
మహా శివరాత్రి
హిందూ మతంలోని మహాశివరాత్రి పండగకు విశిష్ట స్థానం ఉంది. ఈ రోజు శివ పార్వతుల కళ్యాణం, లింగోద్భవం జరిగిందని విశ్వాసం. కనుక మహా శివరాత్రి రోజున శివ శక్తులను అత్యంత భక్తి శ్రద్దలతో పుజిస్తారు. శివయ్య అనుగ్రహం కోసం ఉపవాస దీక్ష చేపట్టి.. జాగరణ చేస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి ఏడాది మహా శివరాత్రి పర్వదినం మాఘ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. శివ రాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలు, శివాలయాల్లో సందడి మొదలైంది. దేశంలో ఉన్న అన్ని జ్యోతిర్లింగాలు, శివాలయాల్లో మహాశివరాత్రి సందర్భంగా శివభక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శివరాత్రి రోజున శివలింగానికి జలాభిషేకం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ రోజున శంకరుడిని పూజించడం వల్ల భక్తులు విశేష ప్రయోజనాలను పొందుతారని నమ్మకం. అంతేకాదు ఉపవాసం చేసిన భక్తులు సహా ప్రతి ఒక్కరూ శివయ్యను ధ్యానం చేస్తూ రాత్రి అంతా మేల్కొంది జాగరణ చేస్తారు. ఈ రోజును శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.
Tollywood: గోవులకు పూజ చేస్తోన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? స్టార్ డైరెక్టర్ కూతురు.. ఆ యంగ్ హీరో చెల్లి
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అందరూ ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. సమీపంలోని శివాలయాలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు.ఈ క్రమంలోనే ఓ టాలీవుడ్ సెలబ్రిటీ ఆవుకు ప్రత్యేక పూజలు చేసింది.
- Basha Shek
- Updated on: Mar 2, 2025
- 12:32 pm
Maha Shivaratri 2025: శివ.. శివా.. ఎంత ఘోరం! పండుగపూట పుణ్యస్నానానికెళ్లి 8 మంది మృతి..
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా పుణ్య స్నానాలకు వెళ్లిన పలువురు ప్రమాదవశాత్తు నిటమునిగి మృతువాత పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో అంతులేని విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
- Srilakshmi C
- Updated on: Feb 27, 2025
- 10:58 am
Mahashivratri 2025: మహాశివరాత్రికి ముందు ఇవి మీ కలలో కనిపిస్తే.. పరమేశ్వరుడి ఆశీస్సులు మీపై ఉన్నాయని అర్థం..!
మహాశివరాత్రి రోజున లేదా మహాశివరాత్రికి ముందు ఇవి మీ కలలో కనిపిస్తే మీపై శివుడి అనుగ్రహం ఉన్నట్లేనని వేదపండితులు చెబుతున్నారు. మహా శివరాత్రికి కొన్ని రోజుల ముందు కలలో శివలింగానికి పాలాభిషేకం చేస్తున్నట్లు కనిపిస్తే మీ కష్టాలు పోతాయని, జీవితం ఆనందమయం అవుతుందని అర్థం. శివరాత్రి సమయంలో ఎలాంటి సంకేతాలు కనిపిస్తే.. దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం.
- Jyothi Gadda
- Updated on: Feb 27, 2025
- 3:20 pm
Maha Shivratri: హర హర మహాదేవ శంభో శంకర.. ఈషా క్షేత్రంలో శివరాత్రి సంబరాలు.. లైవ్ వీడియో
మహాశివరాత్రిని పురస్కరించుకుని తమిళనాడు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. దేశ విదేశీ ప్రముఖులతోపాటు వేలాది మంది భక్తులు ప్రత్యక్షంగా పాల్గొని భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. ఈషా ఫౌండేషన్ ప్రాంగణంలో కలర్ఫుల్గా జరిగే మహాశివరాత్రి వేడుకల్లో భక్తులు దీపాలను వెలిగించి శివుడి నామస్మరణతో పూజలు నిర్వహిస్తున్నారు..
- Shaik Madar Saheb
- Updated on: Feb 26, 2025
- 6:02 pm
Mahashivratri 2025: హర హర మహాదేవ.. పురాతన శివాలయంలో టీమిండియా క్రికెటర్ల పూజలు.. ఫొటోస్ వైరల్
దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొంటున్నారు. ప్రజలందరూ మహాదేవుని భక్తిలో మునిగిపోతున్నారు. పరమేశ్వరుడిని ఆశీస్సులు పొందేందుకు ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్లు పురాతన శివుని ఆలయాన్ని దర్శించుకున్నారు. మహా శివుడికి ప్రత్యేక పూజలు చేశారు . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
- Basha Shek
- Updated on: Feb 27, 2025
- 11:15 am
Maha Shivaratri: బిల్వ పత్రం ఆకులు శివునికి ఇష్టమా..? పురాణాలు ఏం చెబుతున్నాయి..?
మహా శివరాత్రి హిందూ ధర్మంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈ రోజు భక్తులు శివుడిని విశేష భక్తితో పూజిస్తారు. శివలింగానికి వివిధ రకాల సమర్పణలు చేస్తారు. వాటిలో మారేడు ఆకులు (బిల్వ పత్రాలు) ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటాయి. పురాణాల ప్రకారం మారేడు ఆకులను సమర్పించడం శుభప్రదమని, పాప విమోచనానికి దారి తీస్తుందని నమ్ముతారు.
- Prashanthi V
- Updated on: Feb 26, 2025
- 1:31 pm
Telangana: శివ పార్వతులు కనిపించారంటూ వ్యక్తి పూనకాలు.. కట్ చేస్తే.. ఆ ప్రాంతంలో.!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఓ వ్యక్తి వింతగా ప్రవర్తిస్తున్నాడు. తనకు శివపార్వతులు కనిపించారంటూ పూనకం వచ్చిన వాడిలా ప్రవర్తిస్తూ.. త్వరలో ఈ ప్రాంతం శైవ క్షేత్రంగా వర్ధిల్లుతుందని చెప్పాడు. నాలుగు నెలల కాలంలో ఇది రెండో ఘటన కాగా.. అటవీ భూముల ఆక్రమణ కోసం దేవుడు పేరుతో డ్రామాలు చేస్తున్నారంటున్నారు స్థానికులు. ఈ ఘటన భద్రాది కొత్తగూడెంలో చోటు చేసుకుంది.
- N Narayana Rao
- Updated on: Feb 27, 2025
- 11:19 am
మహా శివరాత్రి రోజు చిలగడ దుంప ఎందుకు తింటారు..? ఉపవాస సమయంలో తప్పనిసరిగా తినాలా..?
మహా శివరాత్రి రోజున భక్తులు ఉపవాసం పాటిస్తారు. ఆ రోజు రోజంతా భోజనం తీసుకోకుండా భగవంతుడిని ప్రార్థిస్తారు. ఉపవాసం ముగిసిన తర్వాత తీసుకునే ఆహారాల్లో చిలగడ దుంప ఒకటి. దీనిని తినడం వల్ల శరీరానికి తగిన శక్తి అందుతుంది. అందుకే చాలా మంది శివరాత్రి రోజు చిలగడ దుంప తినేందుకు ఆసక్తి చూపిస్తారు.
- Prashanthi V
- Updated on: Feb 25, 2025
- 6:19 pm
పీరియడ్స్ సమయంలో శివుని ఆరాధన చేయవచ్చా..? మహిళలు పాటించాల్సిన నియమాలు..!
మహాశివరాత్రి హిందూ సంప్రదాయంలో పవిత్రమైన పర్వదినం. ఈ రోజున భక్తులు ఉపవాసం పాటిస్తూ శివుని ఆరాధిస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజున శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు. అందువల్ల ఉపవాసం, రాత్రి జాగరణలు శివుని అనుగ్రహాన్ని పొందేందుకు నిర్వహిస్తారు. అయితే మహిళలకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలనే సందేహం ఉంటుంది.
- Prashanthi V
- Updated on: Feb 25, 2025
- 5:52 pm
Shivaratri 2025: సకల సంపదలనిచ్చే ఏకైక అభిషేకం ఇదే.. శివరాత్రి రోజున ఈ ఒక్కటి మరువకండి..
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అలాంటి పరమశివుడికి ఎంతో ఇష్టమైన రోజు శివరాత్రి. ఆ దేవదేవుడి దర్శించుకునేందుకు దేవాలయాలు కిటకిటలాడుతుంటాయి. మహాశివరాత్రి నాడు చేసే అభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అయితే, వివిధ పదార్థాలు ఉపయోగించి చేసే అభిషేకాలు గ్రహ బాధలతో పాటు సకల దరిద్రాలను తొలగిస్తాయని భక్తులు నమ్ముతారు. ఎలాంటి ఫలితాలు పొందడానికి ఏ రకమైన అభిషేకం చేయాలో తెలుసుకోండి..
- Bhavani
- Updated on: Feb 25, 2025
- 5:47 pm