నరేంద్ర మోదీ
నరేంద్ర మోదీ ప్రస్తుత భారత ప్రధాని. 2014 మేలో తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి దేశ ప్రధాని అయ్యారు. దేశ ప్రధాని కావడానికి ముందు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు.
నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో కూడా పనిచేశారు. ఆయన గుజరాత్లోని వాద్నగర్లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.
2014 లోక్సభలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధించింది. దీని తర్వాత, 2019లో కూడా బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ మళ్లీ భారత ప్రధాని అయ్యారు. 2014 నుంచి బీజేపీ మోదీ పేరును ప్రధాన అస్త్రంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించింది.
తన హయాంలో, ప్రధాని మోడీ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇది అయనపై దేశ ప్రజల్లో ఆదరణను మరింత పెంచింది. ఈ నిర్ణయాలలో పాకిస్థాన్లో సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ చట్టం అమలు మొదలైనవి ఉన్నాయి.
ఇథియోపియా పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి మిన్నంటిన హర్షధ్వానాలు.. తొలి విదేశీ నేతగా రికార్డ్
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇథియోపియా పర్యటన ముగించుకుని, ఒమన్కు చేరుకున్నారు. గురువారం (డిసెంబర్ 18)నాడు ఒమన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోనున్నారు. ఇథియోపియా పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగానికి హర్షధ్వానాలు మిన్నంటాయి. వ్యవస్థ గతంలోనే బందీగా ఉంటే ప్రపంచం ముందుకు సాగలేదని ప్రధాని మోదీ అన్నారు.
- Balaraju Goud
- Updated on: Dec 17, 2025
- 10:13 pm
65 అడుగుల ఎత్తైన విగ్రహాలు, 65 ఎకరాలలో విస్తరించిన సముదాయం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ
మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా డిసెంబర్ 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్నోకు వెళతారు. ఈ పర్యటనలో భాగంగా హర్దోయ్ రోడ్డులో కొత్తగా నిర్మించిన "రాష్ట్ర ప్రేరణ స్థల్"ను ఆయన ప్రారంభిస్తారు. ప్రధాని మోదీ పర్యటనకు సన్నాహకంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం (డిసెంబర్ 17) "రాష్ట్ర ప్రేరణ స్థల్"ను పరిశీలించారు.
- Balaraju Goud
- Updated on: Dec 17, 2025
- 5:43 pm
PM Modi: ఇథియోపియా గడ్డపై భారత సాంస్కృతిక గీతం.. వందేమాతరం ఆలాపనతో మోదీ భావోద్వేగం!
ఇథియోఫియా ప్రధాని అబీ అహ్మద్ ఏర్పాటు చేసిన విందుకు భారత ప్రధాని మోదీ హాజరయ్యారు. మోదీ అక్కడికి వెళ్లిన తర్వాత ఇథియోపియన్ గాయకులు భారతీయ సాంస్కృతిక గీతం వందేమాతరాన్ని పాడి వినపించారు. విదేశీ గడ్డపై భారత సాంస్కృతిక గీతాన్ని విన్న ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో సంతోషించారు.
- Anand T
- Updated on: Dec 17, 2025
- 1:00 pm
PM Modi: ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా.. ప్రధాని మోదీని వరించిన మరో అత్యున్నత పురస్కారం
ప్రధాని నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారమైన ‘ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ను ఆదేశ ప్రధాని అబీ అహ్మద్ అలీ మంగళవారం ప్రధాని మోదీకి అందజేశారు. భారత్-ఇథియోపియా మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక ప్రాత పోశించినందుకు గాను ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. దీంతో ప్రపంచంలో ఈ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోదీ నిలిచారు.
- Anand T
- Updated on: Dec 17, 2025
- 9:21 am
‘భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకం..’ ఆస్ట్రేలియాకు అండగా ఉంటామని ప్రకటించిన ప్రధాని మోదీ!
ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండి బీచ్లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (డిసెంబర్ 14, 2025) తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ తన సంతాపాన్ని తెలియజేశారు. ఆస్ట్రేలియా పౌరులకు ప్రధాని మోదీ సంఘీభావం ప్రకటించారు. ఈ దుఃఖ సమయంలో ఆస్ట్రేలియా ప్రజలకు పూర్తి సంఘీభావంగా నిలుస్తామని అన్నారు.
- Balaraju Goud
- Updated on: Dec 14, 2025
- 10:30 pm
బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబిన్.. అభినందించిన ప్రధాని మోదీ
భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిని ప్రకటించింది. బీహార్ మంత్రి నితిన్ నబిన్ పార్టీ కొత్త తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన జెపి నడ్డా స్థానంలో పార్టీ కొత్త నాయకుడిగా నియమితులవుతారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన నితిన్ నవీన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా అభినందించారు.
- Balaraju Goud
- Updated on: Dec 14, 2025
- 7:00 pm
PM Modi: కామ్రేడ్ల కంచుకోటలో ఎగిరిన బీజేపీ జెండా.. ప్రధాని మోదీ సంచలన ట్విట్..
కేరళలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేసింది. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లోని 101 వార్డులలో భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) 50 వార్డులను గెలుచుకుని సరికొత్త చరిత్రను లిఖించింది.
- Shaik Madar Saheb
- Updated on: Dec 13, 2025
- 4:05 pm
జనాభా లెక్కలు, కోల్ సేతు, రైతుకు మద్దతు.. ప్రధాని మోదీ కేబినెట్ కీలక నిర్ణయం..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం (డిసెంబర్ 12, 2025) జరిగిన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా మూడు నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2027 జనాభా లెక్కలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు.. ఇందు కోసం రూ. 11,718 కోట్ల బడ్జెట్ ఆమోదించింది.
- Balaraju Goud
- Updated on: Dec 12, 2025
- 5:00 pm
అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ప్రధాని మోదీ ఫోన్ కాల్.. ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పురోగతి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించినట్లు సమాచారం. భారతదేశం-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని ఇద్దరు నాయకులు సమీక్షించారు. వాణిజ్యం, కీలక సాంకేతికతలు, ఇంధనం, రక్షణ, భద్రతా రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై ప్రధాని మోదీ - ట్రంప్ చర్చించారు.
- Balaraju Goud
- Updated on: Dec 11, 2025
- 8:08 pm
‘మీ డబ్బు, మీ హక్కు’ ఉద్యమంలో పాల్గొనండి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!
మీరు, లేదా మీ పూర్వీకులు.. బ్యాంకులు, లేదా నాన్ బ్యాంకింగ్ సంస్థల్లో మర్చిపోయిన, మిగిలిపోయిన సొత్తు మీకు దక్కే ఛాన్స్ను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. కేంద్రం ఇటీవల ఈ డబ్బులు తీసుకునేందుకు సులువైన వెసులుబాటు కల్పించింది. సదరు నగదుకు మీరు హక్కుదారులు, వారసులైతే, బ్యాంకుల్లో నిరూపయోగంగా ఉన్న సొమ్ములు చాలా సులభంగా తీసుకుకొచ్చారు.
- Balaraju Goud
- Updated on: Dec 10, 2025
- 11:40 am
నిబంధనలు, చట్టాలు ప్రజల మేలు కోరకే.. వేధించడానికి కాదుః ప్రధాని మోదీ
మంగళవారం ఉదయం పార్లమెంట్ హౌస్లో NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ప్రధాని మోడీతో సహా NDA ఎంపీలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. బీహార్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించినందుకు NDA నాయకులు ప్రధాని మోదీని సత్కరించారు. ఈ సమావేశంలో, ప్రధానమంత్రి పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి ప్రసంగించి అనేక అంశాలపై చర్చించారు.
- Balaraju Goud
- Updated on: Dec 9, 2025
- 6:07 pm
Parliament Winter Session 2025: లోక్సభలో వందేమాతరం గేయంపై ప్రత్యేక చర్చ ప్రారంభించిన ప్రధాని
వందేమాతర గీతం వరస మారుతున్నది. తరం మారుతున్నది..ఆ స్వరం మారుతున్నదీ అన్నాడో కవి. కానీ ఎవరెన్ని అపస్వరాలు పలుకుతున్నా.. తరాలుగా ఊరూవాడా ప్రతిధ్వనిస్తూనే ఉంది వందేమాతర గీతం. 150 వసంతాలు పూర్తిచేసుకున్న జాతీయ గీతంపై పార్లమెంట్ సాక్షిగా పదిగంటల ప్రత్యేక చర్చ జరుగుతుంది. ఆ డీటేల్స్ ఈ కథనంలో ...
- Ram Naramaneni
- Updated on: Dec 8, 2025
- 12:35 pm