Balaraju Goud
Senior Sub-Editor, Political, Crime, Business, Hyperlocal - TV9 Telugu
balaraju.varaganti@tv9.com29 సంవత్సరాల జర్నలిజం అనుభవం. ప్రింట్ మీడియాలో నాలుగేళ్లు. ఆ తర్వాత 2004 జూన్ మొదలుకుని ఎలక్ట్రానిక్ మీడియా అనుభవం. మొదట 1995 సంవత్సంలో వర్తమానం పత్రిక రిపోర్టర్గా ప్రారంభమైన జర్నలిజం జర్నీలో వార్త దిన పత్రిక రిపోర్టర్గా, రాజధాని ఎక్స్ప్రెస్ డైలీ న్యూస్ ప్రింట్ మీడియాలో పనిచేశాను. ఆ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వద్ద పర్సల్ సెక్రటరీగా విధి నిర్వహణ. తిరిగి మరోసారి జర్నలిజం వైపు అడుగులేశాను. 2004లో సత్య టీవీలో చేరాను. ఆ తర్వాత టీఎన్ఎన్ సబ్ ఎడిటర్గా, అటు నుంచి జీ 24 గంటలులో సబ్ ఎడిటర్గా, మహా న్యూస్లో సీనియర్ సబ్ ఎడిటర్గా పని చేశాను. 2013 నుంచి టీవీ9లో సీనియర్ సబ్ ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం TV9 Telugu డిజిటల్ విభాగంలో సీనియర్ సబ్-ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను.
అమెరికా-ఇరాన్ మధ్య చావో రేవో తేలాల్సిన సమయం.. శాంతి చర్చలకు డొనాల్డ్ ట్రంప్!
అమెరికా, ఇరాన్ల మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి ఇస్లామాబాద్ వైపు మళ్లాయి. హోర్ముజ్ జలసంధిలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముగియనున్న కాల్పుల విరమణ గడువు వెరసి.. ప్రపంచం మొత్తం ఇప్పుడు పాకిస్థాన్ రాజధానిలో జరగబోయే కీలక శాంతి చర్చల వైపు ఆసక్తిగా చూస్తోంది.
- Balaraju Goud
- Updated on: Apr 21, 2026
- 1:49 pm
Hyderabad: అయ్య బాబోయ్.. చదివేది పదో తరగతి.. చేసే పనులు మాత్రం.. !
హైదరాబాద్ మహానగరంలోని కూకట్పల్లిలో వెలుగుచూసిన ఈ ఘటన సమాజానికి ఒక హెచ్చరికగా నిలుస్తోంది. కేవలం 15 ఏళ్ల ప్రాయంలో, పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు విలాసాల కోసం దారితప్పి వాహన చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది. వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ కుర్రాడిని నిలదీయడంతో అసలు యవ్వారం బయటపడింది.
- Balaraju Goud
- Updated on: Apr 21, 2026
- 12:40 pm
వచ్చారో.. అరెస్టే..! నెతన్యాహుకు హంగేరి ప్రధాని పీటర్ మాగ్యార్ స్ట్రాంగ్ వార్నింగ్
హంగేరి రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విక్టర్ ఓర్బన్ 16 ఏళ్ల సుదీర్ఘ పాలనకు చరమగీతం పాడుతూ, పీటర్ మాగ్యార్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అధికారం చేపట్టిన వెంటనే ఆయన అంతర్జాతీయ వేదికపై సంచలన నిర్ణయాలు ప్రకటిస్తూ వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఉద్దేశించి మాగ్యార్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
- Balaraju Goud
- Updated on: Apr 21, 2026
- 12:03 pm
గంటల పసికందులే వీరి టార్గెట్.. పక్కా స్కెచ్తో మస్కా.. ‘ఆపరేషన్ దేవ్’తో వెలుగులోకి సంచలనాలు!
అంతర్రాష్ట్ర స్థాయిలో పసిబిడ్డల విక్రయాలే లక్ష్యంగా సాగుతున్న ఒక భారీ నెట్వర్క్ను గుజరాత్ పోలీసులు ఛేదించారు. కేవలం అండదాతల బ్రోకర్గా మొదలై, చివరకు నవజాత శిశువుల స్మగ్లర్గా మారిన తెలంగాణకు చెందిన ఒక ముఠా నాయకుడి ఆగడాలకు బనస్కాంత పోలీసులు అడ్డుకట్ట వేశారు.
- Balaraju Goud
- Updated on: Apr 21, 2026
- 10:56 am
భారత్-అమెరికా వాణిజ్య బంధంలో కొత్త అధ్యాయం.. వాషింగ్టన్లో కీలక చర్చలు!
భారతదేశం - అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలను మరో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దిశగా వాషింగ్టన్లో కీలకమైన వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య ఒక సమగ్ర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది.
- Balaraju Goud
- Updated on: Apr 21, 2026
- 10:25 am
రూ. వంద కోసం దారుణం! ప్రాణాలు కోల్పోయిన ఛాయ్వాలా.. చావు బతుకుల మధ్య మరొకరు!
మనుషుల్లో రానురాను మానవత్వం మంటగలుస్తోంది. కేవలం వంద రూపాయల కోసం ఒక నిండు ప్రాణం బలికావడం అత్యంత శోచనీయం. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
- Balaraju Goud
- Updated on: Apr 21, 2026
- 8:19 am
బాకీ తీర్చలేదని బంధాన్ని తుంచేశాడు.. పుట్టబోయే బిడ్డతో సహా ముగ్గురి ప్రాణాలను చిదిమేశాడు!
హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీలో తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి.. అన్నను, గర్భిణీ అని కూడా చూడకుండా వదినను అతి దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్పురాలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది.
- Balaraju Goud
- Updated on: Apr 21, 2026
- 7:53 am
కేసులు వలయంలో చిక్కుకుపోయిన దళపతి.. రాజకీయ రణక్షేత్రంలో నెగ్గుకొచ్చేనా..?
తమిళ రాజకీయాల్లో 'దళపతి' విజయ్ ఎంట్రీ ఒక సంచలనం. వెండితెరపై అప్రతిహత విజయాలతో దూసుకెళ్లిన ఆయన, రాజకీయ రణక్షేత్రంలోకి అడుగుపెట్టగానే అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలో నాయకులు ప్రజల మధ్య ఉండాలి, కానీ విజయ్ మాత్రం ఇప్పుడు ప్రజా క్షేత్రం కంటే న్యాయస్థానాల చుట్టూనే ఎక్కువగా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
- Balaraju Goud
- Updated on: Apr 21, 2026
- 8:02 am
కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయానికి మహర్దశ.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శ్రీకారం
కాళేశ్వరం ఆలయ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇందుకోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. ఆలయ అభివృద్ధితో పాటు ఇతర పనులకు శ్రీకారం చుట్టింది. భక్తులకు కనీస వసతులు కల్పించడం, ఆలయ ప్రాంగణాన్ని విస్తరించడం వంటి అంశాలపై సీఎం రేవంత్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
- Balaraju Goud
- Updated on: Apr 21, 2026
- 7:06 am
లోక్సభలో వీగిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. మోదీ ప్రభుత్వం ఏం చేయబోతోంది?
లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. మొత్తంగా 528 ఓట్లు పోలవగా.. అనుకూలంగా 298, ప్రతికూలంగా 230 మంది ఓటేశారు. ఈ బిల్లు నెగ్గాలంటే టు థర్డ్ మెజార్టీగా 352 ఓట్లు రావాల్సి ఉండగా.. 298 మాత్రమే రావడంతో.. బిల్లు వీగిపోయినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. 131 రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు చారిత్రక తప్పిదం చేశాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 17, 2026
- 9:35 pm
ఫ్రెండ్ను కలిసేందుకు వెళ్లి.. బురఖాలో ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి షాకైన తల్లిదండ్రులు!
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో సభ్య సమాజం సిగ్గుపడేలా చేసే ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని, ప్రేమ పేరుతో వలలో వేసుకుని, మత మార్పిడికి ఒత్తిడి తెస్తూ దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న ఒక గ్యాంగ్ బాగోతం బట్టబయలైంది. బాధితుల్లో ఒకరైన అశోక్నగర్ నివాసి, మరో ఇద్దరు బాలికలతో కలిసి బురఖా ధరించి ఇంటికి రావడంతో ఈ దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
- Balaraju Goud
- Updated on: Apr 17, 2026
- 8:34 pm
ఎన్డీఏకు అందని ‘మ్యాజిక్ ఫిగర్’.. లోక్సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు
లోక్సభలో మహిళా రిజర్వేషన్ల వేగవంతమైన అమలుకు ఉద్దేశించిన కీలక బిల్లు చుక్కెదురైంది. 131వ రాజ్యాంగ సవరణ వీగిపోయింది. కొత్త జనాభా గణనతో సంబంధం లేకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, మహిళా కోటాను వెంటనే అమలు చేయాలన్న ప్రతిపాదనను లోక్సభ తిరస్కరించింది. శుక్రవారం (ఏప్రిల్ 17) జరిగిన ఈ ఉత్కంఠభరిత ఓటింగ్లో మొత్తం 489 మంది ఎంపీలు పాల్గొన్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 17, 2026
- 8:06 pm