Balaraju Goud
Senior Sub-Editor, Political, Crime, Business, Hyperlocal - TV9 Telugu
balaraju.varaganti@tv9.com29 సంవత్సరాల జర్నలిజం అనుభవం. ప్రింట్ మీడియాలో నాలుగేళ్లు. ఆ తర్వాత 2004 జూన్ మొదలుకుని ఎలక్ట్రానిక్ మీడియా అనుభవం. మొదట 1995 సంవత్సంలో వర్తమానం పత్రిక రిపోర్టర్గా ప్రారంభమైన జర్నలిజం జర్నీలో వార్త దిన పత్రిక రిపోర్టర్గా, రాజధాని ఎక్స్ప్రెస్ డైలీ న్యూస్ ప్రింట్ మీడియాలో పనిచేశాను. ఆ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వద్ద పర్సల్ సెక్రటరీగా విధి నిర్వహణ. తిరిగి మరోసారి జర్నలిజం వైపు అడుగులేశాను. 2004లో సత్య టీవీలో చేరాను. ఆ తర్వాత టీఎన్ఎన్ సబ్ ఎడిటర్గా, అటు నుంచి జీ 24 గంటలులో సబ్ ఎడిటర్గా, మహా న్యూస్లో సీనియర్ సబ్ ఎడిటర్గా పని చేశాను. 2013 నుంచి టీవీ9లో సీనియర్ సబ్ ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం TV9 Telugu డిజిటల్ విభాగంలో సీనియర్ సబ్-ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను.
మహిళా ఖాతాలో వచ్చి పడ్డ లక్ష్మీదేవి.. ఏకంగా రూ. 10 కోట్లు జమ.. ఏం చేసిందో తెలుసా?
ఉత్తరప్రదేశ్లో విచిత్ర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మైన్పురి జిల్లాలో ఒక మహిళ ఏటీఎంలో మామూలుగా బ్యాలెన్స్ చెక్ చేసుకుంది. అయితే తన బ్యాంకు ఖాతాలోకి దాదాపు రూ. 10 కోట్లు జమ అయినట్లు గుర్తించి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ ఘటన గందరగోళానికి దారితీసింది. బ్యాంకింగ్ వ్యవస్థలపై ప్రశ్నలను లేవనెత్తింది. వెంటనే అప్రమత్తమైన ఆ మహిళ బ్యాంకుకు పరుగులు తీసింది.
- Balaraju Goud
- Updated on: Mar 29, 2026
- 1:59 pm
Security Alert: ఐఫోన్, మ్యాక్ వినియోగదారులు జాగ్రత్త! ప్రమాద హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం..!
మీరు ఆపిల్ ఐఫోన్, మ్యాక్ లేదా ఐప్యాడ్ ఉపయోగిస్తుంటే, ఈ వార్త మీకు అత్యంత ముఖ్యమైనది. ఆపిల్ పరికరాలలో ఉన్న అనేక తీవ్రమైన భద్రతా లోపాలపై భారతదేశ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ, సెర్ట్-ఇన్, హై అలర్ట్ జారీ చేసింది. ఈ లోపాల వల్ల హ్యాకర్లు మీ పరికరంలోకి ప్రవేశించి డేటాను దొంగిలించవచ్చు. లేదంటే మీ ఫోన్ను తమ నియంత్రణలోకి తీసుకోవచ్చని హెచ్చరించింది.
- Balaraju Goud
- Updated on: Mar 29, 2026
- 1:34 pm
వదంతులకు దూరంగా ఉండండి.. ఏ కష్టమొచ్చిన కలిసికట్టుగా ఎదురుకుందాంః ప్రధాని మోదీ!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (మార్చి 29, 2026) ఉదయం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియో 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 'మన్ కీ బాత్' కార్యక్రమం యొ132వ ఎపిసోడ్లో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, "ఈ మార్చి నెల ప్రపంచవ్యాప్తంగా చాలా అల్లకల్లోలంగా గడిచింది. కోవిడ్ కారణంగా యావత్ ప్రపంచం చాలా కాలం పాటు అనేక సమస్యలను ఎదుర్కొన్న విషయం మనందరికీ గుర్తుంది. కరోనా సంక్షోభాన్ని అధిగమించిన తర్వాత ప్రపంచం ప్రగతి పథంలో ముందుకు సాగుతుందన్నారు.
- Balaraju Goud
- Updated on: Mar 29, 2026
- 12:48 pm
Telangana: రామాలయంలో అద్భుతం.. అంజనేయుడికి హారతి, మొక్కులు చెల్లించిన వానరం!
హనుమంతుడికి ప్రతిరూపమే వానరం అంటారు. అలాంటి వానరం ఆయన సన్నిధానానికి చేరుకుని పూజలు చేసిన దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. దహెగాం రామాలయంలోని హనుమాన్ విగ్రహనికి హనుమాన్ స్వాములు పూజలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఎక్కడి నుండి వచ్చిందో కాని ఒక వానరం స్వామి వారికి మంగళ హారతి ఇచ్చేంత వరకు శ్రద్ధగా నిలబడిపోయింది.
- Balaraju Goud
- Updated on: Mar 29, 2026
- 12:15 pm
పాకిస్తాన్ ముమ్మాటికీ ఉగ్రవాద దేశమే.. ఇదిగో సాక్ష్యాలు.. బయటపెట్టిన అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్
ఉగ్రవాద కార్యాకలాపాలకు సంబంధించి అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ సంచలన నివేదికను బయటపెట్టింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపుల గురించి, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ను లక్ష్యంగా చేసుకున్న వాటి గురించి వివరించింది. దీంతో భారతదేశానికి చాలాకాలంగా ఉన్న ఆందోళనలను మరోసారి రేకెత్తించింది. తన నివేదికలో అనేక తీవ్రవాద గ్రూపులను ప్రముఖంగా ప్రస్తావించింది.
- Balaraju Goud
- Updated on: Mar 29, 2026
- 11:30 am
బాత్రూమ్లో జారిపడ్డ పాకిస్తాన్ మాజీ సైన్యాధిపతి.. తల పగిలి చనిపోయిన కమర్ జావేద్!
పాకిస్తాన్ మాజీ సైన్యాధిపతి కమర్ జావేద్ బాజ్వా తీవ్రమైన తల గాయాలతో మరణించారని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. మీడియా కథనాల ప్రకారం, 65 ఏళ్ల మాజీ జనరల్ కమర్ జావేద్ తన బాత్రూమ్లో జారి పడిపోయాడు. దీంతో అతన్ని కుటుంబసభ్యులు రావల్పిండి మిలిటరీ ఆసుపత్రిలో చేర్పించారు.
- Balaraju Goud
- Updated on: Mar 29, 2026
- 10:44 am
ఇరాన్లో అంతర్గత యుద్ధం.. అధ్యక్షుడు, ఐఆర్జిసి అధిపతి మధ్య విభేదాలు.. తిరుగుబాటు సంకేతాలా?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యం ఇంకా నెరవేరలేదు. నాలుగు వారాల్లో యుద్ధం ముగుస్తుందని ప్రకటించిన ట్రంప్కు ఇరాన్ పోరాటం మింగుడుపడడం లేదు. 30 రోజులుగా ఇరాన్ చేస్తున్న పోరాటం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. ఏకకాలంలో ఇజ్రాయెల్, అమెరికాతో పోరాటం.. గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తూ ఇప్పటికీ తన పవర్ను ప్రదర్శిస్తోంది. తమ సుప్రీం లీడర్ను కోల్పోయినా.. టాప్ నాయకత్వం తుడిచిపెట్టుకుపోయినా.. IRGC మాత్రం లొంగలేదు. చిన్న డ్రోన్లతోనే పెద్ద లక్ష్యాలను చేధిస్తోంది.
- Balaraju Goud
- Updated on: Mar 29, 2026
- 10:14 am
సొంత దేశంలోనే చుక్కలు చూస్తున్న డొనాల్డ్ ట్రంప్.. ‘రాజులు వద్దు’ అంటూ కదంతొక్కిన అమెరికా జనం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా చర్యలకు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్డెక్కారు. నో కింగ్స్ అంటూ నిరసనలు వెల్లువెత్తాయి. ఇది అమెరికాలో చరిత్రలోనే అతిపెద్ద నిరసనల్లో ఒకటిగా మారుతుందని, దీనికి మిన్నెసోటా కేంద్ర బిందువుగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. 50 రాష్ట్రాల్లో 3,100 చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించామని, వీటిలో మొత్తం 90 లక్షల మందికి పైగా పాల్గొన్నారని తెలిపారు.
- Balaraju Goud
- Updated on: Mar 29, 2026
- 9:09 am
ఇస్లామాబాద్లో ఇరాన్-అమెరికా యుద్ధంపై చర్చలు.. మధ్యవర్తిత్వంలో ఎవరు పాల్గొంటున్నారు..?
అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధం దాదాపు నెల రోజులుగా కొనసాగుతోంది. అమెరికా తన మిత్రదేశమైన ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై నిరంతరం దాడులు చేస్తోంది. దీంతో ఇరాన్ మధ్యప్రాచ్యాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. అంతేకాకుండా, హోర్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా విస్తృత ఆగ్రహానికి కారణమైంది.
- Balaraju Goud
- Updated on: Mar 29, 2026
- 8:53 am
ఇరాన్లో భారీగా మోహరించిన US సైనిక బలగాలు.. అమెరికా గ్రౌండ్ ఆపరేషన్ రంగం సిద్ధమా..?
ఇరాన్పై దాడుల విషయంలో అమెరికా పెద్ద నిర్ణయం తీసుకోబోతోందా…? దాడులకు 10 రోజుల విరామం అని ట్రంప్ ప్రకటించిన తర్వాత, పశ్చిమాసియాలో అకస్మాత్తుగా సీన్ మారింది. అగ్రరాజ్య సైనిక మోహరింపులు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. యూఎస్ఎస్ ట్రిపోలి నౌకలోని సుమారు 3,500 మంది మెరైన్లు, సెయిలర్స్ ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
- Balaraju Goud
- Updated on: Mar 29, 2026
- 8:23 am
ఫోజులకు ఏమాత్రం తక్కువ లేదు.. అందమైన ముఖం వెనక అతి కిరాతకమా..! మూడేళ్లకు బయటపడ్డ నిజం!
చేసిన పాపం ఊరికే పోదు.. ఎప్పటికైనా వెంటాడుతుంది. ఈ కలియుగంలో మాత్రం కాస్త లేటు అవ్వచ్చేమో కానీ, శిక్ష మాత్రం పక్కా అని మరో ఘటనతో రుజువు అయ్యింది. మూడేళ్ల క్రితం ఒక సాధారణ మరణంగా ముగిసిపోయిన ఓ కేసు.. ఇప్పుడు ఊహించని మలుపు తిరిగి సంచలనం సృష్టిస్తోంది. కన్న తండ్రినే అతి కిరాతకంగా అంతమొందించిన ఒక పోలీస్ కుమార్తె ఉదంతం.. చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరనే నిజాన్ని చాటిచెప్పింది.
- Balaraju Goud
- Updated on: Mar 29, 2026
- 7:18 am
Healthy Diet: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నప్పటికీ విటమిన్ లోపానికి కారణం ఏమిటి?
ఈ రోజుల్లో ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఇంట్లో వండిన భోజనం, పండ్లు, కూరగాయలు, సమతుల్య ఆహారం తీసుకుంటున్నప్పటికీ, చాలామంది నీరసం, అలసట లేదంటే తరచుగా అనారోగ్యం బారిన పడుతున్నారు. పరీక్షలు చేయగా ఐరన్, విటమిన్ బి12 లేదా విటమిన్ డి లోపాలు ఉన్నట్లు వెల్లడవుతోంది.
- Balaraju Goud
- Updated on: Mar 28, 2026
- 2:17 pm