేంద్ర మోదీ
నరేంద్ర మోదీ ప్రస్తుత భారత ప్రధాని. 2014 మేలో తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి దేశ ప్రధాని అయ్యారు. దేశ ప్రధాని కావడానికి ముందు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు.
నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో కూడా పనిచేశారు. ఆయన గుజరాత్లోని వాద్నగర్లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.
2014 లోక్సభలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధించింది. దీని తర్వాత, 2019లో కూడా బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ మళ్లీ భారత ప్రధాని అయ్యారు. 2014 నుంచి బీజేపీ మోదీ పేరును ప్రధాన అస్త్రంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించింది.
తన హయాంలో, ప్రధాని మోడీ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇది అయనపై దేశ ప్రజల్లో ఆదరణను మరింత పెంచింది. ఈ నిర్ణయాలలో పాకిస్థాన్లో సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ చట్టం అమలు మొదలైనవి ఉన్నాయి.
అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న ప్రతిష్టాత్మక 'వీబీజీ రామ్ జీ' (వికసిత్ భారత్ గ్రీన్ - రాష్ట్రీయ గ్రామీణ మౌలిక సదుపాయాలు) పథకం పేదల జీవితాలనే మార్చే పథకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లె సభ నుంచి VBG RAM G పథకాన్ని సీఎం చంద్రబాబు ఘనంగా ప్రారంభించారు. గతంలో నరేగా పథకం రాయలసీమ నుంచే ప్రారంభమైందని, ఇప్పుడు ఈ చారిత్రాత్మక పథకం కూడా ఇక్కడి నుంచే ఆవిష్కృతం కావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చేలా పథకాన్ని అమలు చేస్తామన్నారు.
- Balaraju Goud
- Updated on: Jul 2, 2026
- 1:42 pm
మోదీ మార్క్ వ్యూహం..! వర్షాకాల సమావేశాల తర్వాతే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?
కేంద్రంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంటూ వస్తున్న ఊహాగానాలకు బ్రేక్ పడేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి మంత్రివర్గ మార్పుల కంటే కీలక చట్టాలను ఆమోదింపజేసుకోవడానికే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. జూలై మూడవ వారంలో బహుశా జూలై 20 నుండి ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాల ముగిసిన తర్వాత, అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ఈ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని సమాచారం.
- Balaraju Goud
- Updated on: Jun 30, 2026
- 4:33 pm
PM Modi: ప్రధాని మోదీకి మరో అరుదైన ఘనత.. సెషెల్స్ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కారం..
పర్యావరణ పరిరక్షణలో విశేష కృషికి గాను ప్రధాని నరేంద్ర మోదీకి సెషెల్స్ దేశ అత్యున్నత అధ్యక్ష పురస్కారం 'గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్' లభించింది. ఈ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా మోదీ నిలిచారు. బ్లూ ఎకానమీ, వాతావరణ మార్పులపై పోరాటం, పర్యావరణ హిత కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని సెషెల్స్ ప్రభుత్వం ప్రదానం చేసింది.
- Gopikrishna Meka
- Updated on: Jun 28, 2026
- 4:34 pm
PM Modi Mann ki Baat: ప్రతి వర్షపు నీటి బొట్టును పరిరక్షించుకోవాలి: మన్ కీ బాత్లో ప్రధాని మోదీ కీలక సూచనలు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జల సంరక్షణ పిలుపునిచ్చారు.. ప్రతి వర్షపు నీటి బొట్టును పరిరక్షించుకోవాలని మోదీ సూచించారు.. "క్యాచ్ ది రెయిన్" అనే ప్రచారాన్ని ఎక్కడా తక్కువ చేయవద్దని హితవు పలికారు. వర్షాకాలంలో నీటిని ఒడిసి పట్టుకోవడం సమిష్టి బాధ్యత అని ప్రధాని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (జూన్ 28) తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 135వ ఎపిసోడ్లో ప్రసంగించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jun 28, 2026
- 2:40 pm
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జంతువు దగ్గరకు మోదీ.. భారత్-సీషెల్స్ సరికొత్త దౌత్యానికి ‘జోనాథన్’ ప్రతీక!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (జూన్ 27) తన మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సీషెల్స్ చేరుకున్నారు. భారతదేశానికి, హిందూ మహాసముద్ర ద్వీపసమూహమైన సీషెల్స్కు మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
- Balaraju Goud
- Updated on: Jun 27, 2026
- 2:12 pm
సన్నిహిత సంబంధాలు – వ్యూహాత్మక భాగస్వామ్యం.. త్వరలో భారత్ పర్యటనకు డొనాల్డ్ ట్రంప్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది 2027 ఆరంభంలో భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పర్యటనకు సంబంధించిన వివరాలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అధికారికంగా ప్రకటించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను, వ్యూహాత్మక అంశాలను ఖరారు చేసేందుకు తాను త్వరలోనే భారతదేశంలో పర్యటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
- Balaraju Goud
- Updated on: Jun 27, 2026
- 11:36 am
AI యుగంలో సరికొత్త విప్లవం.. హైదరాబాద్లో దేశంలోనే తొలి ‘డేటా సెంటర్ సిటీ’!
సాంకేతిక రంగంలో ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హైదరాబాద్ మహానగరం, ఇప్పుడు మరో సంచలన ప్రాజెక్టుకు వేదిక కాబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ను తట్టుకునేందుకు భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా, కేవలం డేటా సెంటర్ల కోసమే ఒక పూర్తి 'డేటా సెంటర్ నగరాన్ని' (Data Center City) అభివృద్ధి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో ఈ ప్రాజెక్ట్ దేశంలోనే ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.
- Prabhakar M
- Updated on: Jun 26, 2026
- 11:59 am
ఢిల్లీలో పోటీ చేస్తే 10 లక్షల ఓట్లు వస్తాయి.. భారత పర్యటనపై ఇటలీ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని రాసిన నూతన పుస్తకం 'జార్జియాస్ విజన్' (Giorgias Vision) ప్రస్తుతం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ పుస్తకంలో ఆమె 2023లో తాను భారతదేశంలో పర్యటించినప్పటి మధుర స్మృతులను ఆప్యాయంగా గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా న్యూఢిల్లీ వీధుల్లో తన చిరునవ్వుతో కూడిన స్వాగత పోస్టర్లను చూసి, ఇటలీ ఉప ప్రధానమంత్రి ఆంటోనియో తజానీ వేసిన ఒక చమత్కారమైన జోక్ను ఆమె ఇందులో ప్రస్తావించారు.
- Balaraju Goud
- Updated on: Jun 25, 2026
- 6:11 pm
PM Modi : ఆరోగ్యానికి యోగా చాలా అవసరం.. దీన్ని ఒకే రోజుకు పరిమితం చేయొద్దు- ప్రధాని మోదీ
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో ఏర్పాటు చేసిన యోగా డే వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బీజేపీ తొలిసారి అధికారం చేపట్టాక యోగా వేడుకలకు కేంద్రం బెంగాల్ను ఎంచుకుంది. నగరంలోని రెడ్ రోడ్డులో ఈ వేడుకల్లో బెంగాల్ సీఎం సహా 35 వేల మంది పాల్గొన్నారు.
- Anand T
- Updated on: Jun 21, 2026
- 9:03 am
రెడ్ రోడ్లో యోగా మహాసంగమం.. ప్రధాని మోదీ నేతృత్వంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు కోల్కతా ముస్తాబైంది. జూన్ 21న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరిగే ప్రధాన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహించనున్నారు. "యోగా ఫర్ హెల్తీ ఏజింగ్" అనే థీమ్తో ఈ ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ఉంది.
- Balaraju Goud
- Updated on: Jun 20, 2026
- 5:21 pm
అన్నదాతలకు శుభవార్త.. సుఖీభవ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లో రూ.3,125 కోట్ల జమ!
ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత ఆర్థిక సాయాన్ని శనివారం (జూన్ 20) విడుదల చేయనుంది. రైతుల పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు లబ్ధి పొందనున్నారు.
- Balaraju Goud
- Updated on: Jun 19, 2026
- 4:23 pm
రాజ్యసభలో పెరుగుతున్న బీజేపీ బలం.. మూడింట రెండు వంతుల మెజారిటీ దిశగా ఎన్డీఏ..!
కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఇప్పుడు రాజ్యసభలోనూ తన బలాన్ని మరింత పెంచుకుంటున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏకు అనుకూలంగా రావడంతో, ఆ కూటమి సంఖ్యాబలం గణనీయంగా పెరిగింది. దీంతో భవిష్యత్తులో కీలక బిల్లులను ఆమోదించుకునే దిశగా బీజేపీ మరింత బలపడుతున్నట్లు కనిపిస్తోంది.
- Balaraju Goud
- Updated on: Jun 19, 2026
- 2:53 pm