Balaraju Goud
Senior Sub-Editor, Political, Crime, Business, Hyperlocal - TV9 Telugu
balaraju.varaganti@tv9.com29 సంవత్సరాల జర్నలిజం అనుభవం. ప్రింట్ మీడియాలో నాలుగేళ్లు. ఆ తర్వాత 2004 జూన్ మొదలుకుని ఎలక్ట్రానిక్ మీడియా అనుభవం. మొదట 1995 సంవత్సంలో వర్తమానం పత్రిక రిపోర్టర్గా ప్రారంభమైన జర్నలిజం జర్నీలో వార్త దిన పత్రిక రిపోర్టర్గా, రాజధాని ఎక్స్ప్రెస్ డైలీ న్యూస్ ప్రింట్ మీడియాలో పనిచేశాను. ఆ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వద్ద పర్సల్ సెక్రటరీగా విధి నిర్వహణ. తిరిగి మరోసారి జర్నలిజం వైపు అడుగులేశాను. 2004లో సత్య టీవీలో చేరాను. ఆ తర్వాత టీఎన్ఎన్ సబ్ ఎడిటర్గా, అటు నుంచి జీ 24 గంటలులో సబ్ ఎడిటర్గా, మహా న్యూస్లో సీనియర్ సబ్ ఎడిటర్గా పని చేశాను. 2013 నుంచి టీవీ9లో సీనియర్ సబ్ ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం TV9 Telugu డిజిటల్ విభాగంలో సీనియర్ సబ్-ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను.
బాబుతో బిజినెస్ మామూలుగా ఉండదు.. రెండురోజుల్లో రూ. 9 లక్షల కోట్లు!
అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధి పోటీలో కూడా ఆంధ్రప్రదేశ్ని టాప్లో నిలపాలి. విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్కి మేజర్ డెస్టినేషన్గా మార్చాలి.. ప్రపంచ దేశాల బిజినెస్మేన్కి గేట్వే ఆంధ్రప్రదేశే కావాలి. ఇదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంటూ వస్తున్న బంగారు కల.. ! 17 నెలల్లోనే రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలన్నది ఆయన పెట్టుకున్న టార్గెట్..!
- Balaraju Goud
- Updated on: Nov 13, 2025
- 9:49 pm
చిన్న నాగుపాము.. చూసుకోకుండా తొక్కించాడు.. కానీ ఆ తర్వాత ఊహించని ట్విస్ట్!
ప్రతిరోజూ, సోషల్ మీడియాలో మనం ఆశ్చర్యకరమైన వీడియోలను చూస్తుంటాం. కొన్నిసార్లు, మానవ తప్పిదం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. మరికొన్నిసార్లు, జంతువులకు సంబంధించి వీడియోలు బయటపడతాయి. అవి మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇప్పుడు, అలాంటి ఒక వీడియో ఇంటర్నెట్లో వేగంగా వైరల్ అవుతోంది. ఇందులో ఒక బైకర్ తెలియకుండానే తన ప్రాణాలను పణంగా పెట్టాడు.
- Balaraju Goud
- Updated on: Nov 13, 2025
- 8:55 pm
ఘోరప్రమాదం.. హైవేపై 6 వాహనాలను ఢీకొట్టిన ట్రక్కు .. 8మంది సజీవదహనం
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గురువారం (నవంబర్ 13) పూణేలోని నవ్లే బ్రిడ్జిపై ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రెండు కంటైనర్ ట్రక్కులు ఢీకున్నాయి. వాటిలో ఒకటి మంటల్లో చిక్కుకుంది. రెండు ట్రక్కుల మధ్య ఒక కారు ఇరుక్కుపోయి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది సజీవ దహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి సహాయక చర్యలు చేపట్టారు.
- Balaraju Goud
- Updated on: Nov 13, 2025
- 8:17 pm
మామిడి రైతుకు రూ. 1.82 కోట్ల ఆదాయం.. నోటీసు పంపిన ఐటీ శాఖ.. చివరికి..!
బెంగళూరులో ఒక మామిడి రైతుకు కోర్టు ఉపశమనం కల్పించిన కేసు వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 30, 2025న, ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) బెంగళూరు బెంచ్ ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది. రైతు శ్రీకననకు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఆదాయ పన్ను శాఖ నోటీసును రద్దు చేశారు. రైతు మామిడి అమ్మకాల ద్వారా తన ఆదాయాన్ని తప్పుగా పేర్కొన్నట్లు ఐటీ శాఖ అంగీకరించింది.
- Balaraju Goud
- Updated on: Nov 13, 2025
- 6:56 pm
జూబ్లీహిల్స్ కౌంటింగ్కు పగడ్బందీ ఏర్పాట్లు.. ఫైనల్ రిజల్ట్ వచ్చేదీ ఎప్పుడంటే..?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం తేలే సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో బాక్స్లు ఓపెన్ కాబోతున్నాయి. కౌంటింగ్ కోసం ఈసీ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇంతకీ.. ఎన్ని రౌండ్లలో కౌంటింగ్ ఉండబోతోంది? ఫైనల్ రిజల్ట్ రావడానికి ఎంత టైమ్ పట్టొచ్చు? భద్రతా ఏర్పాట్ల సంగతేంటి?
- Balaraju Goud
- Updated on: Nov 13, 2025
- 6:23 pm
వైద్య శాస్త్రంలోనే అద్భుతం.. ఒకటి కాదు.. రెండు కాదు.. 9మంది పిల్లలను మోస్తున్న మహిళ!
ఈజిప్టులో జరిగిన అత్యంత అరుదైన వైద్య సంఘటన వైద్యులను సైతం ఆశ్చర్యపరిచింది. ఒక మహిళ సాధారణ గర్భధారణ నిర్ధారణ కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు వైద్యులే షాక్ అయ్యారు. ఆమెకు పరీక్షలు నిర్వహించి చూడగా, ఒకటి కాదు, రెండు కాదు, తొమ్మిది మంది పిల్లలను ఒకేసారి ఆమె గర్భంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ వార్త ఆ జంటను మాత్రమే కాకుండా వైద్యులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది.
- Balaraju Goud
- Updated on: Nov 13, 2025
- 5:53 pm
డ్రైనేజీలో తేలియాడుతున్న వింత వస్తువులు.. పోలీసులు వచ్చి చూస్తే షాక్..!
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలోని సెక్టార్ 34 ప్రాంతంలోని డ్రైనేజీలో మృతదేహం లభ్యం కావడం సంచలనం సృష్టించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నోయిడా పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. డ్రైనేజీలో దొరికిన శరీర భాగాలు హత్య కేసుగా కనిపిస్తున్నాయని, మృతదేహాన్ని పారవేసే ఉద్దేశ్యంతో శరీర భాగాలను డ్రైనేజీలో పడేశారని పోలీసులు తెలిపారు.
- Balaraju Goud
- Updated on: Nov 13, 2025
- 5:27 pm
భారత్-ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధానికి సిద్ధం.. పాక్ రక్షణ మంత్రి ఖవాజా సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఉగ్రవాదులకు స్థావరంగా ఉన్న పాకిస్తాన్లో ఆందోళనను మరింత పెంచింది. ఢిల్లీ ఉగ్రవాద దాడి తర్వాత, ఇస్లామాబాద్ కోర్టు కాంప్లెక్స్లో పేలుడు సంభవించింది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా మరోసారి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. రెండవ రౌండ్లో కూడా ఆయన మాకు సహాయం చేస్తాడు అంటూ ఖవాజా హెచ్చరించారు.
- Balaraju Goud
- Updated on: Nov 13, 2025
- 4:32 pm
మీ కారు అమ్మే ముందు, ఈ 5 విషయాలను గుర్తుంచుకోండి, లేదంటే ప్రమాదంలో పడ్డట్టే!
మీ కారును ఇచ్చే ముందు, మీ Google లేదా Apple ఖాతా నుండి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ నుండి లాగ్ అవుట్ అవ్వండి. సేవ్ చేసిన కాంటాక్ట్లు, కాల్ హిస్టరీ, నావిగేషన్ అడ్రస్లను తొలగించండి. మీ FasTagని తీసివేయండి. ఏవైనా GPS ట్రాకర్లను లేదా బ్లూలింక్ లేదా ఐ-కనెక్ట్ వంటి కనెక్ట్ చేసిన యాప్లను నిలిపివేయండి. ఇది మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
- Balaraju Goud
- Updated on: Nov 13, 2025
- 3:49 pm
పంజాబ్లో బయటపడ్డ మరో ఉగ్ర కుట్ర. 10 మంది ఉగ్రవాదుల అరెస్ట్!
పంజాబ్ పోలీసులు భారీ విజయాన్ని సాధించారు. లూథియానా కమిషనరేట్ పోలీసులు ఐఎస్ఐ-పాకిస్తాన్ మద్దతుతో గ్రెనేడ్ దాడి మాడ్యూల్ను ఛేదించారు. ఈ కేసులో 10 మంది కీలక కార్యకర్తలను అరెస్టు చేశారు. వీరంతా విదేశాల్లోని హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరిపారు. పంజాబ్ పోలీస్ డిజిపి ట్వీట్ చేయడం ద్వారా ఈ ప్రధాన విజయం గురించి సమాచారం ఇచ్చారు.
- Balaraju Goud
- Updated on: Nov 13, 2025
- 3:27 pm
లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఐపీఎల్ క్రీడాకారుడు.. పోలీసులకు హైదరాబాద్ మహిళ ఫిర్యాదు!
ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక ఐపీఎల్ క్రీడాకారుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అత్యాచారం చేసి దాడి చేశాడని ఒక మహిళా క్రికెటర్ ఆరోపించింది. హైదరాబాద్కు చెందిన బాధితురాలు మొదట నోయిడాలోని ఒక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే, ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో, ఆమె లక్నో పోలీస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి సీనియర్ పోలీసు అధికారులను కలిసి న్యాయం చేయాలని కోరింది.
- Balaraju Goud
- Updated on: Nov 13, 2025
- 3:06 pm
జార్జియాలో తీవ్ర విషాదం.. చూస్తుండగానే కుప్పకూలిన టర్కీ సైనిక విమానం..!
జార్జియాలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం (నవంబర్ 11) తుర్కియే సి-130 మిలిటరీ కార్గో విమానం కుప్పకూలిపోయింది. ఈ విమానం అజర్బైజాన్ నుండి బయలుదేరి 20 మందిని తీసుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతులు, క్షతగాత్రులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియదు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలను సంఘటనా స్థలానికి పంపించారు అధికారులు.
- Balaraju Goud
- Updated on: Nov 11, 2025
- 9:56 pm