
నరేంద్ర మోదీ
నరేంద్ర మోదీ ప్రస్తుత భారత ప్రధాని. 2014 మేలో తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి దేశ ప్రధాని అయ్యారు. దేశ ప్రధాని కావడానికి ముందు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు.
నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో కూడా పనిచేశారు. ఆయన గుజరాత్లోని వాద్నగర్లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.
2014 లోక్సభలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధించింది. దీని తర్వాత, 2019లో కూడా బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ మళ్లీ భారత ప్రధాని అయ్యారు. 2014 నుంచి బీజేపీ మోదీ పేరును ప్రధాన అస్త్రంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించింది.
తన హయాంలో, ప్రధాని మోడీ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇది అయనపై దేశ ప్రజల్లో ఆదరణను మరింత పెంచింది. ఈ నిర్ణయాలలో పాకిస్థాన్లో సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ చట్టం అమలు మొదలైనవి ఉన్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయాలు.. వీసాలు రద్దు, సింధూ జలాలు కట్!
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి ప్రధాని మోదీ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయాన్ని ప్రకటించింది. భద్రతపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం తర్వాత, విదేశాంగ కార్యదర్శి మిస్రి మాట్లాడుతూ, పాకిస్తాన్తో సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు చెప్పారు. అలాగే అట్టారి చెక్ పోస్ట్ మూసివేయాలని నిర్ణయించారన్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 23, 2025
- 10:03 pm
ఉగ్ర ఘటనపై భారత్ వరుస సమీక్షలు.. బెంబేలెత్తిపోతున్న పాక్
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో భారత్-పాకిస్తాన్ మధ్య ఏదో పెద్ద విషయం జరగబోతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గత 4 గంటల్లో జరిగిన నాలుగు ప్రధాన చర్యల ద్వారా ఈ భయాలు మరింత బలపడ్డాయి. భారతదేశం మునుపటిలాగా సరిహద్దు ఉగ్రవాదులను నిర్మూలించడానికి పెద్ద చర్యకు పూనుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- Balaraju Goud
- Updated on: Apr 23, 2025
- 3:46 pm
Pahalgam Terror Attack: హైఅలర్ట్.. ఎయిర్పోర్ట్లోనే అజిత్ దోవల్తో ప్రధాని మోదీ భేటీ.. కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..
ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి ఎయిర్పోర్టులోనే.. పహల్గామ్ లో ఉగ్రదాడి ఘటనపై NSA అజిల్ దోవల్ వివరణ ఇచ్చారు. దోవల్తోపాటు విదేశాంగమంత్రి, విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఈ మీటింగ్లో పాల్గొన్నారు.. కాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. CCS సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది..
- Shaik Madar Saheb
- Updated on: Apr 23, 2025
- 9:25 am
Pahalgam Terror Attack: ఉగ్రదాడిపై ట్రంప్ సీరియస్.. భారత్కు అండగా ఉంటామంటూ పిలుపు
అందమైన కశ్మీరంలో తుపాకుల మోత. టూరిస్టులపై విచక్షణారహిత కాల్పులు. ఉగ్రమూకల పిరికిపంద చర్యకు యావత్ దేశం ఉలిక్కిపడింది. అమాయకుల ప్రాణాలే టార్గెట్గా రెచ్చిపోయిన ముష్కరులు అత్యంత హేయంగా ఈ దుశ్చర్యకు దిగారు. కుటుంబాల ముందే మగవారిని మట్టుబెట్టారు. ఆర్తనాదాలు చేస్తున్నా.. తమను వదిలేయమని బతిమాలినా.. ఏమీ చేయొద్దంటూ కాళ్లావేళ్లా వేడుకున్నా ఆ కిరాతకులు వదల్లేదు. విచ్చలవిడిగా కాల్పులు జరిపి పదుల సంఖ్యలో టూరిస్టులను బలితీసుకున్నారు. ప్రశాంతమైన పెహల్గాం మృత్యుఘోష పెట్టింది.
- Venkata Chari
- Updated on: Apr 23, 2025
- 7:13 am
Terrorist Attack: జమ్ముకశ్మీర్లో ఉగ్రమూకల దుశ్చర్య.. 27 మంది టూరిస్టుల మృతి..! మరో 20 మందికి..
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు.. ప్రముఖ టూరిస్ట్ స్పాట్ పహల్గామ్లో పర్యాటకులను టార్గెట్ చూస్తూ.. ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు.. 20 మందికి పైగా గాయాలైనట్లు పేర్కొంటున్నారు. చాలా మంది మృత్యువుతో పోరాడుతున్నట్లు పేర్కొంటున్నారు..
- Shaik Madar Saheb
- Updated on: Apr 23, 2025
- 9:06 am
Terrorist Attack: జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడిపై ప్రధాని మోదీ ఆరా.. అమిత్షాకు కీలక ఆదేశాలు..
ఈ ఘటనపై కేంద్రం సీరియస్ అయ్యింది. సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు ఫోన్ చేశారు. ఉగ్రదాడిపై ఆరా తీశారు. అమిత్షాను పహల్గామ్కు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ఉగ్రదాడి ఘటనపై హోంశాఖ అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశానికి పిలుపునిచ్చింది..
- Shaik Madar Saheb
- Updated on: Apr 22, 2025
- 9:17 pm
సౌదీ గగనతలంలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. 3 యుద్ధ విమానాల ఎస్కార్ట్తో అపూర్వ స్వాగతం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీ విమానానికి 3 యుద్ధ విమానాలు ఎస్కార్ట్ గా వచ్చాయి. సౌదీ వైమానిక దళానికి చెందిన F15 విమానం ప్రధాని మోదీని కాపాడుతూ ఆకాశంలో రక్షణగా నిలిచాయి.
- Balaraju Goud
- Updated on: Apr 22, 2025
- 4:32 pm
త్వరలో కేంద్రంలో కీలక పరిణామాల దిశగా సంకేతాలు.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ?
చట్టాల ఆమోదం విషయంలో రాష్ట్రపతికి సుప్రీంకోర్టు కాల పరిమితి విధించిన అంశంతో పాటు కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ, బెంగాల్లో రాష్ట్రపతి పాలన, బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక, పార్టీలో సంస్థాగత మార్పులు సహా పలు కీలక అంశాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
- Gopikrishna Meka
- Updated on: Apr 18, 2025
- 9:08 pm
ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ అగ్రనేతల కీలక భేటీ.. ప్రధాన చర్చ అదేనా?
ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ నూతన రథసారథి ఎవరన్న దానిపై త్వరలో స్పష్టత రానుంది. బీజేపీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో బుధవారం(ఏప్రిల్ 16) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక గురించి కూడా చర్చ జరిగినట్లు సమాచారం.
- Gopikrishna Meka
- Updated on: Apr 16, 2025
- 11:19 pm
కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. భారత్ ఫ్రెండే.. బట్ కండిషన్స్ అప్లై అంటన్న యూఎస్!
అమెరికాతో భారత్ బందం కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంగా మారింది. ఓవైపు మిత్రుడంటూనే.. ఆంక్షల కొరడా ఝలపిస్తోంది అమెరికా. ఓవైపు చైనాను ఢీకొట్టాలంటే అమెరికాకు కనిపిస్తున్న బుల్లెట్ పాయింట్ బారతే. అందుకే అమెరికా ఫస్ట్ విధానంతో ఆంక్షలు కురిపిస్తూనే.. డిఫెన్స్ డీల్తో మనకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. మరి అమెరికా ఆడుతున్న గేమ్లో భారత్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళుతోంది..?
- Balaraju Goud
- Updated on: Apr 15, 2025
- 10:08 pm