నరేంద్ర మోదీ
నరేంద్ర మోదీ ప్రస్తుత భారత ప్రధాని. 2014 మేలో తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి దేశ ప్రధాని అయ్యారు. దేశ ప్రధాని కావడానికి ముందు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు.
నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో కూడా పనిచేశారు. ఆయన గుజరాత్లోని వాద్నగర్లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.
2014 లోక్సభలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధించింది. దీని తర్వాత, 2019లో కూడా బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ మళ్లీ భారత ప్రధాని అయ్యారు. 2014 నుంచి బీజేపీ మోదీ పేరును ప్రధాన అస్త్రంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించింది.
తన హయాంలో, ప్రధాని మోడీ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇది అయనపై దేశ ప్రజల్లో ఆదరణను మరింత పెంచింది. ఈ నిర్ణయాలలో పాకిస్థాన్లో సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ చట్టం అమలు మొదలైనవి ఉన్నాయి.
ఎల్ నినో ముప్పు పొంచి ఉంది.. నీటిని కాపాడుకోండి.. రాష్ట్రాలకు ప్రధాని మోదీ హెచ్చరిక!
వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావాలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో మాట్లాడిన ఆయన, దేశంలోని అన్ని రాష్ట్రాలు నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, రాబోయే వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. 28 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో "వికసిత భారత్@2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి" అనే అంశంపై చర్చ జరిగింది.
- Balaraju Goud
- Updated on: Jun 12, 2026
- 11:26 am
తిరుపతిలో కూటమి గర్జన.. రెండేళ్ల పాలనపై ప్రజల ముందుకు ప్రోగ్రెస్ కార్డ్!
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తిరుపతి వేదికగా శుక్రవారం (జూన్ 12) భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. "2 ఏళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం" పేరుతో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. గత రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రజలకు సమగ్ర నివేదిక అందించేందుకు ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది.
- Balaraju Goud
- Updated on: Jun 12, 2026
- 10:59 am
PM Modi: ప్రపంచం ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంటోంది: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్ సమావేశంలో 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంపై చర్చించారు. మానవాభివృద్దిపై దృష్టి పెట్టాలని మోదీ పిలపునిచ్చారు. ఉపాధి అవకాశాలు పెరగాలంటే యువత నైపుణ్యాలను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో జీడీపీపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు మోదీ.
- Shaik Madar Saheb
- Updated on: Jun 11, 2026
- 9:21 pm
యూరప్లో భారత్ కొత్త గేమ్ ప్లాన్.. భారత ప్రధాని మోదీ తొలిసారి స్లోవేకియా పర్యటన.. ఎందుకింత ప్రాధాన్యత..?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 13 నుంచి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో ఐదు రోజుల పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో ఫ్రాన్స్కు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తున్నప్పటికీ, స్లోవేకియా పర్యటనపై కూడా అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే భారత ప్రధానమంత్రి ఒకరు స్లోవేకియాను ద్వైపాక్షికంగా సందర్శించడం ఇదే తొలిసారి. దీంతో భారత విదేశాంగ వ్యూహంలో ఈ చిన్న యూరోపియన్ దేశానికి పెరుగుతున్న ప్రాధాన్యంపై చర్చ జరుగుతోంది.
- Balaraju Goud
- Updated on: Jun 11, 2026
- 2:12 pm
ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీకి వెల్లువెత్తుతున్న అభినందనలు.. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఏమన్నారంటే?
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ అభినందనలు తెలిపారు. భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడిగా గుర్తింపు పొందిన మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ టిమ్ కుక్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ప్రత్యేక పోస్టు చేశారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచే ఆవిష్కరణలకు మద్దతు అందిస్తున్నందుకు ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
- Balaraju Goud
- Updated on: Jun 11, 2026
- 11:17 am
అమెరికా-ఇరాన్ హోరాహోరీ దాడులు.. కువైట్ ఎమిర్కు ప్రధాని మోదీ అత్యవసర ఫోన్ కాల్!
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అదుపు తప్పి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. శాంతి చర్చల ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ల మధ్య ఘర్షణ రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ ఆసియాలో వేగంగా మారుతున్న భద్రతా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కువైట్ ఎమిర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాతో ఫోన్లో అత్యవసరంగా చర్చించారు.
- Balaraju Goud
- Updated on: Jun 10, 2026
- 1:46 pm
భారత్కు సుదీర్ఘ ప్రధానిగా మోదీ! 4398 రోజుల నెహ్రూ రికార్డుకు బ్రేక్ !
PMO.. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఆఫ్ ఇండియా. దేశ పరిపాలనకు గుండెకాయ లాంటిది. సచివాలయాలు ఎగ్జిక్యూటివ్స్కి అడ్డా ఐనప్పటికీ, కేంద్రమంత్రుల డ్యూటీచార్ట్లు, ప్రోగ్రెస్ రిపోర్టులూ ఖరారయ్యేది మాత్రం పీఎంఓలోనే. ఇండియన్ సివిల్ సర్వీస్కు చెందిన అత్యున్నతస్థాయి అధికారుల మకాం కూడా ఇక్కడే. కేంద్ర మంత్రిత్వశాఖల మధ్య సమన్వయం జరిగేది కూడా ఇక్కడే. దేశ గతిని నిర్దేశించే విధాన నిర్ణయాలన్నీ పీఎంఓలోనే డిజైన్ ఔతాయి. అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చే హక్కు కూడా ప్రధాని చేతుల్లోనే ఉండేది. అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అమల్లో ఉంటే, ఇండియాలో మాత్రం ప్రైమ్మినిస్టర్దే సూపర్పవర్. దటీజ్ ది బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమొక్రసీ. అటువంటి పీఎంఓకు దశాబ్దాలపాటు నేతృత్వం వహించే అవకాశం దొరికితే..! ఎస్ PMO of ఇండియాకు లాంగ్టైమ్ కెప్టెన్సీ చేసిన ఘనత దక్కించుకుని ఒకేఒక్కడు అనిపించుకున్నారు నరేంద్ర దామోదర్దాస్ మోదీ.
- Ram Naramaneni
- Updated on: Jun 9, 2026
- 9:40 pm
భారత రాజకీయాల్లో అజేయ శకం.. నెహ్రూ రికార్డు బద్దలు.. ప్రధాని మోదీ భావోద్వేగ పోస్ట్!
భారత రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడింది. సరిగ్గా 12 ఏళ్ల క్రితం 2014 మే 26న దేశ ప్రధానిగా సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీ, నేడు అత్యంత అరుదైన చారిత్రక మైలురాయిని అధిగమించారు. స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా అధికారంలో కొనసాగిన ఎన్నికైన ప్రధానిగా సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ క్రమంలో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న సుదీర్ఘ కాలపు రికార్డును ప్రధాని మోదీ బద్దలు కొట్టారు. జూన్ 9 నాటికి ఆయన పదవిలో విజయవంతంగా 4,398 రోజులను పూర్తి చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు.
- Balaraju Goud
- Updated on: Jun 9, 2026
- 3:06 pm
PM Modi: నెహ్రూను మించి మోదీ సక్సెస్కు కారణం ఇదే.. లెక్కలతో సహా చెప్పిన దేవెగౌడ..
నెహ్రూ హయాంలో రాజకీయం వేరు.. మోదీ హయాంలో రాజకీయం వేరు అని మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అన్నారు. నెహ్రూ రికార్డులను బద్దలు కొడుతూ మోదీ సుదీర్ఘ కాలం ప్రధానిగా ఎలా కొనసాగుతున్నారు? అసలు నెహ్రూ కేబినెట్కు, మోదీ కేబినెట్కు ఉన్న తేడా ఏంటి? జాతీయ ప్రయోజనాల విషయంలో మోదీ తీసుకునే ఆ నిర్ణయం వెనుక ఉన్న రహస్యాలపై దేవెగౌడ కీలక విషయాలు వెల్లడించారు.
- Krishna S
- Updated on: Jun 9, 2026
- 11:58 am
21వ శతాబ్దపు నవభారత దార్శనికుడు.. నరేంద్ర మోదీ నాయకత్వంపై చంద్రబాబు ప్రశంసల జల్లు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ అధ్యక్షుడు శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు రాసిన ఒక ప్రత్యేక వ్యాసం ఇటీవల ప్రముఖ పత్రికలో ప్రచురితమైంది. భారతదేశానికి అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా పనిచేసిన ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించనున్న ప్రధాని నరేంద్ర మోదీ మైలురాయిపై చంద్రబాబు నాయుడు ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ సాధించిన ఈ ఘనత ఆయన నాయకత్వం, దార్శనికతపై భారత ప్రజలు ఉంచిన అచంచలమైన విశ్వాసానికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు.
- Balaraju Goud
- Updated on: Jun 9, 2026
- 11:57 am
ఏడు దశాబ్దాల నిశ్శబ్దం వీడింది.. ప్రధాని మోదీ చొరవతో భారత గడ్డపై చిరుతల సరికొత్త శకం!
భారతదేశ ప్రాచీన కథల్లో, సంస్కృతిలో చిరుతపులికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు అరేబియా ద్వీపకల్పం నుండి భారత ఉపఖండం అంతటా స్వేచ్ఛగా సంచరించిన ఆసియా చిరుతలు, కాలక్రమేణా దేశంలో పూర్తిగా అంతరించిపోయాయి. ఉత్తరాన పంజాబ్ నుండి దక్షిణాదిన తమిళనాడులోని తిరునెల్వేలి వరకు, పశ్చిమాన గుజరాత్-రాజస్థాన్ నుండి తూర్పున బెంగాల్ వరకు ఉన్న పొద అడవులు, పొడి గడ్డి మైదానాలు, సవన్నాలు ఒకప్పుడు వీటికి ఆవాసాలుగా ఉండేవి.
- Balaraju Goud
- Updated on: Jun 7, 2026
- 7:58 pm
కాలం మారింది.. రికార్డు మారింది! నాడు రేడియో కాలపు రాజకీయం.. నేడు రీల్స్ కాలపు పోరాటం..!
భారత ప్రజాస్వామ్య చరిత్రలో జూన్ 10 ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ప్రస్తుత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజున ఒక అరుదైన, చారిత్రాత్మక రికార్డును తన పేరిట లిఖించుకోనున్నారు. స్వతంత్ర భారతదేశంలో ఎన్నికల ద్వారా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన నిలవనున్నారు. దీంతో, దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ నెలకొల్పిన సుదీర్ఘ కాలపు రికార్డును నరేంద్ర మోదీ అధిగమించనున్నారు.
- Balaraju Goud
- Updated on: Jun 6, 2026
- 6:06 pm