Balaraju Goud
Senior Sub-Editor, Political, Crime, Business, Hyperlocal - TV9 Telugu
balaraju.varaganti@tv9.com29 సంవత్సరాల జర్నలిజం అనుభవం. ప్రింట్ మీడియాలో నాలుగేళ్లు. ఆ తర్వాత 2004 జూన్ మొదలుకుని ఎలక్ట్రానిక్ మీడియా అనుభవం. మొదట 1995 సంవత్సంలో వర్తమానం పత్రిక రిపోర్టర్గా ప్రారంభమైన జర్నలిజం జర్నీలో వార్త దిన పత్రిక రిపోర్టర్గా, రాజధాని ఎక్స్ప్రెస్ డైలీ న్యూస్ ప్రింట్ మీడియాలో పనిచేశాను. ఆ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వద్ద పర్సల్ సెక్రటరీగా విధి నిర్వహణ. తిరిగి మరోసారి జర్నలిజం వైపు అడుగులేశాను. 2004లో సత్య టీవీలో చేరాను. ఆ తర్వాత టీఎన్ఎన్ సబ్ ఎడిటర్గా, అటు నుంచి జీ 24 గంటలులో సబ్ ఎడిటర్గా, మహా న్యూస్లో సీనియర్ సబ్ ఎడిటర్గా పని చేశాను. 2013 నుంచి టీవీ9లో సీనియర్ సబ్ ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం TV9 Telugu డిజిటల్ విభాగంలో సీనియర్ సబ్-ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను.
బేకరీలకు వెళ్లి లాగించేస్తున్నారా..? ఓ పారీ ఆడ ఏం జరుగుతుందో తెలుసుకోండి..!
హైదరాబాద్లో కల్తీ ఆహార తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపుతున్న అధికారులు.. తాజాగా అత్తాపూర్ పరిధిలో మరో అక్రమ నివాసానికి చెక్ పెట్టారు. అత్తాపూర్ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా, అత్యంత అనారోగ్యకరమైన, అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహిస్తున్న ఒక అక్రమ బేకరీ తయారీ యూనిట్పై హెచ్-ఫాస్ట్ (H-FAST) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
- Balaraju Goud
- Updated on: Jun 5, 2026
- 6:04 pm
కుబేరుడి గాలి తగిలిందో ఏముందో.. రాత్రికి రాత్రి ప్లంబర్ అకౌంట్లో వందలాది కోట్లు..!
లక్షల్లో అప్పులున్నవాడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడైతే ఎలా ఉంటుందో.. బీహార్కు చెందిన ఒక సాధారణ యువకుడి పరిస్థితి అలాగే మారింది. ఒక సాధారణ ప్లంబర్గా జీవనం సాగిస్తున్న ఆ యువకుడి బ్యాంకు ఖాతాలో అకస్మాత్తుగా ఏకంగా రూ. 294 కోట్ల 80 లక్షలు ప్రత్యక్షమవ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
- Balaraju Goud
- Updated on: Jun 5, 2026
- 5:28 pm
నెహ్రూ రికార్డు అధిగమించే దిశగా మోదీ.. ‘నాటి పునాదుల’ నుండి ‘నేటి డిజిటల్ శకం’ వరకు భారత పరిపాలనా ప్రస్థానం!
భారతదేశ రాజకీయ, పరిపాలనా చరిత్రలో 2026 జూన్ 10 ఒక సువర్ణ అధ్యాయంగా లిఖించబోతుంది. దేశాన్ని నిరంతరాయంగా అత్యధిక కాలం పాలించిన తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న చారిత్రక రికార్డును ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజున అధికారికంగా అధిగమించనున్నారు.
- Balaraju Goud
- Updated on: Jun 5, 2026
- 4:17 pm
పర్యావరణ రక్షణకై స్వయంగా రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు! స్టీల్ సిటీలో 5 కి.మీ. సైకిల్ సవారీ!
రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించి, పర్యావరణ సమతుల్యతను కాపాడడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏయూ క్యాంపస్లో మొక్క నాటి, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.
- Balaraju Goud
- Updated on: Jun 5, 2026
- 3:02 pm
ప్రపంచ సంక్షోభాలకు భారత్తోనే పరిష్కారం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకర్త వికాస వర్గ శిక్షణా శిబిరాల ముగింపు సభ నాగపూర్లో అత్యంత వైభవంగా జరిగింది. సంఘ్ శతాబ్ది సంవత్సర మహోత్సవాల నేపథ్యంలో నిర్వహించిన ఈ బహిరంగ సభకు ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ మోహన్ భగవత్ జీ ముఖ్య వక్తగా హాజరవగా, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా ముఖ్య అతిథిగా విచ్చేశారు.
- Balaraju Goud
- Updated on: Jun 4, 2026
- 9:43 pm
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. లండన్ తరహాలో ‘అమరావతి ఐ’.. గోవా తరహాలో ‘బీచ్ షాక్స్’..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు సాగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పర్యాటకం, ఉపాధి, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ప్రభుత్వం పలు సంచలన, కీలక అంశాలకు పచ్చజెండా ఊపింది. గోవా తరహాలో బీచ్ టూరిజం డెవలప్మెంట్, లండన్ తరహాలో 'అమరావతి ఐ' వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు ఉద్యోగులకు మేలు చేకూర్చే పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
- Balaraju Goud
- Updated on: Jun 4, 2026
- 9:09 pm
ఎన్డీఏ పక్షాల కీలక నిర్ణయం.. టీడీపీకి 3, జనసేనకు 1 రాజ్యసభ సీటు ఖరారు!
ఆంధ్రప్రదేశ్లో అధికార ఎన్డీఏ కూటమి పక్షాల కీలక సమావేశం గురువారం (జూన్ 04)న అమరావతిలో జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ, సభల నిర్వహణతో పాటు రాజ్యసభ స్థానాల కేటాయింపుపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
- Balaraju Goud
- Updated on: Jun 4, 2026
- 8:42 pm
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాలపై నా స్టాండ్ ఎప్పుడూ ఒక్కటేః పవన్ కల్యాణ్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యల చుట్టూ తిరుగుతున్న రాజకీయ మంట ఇంకా చల్లారలేదు. తాను తెలంగాణ ప్రజలను కించపరచలేదని పవన్ క్లారిటీ ఇచ్చినప్పటికీ, ఆయనపై విమర్శల దాడి మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఎక్స్ (X) వేదికగా పవన్ కల్యాణ్ తెలంగాణపై తన స్థిరమైన వైఖరిని స్పష్టం చేశారు.
- Balaraju Goud
- Updated on: Jun 4, 2026
- 7:16 pm
అరె బద్మాష్..! లంచం ఇవ్వలేదని ఇంత పైశాచికత్వమా?.. 14 ఏళ్ల బాలికపై డాక్టర్ అమానుషం!
ఉత్తరప్రదేశ్లో మానవత్వాన్ని మంటగలిపేలా తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక ప్రభుత్వ వైద్యుడు ప్రవర్తించిన తీరుపై సభ్య సమాజం సిగ్గుపడేలా చేసింది. లంచం ఇవ్వలేదన్న ఒకే ఒక్క కోపంతో, తాను సర్జరీ చేసి అతికించిన ఒక 14 ఏళ్ల బాలిక కాలి ఎముకను ఆ వైద్యుడే స్వయంగా మళ్లీ విరగ్గొట్టాడు. ఈ అమానుష ఘటన వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
- Balaraju Goud
- Updated on: Jun 4, 2026
- 7:22 pm
తీరని విషాదం.. నాలుగు కుటుంబాలను శోకసంద్రంలో ముంచేసిన ఈత సరదా..!
ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని చెరువుకొమ్ముపాలెం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు నీటి కుంటలోకి దిగిన నలుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తూ నీట మునిగి గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలు చేపట్టారు.
- Balaraju Goud
- Updated on: Jun 4, 2026
- 6:23 pm
Viral Video: మామిడి పండు కోసం ఆశపడితే.. ఒళ్లంతా వాతలే! చూస్తే నవ్వు ఆపుకోలేరు!
"దురాశ దు:ఖానికి చేటు" అన్నారు పెద్దలు. ఏ విషయమైనా హద్దులు దాటితే ప్రమాదమే.. ముఖ్యంగా దురాశకు పోతే ఎలాంటి పరాభవం ఎదురవుతుందో చెప్పడానికి సరిగ్గా సరిపోయే ఒక ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు కూడా నవ్వు ఆపుకోలేరు.
- Balaraju Goud
- Updated on: Jun 4, 2026
- 5:55 pm
ఇరాన్ అణు రహస్యాలను అమెరికాకు కట్టబెట్టిన పాక్ మంత్రి? వాషింగ్టన్ రిపోర్ట్తో ప్రకంపనలు!
ఇరాన్, అమెరికాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ ఒక సంచలన వార్త అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వాషింగ్టన్ పర్యటనలో భాగంగా మే 29న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని ఇషాక్ దార్ అమెరికాకు చేరవేశారని, ఇది విన్న రూబియో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని మాజీ సీఐఏ (CIA) విశ్లేషకుడు లారీ జాన్సన్ ఆరోపించారు.
- Balaraju Goud
- Updated on: Jun 4, 2026
- 5:31 pm