Balaraju Goud
Senior Sub-Editor, Political, Crime, Business, Hyperlocal - TV9 Telugu
balaraju.varaganti@tv9.com29 సంవత్సరాల జర్నలిజం అనుభవం. ప్రింట్ మీడియాలో నాలుగేళ్లు. ఆ తర్వాత 2004 జూన్ మొదలుకుని ఎలక్ట్రానిక్ మీడియా అనుభవం. మొదట 1995 సంవత్సంలో వర్తమానం పత్రిక రిపోర్టర్గా ప్రారంభమైన జర్నలిజం జర్నీలో వార్త దిన పత్రిక రిపోర్టర్గా, రాజధాని ఎక్స్ప్రెస్ డైలీ న్యూస్ ప్రింట్ మీడియాలో పనిచేశాను. ఆ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వద్ద పర్సల్ సెక్రటరీగా విధి నిర్వహణ. తిరిగి మరోసారి జర్నలిజం వైపు అడుగులేశాను. 2004లో సత్య టీవీలో చేరాను. ఆ తర్వాత టీఎన్ఎన్ సబ్ ఎడిటర్గా, అటు నుంచి జీ 24 గంటలులో సబ్ ఎడిటర్గా, మహా న్యూస్లో సీనియర్ సబ్ ఎడిటర్గా పని చేశాను. 2013 నుంచి టీవీ9లో సీనియర్ సబ్ ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం TV9 Telugu డిజిటల్ విభాగంలో సీనియర్ సబ్-ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను.
Watch: ప్రాణాలు పోతాయ్రా..! ఇంటి పైకప్పు అంచున ఫోన్ చూస్తున్న బాలుడు.. వామ్మో వీడియో చూశారా..?
ప్రస్తుత డిజిటల్ యుగంలో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్లు ఒక అంతర్భాగంగా మారిపోయాయి. అయితే, స్మార్ట్ఫోన్లకు బానిస కావడం ఎంత తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందో హెచ్చరించే ఒక భయంకరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురవుతున్నారు.
- Balaraju Goud
- Updated on: Jun 25, 2026
- 9:56 pm
ప్రపంచవ్యాప్తంగా గడ్డిమందు నిషేధం దిశగా అడుగులు.. తెలంగాణ బాటలోనే అగ్రరాజ్యం అమెరికా రాష్ట్రం!
మానవ ప్రాణాలకు, పర్యావరణానికి తీవ్ర ముప్పుగా పరిణమించిన ప్రమాదకరమైన 'పారాక్వాట్' (Paraquat) గడ్డిమందును ప్రపంచవ్యాప్తంగా నిషేధించే ప్రక్రియ మరింత వేగవంతమైంది. తాజాగా, అగ్రరాజ్యం అమెరికాలోని వర్మాంట్ రాష్ట్రం ఈ గడ్డిమందుపై పూర్తి నిషేధం విధిస్తూ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. పారాక్వాట్ను శాశ్వతంగా నిషేధిస్తూ వర్మాంట్ అసెంబ్లీ ఏకంగా ఒక కొత్త చట్టాన్ని ఆమోదించింది. తద్వారా, అమెరికాలోనే ఈ రసాయన కలుపు సంహారకాన్ని చట్టబద్ధంగా నిషేధించిన మొదటి రాష్ట్రంగా వర్మాంట్ సరికొత్త రికార్డు సృష్టించింది.
- Balaraju Goud
- Updated on: Jun 25, 2026
- 9:39 pm
Watch: కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్కు వచ్చిన జంట.. చిత్రంగా కనిపించిన ప్యాంట్.. చెక్ చేయగా షాక్!
హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వేదికగా మరోసారి భారీ మొత్తంలో తరలిస్తున్న స్మగ్లింగ్ బంగారం పట్టుబడింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుండి విమానంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు భారతీయ ప్రయాణికులను హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు గురువారం (జూన్ 25) అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 3.36 కోట్ల విలువైన 2.271 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
- Balaraju Goud
- Updated on: Jun 25, 2026
- 9:26 pm
గ్యాస్ వినియోగదారులకు గుడ్న్యూస్.. ఎల్పీజీ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్ర సర్కార్..!
దేశంలో వాణిజ్య, పారిశ్రామిక రంగానికి ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ (LPG) సరఫరాపై ఉన్న అన్ని రకాల ఆంక్షలను తక్షణమే ఎత్తివేసింది. గృహేతర ప్యాకేజ్డ్ ఎల్పీజీ సరఫరాపై గతంలో విధించిన రంగాల వారీ పరిమితులను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల తర్వాత తలెత్తిన అంతర్జాతీయ సంక్షోభానికి ముందు ఎలాంటి పరిస్థితులు ఉండేవో.. ఇప్పుడు ఎల్పీజీ సరఫరా మళ్లీ అదే యధాస్థితికి చేరుకుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- Balaraju Goud
- Updated on: Jun 25, 2026
- 7:59 pm
కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం.. వ్యాక్సిన్లు, క్యాన్సర్ మందులపై క్యూఆర్ (QR) కోడ్ తప్పనిసరి!
భారతదేశ ఫార్మాస్యూటికల్ సరఫరా, నాణ్యత, భద్రత, సమగ్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం గురువారం (జూన్ 25, 2026) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో నకిలీ, నాసిరకం మందుల చలామణీకి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 'డ్రగ్స్ రూల్స్, 1945'కు కీలక సవరణలను నోటిఫై చేసింది. ఈ సరికొత్త సవరణల ద్వారా ‘షెడ్యూల్ H2’ పరిధిని విస్తరించడంతో పాటు, అత్యంత కీలకమైన అదనపు కేటగిరీల మందులను కూడా క్యూఆర్ కోడ్ ఆధారిత ‘ట్రాక్ అండ్ ట్రేస్’ ఫ్రేమ్వర్క్ పరిధిలోకి తీసుకువచ్చింది.
- Balaraju Goud
- Updated on: Jun 25, 2026
- 7:47 pm
‘మమ్మల్ని వదిలేయండి, భారత్తో కలుస్తాం’.. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మిన్నంటిన నిరసనలు.. !
పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoK)లో పాక్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా తిరుగుబాటు గురువారం (జూన్ 25, 2026) నాటికి 16వ రోజుకు చేరుకుంది. పాకిస్తాన్ అణచివేత ధోరణికి వ్యతిరేకంగా, PoKకి విముక్తి కావాలంటూ రావల్కోట్లోని ఈద్గా మైదానంలో 50,000 మందికి పైగా నిరసనకారులు భారీ ప్రదర్శన చేపట్టారు. ముఖ్యంగా అక్కడి మహిళలు తమను నిలువునా దోచుకుంటున్న పాకిస్తాన్ నుండి విడిపోయి, భారతదేశంతో చేతులు కలపాలని బహిరంగంగా పిలుపునివ్వడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
- Balaraju Goud
- Updated on: Jun 25, 2026
- 6:42 pm
ఢిల్లీలో పోటీ చేస్తే 10 లక్షల ఓట్లు వస్తాయి.. భారత పర్యటనపై ఇటలీ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని రాసిన నూతన పుస్తకం 'జార్జియాస్ విజన్' (Giorgias Vision) ప్రస్తుతం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ పుస్తకంలో ఆమె 2023లో తాను భారతదేశంలో పర్యటించినప్పటి మధుర స్మృతులను ఆప్యాయంగా గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా న్యూఢిల్లీ వీధుల్లో తన చిరునవ్వుతో కూడిన స్వాగత పోస్టర్లను చూసి, ఇటలీ ఉప ప్రధానమంత్రి ఆంటోనియో తజానీ వేసిన ఒక చమత్కారమైన జోక్ను ఆమె ఇందులో ప్రస్తావించారు.
- Balaraju Goud
- Updated on: Jun 25, 2026
- 6:11 pm
Citizenship: భారత పౌరసత్వానికి నిజమైన రుజువు పత్రం ఏదీ? చట్టం ఏం చెబుతోంది..?
‘పాస్పోర్ట్ సేవా దివస్’ సందర్భంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. భారత పాస్పోర్ట్ కేవలం ఒక ప్రయాణ పత్రం (ట్రావెల్ డాక్యుమెంట్) మాత్రమేనని, అది పౌరసత్వానికి తిరుగులేని రుజువు కాదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో సామాన్య ప్రజల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తాయి. పాస్పోర్ట్లు, ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు పౌరసత్వానికి అంతిమ రుజువు కాకపోతే, మరి అసలైన పౌరసత్వ రుజువు ఏది? చట్టం ఏం చెబుతోంది? అనే అంశాలపై గందరగోళం నెలకొంది.
- Balaraju Goud
- Updated on: Jun 25, 2026
- 5:16 pm
లెక్చరర్ల నియామకాల్లో భారీ కుంభకోణం.. కీలక పత్రాలు, నకిలీ ఓఎంఆర్ షీట్లు స్వాధీనం!
తమిళనాడులో సంచలనం సృష్టించిన పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామక కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి నిఘా పెట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 కింద ఈడీ చెన్నై జోనల్ కార్యాలయం బుధవారం తమిళనాడు వ్యాప్తంగా భారీ సోదాలు నిర్వహించింది. చెన్నై, మదురై, తిరుచిరాపల్లి (తిరుచ్చి), కోయంబత్తూరు నగరాల్లోని 21 కీలక ప్రాంతాలపై ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి.
- Balaraju Goud
- Updated on: Jun 25, 2026
- 4:56 pm
వెనిజులాలో పెను విపత్తు.. వరుస భూకంపాలతో మృత్యుఘోష.. అంతకంతకూ పెరుగుతున్న మృత్యుల సంఖ్య!
వెనిజులాలో బుధవారం (జూన్ 24) సాయంత్రం సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాలు పెను విషాదాన్ని నింపాయి. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా 164 మంది మరణించగా, 971 మంది గాయపడ్డారని తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ గురువారం అధికారికంగా ప్రకటించారు. అంతకుముందు మృతుల సంఖ్య 32 గా ఉన్నప్పటికీ, శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతుండటంతో ఈ సంఖ్య వేగంగా పెరిగింది. గాయపడిన వారి సంఖ్య కూడా భారీగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.
- Balaraju Goud
- Updated on: Jun 25, 2026
- 4:35 pm
తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రలు, కేంద్ర మంత్రి సమక్షంలో ఆవిష్కృతం!
కర్ణాటకలోని విజయనగర జిల్లా పరిధిలోని తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో గురువారం ( జూన్ 25, 2026) ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రూ.51 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన 33 కొత్త స్పిల్ వే (క్రస్ట్) గేట్లను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కలిసి అధికారికంగా ప్రారంభించారు.
- Balaraju Goud
- Updated on: Jun 25, 2026
- 3:51 pm
ఇన్స్టాగ్రామ్ పరిచయం.. నమ్మి వెళ్తే నట్టేట ముంచారు.. వితంతువుపై సామూహిక అఘాయిత్యం!
సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ కేవలం యువత కాలక్షేపానికే కాదు, నేరస్థులకు అమాయక బాధితులను వేటాడేందుకు ఒక సాధనంగా మారుతోంది. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాకు చెందిన ఒక నిరుపేద వితంతువుకు ఎదురైన భయంకరమైన ఘటనే దీనికి నిదర్శనం. మొదట సానుభూతి నటిస్తూ, ఆపై ఆమె నిస్సహాయతను ఆసరాగా చేసుకుని నిందితులు ఆమె జీవితాన్ని నరకప్రాయం చేశారు.
- Balaraju Goud
- Updated on: Jun 25, 2026
- 3:10 pm