నరేంద్ర మోదీ
నరేంద్ర మోదీ ప్రస్తుత భారత ప్రధాని. 2014 మేలో తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి దేశ ప్రధాని అయ్యారు. దేశ ప్రధాని కావడానికి ముందు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు.
నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో కూడా పనిచేశారు. ఆయన గుజరాత్లోని వాద్నగర్లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.
2014 లోక్సభలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధించింది. దీని తర్వాత, 2019లో కూడా బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ మళ్లీ భారత ప్రధాని అయ్యారు. 2014 నుంచి బీజేపీ మోదీ పేరును ప్రధాన అస్త్రంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించింది.
తన హయాంలో, ప్రధాని మోడీ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇది అయనపై దేశ ప్రజల్లో ఆదరణను మరింత పెంచింది. ఈ నిర్ణయాలలో పాకిస్థాన్లో సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ చట్టం అమలు మొదలైనవి ఉన్నాయి.
“చొరబాటుదారులు సామాను సర్దుకోండి.. అక్రమార్కులను వదిలిపెట్టబోము” : ప్రధాని మోదీ
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ సందడి పెరుగుతోంది. శనివారం (ఏప్రిల్ 11) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కట్వా నుండి బెంగాల్ ప్రజల మనోభావాలను వివరిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. తన వెనుక ఉన్న జనసమూహాన్ని చూపిస్తూ, "దేశవాసులారా, మీరు బెంగాల్ ప్రజల మనోభావాలను చూడవచ్చు" అని ఆయన అన్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 11, 2026
- 9:48 pm
ఒకే ఫ్రేమ్లో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ.. పార్లమెంట్లో అరుదైన దృశ్యం.. వీడియో ఇదిగో..!
కేరళ, బెంగాల్, అస్సాం సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోరు కారణంగా రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ క్రమంలోనే శనివారం (ఏప్రిల్ 11) భారత రాజకీయాల్లో ఒక ప్రత్యేక ఘట్టం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అకస్మాత్తుగా ముఖాముఖి తారసపడ్డారు.
- Balaraju Goud
- Updated on: Apr 11, 2026
- 4:08 pm
PM Modi: ప్రధాని మోదీ హత్యకు కుట్ర..? అమెరికా నిఘా సంస్థతో బేరసారాలు.. ముగ్గురు అరెస్ట్!
బీహార్లో సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇందుకు సంబంధించి 22 ఏళ్ల అమన్ తివారీతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. భద్రతా సంస్థలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.
- Balaraju Goud
- Updated on: Apr 10, 2026
- 3:47 pm
భావితరాల కోసం మహిళా రిజర్వేషన్ బిల్లు.. అన్ని రాజకీయ పక్షాలకు ప్రధాని మోదీ పిలుపు
పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల చట్టసవరణ బిల్లుకు కౌంట్డౌన్ ప్రారంభమయ్యింది. విపక్షాలు బిల్లుకు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 16,17,18 తేదీల్లో జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులు హాజరై ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించాలని ప్రధాని మోదీ కోరారు.
- Balaraju Goud
- Updated on: Apr 9, 2026
- 9:48 pm
నిరంకుశ ప్రభుత్వం కూలబోతోంది.. అభివృద్ధి చెందిన బెంగాల్ను నిర్మిస్తాంః ప్రధాని మోదీ
బెంగాల్లో బీజేపీ ప్రభంజనం వీస్తోందని, భవానీపూర్లో పరిస్థితి నందిగ్రామ్ మాదిరిగానే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నిరంకుశ ప్రభుత్వం కూలబోతోందని, బెంగాల్ మార్పు బాటలో పయనిస్తోందని, ఈ ఎన్నికలు అభివృద్ధి చెందిన బెంగాల్ను నిర్మించబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు. బెంగాల్ వ్యాప్తంగా మార్పుల తుఫాను వీస్తోందని ప్రధానమంత్రి అన్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 9, 2026
- 3:27 pm
ఏసుక్రీస్తు బోధనలు.. కరుణను, సామాజిక ఐక్యతను బలోపేతం చేస్తాయిః మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఈస్టర్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు నూతన జీవితానికి ప్రతీక అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శాంతి, ఆనందం, ఐక్యత ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఏసుక్రీస్తు బోధనలు కరుణను ప్రేరేపించి, సామాజిక ఐక్యతను బలోపేతం చేయాలని ప్రధాని కోరారు. మరోవైపు, సెయింట్ పీటర్స్ బసిలికాలో జరిగిన ఈస్టర్ విజిల్ మాస్కు అధ్యక్షత వహించిన పోప్ లియో XIV, విశ్వాసులు భయం, అపనమ్మకం, అసమ్మతిని అధిగమించాలని కోరారు.
- Balaraju Goud
- Updated on: Apr 5, 2026
- 10:32 am
స్నేహమంటే ఇదేరా..! చమురు, గ్యాస్ సంక్షోభం వేళ భారతదేశానికి అండగా నిలిచిన చిన్న దేశాలు..!
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త చమురు, గ్యాస్ సంక్షోభానికి దారితీశాయి. ప్రపంచ ఇంధనంలో 20 శాతాన్ని రవాణా చేసే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ ఉద్రిక్తత ప్రభావం ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారతదేశంపై పడింది. భారతదేశం తన ముడి చమురులో సుమారు 40-50 శాతాన్ని హోర్ముజ్ జలసంధి ద్వారానే దిగుమతి చేసుకుంటుంది.
- Balaraju Goud
- Updated on: Apr 4, 2026
- 12:47 pm
యుద్ధం సాకుగా పాకిస్తాన్ భారత్పై నీచమైన చర్యకు పాల్పడుతోందిః రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పొరుగు దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం (ఏప్రిల్ 2) పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండానే దానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, పొరుగు దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎవరైనా భారతదేశంపై దుస్సాహసానికి పాల్పడవచ్చన్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 2, 2026
- 1:09 pm
ప్రపంచ సంక్షోభం వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. కీలక సుంకాలు రద్దు..!
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా నెలకొన్న ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎరువుల కంపెనీలకు గణనీయమైన ఉపశమనం కల్పించింది. అమ్మోనియం నైట్రేట్పై దిగుమతి సుంకాన్ని మాఫీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పలు పెట్రోకెమికల్ ఉత్పత్తులపై కూడా దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది.
- Balaraju Goud
- Updated on: Apr 2, 2026
- 11:41 am
లోక్సభ ముందుకు ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లు.. మద్దతు పలికిన కాంగ్రెస్, వైసీపీ వాకౌంట్!
అమరావతి చట్టబద్ధతకు మరో కీలక అడుగు పడింది. ఇవాళ బుధవారం (ఏప్రిల్ 01, 2026 ) ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత లోక్సభ ముందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు తీసుకువచ్చారు. అయితే లోక్సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.
- Balaraju Goud
- Updated on: Apr 1, 2026
- 1:07 pm
తేయాకులు కోసి, సెల్ఫీ తీసుకుంటూ.. టీ తోటలో చిరస్మరణీయ అనుభూతిని పొందిన ప్రధాని మోదీ
అస్సాం పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శైలిలో కనిపించారు. దిబ్రుగఢ్లోని ఒక తేయాకు తోటలో కార్మికులను ప్రధాని మోదీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అక్కడి మహిళలతో ముచ్చటించారు. వారితో కలిసి తేయాకు ఆకులు కోశారు. మహిళా కూలీల కోరిక మేరకు వారితో సెల్ఫీలు తీసుకున్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 1, 2026
- 11:39 am
Amaravati: అమరావతికి రాజముద్ర.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు.. లైవ్ వీడియో
పార్లమెంట్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ద్వారా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించనుంది కేంద్ర ప్రభుత్వం.. లోక్సభలో కేంద్రహోంశాఖ సహాయ మంద్రి నిత్యానంద రాయ్ బిల్లును ప్రవేశపెట్టారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత అంశంపై పార్లమెంట్లో చర్చ జరుగుతోంది. ఈ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 1, 2026
- 12:16 pm