
Balaraju Goud
Senior Sub-Editor, Political, Crime, Business, Hyperlocal - TV9 Telugu
balaraju.varaganti@tv9.com29 సంవత్సరాల జర్నలిజం అనుభవం. ప్రింట్ మీడియాలో నాలుగేళ్లు. ఆ తర్వాత 2004 జూన్ మొదలుకుని ఎలక్ట్రానిక్ మీడియా అనుభవం. మొదట 1995 సంవత్సంలో వర్తమానం పత్రిక రిపోర్టర్గా ప్రారంభమైన జర్నలిజం జర్నీలో వార్త దిన పత్రిక రిపోర్టర్గా, రాజధాని ఎక్స్ప్రెస్ డైలీ న్యూస్ ప్రింట్ మీడియాలో పనిచేశాను. ఆ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వద్ద పర్సల్ సెక్రటరీగా విధి నిర్వహణ. తిరిగి మరోసారి జర్నలిజం వైపు అడుగులేశాను. 2004లో సత్య టీవీలో చేరాను. ఆ తర్వాత టీఎన్ఎన్ సబ్ ఎడిటర్గా, అటు నుంచి జీ 24 గంటలులో సబ్ ఎడిటర్గా, మహా న్యూస్లో సీనియర్ సబ్ ఎడిటర్గా పని చేశాను. 2013 నుంచి టీవీ9లో సీనియర్ సబ్ ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం TV9 Telugu డిజిటల్ విభాగంలో సీనియర్ సబ్-ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను.
పతంజలి మరో ముందడుగు.. గ్రామీణ సాధికారత, ఆరోగ్య బారతదేశంగా మార్చడమే లక్ష్యం..!
పతంజలి భవిష్యత్తు ప్రణాళికలు స్వావలంబన, సంపూర్ణ ఆరోగ్యంపై దృష్టి సారించాయి. పతంజలి ఆయుర్వేదం రైతులు, మూలికా ఉత్పత్తిదారులు, స్థానిక చేతివృత్తులవారికి మద్దతు ఇవ్వడం ద్వారా దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోంది. అలాగే, యోగా, ఆయుర్వేద పరిశోధన కేంద్రాలను స్థాపించడం ద్వారా, పతంజలి ఆయుర్వేదాన్ని ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలో ప్రభావవంతమైన వైద్య వ్యవస్థగా ఏర్పాటు చేస్తోంది.
- Balaraju Goud
- Updated on: Mar 31, 2025
- 1:18 pm
పగోడికి కూడా ఈ బాధ ఉండకూడదు.. ఈ లవ్ ఫెయిల్యూర్ వ్యక్తీ ఏం చేశాడో చూస్తే..!
ప్రస్తుతం ఇంటర్నెట్లో ఒక ప్రత్యేకమైన వివాహం గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ప్రేమలో పదే పదే మోసపోవడాన్ని తట్టుకోలేకే ఒక వ్యక్తి మేకను పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహనికి సంబంధించిన వార్తల సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వైరల్ పోస్ట్పై నెటిజన్లు చాలా సరదాగా కామెంట్ చేస్తున్నారు.
- Balaraju Goud
- Updated on: Mar 31, 2025
- 12:50 pm
సమాజంలో సామరస్యం, దయ స్ఫూర్తి పెంచండి.. దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని ఈద్ శుభాకాంక్షలు
ఈద్-ఉల్-ఫితర్ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రాముఖ్యతను ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించి, శాంతి, సామరస్యం, సోదరభావం సందేశాన్ని ఇచ్చారు. ఈద్ చంద్రుడిని చూసిన తర్వాత, దేశవ్యాప్తంగా పండుగ సందడి నెలకొంది.
- Balaraju Goud
- Updated on: Mar 31, 2025
- 11:28 am
Watch: ఏం ధైర్యంరా బుడ్డోడా.. ఏకంగా సింహంతోనే పరాచకాలా.. వైరల్ వీడియో
ప్రస్తుతం మారుతున్న కాలంతో పాటు, సింహాన్ని ఉంచుకోవడం కూడా ఒక అభిరుచిగా మారింది. కొందరు వ్యక్తులు పెద్ద పులులను, సింహాలను పెంపుడు జంతువుల్లాగా సాకుతున్నారు. ఈ క్రమంలోనే సింహాన్ని పెంచుకునే వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక పిల్లవాడు సింహం తోకను లాగుతున్నాడు.
- Balaraju Goud
- Updated on: Mar 31, 2025
- 10:52 am
మాజీ మంత్రులను వెంటాడుతున్న కేసులు.. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న నేతలు!
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం అంతా ఇప్పుడు సీదిరి అప్పలరాజు చుట్టూనే నడుస్తోంది. ఒకప్పుడు మంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మాజీ మంత్రి, పలాస నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ సీదిరి అప్పలరాజును పోలీస్ కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా ఆయనపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
- Balaraju Goud
- Updated on: Mar 31, 2025
- 9:54 am
లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్ పేరుతో వల.. తీరా చూస్తే ఈడీ అధికారులే షాక్..!
ఉత్తరప్రదేశ్ నోయిడాలోని భారీ హైటెక్ వ్యభిచార రాకెట్ గుట్టరట్టు అయింది. లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్ పేరుతో వల వేసి.. పలువురు యువతులను వ్యభిచార రొంపిలోకి దింపతున్న ఓ జంట దందాను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) బట్టబయలు చేసింది. అడల్ట్ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్లను నిర్వహిస్తున్నట్లు తేల్చారు. ఈడీ దాడుల్లో 15.66 కోట్ల రూపాయల అక్రమ విదేశీ నిధులను స్వాధీనం చేసుకున్నారు.
- Balaraju Goud
- Updated on: Mar 31, 2025
- 8:56 am
మళ్లీ తెరపైకి లారెన్స్ బిష్టోయ్ గ్యాంగ్.. ఏకంగా సమాజ్వాదీ పార్టీ నేతకే వార్నింగ్!
లారెన్స్ బిష్టోయ్ గ్యాంగ్ మరోసారి తెరపైకి వచ్చింది. గతేడాది మహారాష్ట్రలోని అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేతను అత్యంత దారుణంగా హత్య చేసిన బిష్టోయ్ ముఠా.. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ నేత తారిఖ్ఖాన్కు కాల్ చేసి బెదిరించడం సంచలనం రేపుతోంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తారిఖ్ఖాన్కు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
- Balaraju Goud
- Updated on: Mar 31, 2025
- 8:36 am
హైదరాబాద్-విజయవాడ మార్గంలోని వాహనదారులకు గుడ్న్యూస్.. భారీగా తగ్గిన టోల్ ట్యాక్స్
కేంద్ర సర్కార్ నిర్ణయంతో భారీగా టోల్ ట్యాక్స్లు తగ్గాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి ఊరట లభించింది. వాహనాలకు టోల్ ట్యాక్స్ తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-విజయవాడ హైవేపై మంగళవారం(ఏఫ్రిల్ 1) తెల్లవారుజాము నుంచి అమలులోకి రానున్నాయి.
- Balaraju Goud
- Updated on: Mar 31, 2025
- 8:26 am
సన్న బియ్యంపై అప్పుడే మొదలైన క్రెడిట్ వార్.. వాటాలు వేసుకుంటున్న కాంగ్రెస్-బీజేపీ!
పేదలకు కడుపు నిండా అన్నం పెట్టేందుకే సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ హయాంలోనే రేషన్ షాపుల విధానంతో పాటు బియ్యం సరఫరా పథకాలు మొదలయ్యాయని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సన్న బియ్యం పథకంపై అప్పుడే క్రెడిట్ వార్ మొదలైంది. పేదల కోసం ఆలోచించే ఈ పథకం తెచ్చామని కాంగ్రెస్ అంటుంటే.. ఈ పథకం ఖర్చులో మెజార్టీ వాటా కేంద్రానిదే అనే వాదనను తెరపైకి తెచ్చింది బీజేపీ.
- Balaraju Goud
- Updated on: Mar 31, 2025
- 7:38 am
Myanmar Earthquake: ప్రకృతి ప్రళయానికి మయన్మార్ విలవిల.. మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం..?
మయన్మార్తో పాటు థాయ్లాండ్లో సంభవించిన భూకంపం తీవ్రత ఎవరూ ఊహించని స్థాయిలో ఉంది. అయితే ఈ భూకంపం సాధారణమైంది కాదు.. 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. మయన్మార్లో భూకంప విలయంలో మరణించిన వారి సంఖ్య 1700 దాటింది.
- Balaraju Goud
- Updated on: Mar 31, 2025
- 7:21 am
Andhra Pradesh: క్యాన్సర్ పెషేంట్కు అండగా హోంమంత్రి.. వీడియో కాల్ చేసిన భరోసా..!
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను దగ్గర నుండి చూడాలని ఓ క్యాన్సర్ పెషేంట్ కోరిక. దీంతో వీడియో కాల్ చేసిన హోంమంత్రి ఆమెతో మాట్లాడారు. ఆమెకు ధైర్యం చెప్పారు. ఎప్పుడు మాట్లాడాలనిపించినా కాల్ చేయాలని ఆమెకు భరోసా ఇచ్చారు. అంతే కాదు.. ధైర్యానికి మించిన మందు లేదని ఆమెలో ధైర్యాన్ని పెంచే ప్రయత్నం చేశారు.
- Balaraju Goud
- Updated on: Mar 31, 2025
- 7:04 am
స్కూటీపై నిలబడి, నడిరోడ్డులో షాకింగ్ స్టంట్ చేసిన అమ్మాయి.. షాకింగ్ వీడియో వైరల్!
ప్రస్తుత రోజుల్లో రీల్స్ చేసే మోజులో జనం ఎంతకైనా తెగిస్తున్నారు. రీల్స్ చేసేటప్పుడు పరిసరాలను సైతం మరిచిపోయి, తమ ప్రాణాలను పట్టించుకోవడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనకు సంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో ఒక అమ్మాయి కదులుతున్న స్కూటర్ మీద నిలబడి స్టంట్ చేసింది. ఈ ఘటన ఒళ్లు గగుర్పాటుకు గురిచేసింది.
- Balaraju Goud
- Updated on: Mar 30, 2025
- 9:18 pm