Balaraju Goud
Senior Sub-Editor, Political, Crime, Business, Hyperlocal - TV9 Telugu
balaraju.varaganti@tv9.com29 సంవత్సరాల జర్నలిజం అనుభవం. ప్రింట్ మీడియాలో నాలుగేళ్లు. ఆ తర్వాత 2004 జూన్ మొదలుకుని ఎలక్ట్రానిక్ మీడియా అనుభవం. మొదట 1995 సంవత్సంలో వర్తమానం పత్రిక రిపోర్టర్గా ప్రారంభమైన జర్నలిజం జర్నీలో వార్త దిన పత్రిక రిపోర్టర్గా, రాజధాని ఎక్స్ప్రెస్ డైలీ న్యూస్ ప్రింట్ మీడియాలో పనిచేశాను. ఆ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వద్ద పర్సల్ సెక్రటరీగా విధి నిర్వహణ. తిరిగి మరోసారి జర్నలిజం వైపు అడుగులేశాను. 2004లో సత్య టీవీలో చేరాను. ఆ తర్వాత టీఎన్ఎన్ సబ్ ఎడిటర్గా, అటు నుంచి జీ 24 గంటలులో సబ్ ఎడిటర్గా, మహా న్యూస్లో సీనియర్ సబ్ ఎడిటర్గా పని చేశాను. 2013 నుంచి టీవీ9లో సీనియర్ సబ్ ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం TV9 Telugu డిజిటల్ విభాగంలో సీనియర్ సబ్-ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను.
Telangana: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ATA ప్రతినిధులు.. తెలుగు మహా సభలకు రావాలంటూ ఆహ్వానం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఏడాది జూలై 31న జరగనున్న 19వ ఆటా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం తో అమెరికాలో ఉన్న తెలుగు ప్రవాసుల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఆటా మహాసభలకు రావాలని కోరారు.
- Balaraju Goud
- Updated on: Dec 18, 2025
- 11:44 pm
Hyderabad: స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం..!
హైదరాబాద్ శివారు శంకర్పల్లి దగ్గర ఎక్స్ప్రెస్ స్పెషల్ ట్రైన్లో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి బెళగావి వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్ వెనుక బోగిలో మంటలు అంటుకున్నాయి. ఇది గమనించిన స్టేషన్ మాస్టర్ లోకో ఫైలట్ను అప్రమత్తం చేశారు. వెంటనే ఫైర్ సిలిండర్తో మంటలు ఆర్పిన లోకో ఫైలట్, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రెప్పపాటులో పెను ప్రమాదం తప్పింది.
- Balaraju Goud
- Updated on: Dec 18, 2025
- 10:48 pm
బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి ఐటీ శాఖ షాక్.. ఇంటితోపాటు పలు ప్రాంతాల్లో సోదాలు!
ముంబైలోని బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. బాస్టియన్ రెస్టారెంట్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, పన్ను అవకతవకలపై దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. శిల్పా శెట్టి ఇంట్లో, ఆమెకు సంబంధించిన ఇతర ప్రదేశాలలో ఆదాయపు పన్ను శాఖ పత్రాలను పరిశీలిస్తోంది.
- Balaraju Goud
- Updated on: Dec 18, 2025
- 9:47 pm
దట్టమైన పొగమంచులో ‘మృత్యువు’గా ఎదురొచ్చిన ఎద్దు.. కారు కాలువలో పడి ముగ్గురు మృతి..!
దట్టమైన పొగమంచు ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. బీహార్లోని దర్భంగా జిల్లాలోని నెహ్రా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. నెహ్రా గ్రామం సమీపంలో ఈ ప్రమాదంలో జరిగింది. దట్టమైన పొగమంచులో దారి కనిపించక ఘోరం జరిగింది.
- Balaraju Goud
- Updated on: Dec 18, 2025
- 9:02 pm
గాయాలను నయం చేసుకుంటున్న పాకిస్తాన్.. మురిద్ ఎయిర్బేస్లో మరమ్మతులు షురూ!
ఆపరేషన్ సిందూర్ సమయంలో, భారతదేశం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడమే కాకుండా పాకిస్తాన్లోని మురిద్ ఎయిర్బేస్ను కూడా ధ్వంసం చేసింది. ఇప్పుడు, ఈ పాకిస్తాన్ వైమానిక దళ కమాండ్, కంట్రోల్ భవనం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ 16, 2025న తీసిన మురిద్ ఎయిర్బేస్ ఉపగ్రహ చిత్రం, భవనం ఎర్రటి టార్పాలిన్తో కప్పిన్నట్లు కనిపిస్తుంది.
- Balaraju Goud
- Updated on: Dec 18, 2025
- 8:20 pm
దూకుడు పెంచిన టీవీకే పార్టీ అధినేత విజయ్.. ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేసే పనిలో బిజీ..!
టీవీకే పార్టీ అధినేత విజయ్ దూకుడు పెంచారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. డీఎంకే పార్టీకి తానే ప్రత్యామ్నాయం అని నిరూపించుకునే పనిలో బిజీ అయ్యారు. ఇందులో భాగంగా ఈరోడ్ జిల్లాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు విజయ్.
- Balaraju Goud
- Updated on: Dec 18, 2025
- 8:04 pm
ముందు ఒరిస్సా రిజిస్ట్రేషన్.. వెనుక ఏపీ నెంబర్.. అనుమానంతో చెక్ చేస్తే షాక్..!
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట శివారులో పుష్ప సినిమా తరహాలో గంజాయి రవాణాకు స్మగ్లర్లు పాల్పడ్డారు. రెండు కోట్ల విలువ చేసే 405 కేజీల గంజాయి, ఉన్న 22 బస్తాలను, బొలెరో వ్యాన్ను వదిలి గంజాయి స్మగ్లర్లు పరారయ్యారు. గంజాయి స్మగ్లర్లు కోసం అటవీ ప్రాంతంలో డ్రోన్ కెమెరా ద్వారా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు గోకవరం పోలీసులు.
- Balaraju Goud
- Updated on: Dec 18, 2025
- 7:46 pm
జనాన్ని నిండా ముంచి విదేశాల్లో జల్సాలు.. విజయ్ మాల్యా ప్రీ-బర్త్డే పార్టీలో లలిత్ మోడీ..!
దేశం విడిచి పారిపోయిన వ్యాపారవేత్తలు లలిత్ మోడీ, విజయ్ మాల్యా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి, లండన్లో లలిత్ మోడీ తన స్నేహితుడు విజయ్ మాల్యా 70వ పుట్టినరోజుకు ముందు నిర్వహించిన విలాసవంతమైన పార్టీలో ప్రత్యక్షమయ్యాడు. భారతదేశంలో కోట్లాది రూపాయల కుంభకోణాలు, రుణ ఎగవేతలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరూ విదేశాలలో బహిరంగంగా వేడుకలు జరుపుకుంటున్నారు.
- Balaraju Goud
- Updated on: Dec 18, 2025
- 7:09 pm
ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలక పరిణామం.. మరో సూసైడ్ బాంబర్ అరెస్ట్.. తప్పిన భారీ ముప్పు!
గత నెలలో ఢిల్లీలో జరిగిన ఎర్రకోట పేలుళ్ల కేసులో మరో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఇది తొమ్మిదవ అరెస్టు. నిందితుడిని జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లోని షోపియన్ ప్రాంతానికి చెందిన యాసిర్ అహ్మద్ దార్గా గుర్తించారు. అతన్ని ఢిల్లీలో అరెస్టు చేశారు. యాసిర్ అహ్మద్ దార్ కూడా ఒక ఆత్మాహుతి బాంబర్ అని, ఢిల్లీలో ఆత్మాహుతి దాడి చేస్తానని ప్రతిజ్ఞ చేశాడని NIA చెబుతోంది.
- Balaraju Goud
- Updated on: Dec 18, 2025
- 6:07 pm
Viral Video: ప్రాణాలతో చెలగాటం.. భయానక స్టంట్తో గూస్ బంప్స్ తెప్పిస్తున్న రష్యన్ బ్యూటీ..!
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చలి, గడ్డకట్టే మంచు మధ్య, ఒక అమ్మాయి ప్రమాదకరమైన స్టంట్ చేసింది. అది నెటిజన్లను షాక్కు గురి చేసింది. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న ఈ అమ్మాయి ఏం చేసిందో మీరే చూడండి, ఇది చూసే వారి వెన్నులో వణుకు పుట్టించింది.
- Balaraju Goud
- Updated on: Dec 18, 2025
- 5:52 pm
ట్రంప్ బెదిరింపుల మధ్య, బ్రిక్స్ బాధ్యతలు చేపట్టబోతున్న భారత్.. అమెరికాకు నిద్రలేమి రాత్రులే..!
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి, సుంకాల బెదిరింపుల మధ్య, బ్రిక్స్ అమెరికా వ్యతిరేక కూటమిగా ఎదగకుండా నిరోధించడం భారతదేశానికి అతిపెద్ద సవాలు. బహుపాక్షిక సహకారం, అభివృద్ధి, సంభాషణలకు సానుకూల ప్రత్యామ్నాయంగా సమూహాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం కృషి చేస్తుంది. రాబోయే కాలం భారతదేశానికి దౌత్యపరమైన అగ్ని పరీక్షగా భావిస్తున్నారు.
- Balaraju Goud
- Updated on: Dec 18, 2025
- 4:32 pm
‘అత్తగారూ, నా భార్యను పంపించేయండి’.. నడిరోడ్డులో అత్త కాళ్ళు పట్టుకుని వేడుకున్న యువకుడు..!
ఉత్తరప్రదేశ్లో ఒక దిగ్భ్రాంతికరమైన కుటుంబ వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అలీఘర్లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రిజర్వ్ పోలీస్ లైన్స్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. బాధితుడు సంజయ్ తన భార్యను తిరిగి పంపించాలంటూ వేడుకుంటూ రోడ్డు మధ్యలో తన అత్తగారి పాదాలను పట్టుకున్నాడు.
- Balaraju Goud
- Updated on: Dec 17, 2025
- 11:21 pm