![నరేంద్ర మోదీ](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/10/pm-modi-150-150.jpg)
నరేంద్ర మోదీ
నరేంద్ర మోదీ ప్రస్తుత భారత ప్రధాని. 2014 మేలో తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి దేశ ప్రధాని అయ్యారు. దేశ ప్రధాని కావడానికి ముందు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు.
నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో కూడా పనిచేశారు. ఆయన గుజరాత్లోని వాద్నగర్లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.
2014 లోక్సభలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధించింది. దీని తర్వాత, 2019లో కూడా బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ మళ్లీ భారత ప్రధాని అయ్యారు. 2014 నుంచి బీజేపీ మోదీ పేరును ప్రధాన అస్త్రంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించింది.
తన హయాంలో, ప్రధాని మోడీ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇది అయనపై దేశ ప్రజల్లో ఆదరణను మరింత పెంచింది. ఈ నిర్ణయాలలో పాకిస్థాన్లో సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ చట్టం అమలు మొదలైనవి ఉన్నాయి.
Niti Aayog Meeting: ఇవాళ ఢిల్లీలో నీతి ఆయోగ్ కీలక భేటీ.. బాయ్కాట్ చేస్తున్న సీఎంలు ఎవరు?
ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో నీతి ఆయోగ్ కీలక భేటీ కానుంది. అయితే.. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతుండగా, కొందరు సీఎంలు బాయ్కాట్ చేస్తుండడం హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ.. నీతి ఆయోగ్ భేటీకి హాజరయ్యే ముఖ్యమంత్రులు ఎవరు?.. బాయ్కాట్ చేస్తున్న సీఎంలు ఎవరు?
- Balaraju Goud
- Updated on: Jul 27, 2024
- 7:15 am
Prahlad Joshi: కొత్త వివాదంలో కాంగ్రెస్.. ఆ ప్రాంతం పేరు మార్పును ఖండించిన కేంద్ర మంత్రి..
రామ్ నగర్ జిల్లా పేరును బెంగళూరు సౌత్ జిల్లాగా మార్చేందుకు కర్ణాటక మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు. బెంగళూరులోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలోని కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో రాం నగర్ అనే పేరు కలిగిన ప్రాంతాన్ని బెంగళూరు సౌత్ జిల్లాగా మారుస్తూ కేబినెట్ ఆమోదించింది.
- Srikar T
- Updated on: Jul 26, 2024
- 7:08 pm
PM Modi: మాతృ దేశం కోసం భారత సైనికులు చేసిన త్యాగాలు మరువలేనివిః ప్రధాని మోదీ
భారత్-పాకిస్థాన్ మధ్య 60 రోజుల పాటు కార్గిల్ యుద్ధం జరిగింది. పాకిస్థాన్ సైన్యం రహస్యంగా కార్గిల్ కొండలను అధిరోహించింది. భారత భూభాగంలోని 15 వేల అడుగుల ఎత్తైన కార్గిల్ శిఖరాలను పాక్ సైనికులు స్వాధీనం చేసుకున్నారు. కానీ భారత సైనికులు, అలుపెరగని ధైర్యాన్ని ప్రదర్శించి, పాక్ సైనికుల ఆక్రమణ నుండి కార్గిల్ను విడిపించారు.
- Balaraju Goud
- Updated on: Jul 26, 2024
- 12:23 pm
Union Budget 2024: ఉపాధి కల్పనే లక్ష్యం.. నైపుణ్య శిక్షణే మార్గం.. కేంద్రం ఏకంగా రూ. 2 లక్షల కోట్లతో కొత్త పథకం
యువ రక్తంతో నిండిన భారతదేశం మాత్రమే కాదు, నిరుద్యోగ సమస్య ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను వేధిస్తోంది. విద్యావకాశాలు పెరగడంతో యూనివర్సిటీల నుంచి పట్టభద్రులు కుప్పలుతెప్పలుగా బయటికొస్తున్నారు. అయితే చాలామంది చేతిలో డిగ్రీ పట్టాలు ఉంటున్నాయి కానీ ఏదైనా ఉద్యోగం చేయడానికి అవసరమైన నైపుణ్యాలు కొరవడుతున్నాయి. నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేయడంలో ఇది కూడా ఒక కీలకాంశంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొన్ని కొత్త పథకాలను ప్రతిపాదించింది.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Jul 25, 2024
- 8:20 pm
Pawan Kalyan: కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధుల వరద.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన ఇదే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల వరద.. కేంద్ర బడ్జెట్లో వరాల జల్లు.. ఏపీ విభజన సమస్యల క్లియరెన్స్ దిశగా కేంద్ర అడుగులు వేస్తోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్.. బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేసింది.
- Balaraju Goud
- Updated on: Jul 24, 2024
- 8:53 am
CM Revanth: తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది.. బడ్జెట్పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల కక్ష పూరితంగా వ్యవహరించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 18సార్లు తాము మంత్రుల బృందంతో కలిసి రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి సమస్యలు తీర్చాలని కేంద్ర మంత్రులను కోరినట్లు తెలిపారు. చాలా సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర సమస్యలపై వివరించామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై స్పందించారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ది కోసం కేంద్రం ఆలోచన చేయడం లేదన్నారు.
- Srikar T
- Updated on: Jul 23, 2024
- 6:02 pm
Budget 2024: వారికి రూ.15వేలు.. కేంద్ర బడ్జెట్లో ఉద్యోగ కల్పనకు పెద్దపీట.. మూడు ప్రోత్సహకాలు.. ఏంటంటే..
కేంద్ర బడ్జెట్లో ఉద్యోగ కల్పనకు అత్యంత ప్రాధాన్యత కేంద్రం. యువతలో స్కిల్ డెవలప్మెంట్ , ఉపాధి కల్పన కోసం రూ. 2 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు లక్షా 52 వేల కోట్లను కేటాయించారు. ఓవైపు నిరుద్యోగం.. మరోవైపు వ్యవసాయరంగంపై ఫోకస్ ఎక్కువగా పెట్టారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 24, 2024
- 11:16 am
PM Modi: సరికొత్త శక్తినిస్తుంది.. యువత కలలు నెరవేర్చేలా బడ్జెట్: ప్రధాని మోదీ
PM Modi on Budget 2024: కేంద్ర మంత్రి సమర్పించిన బడ్జెట్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.. ఈ బడ్జెట్ పేద-మధ్యతరగతి వర్గానికి సాధికారత కల్పిస్తుందని తెలిపారు. దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్ అంటూ కొనియాడారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని.. ఈ బడ్జెట్ పేద-మధ్యతరగతి వర్గాల సాధికారత కోసమేనని తెలిపారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 23, 2024
- 3:12 pm
Budget 2024 – Gold Rates: బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న ధరలు..
పసిడి, వెండి కొనుగోలుదారులకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గించారు. బంగారం, వెండిపై సుంకం 6 శాతానికి తగ్గించారు. ప్లాటినమ్పై 6.4 శాతాననికి కుదించినట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 23, 2024
- 2:57 pm
Budget 2024: ఎన్నో ఆశలు.. భారీ అంచనాలు.. కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్..
ఎన్నో ఆశలు, భారీ అంచనాల మధ్య.. పూర్తి స్థాయి బడ్జెట్లో ఎలాంటి మెరుపులు ఉంటాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. లోక్సభలో 11.04 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభంకానుంది. వికసిత్ భారత్ లక్ష్యమంటున్న NDA సర్కార్.. ఇవాళ్టి యూనియన్ బడ్జెట్లో ఎలాంటి కీలక నిర్ణయాలు ప్రకటించబోతోంది.
- Shaik Madar Saheb
- Updated on: Jul 23, 2024
- 2:57 pm
Nirmala Sitharaman Budget 2024 Highlights: ఏపీకి వరాల జల్లు.. వేతన జీవులకు ఊరట.. మోదీ 3.0 సర్కార్ బడ్జెట్ హైలెట్స్ ఇవే..
Nirmala Sitharaman Speech Union Budget 2024 highlights: ఎన్నో ఆశలు, భారీ అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. లోక్సభలో 11.04 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభమై.. దాదాపు 12.30 వరకు కొనసాగింది.. వికసిత్ భారత్ లక్ష్యమంటున్న NDA సర్కార్.. యూనియన్ బడ్జెట్లో కీలక నిర్ణయాలు ప్రకటించింది.. ఆర్థికరంగానికి ఊతమిచ్చేలా బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.. కేంద్ర బడ్జెట్ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లు గా ప్రకటించింది.. మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు, పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు, ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది.. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లుగా అంచనా వేసింది.
- Shaik Madar Saheb
- Updated on: Jul 23, 2024
- 5:38 pm
RSS: ఆర్ఎస్ఎస్విషయంలో మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు కూడా..
ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఇప్పటివరకు ఉన్న నిషేధాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం ఎత్తి వేసింది. కొన్ని దశాద్దాలుగా ఉన్న ఈ నిషేధాన్ని ఎత్తివేయడాన్ని ఆర్ఎస్ఎస్ స్వాగతించింది. ఈ నిర్ణయం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు.
- Basha Shek
- Updated on: Jul 22, 2024
- 9:54 pm
PM Modi: వచ్చే ఐదేళ్లు దేశాభివృద్ధి కోసం పోరాడండి.. విపక్షాలకు ప్రధాని మోదీ సలహా..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు.. 2047 నాటికి విక్షిత్ భారత్ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని స్పష్టంచేశారు. మూడోసారి అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్న మోదీ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 22, 2024
- 1:06 pm
Budget 2024: మోదీ సర్కార్ 3.0 తొలి బడ్జెట్.. తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కే అవకాశం..!
కీలకమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్.. ఈసారి బడ్జెట్లో ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
- Shaik Madar Saheb
- Updated on: Jul 22, 2024
- 12:50 pm
Budget Expectations: రేపటి నుంచే బడ్జెట్ సెషన్.. ఆదాయపు పన్నులో ఎలాంటి ప్రయోజనం ఉంటుందో..?
. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ పన్ను చెల్లింపుదారుల కళ్లు ఆమెపైనే ఉన్నాయి. చాలా మంది కోరుకునే 80C సెక్షన్ ఈసారి కూడా మళ్లీ లైమ్లైట్లోకి వచ్చింది. కచ్చితంగా ఈసారి 80C మినహాయింపు మొత్తం పెరుగుతుందనే మాటలు వినిపిస్తున్నాయి.
- Balaraju Goud
- Updated on: Jul 21, 2024
- 12:41 pm