
Balaraju Goud
Senior Sub-Editor, Political, Crime, Business, Hyperlocal - TV9 Telugu
balaraju.varaganti@tv9.com29 సంవత్సరాల జర్నలిజం అనుభవం. ప్రింట్ మీడియాలో నాలుగేళ్లు. ఆ తర్వాత 2004 జూన్ మొదలుకుని ఎలక్ట్రానిక్ మీడియా అనుభవం. మొదట 1995 సంవత్సంలో వర్తమానం పత్రిక రిపోర్టర్గా ప్రారంభమైన జర్నలిజం జర్నీలో వార్త దిన పత్రిక రిపోర్టర్గా, రాజధాని ఎక్స్ప్రెస్ డైలీ న్యూస్ ప్రింట్ మీడియాలో పనిచేశాను. ఆ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వద్ద పర్సల్ సెక్రటరీగా విధి నిర్వహణ. తిరిగి మరోసారి జర్నలిజం వైపు అడుగులేశాను. 2004లో సత్య టీవీలో చేరాను. ఆ తర్వాత టీఎన్ఎన్ సబ్ ఎడిటర్గా, అటు నుంచి జీ 24 గంటలులో సబ్ ఎడిటర్గా, మహా న్యూస్లో సీనియర్ సబ్ ఎడిటర్గా పని చేశాను. 2013 నుంచి టీవీ9లో సీనియర్ సబ్ ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం TV9 Telugu డిజిటల్ విభాగంలో సీనియర్ సబ్-ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను.
మిడిల్ ఈస్ట్లో మహా యుద్ధం.. ఆపరేషన్ రైజింగ్ లయన్, ఎక్కడికి దారితీస్తుంది?
ఇజ్రాయెల్-ఇరాన్ దేశాలు నువ్వా ? నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఆరుగురు టాప్ ఇరాన్ ఆర్మీ కమాండర్లను చంపేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది చనిపోయారని , దీనికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది.
- Balaraju Goud
- Updated on: Jun 13, 2025
- 9:47 pm
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తత గురించి బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఇరాన్తో ప్రస్తుత పరిస్థితి గురించి నెతన్యాహు తనకు తెలియజేసినట్లు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. భారతదేశం ఆందోళనలను ఆయనకు తెలియజేశానని, ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని స్పష్టం చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
- Balaraju Goud
- Updated on: Jun 13, 2025
- 8:39 pm
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్న్యూస్.. కోర్టు ఆదేశాలతో త్వరలోనే ప్రక్రియ షురూ!
ఆస్తుల పునరుద్ధరణ ద్వారా ఊరట లభించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) ద్వారా జప్తు చేసిన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను బాధితులకు పంపిణీ చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఆస్తుల మార్కెట్ విలువ సుమారు రూ. 6 వేల కోట్లుగా అంచనా వేయడం జరిగింది. ఈడీ హైదరాబాద్ జోన్ కార్యాలయం, అగ్రి గోల్డ్ గ్రూప్ కంపెనీలు నడిపిన పొంజీ స్కీమ్ బాధితులకు అందజేయనున్నారు.
- Balaraju Goud
- Updated on: Jun 13, 2025
- 8:22 pm
డీజీసీఏ కీలక నిర్ణయం.. భారత్లోని అన్ని బోయింగ్ విమానాల తనిఖీకి ఆదేశం..!
జూన్ 12న గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. బోయింగ్ 787-8/9 విమానాలపై భద్రతా తనిఖీలను పెంచాలని DGCA కీలక సూచనలు జారీ చేసింది. ఈ కొత్త సూచన జూన్ 15, 2025 అర్ధరాత్రి 12 గంటల నుండి అమల్లోకి వస్తుంది. విమానానికి ముందు అనేక ముఖ్యమైన సాంకేతిక తనిఖీలను నిర్వహించాలని DGCA ఆదేశించింది.
- Balaraju Goud
- Updated on: Jun 13, 2025
- 6:51 pm
తొలిసారి భారత్లో మొదలైన బ్లాక్బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!
అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బ్లాక్ బాక్స్..! దర్యాప్తు సంస్థలకు కీలక ఆధారాలు లభించాలంటే.. ఖచ్చితంగా డీకోడ్ కావాల్సింది కూడా ఈ బ్లాక్బాక్సే..! అసలేంటీ బ్లాక్ బాక్స్..? చూడ్డానికి బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటూ బాక్స్బాక్స్గా పిలవడే దీనికి, ప్రమాదానికి సంబంధించిన వాస్తవాలు తెలియజేసే దమ్ముందా..?
- Balaraju Goud
- Updated on: Jun 13, 2025
- 6:51 pm
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
ఫార్ములా-ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. సోమవారం ఉదయం10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్, ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద కుమార్, ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ గతంలో ఒకసారి విచారించింది.
- Balaraju Goud
- Updated on: Jun 13, 2025
- 5:07 pm
నది ఒడ్డున విహారయాత్రలో ఎంజాయ్.. ఇంతలోనే ఏంట్రీ ఇచ్చిన ఏనుగు..!
కొంతమంది ఆడవిలో నది ఒడ్డున విహారయాత్ర ఎంజాయ్ చేస్తుండగా, అకస్మాత్తుగా ఒక ఏనుగు అక్కడికి వచ్చింది. ఆడవిలో చోటు చేసుకున్న అనూహ్య ఘటనకు సంబంధించిన ఒక వీడియోను IFS అధికారి ప్రవీణ్ కస్వాన్ సోషల్ మీడియా X లో షేర్ చేశారు. ఇది ఎవరి తప్పు? అని ఆయన ప్రజలను అడిగారు. దీంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
- Balaraju Goud
- Updated on: Jun 13, 2025
- 4:31 pm
విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVRను విశ్లేషించనున్న FSL బృందం
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో DVR ను గుజరాత్ ATS స్వాధీనం చేసుకుంది. ఫోరెన్సిక్ బృందం ఇప్పుడు DVR ను దర్యాప్తు చేస్తుంది. భద్రతా దృక్కోణం నుండి విమానంలో DVR ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. సంఘటన సమయంలో జరిగిన కార్యకలాపాలను అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది.
- Balaraju Goud
- Updated on: Jun 13, 2025
- 6:52 pm
ఆకాశవీధిలో మృత్యునాదం.. అత్యంత విషాదాన్ని నింపిన ప్రమాదాలు ఇవే!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. భారతదేశాన్నే కాదు, యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 254మందితో లండన్కు పయనమైన విమానం.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలడం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఉదంతంతో... గత ప్రమాదాలను కూడా నెమరేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకు ముందు భారత్లో జరిగిన భారీ విమానప్రమాదాలేంటి? ఎక్కడెక్కడ జరిగాయ్! ఆ వివరాలు చూద్దాం.
- Balaraju Goud
- Updated on: Jun 13, 2025
- 6:52 pm
మృత్యు విహంగం.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. 37 ఏళ్ల భయంకర జ్ఞాపకాన్ని గుర్తు చేసిందీ ప్రమాదం!
గురువారం (జూన్ 12) అహ్మదాబాద్లో భారీ విమాన ప్రమాదం జరిగింది. ఆ ప్రయాణీకుల విమానంలో 242 మంది ఉన్నారు. ఒక్కరు తప్పా అందరూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదం 37 సంవత్సరాల క్రితం జరిగిన విమాన ప్రమాద జ్ఞాపకాలను తిరిగి తెచ్చింది. ఆ సమయంలో, ఆ ప్రమాదంలో మొత్తం 137 మంది మరణించారు.
- Balaraju Goud
- Updated on: Jun 13, 2025
- 1:16 pm
విమానయాన చరిత్రలో ఘోర విషాదం.. ఎలా జరిగింది. ఏం జరిగింది.. అసలు కారణం అదేనా?
విమానయాన చరిత్రలో ఘోర విషాదం. ఎయిరిండియా 171 విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకు ఊహించని ప్రమాదం. ఆకాశంలో రివ్వున ఎగరాల్సిన ఫ్లైట్.. రన్వే నుంచి పైకి ఎగరగానే సెకన్ల వ్యవధిలో కుప్పకూలింది. అదీ జనావాసాలపై. ఫ్లైట్ లో ఉన్న ఒక్కరు తప్పా అందరు ప్రాణాలు కోల్పోయారని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. 241మంది చనిపోయారు.
- Balaraju Goud
- Updated on: Jun 13, 2025
- 1:16 pm
ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలివేనా.? షాకింగ్ విషయాలు చెప్పిన అమెరికా నిపుణులు
అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న 241 మంది ప్రయాణికులు మరణించారు. ప్రమాదానికి ముందు, పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు మేడే కాల్ చేశాడని, కానీ ఎటువంటి స్పందన రాలేదని డిజిసిఎ చెబుతోంది. ఇబ్బందుల్లో ఉన్న విమానం ఎలా సహాయం పొందుతుంది అనే ప్రశ్న తలెత్తుతుంది? అమెరికాకు చెందిన ప్రసిద్ధ విమానయాన నిపుణుడు జాన్ ఎం. కాక్స్ దీని గురించి సంచలన విషయాన్ని వెల్లడించారు.
- Balaraju Goud
- Updated on: Jun 13, 2025
- 1:17 pm