Balaraju Goud
Senior Sub-Editor, Political, Crime, Business, Hyperlocal - TV9 Telugu
balaraju.varaganti@tv9.com29 సంవత్సరాల జర్నలిజం అనుభవం. ప్రింట్ మీడియాలో నాలుగేళ్లు. ఆ తర్వాత 2004 జూన్ మొదలుకుని ఎలక్ట్రానిక్ మీడియా అనుభవం. మొదట 1995 సంవత్సంలో వర్తమానం పత్రిక రిపోర్టర్గా ప్రారంభమైన జర్నలిజం జర్నీలో వార్త దిన పత్రిక రిపోర్టర్గా, రాజధాని ఎక్స్ప్రెస్ డైలీ న్యూస్ ప్రింట్ మీడియాలో పనిచేశాను. ఆ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వద్ద పర్సల్ సెక్రటరీగా విధి నిర్వహణ. తిరిగి మరోసారి జర్నలిజం వైపు అడుగులేశాను. 2004లో సత్య టీవీలో చేరాను. ఆ తర్వాత టీఎన్ఎన్ సబ్ ఎడిటర్గా, అటు నుంచి జీ 24 గంటలులో సబ్ ఎడిటర్గా, మహా న్యూస్లో సీనియర్ సబ్ ఎడిటర్గా పని చేశాను. 2013 నుంచి టీవీ9లో సీనియర్ సబ్ ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం TV9 Telugu డిజిటల్ విభాగంలో సీనియర్ సబ్-ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను.
పనికి రావాలనిపించడం లేదా? సెలవు తీసుకోండి..! ఉద్యోగులకు చైనా కంపెనీ బంపర్ ఆఫర్!
ఉద్యోగుల పని ఒత్తిడి, మానసిక సంతృప్తి, వర్క్-లైఫ్ బ్యాలెన్స్పై మరోసారి చర్చ మొదలైంది. చైనాకు చెందిన రిటైల్ సంస్థ పాంగ్ డాంగ్ లై (Pang Dong Lai) అనుసరిస్తున్న ఓ ప్రత్యేకమైన సెలవు విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగులు మానసికంగా సంతోషంగా లేని రోజుల్లో కూడా సెలవు తీసుకునే అవకాశం కల్పించడమే ఈ పాలసీ ప్రత్యేకత.
- Balaraju Goud
- Updated on: Aug 8, 2026
- 1:53 pm
రాత్రంతా లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? మీ హార్మోన్లకు బిగ్ వార్నింగ్!
నిద్ర అంటే కేవలం అలసట తీర్చుకోవడం మాత్రమే కాదు.. శరీరంలోని అనేక కీలక ప్రక్రియలు సక్రమంగా కొనసాగడానికి అవసరమైన సహజ వ్యవస్థ. ముఖ్యంగా హార్మోన్ల నియంత్రణ, శరీర ఉష్ణోగ్రత, మెదడు పనితీరు, ఒత్తిడి నియంత్రణ వంటి అంశాల్లో నాణ్యమైన నిద్రకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే చాలామంది రాత్రిపూట గదిలో లైట్ వేసుకునే నిద్రపోతుంటారు. కొందరికి బెడ్సైడ్ ల్యాంప్ అలవాటైతే, మరికొందరు మొబైల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల స్క్రీన్ను చూస్తూనే నిద్రలోకి జారుకుంటారు.
- Balaraju Goud
- Updated on: Aug 8, 2026
- 1:29 pm
చదువుల్లోనే కాదు.. జీవితమే అసలు పరీక్ష.. ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ యువతకు కీలక సూచనలు చేశారు.“క్యాంపస్లో సిలబస్ ఉంటుంది.. కానీ జీవితంలో సిలబస్కు వెలుపలే పరీక్షలు ఉంటాయి” అంటూ యువతను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితానికి నిర్దిష్టమైన ప్రశ్నపత్రం, ముందుగా నిర్ణయించిన మార్గం ఉండదని.. కొన్నిసార్లు అసలు ప్రశ్న ఏమిటో కూడా ఎవరూ చెప్పరని, దాన్ని తామే గుర్తించి పరిష్కరించాల్సి ఉంటుందని అన్నారు.
- Balaraju Goud
- Updated on: Aug 8, 2026
- 1:00 pm
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర కలకలం రేపే ఘటన వెలుగుచూసింది. నగరంలోని బగలగుంటె ప్రాంతంలో ఓ డ్యూప్లెక్స్ ఇంట్లో 52 ఏళ్ల మహిళ అస్థిపంజరం లభ్యమైంది. మృతురాలు దక్షాయణిగా పోలీసులు గుర్తించారు. ఆమె సుమారు ఏడాది క్రితమే మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా నివసించిన ఆమె మృతదేహం ఇంతకాలం బయటపడకపోవడం స్థానికంగా సంచలనంగా మారింది.
- Balaraju Goud
- Updated on: Aug 8, 2026
- 12:22 pm
మారుతున్న Gen Z ఆలోచన.. ఇళ్లు కొనడం మానేస్తే.. భారత ఆర్థిక వ్యవస్థకు ఏమవుతుంది?
ఒకప్పుడు ఉద్యోగం వచ్చిందంటే ఇల్లు కొనాలి.. పెళ్లి అయితే సొంతింటి కోసం లోన్ తీసుకోవాలి.. ఇదే మధ్యతరగతి భారతీయుల ఆలోచన. కానీ ఇప్పుడు ఆ ఆలోచనను జెన్ జెడ్ మార్చేస్తోంది. ‘ఇల్లు కొనడం కంటే.. ముందుగా సంపద పెంచుకోవాలి’ అంటున్న ఈ తరం నిజంగానే సొంతింటికి దూరమైతే ఏం జరుగుతుంది? రియల్ ఎస్టేట్ నుంచి బ్యాంకింగ్ వరకు.. సిమెంట్ నుంచి స్టీల్ వరకు.. ప్రభుత్వ స్టాంప్ డ్యూటీ నుంచి ఉపాధి వరకు.. దాని ప్రభావం ఎంత దూరం వెళ్తుంది? ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన స్థిరాస్తి రంగం ఎలా మారుతుంది? అసలు Gen Z ఇళ్లు కొనడం మానేస్తుందా.. లేక కేవలం కొంచెం ఆలస్యంగా కొనుగోలు చేస్తుందా? ఇప్పుడు ఈ ప్రశ్నలే భారత ఆర్థిక వ్యవస్థ ముందున్న ఆసక్తికరమైన చర్చగా మారుతున్నాయి.
- Balaraju Goud
- Updated on: Aug 8, 2026
- 11:49 am
Bus Accident: ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు..!
హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంబా జిల్లాలోని తిస్సా–బైరాగఢ్ రహదారిపై శనివారం (ఆగస్టు 08) ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 11 మంది గాయపడ్డారు. చలుజ్ మోర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం తీవ్రతతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
- Balaraju Goud
- Updated on: Aug 8, 2026
- 10:47 am
చైనా పేరు మార్చితే.. భారత్ మ్యాప్ మార్చింది! 27 ప్రాంతాలపై డ్రాగన్కు స్ట్రాంగ్ కౌంటర్
అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు చైనా పదేపదే కొత్త పేర్లు పెడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని 27 ప్రాంతాలు, భౌగోళిక స్వరూపాలకు వాటి ప్రామాణిక పేర్లను అధికారిక భారత పటంలో లాంఛనంగా గుర్తించింది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో ఈ పేర్లను అధికారికంగా నమోదు చేసింది. ఆయా ప్రాంతాలను స్పష్టంగా గుర్తించడంతో పాటు ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని కేంద్రం తెలిపింది.
- Balaraju Goud
- Updated on: Aug 8, 2026
- 10:22 am
ప్రభుత్వశాఖలో పందికొక్కులు.. ఒకే ఆధార్.. రెండు ఉద్యోగాలు.. రెండు జీతాలు!
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పేరోల్ వ్యవస్థలో వెలుగుచూస్తున్న డూప్లికేట్ వివరాలు ఇప్పుడు అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఒకే ఆధార్ నంబర్తో వేర్వేరు ఉద్యోగ ఐడీలపై ఇద్దరు ఉద్యోగులకు జీతాలు చెల్లించినట్లు ఆర్థికశాఖ పరిశీలనలో బట్టబయలైంది. మరికొన్ని కేసుల్లో ఒక శాఖలో ఆధార్ వివరాలతో జీతం చెల్లిస్తుండగా.. మరో శాఖలో ఆధార్ లేకుండానే వేతనం డ్రా అయినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
- Balaraju Goud
- Updated on: Aug 8, 2026
- 9:31 am
ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం..? ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాటం..! నిజమెంతా..?
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై మరోసారి తీవ్రస్థాయిలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వాదనలను ఇరాన్ ప్రభుత్వం గానీ అధికారిక ఆరోగ్య సంస్థలు కానీ ఇప్పటివరకు ధృవీకరించలేదు.
- Balaraju Goud
- Updated on: Aug 8, 2026
- 8:52 am
E20 పెట్రోల్లో కల్తీ ఉందా? 90 వేల బంకుల్లో తనిఖీలు.. బయటపడ్డ అసలు నిజం!
దేశవ్యాప్తంగా E20 పెట్రోల్పై కొనసాగుతున్న అనుమానాలు, సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కీలక ప్రకటన చేశాయి. E20 పెట్రోల్లో అధిక స్థాయిలో క్లోరైడ్, నీటి కల్తీ జరుగుతోందన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు, పరీక్షలు నిర్వహించామని అయిల్ కంపెనీలు ప్రకటించాయి.
- Balaraju Goud
- Updated on: Aug 8, 2026
- 8:21 am
భారత్కు ట్రంప్ బిగ్ షాక్..! 100% టారిఫ్ ఫ్లాన్.. అమెరికా సెనేట్ ఆమోదం!
రష్యాపై అమెరికా ఆంక్షల యుద్ధం మరో కీలక మలుపు తిరిగింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కల్పించే కీలక బిల్లును అమెరికా సెనేట్ భారీ మెజారిటీతో ఆమోదించింది. ‘లిండ్సే ఓ. గ్రాహమ్ సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’గా పిలుస్తున్న ఈ బిల్లు 86-11 ఓట్లతో ఆమోదం పొందింది.
- Balaraju Goud
- Updated on: Aug 8, 2026
- 7:27 am
దేశమంతా ఉదయం.. ఇక్కడ మాత్రం అర్ధరాత్రే స్వాతంత్ర్య వేడుకలు! కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని అత్యంత వైభవమైన వేడుక ఢిల్లీలోని ఎర్రకోటలో జరుగుతుంది, ఇక్కడ ప్రధానమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అయితే, దేశంలో ఒక నగరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆగస్టు 15 ఉదయం కాకుండా, ఆగస్టు 14 అర్ధరాత్రి ప్రారంభమవుతాయని మీకు తెలుసా?
- Balaraju Goud
- Updated on: Aug 7, 2026
- 2:10 pm