AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహా శివరాత్రి 2026

మహా శివరాత్రి 2026

హిందూ మతంలోని మహాశివరాత్రి పండగకు విశిష్ట స్థానం ఉంది. ఈ రోజు శివ పార్వతుల కళ్యాణం, లింగోద్భవం జరిగిందని విశ్వాసం. కనుక మహా శివరాత్రి రోజున శివ శక్తులను అత్యంత భక్తి శ్రద్దలతో పుజిస్తారు. శివయ్య అనుగ్రహం కోసం ఉపవాస దీక్ష చేపట్టి.. జాగరణ చేస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి ఏడాది మహా శివరాత్రి పర్వదినం మాఘ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. శివ రాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలు, శివాలయాల్లో సందడి మొదలైంది. దేశంలో ఉన్న అన్ని జ్యోతిర్లింగాలు, శివాలయాల్లో మహాశివరాత్రి సందర్భంగా శివభక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శివరాత్రి రోజున శివలింగానికి జలాభిషేకం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ రోజున శంకరుడిని పూజించడం వల్ల భక్తులు విశేష ప్రయోజనాలను పొందుతారని నమ్మకం. అంతేకాదు ఉపవాసం చేసిన భక్తులు సహా ప్రతి ఒక్కరూ శివయ్యను ధ్యానం చేస్తూ రాత్రి అంతా మేల్కొంది జాగరణ చేస్తారు. ఈ రోజును శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.

ఇంకా చదవండి

కోటప్పకొండ తిరునాళ్లలో ఒరిగిపోయిన భారీ ప్రభ

పల్నాడు జిల్లా కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్లలో మద్దిరాల గ్రామానికి చెందిన ప్రభ ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన ప్రభ ఒరిగిపోయింది. భక్తులు అప్రమత్తమవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రద్దీ, భూభాగం హెచ్చుతగ్గులే కారణం. శివయ్య ఆశీస్సులతోనే ప్రమాదం తప్పిందని గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

  • Phani CH
  • Updated on: Feb 16, 2026
  • 7:38 pm

శివపార్వతుల కల్యాణంలో సాక్షాత్కరించిన నాగరాజు

నిర్మల్ జిల్లాలోని గొడిసెర్యాల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం జరుగుతుండగా, నాగుపాము ప్రత్యక్షమై భక్తులను ఆశ్చర్యపరిచింది. హోమగుండం వద్ద పడగవిప్పి నిలబడిన పామును శివుడి రూపంగా భావించిన భక్తులు, శుభశకునంగా నమస్కరించారు. ఈ అద్భుత దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Phani CH
  • Updated on: Feb 16, 2026
  • 7:36 pm

కోటి దీపాల వెలుగుల్లో..మహాశివరాత్రి వైభవం

దక్షిణ కాశీ కోటిపల్లి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో 'కోటి దీపారాధన మహోత్సవం' అత్యంత వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు దీపాలు వెలిగించి, కార్తీక పౌర్ణమిని తలపించేలా ఆలయాన్ని దీప కాంతులతో నింపారు. ఒక్క దీపం వెలిగించినా కోటి ఫలితాలు లభిస్తాయనే నమ్మకంతో భక్తులు తన్మయత్వం చెందారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

  • Phani CH
  • Updated on: Feb 16, 2026
  • 7:27 pm

Maha Shivratri: మహా శివరాత్రి వేడుకల్లో సినిమా తారలు.. భక్తి పాటలకు హీరోయిన్ల స్టెప్పులు.. వీడియోలు ఇదిగో

మహాశివరాత్రి వేడుకల్లో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు. తమిళనాడులోని కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో జరిగిన వేడుకల్లో దురంధర్ బ్యూటీ సారా అర్జున్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి, బాలీవుడ్ భామ మౌనీ రాయ్, బిగ్ బాస్ తెలుగు బ్యూటీ హరి తేజ తదితరులు పాల్గొన్నారు. వీరు పూజలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

చింతలమోరి శివాలయంలో వైభవంగా శివరాత్రి వేడుకలు

చింతలమోరి శివాలయంలో మహా శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కూచిపూడి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ శ్రీనివాస కళ్యాణ ఘట్టాన్ని వేలాదిమంది భక్తులు భక్తిశ్రద్ధలతో వీక్షించారు, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చింతలమోరి శివాలయంలో మహా శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.

  • Phani CH
  • Updated on: Feb 16, 2026
  • 6:50 pm

చాక్‌పీస్‌పై సూక్ష్మ శివలింగం.. చూపరులను మంత్రముగ్ధులను చేస్తుందిగా

మహాశివరాత్రి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్ చాక్ పీస్‌పై అత్యంత సూక్ష్మ శివలింగాన్ని చెక్కారు. కేవలం గుండుపిన్నుతో గంటన్నరలో 1.3 సెం.మీ ఎత్తు, 1.5 సెం.మీ వెడల్పు ఉన్న ఈ కళాఖండం భక్తులను ఆకట్టుకుంటోంది. గతంలో ప్రపంచంలోనే చిన్న జాతీయ జెండాను రూపొందించిన రజనీకాంత్, భక్తిని, కళను అద్భుతంగా కలగలిపి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

  • Phani CH
  • Updated on: Feb 16, 2026
  • 5:04 pm

Mahashivratri 2026: ఇషా మహాశివరాత్రి 2026.. లక్షల మందితో కిక్కిరిసిన ఆదియోగి ప్రాంగణం

ఇషా మహాశివరాత్రి 2026 వేడుకలు 25 భాషల్లో (సంకేత భాషతో సహా) ప్రపంచవ్యాప్తంగా 200కి పైగా ఛానెల్స్‌, డిజిటల్ ప్లాట్‌ఫాంల ద్వారా ప్రసారమై 15 కోట్ల మందికి పైగా చేరాయి.. ఈ సందర్భంగా సద్గురు ఫిబ్రవరి 18 వరకు ఉచిత ‘ఇన్నర్ ఇంజినీరింగ్’ ఆఫర్ ప్రకటించగా, ఈ ఏడాది చివర్లో కాళభైరవ ప్రతిష్ఠ కూడా జరగనున్నట్లు వెల్లడించారు.

ఏడాదికోసారి.. ఉజ్జయిని మహాకాళ్ ఆలయంలో ఈ మధ్యాహ్నం భస్మ హారతి.. ప్రత్యేకత ఇదే

Ujjain Mahakal: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. అయితే, ప్రతిరోజు ఉదయం 4 గంటలకు జరిగే భస్మ హారతి ఈ రోజు (మహా శివరాత్రి తర్వాత సోమవారం) మాత్రం ప్రత్యేకంగా మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించబడుతుంది.

Srisailam: శ్రీశైలం శివయ్యను చెవిటి మల్లన్న అని భక్తులు ఎందుకు పిలుస్తారో తెలుసా..?

శ్రీశైలం కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు, అది భక్తుల పాలిట తల్లిదండ్రుల వంటిది. ఇక్కడ ధూళి దర్శనం, శిఖరేశ్వరం వద్ద పునర్జన్మ లేని మోక్షం, హాటకేశ్వరంలోని బంగారు లింగం ప్రత్యేక ఆకర్షణలు. పల్లవులు, చోళులు, శ్రీకృష్ణదేవరాయలతో సహా అనేక రాజవంశాలచే సుసంపన్నమైన దీని చరిత్ర అద్భుతం. విశ్వాసంతో వచ్చే భక్తులకు అనంత సౌభాగ్యం లభిస్తుంది.

Telangana: శివపార్వతుల కల్యాణం జరుగుతుండగా.. గుడికి వచ్చి పడగవిప్పిన నాగుపాము

మహా శివరాత్రి వేడుకల్లో శివపార్వతుల కల్యాణం జరుగుతుండగా… ఆలయ ప్రాంగణంలో నాగుపాము ప్రత్యక్షమై భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో వెలుగుచూసింది. పూర్తి వివరాలు కథనం లోపల వివరంగా తెలుసుకుందాం పదండి ... ... ... ..

మహా శివరాత్రి నాడుఏమేం చేయాలి? జాగరణ నియమాలు ఇవే!

మహా శివరాత్రి పర్వదినాన పుణ్యస్నానాలు ఆచరించి, కొత్త వస్త్రాలు ధరించి శివారాధన చేయాలి. ఇంటి వద్ద లేదా ఆలయాల్లో అభిషేకాలు, రుద్రాభిషేకాలు చేయడం విశేషం. ఉపవాసం, జాగరణ, ధ్యానం వంటివి ఈశ్వరునికి దగ్గరగా ఉండి ఆధ్యాత్మిక ఫలితాలను అందిస్తాయి. గుణాధీశుడు కథ శివానుగ్రహ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

Isha Mahashivratri 2026: చెవిటి, వినికిడి లోపం ఉన్నవారికీ సైన్ లాంగ్వేజ్‌తో లైవ్‌స్ట్రీమ్

కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రంలో జరిగే మహాశివరాత్రి 2026 వేడుకలను ఈసారి చెవిటి, వినికిడి లోపం ఉన్నవారికీ సైన్ లాంగ్వేజ్‌తో లైవ్‌స్ట్రీమ్ చేయనున్నారు. ఫిబ్రవరి 15 సాయంత్రం 6 నుంచి ఫిబ్రవరి 16 ఉదయం 6 వరకు కొనసాగే ఈ ప్రసారం 23 భారతీయ, అంతర్జాతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.