
నరేంద్ర మోదీ
నరేంద్ర మోదీ ప్రస్తుత భారత ప్రధాని. 2014 మేలో తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి దేశ ప్రధాని అయ్యారు. దేశ ప్రధాని కావడానికి ముందు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు.
నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో కూడా పనిచేశారు. ఆయన గుజరాత్లోని వాద్నగర్లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.
2014 లోక్సభలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధించింది. దీని తర్వాత, 2019లో కూడా బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ మళ్లీ భారత ప్రధాని అయ్యారు. 2014 నుంచి బీజేపీ మోదీ పేరును ప్రధాన అస్త్రంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించింది.
తన హయాంలో, ప్రధాని మోడీ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇది అయనపై దేశ ప్రజల్లో ఆదరణను మరింత పెంచింది. ఈ నిర్ణయాలలో పాకిస్థాన్లో సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ చట్టం అమలు మొదలైనవి ఉన్నాయి.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తత గురించి బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఇరాన్తో ప్రస్తుత పరిస్థితి గురించి నెతన్యాహు తనకు తెలియజేసినట్లు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. భారతదేశం ఆందోళనలను ఆయనకు తెలియజేశానని, ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని స్పష్టం చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
- Balaraju Goud
- Updated on: Jun 13, 2025
- 8:39 pm
మోదీ కేబినెట్ కీలక నిర్ణయం.. రూ. 6,405 కోట్ల విలువైన రెండు రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రెండు ముఖ్యమైన డబ్లింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులకు మొత్తం రూ.6,405 కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది రైల్వేల కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా సరుకు రవాణా, ప్రయాణీకుల రవాణా సామర్థ్యాన్ని పెంచుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
- Balaraju Goud
- Updated on: Jun 11, 2025
- 4:25 pm
అనవసరమైన వాక్చాతుర్యాన్ని మానుకోండి.. మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ!
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రులు తమ తమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన విషయాలపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇతర అంశాలపై మాట్లాడటం మానుకోండి. అలాగే, అనవసరమైన ప్రకటనలు చేయవద్దు. మంత్రిత్వ శాఖ పనితీరు గురించి మీడియా సమావేశాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని ప్రధాని మోదీ సూచించారు.
- Balaraju Goud
- Updated on: Jun 11, 2025
- 4:07 pm
PM Modi: 11 ఏళ్లు.. 11 అతిపెద్ద నిర్ణయాలు.. ప్రధాని మోదీ పాలనలో అమృతకాలం..
సరిగ్గా 11 సంవత్సరాల క్రితం, దూరదృష్టి కలిగిన ఒక నాయకుడు భారత రాజకీయాల్లో అతిపెద్ద సింహాసనాన్ని అధిష్టించారు. ఆయన పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ! 11 ఏళ్ల క్రితం భారత ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారంతో, దేశంలో ఒక కొత్త శకం ప్రారంభమైంది. దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది.
- Ravi Kiran
- Updated on: Jun 11, 2025
- 4:47 pm
ప్రధాని మోదీ మరో సంచలన నిర్ణయం.. ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన విజయాలు, 140 కోట్ల మంది భారతీయుల ఆశీర్వాదాలు, సమిష్టి భాగస్వామ్యంతో భారతదేశం వివిధ రంగాలలో వేగవంతమైన మార్పులను చూసిందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సమిష్టి విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు, ప్రజల మనస్సులలోని సుపరిపాలనను పరీక్షించాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారు.
- Balaraju Goud
- Updated on: Jun 10, 2025
- 3:02 pm
PM Modi: నమో ప్రభుత్వానికి 11 ఏళ్లు.. గర్విస్తున్నానంటూ ప్రధాని మోదీ సంచలన ట్వీట్..
ప్రధాని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వానికి నేటితో ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది జూన్ 9న మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ ప్రభుత్వానికి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘వికసిత్ భారత్కా అమృత్ కాల్’ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రధానిగా 11 ఏళ్ల పాలనపై నరేంద్ర మోదీ సోమవారం ఎక్స్ వేదికగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Jun 9, 2025
- 1:35 pm
11 Years of Modi: 11 ఏళ్ల మోదీ ప్రభుత్వం.. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా భారత్.. నెక్స్ట్ టార్గెట్ అదే..
ఒకప్పుడు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు.. భారత్ దేశం ప్రపంచలోనే శక్తివంతమైన దేశంగా అవతరిస్తోంది.. ఆర్థిక సంస్కరణలు, మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ ప్రజా వస్తువులు.. ఇలా ఎన్నో విషయాలు.. భారతదేశ అభివృద్ధి నమూనాను - ప్రపంచ స్థాయిని పునర్నిర్వచించాయి. దీనంతటికి కారణం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 11 ఏళ్లుగా తీసుకుంటున్న నిర్ణయాలు.. సంస్కరణలు..
- Shaik Madar Saheb
- Updated on: Jun 9, 2025
- 9:33 am
PM Modi: రైతులకు మోడీ సర్కార్ బంపర్ ఆఫర్.. కేవలం 4 శాతం వడ్డీకే రూ. 3 లక్షల రుణం!
PM Modi: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయం నుండి విడుదల చేసిన పోస్ట్లో ఇప్పుడు దేశంలోని లక్షలాది మంది రైతులకు ఆర్థిక జీవనాధారంగా మారిందని ఆర్థిక మంత్రి అన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయడంలో..
- Subhash Goud
- Updated on: Jun 9, 2025
- 7:53 am
భారత్-బంగ్లాదేశ్ను దగ్గర చేసిన బక్రీద్.. ప్రధాని మోదీ శుభాకాంక్షలకు స్పందించిన యూనస్
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ మధ్య ఈద్-ఉల్-అఝా శుభాకాంక్షలు ఇచ్చిపుచ్చుకోవడం భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను బలోపేతం చేసింది. బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత కొనసాగుతున్నప్పటికీ, ఇద్దరు నాయకుల లేఖలు పరస్పర గౌరవం, సహకారాన్ని పెంపొందించాయి. మోదీ బంగ్లాదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయగా, యూనస్ శాంతి, సహకారం ప్రాముఖ్యతను ప్రస్తావించారు. ఈ సంభాషణ రెండు దేశాల మధ్య మెరుగైన సంబంధాల ఆశలను రేకెత్తించింది.
- Balaraju Goud
- Updated on: Jun 8, 2025
- 9:02 pm
ఊహించని విధంగా జాక్ పాట్ కొట్టిన కొత్త జంట.. ఏకంగా ప్రధాని మోదీ నుంచే..!
మహబూబాబాద్ జిల్లాలో ఓ కొత్త జంటకు ఊహించని విధంగా జాక్ పాట్ తగిలింది.. ప్రధానమంత్రిని పెళ్లికి రావాలని లేఖ పంపిన ఆ జంటకు ఊహించని కానుక అందింది. ఏకంగా ప్రధాన మంత్రి సంతకంతో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ అందింది. ఆ జంట ఊహించని కానుకతో ఆనందం తో ఉప్పొంగిపోతున్నారు.
- G Peddeesh Kumar
- Updated on: Jun 8, 2025
- 5:27 pm