కేరళలోని కోజికోడ్లో ఓ షాపు రూపాయికే బ్రాండెడ్ షూస్ ఆఫర్ ప్రకటించడంతో భారీగా జనం తరలివచ్చారు. మొదట వచ్చిన 100 మందికి రూపాయి నోటు తెచ్చిన వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని షాపు యజమాని తెలిపాడు. దీంతో తెల్లవారుజాము నుంచే వేల మంది గుమిగూడి తొక్కిసలాటకు, ట్రాఫిక్ జామ్కు దారితీసింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.