AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్నేహమంటే ఇదేరా..! చమురు, గ్యాస్ సంక్షోభం వేళ భారతదేశానికి అండగా నిలిచిన చిన్న దేశాలు..!

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త చమురు, గ్యాస్ సంక్షోభానికి దారితీశాయి. ప్రపంచ ఇంధనంలో 20 శాతాన్ని రవాణా చేసే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ ఉద్రిక్తత ప్రభావం ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారతదేశంపై పడింది. భారతదేశం తన ముడి చమురులో సుమారు 40-50 శాతాన్ని హోర్ముజ్ జలసంధి ద్వారానే దిగుమతి చేసుకుంటుంది.

స్నేహమంటే ఇదేరా..! చమురు, గ్యాస్ సంక్షోభం వేళ భారతదేశానికి అండగా నిలిచిన చిన్న దేశాలు..!
Pm Narendra Modi Oil Imports
Balaraju Goud
|

Updated on: Apr 04, 2026 | 12:47 PM

Share

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త చమురు, గ్యాస్ సంక్షోభానికి దారితీశాయి. ప్రపంచ ఇంధనంలో 20 శాతాన్ని రవాణా చేసే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ ఉద్రిక్తత ప్రభావం ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారతదేశంపై పడింది. భారతదేశం తన ముడి చమురులో సుమారు 40-50 శాతాన్ని హోర్ముజ్ జలసంధి ద్వారానే దిగుమతి చేసుకుంటుంది. అయినప్పటికీ, ఇతర దేశాలతో పోలిస్తే భారత మార్కెట్లపై ఈ యుద్ధ ప్రభావం తక్కువగా ఉంది.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తలెత్తిన అతిపెద్ద అంతర్జాతీయ సంక్షోభాన్ని భారతదేశపు బలమైన దౌత్యం అధిగమించింది. ప్రధాన దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా, భారతదేశం చిన్న, అంతగా ప్రాచుర్యం లేని దేశాలతో కలిసి పనిచేయడం ద్వారా ఆ సంక్షోభాన్ని చాలా వరకు తప్పించుకుంది. గత నెలతో పోలిస్తే భారతదేశంలో ముడి చమురు, ఎల్‌పిజి, ఎల్‌ఎన్‌జిల లభ్యత గణనీయంగా మెరుగుపడిందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఈ మార్పు వెనుక చిన్న ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. హోర్ముజ్ జలసంధిలో ఏర్పడిన దిగ్బంధనం వల్ల కలిగిన కొరతను తీర్చడానికి భారతదేశం తన ముడి చమురు, గ్యాస్ వనరులను వైవిధ్యపరిచిందని అధికారులు తెలిపారు. ప్రజలు, నిత్యావసర రంగాలపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేందుకు ఎల్పీజీ, ఎల్ఎన్జీ సరఫరాకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. “ఇంధన లభ్యత ఖచ్చితంగా మెరుగుపడింది, నెల రోజుల క్రితంతో పోలిస్తే ఇప్పుడు మనం చాలా మెరుగైన స్థితిలో ఉన్నాము” అని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ అన్నారు.

భారతదేశం ప్రతిరోజూ 5.5 – 5.6 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. యుద్ధానికి ముందు, ఇందులో 40-45 శాతం హోర్ముజ్ జలసంధి ద్వారా వచ్చేది. ఎల్‌పిజి విషయానికొస్తే, భారతదేశం తన 31 మిలియన్ టన్నుల వార్షిక అవసరంలో సుమారు 60 శాతాన్ని దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. ఇందులో 90 శాతం గ్యాస్ ఈ మార్గం నుంచే వస్తుంది.

సహజ వాయువు వినియోగం రోజుకు 191 మిలియన్ క్యూబిక్ మీటర్లు కాగా, అందులో 51 శాతం దిగుమతి కాగా, సుమారు 60 శాతం మధ్యప్రాచ్య దేశాల నుండి వస్తుంది. ఎల్‌పిజి కోసం భారత్, అమెరికా, రష్యా, కెనడా, నార్వే, అలాగే నైజీరియా , అల్జీరియా , గనా , కాంగో , అంగోలా వంటి పశ్చిమ ఆఫ్రికా దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ దేశాల్లో చాలావాటి నుంచి సరఫరాలు కూడా భారత్‌కు రావడం ప్రారంభమయ్యాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఎల్‌ఎన్‌జి కోసం కామెరూన్ , ఈక్వటోరియల్ గినియా, మొజాంబిక్ వంటి దేశాలతో సంప్రదింపులు జరిపారు .

ఇదిలావుంటే, సౌదీ అరేబియా – యూఏఈ తమ సరఫరాలలో కొంత భాగాన్ని హోర్ముజ్ జలసంధిని దాటవేసే పైప్‌లైన్‌ల ద్వారా పంపుతున్నాయి. అవి సౌదీ అరేబియా తూర్పు-పశ్చిమ (యాన్బు) పైప్‌లైన్ , యూఏఈ కి చెందిన హబ్షాన్-ఫుజైరా పైప్‌లైన్. సముద్ర మార్గాలలో దిగ్బంధనాలు ఉన్నప్పటికీ, ఈ సరఫరాలు కొంత ఉపశమనాన్ని కలిగించింది. ఆ ప్రాంతం నుండి భారతదేశం కొన్ని సరఫరాలను స్వీకరించడం కొనసాగించడానికి వీలు కల్పించాయి.

అమెరికాతో ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సమయంలో, డిసెంబర్ 2025, జనవరి-ఫిబ్రవరి 2026లో రష్యా నుండి భారతదేశ దిగుమతులు మందగించాయి. రష్యా చమురు కొనుగోలుకు అమెరికా భారతదేశానికి 30 రోజుల మినహాయింపు ఇవ్వడంతో, మధ్యప్రాచ్యంలోని యుద్ధం దిగుమతులను తిరిగి పుంజుకునేలా చేసింది. దీనివల్ల, అప్పటికే సముద్రంలో ఉన్న ఓడల నుండి, అంటే రష్యా నుండి బయలుదేరిన ఓడల నుండి కూడా భారతదేశం చమురును కొనుగోలు చేయడానికి వీలు కలిగింది. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో రష్యా నుండి భారతదేశ ముడి చమురు కొనుగోళ్లు 90 శాతం పెరిగాయి. అయితే పశ్చిమ ఆసియా నుండి ఇంధన సరఫరాలో అంతరాయాల కారణంగా మొత్తం దిగుమతులు సుమారు 15 శాతం తగ్గాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us