Balaraju Goud
Senior Sub-Editor, Political, Crime, Business, Hyperlocal - TV9 Telugu
balaraju.varaganti@tv9.com29 సంవత్సరాల జర్నలిజం అనుభవం. ప్రింట్ మీడియాలో నాలుగేళ్లు. ఆ తర్వాత 2004 జూన్ మొదలుకుని ఎలక్ట్రానిక్ మీడియా అనుభవం. మొదట 1995 సంవత్సంలో వర్తమానం పత్రిక రిపోర్టర్గా ప్రారంభమైన జర్నలిజం జర్నీలో వార్త దిన పత్రిక రిపోర్టర్గా, రాజధాని ఎక్స్ప్రెస్ డైలీ న్యూస్ ప్రింట్ మీడియాలో పనిచేశాను. ఆ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వద్ద పర్సల్ సెక్రటరీగా విధి నిర్వహణ. తిరిగి మరోసారి జర్నలిజం వైపు అడుగులేశాను. 2004లో సత్య టీవీలో చేరాను. ఆ తర్వాత టీఎన్ఎన్ సబ్ ఎడిటర్గా, అటు నుంచి జీ 24 గంటలులో సబ్ ఎడిటర్గా, మహా న్యూస్లో సీనియర్ సబ్ ఎడిటర్గా పని చేశాను. 2013 నుంచి టీవీ9లో సీనియర్ సబ్ ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం TV9 Telugu డిజిటల్ విభాగంలో సీనియర్ సబ్-ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను.
Watch: వామ్మో.. చూస్తేనే ఒళ్లు గగుర్పాటుకు చేస్తోంది.. 18 అడుగుల కింగ్ కోబ్రాను ఎలా పట్టుకున్నారబ్బా..!
కింగ్ కోబ్రాను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాములలో ఒకటి. అది కరిచి సకాలంలో చికిత్స పొందకపోతే, మరణానికి దారితీస్తుంది. అందుకే జనం ఈ పాముకు చాలా దూరంగా ఉంటారు. అయితే, కొంతమంది అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను సైతం పట్టుకునేందుకు సాహసం చేస్తారు. ఈ రకమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Balaraju Goud
- Updated on: Mar 8, 2026
- 10:02 pm
గల్ఫ్లో చిక్కుకున్న వారికి భారత సర్కార్ భరోసా.. ఎప్పటి వరకు ఎంత మందిని తీసుకువచ్చారంటే..!
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కొనసాగుతోంది. అమెరికాతో చర్చించేదిలేదన్న ఇరాన్ మంకుపట్టు కారణంగా గల్ఫ్లో ఇప్పటికీ అవే టెన్షన్లు. ఇప్పటివరకు యుద్ధంలో 1,300 మందికిపైగా చనిపోయారు. గల్ఫ్ దేశాలకు ఇరాన్ క్షమాపణలు చెప్పి, దాడులు చెయ్యబోమని ఇరాన్ హామీనిచ్చినా.. జనానికి పరేషాన్లు తప్పడం లేదు. ముఖ్యంగా యుద్ధ ప్రభావం ఉన్న భారతీయులు స్వదేశం బాట పడుతున్నారు.
- Balaraju Goud
- Updated on: Mar 8, 2026
- 9:40 pm
ఇరాన్-అమెరికా యుద్ధం మధ్యలోకి రష్యా.. వెంటనే ‘P-5’ సమావేశం కావల్సిందేః పుతిన్
ఇరాన్పై అమెరికా - ఇజ్రాయెల్ సంయుక్త దాడి తర్వాత, మధ్యప్రాచ్యంలో యుద్ధం వేగంగా వ్యాపిస్తోంది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తత నేపథ్యంలో రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తత వేగంగా పెరిగిందని, ఇది అంతర్జాతీయ చట్టం ఉల్లంఘనకు గురవుతుందని రష్యా తెలిపింది. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, "P5" శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
- Balaraju Goud
- Updated on: Mar 8, 2026
- 9:16 pm
కొంప ముంచిన గూగుల్ మ్యాప్.. కాలువలోకి దూసుకెళ్లిన కారు.. జర్రుంటే ప్రాణాలే పోయేవి..!
సాధారణంగా మనకు తెలియని ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే, అడ్రస్ కోసం గూగుల్ మ్యాప్ను నమ్ముకుంటాం. ముఖ్యంగా త్వరగా వెళ్లేందుకు షార్ట్ రూట్ ఏంటో లాంగ్ రూట్ ఏంటో ఫాలో అవుతుంటాం. అయితే అన్ని వేళల్లో గూగుల్ మ్యాప్స్ను నమ్ముకుంటే కొంప ముంచుతున్నాయి. కొన్నిసార్లు దారి తప్పించి, నీళ్లల్లోకి.. ఆడవుల్లోకి తీసుకెళ్తాయి. అలాంటి ఘటన తాజాగా ఉత్తర్ప్రదేశ్లో వెలుగు చూసింది.
- Balaraju Goud
- Updated on: Mar 8, 2026
- 8:38 pm
సాఫ్ట్వేర్ లోపాలతో రెస్టారెంట్ల బిల్లింగ్ స్కామ్.. బిర్యానీ హోటళ్ల తనిఖీల్లో బయటపడ్డ వాస్తవాలు!
కిల్ 'బిల్' పాండేలకు అడ్డాగా మారాయి కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్. వీళ్లు చేస్తున్న మాయాజాలంతో ఏటా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టపోతోంది. బిల్లింగ్ సాఫ్ట్వేర్లోని లోపాలతో కొంతమంది నిర్వాహకులు ప్రభుత్వం కళ్లకు గంతలు కడుతున్నారు. అసలేంటి ఈ బిల్లింగ్ స్కామ్..? ఇది ఎలా జరుగుతుంది?
- Balaraju Goud
- Updated on: Mar 8, 2026
- 7:48 pm
తన జీవితాన్ని ప్రభావితం చేసిన మహిళలను గుర్తుచేసుకుంటూ.. గౌతమ్ అదానీ భావోద్వేగం..!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌతమ్ అదానీ తన జీవితాన్ని, విలువలను తీర్చిదిద్దిన మహిళలను గుర్తు చేసుకున్నారు. ఆ మహిళలను తన ఉన్నతికి సాక్షులుగా అభివర్ణించారు. లింక్డ్ఇన్లో ఒక భావోద్వేగ పోస్ట్ చేసిన గౌతమ్ అదానీ, తన కుటుంబంలోని మహిళల ప్రభావం తనపై ఎంతగానో ఉందో వివరించారు. తన జీవితం, బాధ్యతలు, దేశ నిర్మాణంపై కొత్త దృక్పథాన్ని అందించడంలో వారి పాత్ర ముఖ్యమైనదని అదానీ పేర్కొన్నారు.
- Balaraju Goud
- Updated on: Mar 8, 2026
- 7:32 pm
ఆకాశంలో చికెన్ ముక్క తెచ్చిన తంట.. ఫ్లైట్లో ఇద్దరి మధ్య యుద్ధమే.. అసలేం జరిగిందంటే?
ప్రస్తుత కాలంలో విమాన ప్రయాణం చాలా సాధారణం అయిపోయింది. చాలా మంది దీనిని గతంలో బస్సులో ప్రయాణించినట్లే దినచర్యగా భావిస్తున్నారు. విమాన ప్రయాణం సురక్షితం, సౌకర్యవంతం. ప్రశాంతత, మేఘాల గుండా అందమైన ప్రయాణాలకు సులువుగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు, ఈ ప్రయాణాలు అకస్మాత్తుగా చాలా నాటకీయంగా మారతాయి. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లను తీసి రికార్డ్ చేస్తారు.
- Balaraju Goud
- Updated on: Mar 8, 2026
- 6:12 pm
పాలిటిక్స్లోకి నితీష్ తనయుడి గ్రాండ్ ఎంట్రీ .. బీహార్ నెక్ట్స్ సీఎం ఎవరు..? రేసులో ఉన్నదెవరు..?
20 ఏళ్లు ఆయనే సీఎం.. ఇప్పుడు ఆయన సైడైపోతుండటంతో ఆ సీట్లోకి వచ్చేది ఎవరనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈసారి ఛాన్స్ కమలం పార్టీకి దక్కనుండటంతో.. బీజేపీ నాయకత్వం ఎవరినీ బిహార్ సీఎం కుర్చీపై కూర్చొబెడుతుందనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేసులో ఉన్న పేర్లకే బీజేపీ పెద్దలు టిక్ పెడతారా? లేక ఎవరూ ఊహించని కొత్త ముఖాలకు అవకాశం ఇస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది.
- Balaraju Goud
- Updated on: Mar 8, 2026
- 5:38 pm
Viral Video: ఎందుకురా ఈ వేషాలు.. ప్రియురాలితో వింతైన స్టంట్.. దెబ్బకు దెయ్యం వదిలింది..!
తాజాగా ఒక హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూస్తే, ఒక్కసారిగా ఒళ్లు గుగుర్పాటుకు గురి చేసినంత పనైంది. ఒక యువకుడు తన స్నేహితుల సమక్షంలో తన గర్ల్ఫ్రెండ్ పట్ల ఉన్న ప్రేమను ఒక ప్రత్యేకమైన స్టంట్ ద్వారా తెలియజేయాలనుకున్నాడు. తన ప్రేయసిని తన భుజంపైకి ఎక్కించుకుని తన ఆనందాన్ని వ్యక్తపరచాలనుకున్నాడు.
- Balaraju Goud
- Updated on: Mar 8, 2026
- 5:04 pm
మైనర్ బాలికను ట్రక్లో ఎక్కించుకుని.. మూడు రోజులుగా పశువుల్లా ప్రవర్తించిన ఆరు మంది..!
జార్ఖండ్లో అత్యంత దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికను బంధించి, ఆరు మంది.. మూడు రోజులుగా సామూహికంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. పాకూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీస్ కేసు నమోదైంది. ఈ సంఘటన గురించి తెలియగానే, ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడి, దిగ్భ్రాంతికి గురైంది.
- Balaraju Goud
- Updated on: Mar 8, 2026
- 4:29 pm
‘మీ పని మీరు చూసుకోండి.. మీ సలహాలు వద్దు’.. డోనాల్డ్ ట్రంప్కు కమల్ హాసన్ సీరియస్ వార్నింగ్!
సినీ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్నకు బహిరంగ లేఖ రాయడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. భారతదేశం ఒక స్వతంత్ర, సార్వభౌమ దేశం అని, ఇకపై సుదూర దేశం నుండి ఆదేశాలు తీసుకోదని ఆయన పేర్కొన్నారు.
- Balaraju Goud
- Updated on: Mar 8, 2026
- 4:06 pm
PM Modi: దేశ తొలి ‘రింగ్ మెట్రో’ నెట్వర్క్ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం 12.3 కిలోమీటర్ల పొడవైన మజ్లిస్ పార్క్-మౌజ్పూర్-బాబర్పూర్ పింక్ లైన్ సెక్షన్ను, 9.9 కిలోమీటర్ల పొడవైన దీపాలి చౌక్-మజ్లిస్ పార్క్ ఎక్స్టెన్షన్ మెజెంటా లైన్ను ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో ప్రాజెక్ట్ ఫేజ్ V(A) కింద మూడు కొత్త కారిడార్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
- Balaraju Goud
- Updated on: Mar 8, 2026
- 3:26 pm