AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balaraju Goud

Balaraju Goud

Senior Sub-Editor, Political, Crime, Business, Hyperlocal - TV9 Telugu

balaraju.varaganti@tv9.com

29 సంవత్సరాల జర్నలిజం అనుభవం. ప్రింట్ మీడియాలో నాలుగేళ్లు. ఆ తర్వాత 2004 జూన్ మొదలుకుని ఎలక్ట్రానిక్ మీడియా అనుభవం. మొదట 1995 సంవత్సంలో వర్తమానం పత్రిక రిపోర్టర్‌గా ప్రారంభమైన జర్నలిజం జర్నీలో వార్త దిన పత్రిక రిపోర్టర్‌గా, రాజధాని ఎక్స్‌ప్రెస్ డైలీ న్యూస్ ప్రింట్ మీడియాలో పనిచేశాను. ఆ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌ వద్ద పర్సల్ సెక్రటరీగా విధి నిర్వహణ. తిరిగి మరోసారి జర్నలిజం వైపు అడుగులేశాను. 2004లో సత్య టీవీలో చేరాను. ఆ తర్వాత టీఎన్ఎన్ సబ్ ఎడిటర్‌గా, అటు నుంచి జీ 24 గంటలులో సబ్ ఎడిటర్‌గా, మహా న్యూస్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పని చేశాను. 2013 నుంచి టీవీ9లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం TV9 Telugu డిజిటల్ విభాగంలో సీనియర్ సబ్-ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నాను.

Read More
ప్రపంచ పవర్‌ఫుల్ దేశాల సరసన భారత్.. జాబితా నుంచి అమెరికా ఔట్..!

ప్రపంచ పవర్‌ఫుల్ దేశాల సరసన భారత్.. జాబితా నుంచి అమెరికా ఔట్..!

కిర్గిజిస్థాన్‌లోని SCO సదస్సులో భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. బెలారస్ అధ్యక్షుడు చైనా, రష్యా పక్కన భారత్‌ను మూడు కీలక శక్తులలో ఒకటిగా పేర్కొన్నారు, అమెరికాను జాబితా నుండి మినహాయించారు. ఉగ్రవాదంపై మోడీ స్పష్టమైన వైఖరి, ఇరాన్ సమస్యపై దౌత్యం, పుతిన్‌తో భేటీ భారత్ పెరుగుతున్న అంతర్జాతీయ ప్రభావాన్ని చాటాయి. ఈ పరిణామాలు భారత్ వ్యూహాత్మక ప్రాధాన్యతను పెంచాయి.

బయోలాజికల్ పార్క్‌లో విషాదం..! పులి దాడిలో పారిశుధ్య కార్మికురాలు దుర్మరణం..!

బయోలాజికల్ పార్క్‌లో విషాదం..! పులి దాడిలో పారిశుధ్య కార్మికురాలు దుర్మరణం..!

జైపూర్‌లోని నహర్‌గఢ్ బయోలాజికల్ పార్క్‌లో శివాజీ అనే పులి దాడిలో పారిశుద్ధ్య కార్మికురాలు సుగ్న మరణించారు. ఈ ఘటనపై అటవీశాఖ విచారణ జరుపుతోంది. మృతురాలి కుటుంబం రూ. 1 కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం డిమాండ్ చేస్తోంది. పార్క్‌లో భద్రతా నిబంధనలపై, సిబ్బంది రక్షణపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెరుగుతున్న పులుల సంఖ్యతో పాటు భద్రత మెరుగుపరచాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కార్గిల్ వీరుడి కన్నీటి గాథ.. 24 ఏళ్లుగా హక్కుల కోసం పోరాటం.. చివరకు ఆత్మహత్యాయత్నం!

కార్గిల్ వీరుడి కన్నీటి గాథ.. 24 ఏళ్లుగా హక్కుల కోసం పోరాటం.. చివరకు ఆత్మహత్యాయత్నం!

కార్గిల్ యుద్ధంలో గాయపడిన మాజీ సైనికుడు నాయిక్ శివానంద రెడ్డి, గత 24 ఏళ్లుగా తనకు రావాల్సిన భూమి, ఇతర ప్రయోజనాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు రూ.10 లక్షల లంచం డిమాండ్ చేయడంతో లోకాయుక్తను ఆశ్రయించారు. న్యాయం జరగక ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేశారు. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన వీరుడికి ఎదురైన ఈ దుస్థితి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చాటుతోంది.

ముఖ్యమంత్రి విజయ్ చారిత్రాత్మక నిర్ణయం.. వాళ్లపై ఉన్న కేసులన్నీ ఎత్తివేత..!

ముఖ్యమంత్రి విజయ్ చారిత్రాత్మక నిర్ణయం.. వాళ్లపై ఉన్న కేసులన్నీ ఎత్తివేత..!

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరసనలు చేపట్టిన రైతులు, ఉపాధ్యాయులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. SIPCOT, పరందూర్ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, అలాగే తమ డిమాండ్ల కోసం ఆందోళన చేసిన వారిపై కేసులు ఎత్తివేయడంతో లక్షలాది మందికి భారీ ఊరట లభించనుంది. ప్రజాస్వామ్యబద్ధంగా హక్కులను వినియోగించుకున్న వారిపై కేసులు ఉండకూడదన్నది సీఎం అభిప్రాయం.

కన్న తండ్రిపై కొడుకుల పైశాచికత్వం..! నడిరోడ్డుపైనే కర్రలతో దాడి..

కన్న తండ్రిపై కొడుకుల పైశాచికత్వం..! నడిరోడ్డుపైనే కర్రలతో దాడి..

మహారాష్ట్రలోని ఇందాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. భూమి విక్రయ వివాదంపై 65 ఏళ్ల వృద్ధ తండ్రిపై ఇద్దరు కొడుకులు నడిరోడ్డుపైనే కర్రలతో దాడి చేశారు. ఈ పైశాచిక దాడి దృశ్యాలు వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్న తండ్రిపైనే కొడుకుల ఈ దౌర్జన్యం సమాజంలో ఆందోళన రేకెత్తిస్తోంది.

జనావాసాల్లో జింక కలకలం.. చెంగు చెంగు మంటూ.. రోడ్డుపై పరుగులు తీసిన వన్యప్రాణి!

జనావాసాల్లో జింక కలకలం.. చెంగు చెంగు మంటూ.. రోడ్డుపై పరుగులు తీసిన వన్యప్రాణి!

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మనాగారంలో జనావాసాల మధ్య జింక ప్రత్యక్షమైంది. రహదారిపై పరుగులు తీసిన వన్యప్రాణిని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వన్యప్రాణులు ఇలా గ్రామాలోకి వస్తే, వాటిని వెంబడించకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని స్థానికులు సూచిస్తున్నారు.

నేపాల్‌లో మహా విపత్తు.. రెస్క్యూలో భారత్ కీలకం.. 163 మంది భారతీయులు సురక్షితం.. !

నేపాల్‌లో మహా విపత్తు.. రెస్క్యూలో భారత్ కీలకం.. 163 మంది భారతీయులు సురక్షితం.. !

నేపాల్‌లో సంభవించిన భారీ విపత్తు తర్వాత, భారత్ తక్షణమే రెస్క్యూ, సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 163 మంది భారతీయులను సురక్షితంగా రక్షించింది. సొరంగ రెస్క్యూ, ఫోరెన్సిక్ బృందాలను రంగంలోకి దించి, చిక్కుకుపోయిన వారిని గుర్తించడంలోనూ, మృతదేహాలను గుర్తించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తోంది. నేపాల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, మానవతా దృక్పథంతో భారత్ అందిస్తున్న సహాయం ప్రశంసనీయం.

తిరుపతిలో ఏసీబీ మెరుపు దాడులు..! టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో సోదాలు.. మరో 5 చోట్ల రైడ్స్!

తిరుపతిలో ఏసీబీ మెరుపు దాడులు..! టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో సోదాలు.. మరో 5 చోట్ల రైడ్స్!

తిరుపతిలో టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం నివాసంతో సహా ఆరు ప్రాంతాల్లో ఏసీబీ దాడులు తీవ్ర కలకలం రేపాయి. అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తులపై అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రికార్డులు, పత్రాలను పరిశీలిస్తున్నారు. అత్యంత కీలకమైన ధార్మిక సంస్థలో ఉన్నతాధికారిపై సోదాలు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పూర్తి వివరాలు ఏసీబీ అధికారిక ప్రకటన తర్వాత వెల్లడవుతాయి.

తెనాలిలో దారుణం..! బావమరిది సుపారీ స్కెచ్.. బావను మాట్లాడాలని తీసుకెళ్లి..!

తెనాలిలో దారుణం..! బావమరిది సుపారీ స్కెచ్.. బావను మాట్లాడాలని తీసుకెళ్లి..!

గుంటూరు జిల్లా తెనాలిలో కిడ్నాప్, హత్య ఘటన కలకలం రేపింది. చెక్కపాలిష్ వ్యాపారి కోటి లింగయ్యను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి.. దారుణంగా హతమార్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు కుటుంబ ఆస్తి వివాదాలే కారణమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

‘అసలు దాడి ఇప్పుడే మొదలవుతుంది’.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్..! హోర్ముజ్‌లో హైటెన్షన్!

‘అసలు దాడి ఇప్పుడే మొదలవుతుంది’.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్..! హోర్ముజ్‌లో హైటెన్షన్!

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య సైనిక ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత తీవ్రంగా మారుతున్నాయి. హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించినట్లు అమెరికా ప్రకటించింది. దీనికి ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

జోర్డాన్‌లో యూఎస్ స్థావరాలపై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్.. అమెరికాకు భారీ హెచ్చరిక!

జోర్డాన్‌లో యూఎస్ స్థావరాలపై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్.. అమెరికాకు భారీ హెచ్చరిక!

ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. జోర్డాన్‌లోని అకాబా సమీపంలో ఉన్న అమెరికా మెరైన్ల శిబిరాన్ని బాలిస్టిక్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. భారీ సంఖ్యలో క్షిపణులను ప్రయోగించామని, ఈ దాడిలో పెద్ద సంఖ్యలో అమెరికా సైనికులు మరణించినట్లు ఇరాన్ పేర్కొంది. అయితే ఈ వాదనలను అమెరికా లేదా ఇతర స్వతంత్ర వర్గాలు ఇప్పటివరకు ధృవీకరించలేదు.

పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు భక్తుల దుర్మరణం!

పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు భక్తుల దుర్మరణం!

హర్యానా: పల్వాల్ జిల్లాలో కుండ్లీ-మానే సర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం (సెప్టెంబర్ 01) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని బృందావన్ వైపు వెళ్తున్న యాత్రికులతో కూడిన పికప్ వాహనం.. రహదారి పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పల్వాల్ జిల్లా సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.