AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తన జీవితాన్ని ప్రభావితం చేసిన మహిళలను గుర్తుచేసుకుంటూ.. గౌతమ్ అదానీ భావోద్వేగం..!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌతమ్ అదానీ తన జీవితాన్ని, విలువలను తీర్చిదిద్దిన మహిళలను గుర్తు చేసుకున్నారు. ఆ మహిళలను తన ఉన్నతికి సాక్షులుగా అభివర్ణించారు. లింక్డ్ఇన్‌లో ఒక భావోద్వేగ పోస్ట్‌ చేసిన గౌతమ్ అదానీ, తన కుటుంబంలోని మహిళల ప్రభావం తనపై ఎంతగానో ఉందో వివరించారు. తన జీవితం, బాధ్యతలు, దేశ నిర్మాణంపై కొత్త దృక్పథాన్ని అందించడంలో వారి పాత్ర ముఖ్యమైనదని అదానీ పేర్కొన్నారు.

తన జీవితాన్ని ప్రభావితం చేసిన మహిళలను గుర్తుచేసుకుంటూ.. గౌతమ్ అదానీ భావోద్వేగం..!
Gautam Adani On Women's Day
Balaraju Goud
|

Updated on: Mar 08, 2026 | 7:32 PM

Share

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌతమ్ అదానీ తన జీవితాన్ని, విలువలను తీర్చిదిద్దిన మహిళలను గుర్తు చేసుకున్నారు. ఆ మహిళలను తన ఉన్నతికి సాక్షులుగా అభివర్ణించారు. లింక్డ్ఇన్‌లో ఒక భావోద్వేగ పోస్ట్‌ చేసిన గౌతమ్ అదానీ, తన కుటుంబంలోని మహిళల ప్రభావం తనపై ఎంతగానో ఉందో వివరించారు. తన జీవితం, బాధ్యతలు, దేశ నిర్మాణంపై కొత్త దృక్పథాన్ని అందించడంలో వారి పాత్ర ముఖ్యమైనదని అదానీ పేర్కొన్నారు.

పిల్లలందరికీ, తల్లి వారి మొదటి గురువు. అదేవిధంగా, గౌతమ్ అదానీ తల్లి అతనికి మొదటి గురువు. అతని తల్లి ప్రభావం చెక్కుచెదరకుండా ఉంది. అదానీ తన తల్లి నుండి భారతీయ పౌరాణిక కథలను వింటూ పెరిగారు. ఆ కథలు పాఠ్యపుస్తకాలలో ఉన్న విలువల కంటే చాలా ఉన్నతమైన విలువలను పెంపొందించాయి. తన తల్లి చెప్పే ఈ కథలే అతనిలో ధైర్యం, త్యాగం, కర్తవ్యం, విశ్వాసానికి విత్తనాలను నాటాయని అదానీ గుర్తుచేసుకున్నారు. తన తల్లి 16 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలి ముంబైకి వెళ్లి, సొంతంగా ఏదైనా సాధించాలనే దృఢ సంకల్పంతో, తన కొడుకును అనిశ్చిత భవిష్యత్తు ఉన్న ప్రపంచంలోకి పంపించే ధైర్యం ఎలా వచ్చిందో అని అదానీ భావోద్వేగానికి లోనయ్యారు.

గౌతమ్ అదానీ తన భార్య ప్రీతి అదానీని ‘నా మనస్సాక్షి కీపర్’ అని అభివర్ణించారు. దంతవైద్యురాలైన ప్రీతి అదానీ విద్య, ఆరోగ్య సంరక్షణ, స్థిరమైన జీవనం, సమాజ అభివృద్ధిపై దృష్టి సారించే అదానీ ఫౌండేషన్ స్థాపన ద్వారా 22 రాష్ట్రాలలో కోటి మందికి పైగా ప్రజల జీవితాలను మార్చిన శక్తి ఆమె సొంతం అన్నారు. అలాగే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌతమ్ అదానీ తన ఇద్దరు కోడళ్లు పరిధి, దివా చేస్తున్న కృషీని ప్రశంసించారు. ఇద్దరూ కుటుంబానికి కొత్త దృక్పథాలు, విజయాలు తెచ్చారని ఆయన అన్నారు. పరిధి ఒక న్యాయవాది. దివా ఒక సృజనాత్మక డిజైనర్ అలాగే, దివ్యాంగుల కోసం దేశవ్యాప్తంగా సహాయం అందిస్తున్నారు. వీరితోపాటు తన ముగ్గురు మనవరాలు తనకు తెచ్చిన ఆనందాన్ని అదానీ గుర్తుచేసుకున్నారు. పని ఒత్తిడిని ఈ అమ్మాయిలు తొలగిస్తారని అదానీ అన్నారు.

“ఒక వ్యక్తి తన జీవితాన్ని ఓడరేవులు, విమానాశ్రయాలు, విద్యుత్ ప్లాంట్లు, వ్యాపారాలు నిర్మించడంలో గడుపుతాడు. కానీ మనవరాళ్లు వచ్చి అతన్ని పూర్తి విశ్వాసంతో చూసినప్పుడు, అతను ఎందుకు నిర్మిస్తున్నాడో ఆ వ్యక్తికి చాలా స్పష్టంగా తెలుస్తుంది” అని అదానీ లింక్డ్ఇన్ పోస్ట్‌లో రాశారు. “జీవితానికి బలమైన పునాదిని ఏ ఉక్కుతోనో లేదా కాంక్రీటుతోనో వేయలేము. మనల్ని తీర్చిదిద్దే వ్యక్తులే ఈ పునాదిని నిర్మిస్తారు. ప్రపంచం నా ప్రయాణాన్ని గుర్తుంచుకుంటే, ఇదిగో ఇదే కావాలని నేను ఆశిస్తున్నాను” అంటూ అదానీ ఎంతో భావోద్వేగంతో ముగించారు.

గౌతమ్ అదానీ లింక్డ్ఇన్ పోస్ట్ లింక్ ఇక్కడ చూడండి…

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us