నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ ప్రస్తుత భారత ప్రధాని. 2014 మేలో తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి దేశ ప్రధాని అయ్యారు. దేశ ప్రధాని కావడానికి ముందు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు.

నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో కూడా పనిచేశారు. ఆయన గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.

2014 లోక్‌సభలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధించింది. దీని తర్వాత, 2019లో కూడా బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ మళ్లీ భారత ప్రధాని అయ్యారు. 2014 నుంచి బీజేపీ మోదీ పేరును ప్రధాన అస్త్రంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించింది.

తన హయాంలో, ప్రధాని మోడీ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇది అయనపై దేశ ప్రజల్లో ఆదరణను మరింత పెంచింది. ఈ నిర్ణయాలలో పాకిస్థాన్‌లో సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ చట్టం అమలు మొదలైనవి ఉన్నాయి.

ఇంకా చదవండి

BJP Phasewise War: దశలవారీగా కాంగ్రెస్‌పై బీజేపీ యుద్ధం.. ఒక్కో విడతలో ఒక్కో అస్త్రం ప్రయోగం

దేశంలో 7 దశల వారీగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. మూడోసారి అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ దశలవారీగా కాంగ్రెస్‌పై ఎన్నికల యుద్ధం చేస్తోంది. ఒక్కో ఫేజులో ఒక్కో అస్త్రంతో కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

PM Modi: ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ

ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ఫోన్లో మాట్లాడారు. ఇటలీ విమోచన దినోత్సవం సందర్భంగా ఆమెకు భారత్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఇది ఎంతగానో తోర్పడుతుంది. ఇటలీ 79వ విమోచనోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని మెలోనీకి ఫోన్ చేశారు. ఇటలీ ప్రజలకు తన తరఫునుంచి శుభాకాంక్షలు తెలిపారు.

  • Srikar T
  • Updated on: Apr 25, 2024
  • 9:58 pm

Telangana: లోక్ సభ ఎన్నికల శంఖారావం పూరించిన బీజేపీ.. ఈ నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ బహిరంగ సభలు..

సిద్దిపేటలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నికల శంఖారావం పూరించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రం డిగ్రీ కాలేజీ మైదానంలో ‘బీజేపీ విశాల జన సభ’ను నిర్వహించింది. తెలంగాణలో కనీసం 12 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలని ఓటర్లను కోరారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. దేశవ్యాప్తంగా 400కు పైగా స్థానాల్లో కమలాన్ని వికసింపజేయాలన్నారు ఆయన.

  • Srikar T
  • Updated on: Apr 25, 2024
  • 7:56 pm

ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి.. అప్రమత్తమైన సెక్యూరిటీ..

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. సభలో ప్రసంగిస్తుండగా ఉన్నట్లుండి పడిపోయారు. దేశంలో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 370 సీట్లు గెలవాలన్న దృఢనిశ్చయంతో ఉంది కమలం పార్టీ. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలోని పుసాద్ పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.

  • Srikar T
  • Updated on: Apr 25, 2024
  • 6:01 pm

ECI Notice: ప్రధాని మోదీ, రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. ఏప్రిల్ 29లోగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసులు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ విచారణ చేపట్టింది. మతం, కులం, వర్గం, భాష ప్రాతిపదికన విద్వేషం, విభజన సృష్టిస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్‌లు ఆరోపించాయి. ఇద్దరికి నోటీసులు జారీ చేసిన కమిషన్ ఏప్రిల్ 29 ఉదయం 11 గంటలలోపు సమాధానం కోరింది.

PM Modi: నామ్‌దార్లు.. కామ్‌దార్‌లను అవమానించడం కొత్తేమీ కాదు.. రాహుల్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..

రాహుల్ గాంధీ తనపై చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కుల గణన గురించి మాట్లాడినప్పుడు మోదీ... కులం లేదు.. అంటారని.. మీరు OBC ఎలా ఉన్నారు?..అంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ తరుణంలో తనపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. తనపై కాంగ్రెస్ “షెహజాదా” రాహుల్ గాంధీ చేసిన అవమానకరమైన వ్యాఖ్యల పట్ల ప్రజలు కలత చెందవద్దని, కోపగించవద్దని అభ్యర్థిస్తున్నానన్నారు

PM Modi: తల్లులు, సోదరీమణుల ఆప్యాయత చూస్తుంటే, కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయిః ప్రధాని మోదీ

తన తల్లులు, సోదరీమణుల ఆప్యాయత చూసి తన కళ్లలో నీళ్లు తిరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత బీజేపీ నేతలకు కీలక సూచనలు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్వేగభరితమైన పోస్ట్ చేయడం ద్వారా, ప్రజలు, ముఖ్యంగా మహిళలకు అవగాహన కల్పించాలని ప్రధాని మోడీ బీజేపీ నాయకులకు సూచించారు. ఇంతకీ విషయం ఏంటో తెలుసా?

Lok Sabha Election: చనిపోతే ఆస్తిలో 55% ప్రభుత్వానికే.. కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన కాంగ్రెస్ నేత

లోక్‌సభ ఎన్నికలకు రెండో దశ ఓటింగ్‌కు ముందు ఆస్తి పంపిణీపై రాజకీయ గందరగోళం మధ్య, వారసత్వ పన్నుపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా చేసిన ప్రకటనపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఆయన ప్రకటనపై భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టగా, శామ్ పిట్రోడా ప్రకటనకు కాంగ్రెస్ దూరంగా ఉంది.

BJP: దేశ రాజకీయాల్లో సంచలనం.. ఎన్నికలకు ముందే లోక్‌సభ సీటు గెలుచుకున్న బీజేపీ.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..

ఎన్నికల ముందే బీజేపీ తొలి లోక్ సభ సీటు గెలుచుకొని సంచలనం సృష్టించింది.. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లోని ఐదు అసెంబ్లీ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న కాషాయ పార్టీ.. తాజాగా.. లోక్ సభ ఎన్నికలు ముంగట ఒక స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకొని బోణి కొట్టింది. లోక్ సభ ఎన్నికల ఫలితాలకు ముందే.. సూరత్ లోక్‌సభ స్థానం చరిత్ర సృష్టించింది..

PM Modi: ముస్లింల దుస్థితిపై ఎందుకు మాట్లాడరు.. కాంగ్రెస్, ఎస్పీ టార్గెట్‌గా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కాంగ్రెస్, సమాజ్‌వాదీ (ఎస్పీ) పార్టీలపై విరుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు ఎప్పుడూ బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ పబ్బం గడిపాయని.. ముస్లింల అభివృద్ధి కోసం పాటుపడలేదంటూ మండిపడ్డారు. ముస్లింల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం నేను ఏనాడూ ఏమీ చేయలేదని అణగారిన ముస్లింల దుస్థితిపై చర్చిస్తే వారి వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయంటూ పేర్కొన్నారు.

PM Modi: వాళ్లే కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దంటున్నారు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..

లోక్‌సభ ఎన్నికల్లో సుడిగాలి ప్రచారం చేస్తున్నారు మోదీ. రాజస్థాన్‌లో పలు సభలో తనదైన శైలిలో కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. జాలోర్‌లో ప్రచారం నిర్వహించారు ప్రధాని. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్‌కు అభ్యర్ధులు దొరకడం లేదని విమర్శించారు. ఒకప్పుడు 400 సీట్లు గెలిచిన పార్టీ ఇప్పుడు 300 కంటే తక్కువ సీట్లలో పోటీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు మోదీ.

PM Modi: కాంగ్రెస్‌కు అభ్యర్ధులే కరువు.. జాలోర్‌ సభలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..!

లోక్‌సభ ఎన్నికల్లో సుడిగాలి ప్రచారం చేస్తున్నారు మోదీ. రాజస్థాన్‌ లోని జాలోర్‌లో ప్రచారం నిర్వహించారు ప్రధాని . లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్‌కు అభ్యర్ధులు దొరకడం లేదని విమర్శించారు. ఒకప్పుడు 400 సీట్లు గెలిచిన పార్టీ ఇప్పుడు 300 కంటే తక్కువ సీట్లలో పోటీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు మోదీ.

PM Modi: ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చిన కాంగ్రెస్.. బెంగళూరులో కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ఫైర్

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాటకలోని చిక్కబల్లాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్యాక్స్ సిటీని కాంగ్రెస్ ట్యాంకర్ సిటీగా మార్చిందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.

BJP Plan: వరసగా తెలంగాణకు అగ్ర నేతలు.. ఈ నెల చివరి వారంలో రానున్న ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా

తెలంగాణపై భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఫోకస్ పెంచింది. డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ హైకమాండ్... ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ఇందు కోసం ప్రత్యేక షెడ్యూల్ కూడా రెడీ రూపొందించింది.

PM Modi: ఎన్నికల సభలో బాలుడి చేతిలోని చిత్రాన్ని చూసి కన్నీరు పెట్టుకున్న ప్రధాని మోదీ..!

లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు ప్రధాని నరేంద్ర మోదీ. జనాల్లో కనిపిస్తున్న ఉత్సా,హం చూస్తుంటే జూన్‌ నాలుగున ఎలాంటి ఫలితం వస్తుందో స్పష్టంగా కనిపిస్తోందని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈసారి బీజేపీ కూటమి కచ్చితంగా 400 సీట్లు సాధిస్తుందన్నారు. అయితే ఈ సందర్భంగా ప్రధాని మోదీ బహిరంగసభలో ఎమోషనల్‌ అయ్యారు.