AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈరోజు వాతావరణ సూచన

హైదరాబాద్ వాతావరణ పరిస్థితులు

ప్రస్తుత ఉష్ణోగ్రత స్థాయి

25°C

ఆహ్లాదకరమైన

పాక్షికంగా మేఘావృతం

అనిపించే ఉష్ణోగ్రత 27° C తేమ 75%
చివరిగా నవీకరించబడింది: 2026-08-02 22:30 (స్థానిక సమయం)

భారతదేశంలో అత్యంత వేడి నగరాలు

స్థానం నగరం ఉష్ణోగ్రత స్థితి వాతావరణ పరిస్థితి
1 కరకంబాడి 36°C వేడి మేఘావృతం
2 గంగానగర్ 35°C వేడి పాక్షికంగా మేఘావృతం
3 శ్రీ గంగానగర్ 35°C వేడి పాక్షికంగా మేఘావృతం
4 బికనీర్ 34°C వేడి మేఘాలతో కప్పబడి ఉంది
5 సిర్సా 34°C వేడి పాక్షికంగా మేఘావృతం
6 అలహాబాద్ 34°C వేడి సమీపంలో చిత్తడి వర్షం
7 బీహార్ షరీఫ్ 34°C వేడి Smoky Haze
8 ప్రయాగ్రాజ్ 34°C వేడి సమీపంలో చిత్తడి వర్షం
9 రాజ్‌గిర్ 34°C వేడి Smoky Haze
10 బహదూర్‌ఘర్ 34°C వేడి నిర్మలమైన ఆకాశం
చివరిగా నవీకరించబడింది: 2026-08-02 22:30 (స్థానిక సమయం)
స్థానం నగరం ఉష్ణోగ్రత స్థితి వాతావరణ పరిస్థితి
1 మనాలి 10°C Chilly సమీపంలో చిత్తడి వర్షం
2 బందిపోరా 15°C తాజాగా Rain Shower
3 హంద్వారా 15°C తాజాగా Rain Shower
4 షంషి 15°C తాజాగా పాక్షికంగా మేఘావృతం
5 సోపోర్ 15°C తాజాగా సమీపంలో చిత్తడి వర్షం
6 కుల్గామ్ 17°C తాజాగా Smoky Haze
7 శ్రీనగర్ 17°C తాజాగా సమీపంలో చిత్తడి వర్షం
8 గాంగ్టక్ 17°C తాజాగా సమీపంలో చిత్తడి వర్షం
9 మడికేరి 18°C తాజాగా మంచు
10 కిల్కుండ 18°C తాజాగా పాక్షికంగా మేఘావృతం
చివరిగా నవీకరించబడింది: 2026-08-02 22:30 (స్థానిక సమయం)

AP-TG Weather: ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు వర్ష సూచనలు జారీ అయ్యాయి.

Andhra: ఏపీలో వర్షాలు కొనసాగుతాయా..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది.

Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ మరో సారి వర్ష సూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, నైరుతి రుపువణాల ప్రభావంతో రెండు తెలుగురాష్ట్రాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాబట్టి ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

  • Anand T
  • Updated on: Jul 31, 2026
  • 7:52 am

Weather Alert: శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

Weather Update: వాయుగుండం అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇంకెన్ని రోజులంటే..?

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు సూచించారు.

ఎల్‌నినో పని ఐపోయినట్టేనా..? లోటు వర్షపాతానికి చెక్ పడ్డట్టేనా..? మేఘమా ఏమిటి సందేశం..

ఎల్‌నినో ప్రభావంతో దేశంలో కరువు వస్తుందనే హెచ్చరికలు ఒకవైపు వినిపిస్తుండగా.. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి ఎల్‌నినో ప్రభావం తగ్గిందా? ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు కారణమేంటి? రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది..? వాతావరణ నిపుణులు ఏం చెబుతున్నారు.. అనే వివరాలను తెలుసుకోండి..

తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 40–50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

భారీ వర్షాలు.. తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలతో రహదారులు జలమయమయ్యాయి. ఆదిలాబాద్‌లో అత్యధిక వర్షపాతం నమోదైంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో మరోసారి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

  • SN Pasha
  • Updated on: Jul 29, 2026
  • 6:50 am

బుధవారం తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో బుధవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..

హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నగరంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న గంగానది పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై కేంద్రీకృతమై పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Weather Report: తీవ్ర వాయుగుండం.. ఏపీకి IMD తాజా హెచ్చరికలు

Weather Report: బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం దిశ మార్చుకోవడంతో ఏపీలో ఆశించిన భారీ వర్షాలు కురవలేదు. ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలే నమోదయ్యాయి. రాష్ట్రంలో వర్షపాతం లోటు 54 శాతానికి చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారులు బుధవారం వరకు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

  • SN Pasha
  • Updated on: Jul 28, 2026
  • 7:19 am