Balaraju Goud
Senior Sub-Editor, Political, Crime, Business, Hyperlocal - TV9 Telugu
balaraju.varaganti@tv9.com29 సంవత్సరాల జర్నలిజం అనుభవం. ప్రింట్ మీడియాలో నాలుగేళ్లు. ఆ తర్వాత 2004 జూన్ మొదలుకుని ఎలక్ట్రానిక్ మీడియా అనుభవం. మొదట 1995 సంవత్సంలో వర్తమానం పత్రిక రిపోర్టర్గా ప్రారంభమైన జర్నలిజం జర్నీలో వార్త దిన పత్రిక రిపోర్టర్గా, రాజధాని ఎక్స్ప్రెస్ డైలీ న్యూస్ ప్రింట్ మీడియాలో పనిచేశాను. ఆ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వద్ద పర్సల్ సెక్రటరీగా విధి నిర్వహణ. తిరిగి మరోసారి జర్నలిజం వైపు అడుగులేశాను. 2004లో సత్య టీవీలో చేరాను. ఆ తర్వాత టీఎన్ఎన్ సబ్ ఎడిటర్గా, అటు నుంచి జీ 24 గంటలులో సబ్ ఎడిటర్గా, మహా న్యూస్లో సీనియర్ సబ్ ఎడిటర్గా పని చేశాను. 2013 నుంచి టీవీ9లో సీనియర్ సబ్ ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం TV9 Telugu డిజిటల్ విభాగంలో సీనియర్ సబ్-ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను.
తమిళనాడు స్వేచ్ఛ, మార్పును కోరుకుంటోంది.. డీఎంకేకు కౌంట్డౌన్ ప్రారంభంః ప్రధాని మోదీ
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయాలు ఉపందుకున్నాయి. ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనే మధురాంతకంలో నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈసందర్భంగా డీఎంకే పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా విమర్శించారు.
- Balaraju Goud
- Updated on: Jan 23, 2026
- 5:14 pm
వైద్య శాస్త్రంలో అద్భుతం.. 4వ దశ క్యాన్సర్ రోగికి పునర్జన్మ.. ఎయిమ్స్ డాక్టర్స్ ఘనత..!
ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు మరోసారి వైద్య శాస్త్రంలో ఒక పెద్ద పురోగతిని సాధించారు. 4వ దశ పెద్దప్రేగు క్యాన్సర్తో బాధపడుతున్న తీవ్ర అనారోగ్య రోగికి శస్త్రచికిత్స చేశారు. వైద్యులు రోగి ఉదరం నుండి దాదాపు 20 కిలోగ్రాముల బరువున్న కణితిని తొలగించారు. శస్త్రచికిత్స తర్వాత రోగి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉంది. ఆమె కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.
- Balaraju Goud
- Updated on: Jan 23, 2026
- 4:47 pm
Republic Day-2026: ఈసారి అద్వితీయంగా రిపబ్లిక్ వేడుకలు.. సైనిక పరేడ్ కాదు.. ప్రత్యక్ష యుద్ధ రంగం!
ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కర్తవ్య పథ్ ముస్తాబవుతోంది. ఈసారి కర్తవ్య పథ్ కేవలం పరేడ్ గ్రౌండ్లా కాకుండా, భీకర సమరక్షేత్రంలా ముస్తాబవుతోంది! రణక్షేత్రంలో అమలు చేసే లైవ్ యాక్షన్ వ్యూహాలతో భారత సైన్యం తన విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపబోతోంది.
- Balaraju Goud
- Updated on: Jan 23, 2026
- 2:36 pm
Donald Trump: సెకండ్ ఇన్నింగ్స్కు ఫస్ట్ యానివర్సరీ.. కంపు చేసిన ట్రంపు నామ సంవత్సరం!
ఒక్కటా రెండా ట్రంప్ పీడిత దేశాలన్నీ ఒక్కతాటిమీదకొచ్చేశాయి. దాదాపు అమెరికాయేత ప్రపంచమంతా కలిసి ఒకటే కోరస్. ఎప్పటికైనా గ్రీన్లాండ్ తనదేనన్న ట్రంపరితనంపై ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బ్రిటన్, బెల్జియం ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ చేసిన ప్రకటనలు పెను సంచలనంగా మారాయి. ట్రంప్నకు ఇకమీదట దేత్తడి తప్పదని, గీత దాటితే ఎదురుదాడేనని స్పష్టమైన సంకేతాలిచ్చేశాయి. ఒక్క ఏడాదిలో, ఒకే ఒక్క ఏడాదిలో అమెరికా అధ్యక్షులవారు ఇన్ని టన్నుల వ్యతిరేకతను ఎలా మూటగట్టుకున్నట్టు? డొనాల్డ్ ట్రంప్ అంతటి కరడు గట్టిన విలన్గా ఎందుకు మారినట్టు?
- Balaraju Goud
- Updated on: Jan 22, 2026
- 9:55 pm
వసంత పంచమి వేళ ఆలయంలో హిందువులతో పాటు ముస్లింల ప్రార్ధనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
మధ్యప్రదేశ్ ధార్ భోజ్శాల ఆలయం వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వసంత పంచమి వేడుకల వేళ ఆలయంలో హిందువులతో పాటు ముస్లింలు ప్రార్ధన చేసుకోవడానికి అనుమతించింది. నమాజ్కు వచ్చే ముస్లింలు జిల్లా యాజమాన్యం వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది.
- Balaraju Goud
- Updated on: Jan 22, 2026
- 9:04 pm
Viral Video: కొండచిలువకే చక్కిలిగింతలు పెట్టిన యువకుడు.. దాని రియాక్షన్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..!
అది ఏ పాము అయినా, దాని దగ్గరికి వెళ్ళాలంటే భయంతో వణికిపోతారు. ఆ పాము కొండచిలువ అయితే, ఇక ఉపిరి ఆగినంత పని అవుతుంది. అయితే కొండచిలువలు విషపూరితమైనవి కాదని మీకు తెలిసి ఉండవచ్చు, కానీ అవి చాలా ప్రమాదకరమైనవి. ఎవరు కూడా వాటి దగ్గరికి వెళ్ళే పొరపాటు కూడా చేయరు. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.
- Balaraju Goud
- Updated on: Jan 22, 2026
- 8:16 pm
పెళ్లి చేసుకోబోతున్న జీవిత ఖైదు పడ్డ ఖైదీలు.. పెరోల్ మంజూరు చేసిన కోర్టు!
రాజస్థాన్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీల వివాహం చర్చనీయాంశమైంది. హనీ ట్రాప్ యువకుడినే ప్రియా సేథ్ వివాహం చేసుకోబోతుంది. హత్య కేసులో జైపూర్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న హంతకురాలు ప్రియా సేథ్, హత్య కేసులో అదే జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న హనుమాన్ ప్రసాద్తో ప్రేమలో పడింది.
- Balaraju Goud
- Updated on: Jan 22, 2026
- 7:47 pm
Viral Video: ప్రతిరోజూ స్కూల్కి బంక్ కొడుతున్న పిల్లాడు.. తల్లి చేసిన పనికి దెబ్బకు దిగి వచ్చాడు..!
చిన్న పిల్లలు సహజంగానే అల్లరి చేస్తారు. వారు ఆటల్లో పడి ఉండటం వల్ల తరచుగా పాఠశాలకు డుమ్మా కొడుతుంటారు. అయితే, వారి తల్లిదండ్రులు వారిని వెళ్ళమని ఒప్పించడం, బెదిరించడం చేస్తారు. ఈ రకమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇది చాలా ఫన్నీ ఉంది. దాన్ని చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేరు.
- Balaraju Goud
- Updated on: Jan 22, 2026
- 7:19 pm
జార్ఖంఢ్లో తప్పిన ఘోర రైలు ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన గోండా-అసన్సోల్ ఎక్స్ప్రెస్
జార్ఖండ్లోని దేవగఢ్లో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. రైల్వే క్రాసింగ్ దగ్గర వెళ్తున్న ట్రక్ను గోండా-అసన్సోల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. దీంతో లారీ పక్కకు ఒరిగిపోయింది. ప్రమాదం చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంతో రైలు ఇంజన్ పూర్తిగా ధ్వంసమయ్యింది.
- Balaraju Goud
- Updated on: Jan 22, 2026
- 5:58 pm
Viral Video: వాటర్ గన్తో పిల్లాడి ఆటలు.. గున్న ఏనుగు నటనకు జనం ఫిదా.. అస్కార్ అవార్డ్ పక్కా..!
సోషల్ మీడియా ప్రపంచం ఫన్నీ, అందమైన వీడియోలతో తెగ ఆకట్టుకుంటుంది. మరీ ముఖ్యంగా జంతువులకు సంబంధించి దృశ్యాలు కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తే, మరికొన్ని ఆనందాన్ని ఇస్తాయి. ప్రస్తుతం ఇలాంటిదే.. ఒక పిల్ల ఏనుగు వీడియో ఇంటర్నెట్లో తుఫానుగా మారింది. ఈ చిన్న వీడియో క్లిప్ను చూస్తున్న నెటిజన్లు, ఏ జంతువు అయినా ఇంత పరిపూర్ణంగా నటించగలదా అని ఆలోచిస్తున్నారు.
- Balaraju Goud
- Updated on: Jan 22, 2026
- 5:31 pm
అసెంబ్లీ నుంచి గవర్నర్ గెహ్లాట్ వాకౌట్! గందరగోళంలో శాసనసభ శీతాకాల సమవేశాలు..!
గవర్నర్ అసెంబ్లీకి హాజరు కాకపోతే తదుపరి చట్టపరమైన చర్యల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సిద్ధరామయ్య ప్రభుత్వం సిద్ధమైంది. అయితే, అధికార కాంగ్రెస్ నాయకుల అంచనాలకు భిన్నంగా, గవర్నర్ అసెంబ్లీకి వచ్చి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగంలోని మొదటి, చివరి పేరాల్లోని కొన్ని పంక్తులను మాత్రమే చదివి, ఆ తర్వాత వెళ్లిపోయారు.
- Balaraju Goud
- Updated on: Jan 22, 2026
- 4:34 pm
భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!
అనంతపురం జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంతలో దారుణం.. ఎల్లమ్మకాలనీలో మరో దారుణం జరిగింది. భార్య లక్ష్మీ గంగ గొంతుకోసి హత్య చేశాడు భర్త వీరాంజనేయులు. ఆ తర్వాత.. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
- Balaraju Goud
- Updated on: Jan 22, 2026
- 4:08 pm