నేను సబ్ ఎడిటర్గా టీవీ9 తెలుగులో 2019 నవంబర్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి సైట్కు సంబంధించిన గ్యాలరీలు, వెబ్ స్టోరీస్లు చూసుకుంటున్నాను. అంతేకాకుండా ఆర్టికల్స్కు సంబంధించిన ఫోటోలను సైతం క్వాలిటీలో ఉండేలా మారుస్తున్నాను.
7 రోజులు ఈ డ్రింక్స్ తాగితే.. చెడు కొలెస్ట్రాలు పూర్తిగా మాయం
పెరుగుతున్న గుండె సమస్యలను, ధమనుల బ్లాకులను తగ్గించడానికి సహజ నివారణలను తెలుపుతున్నారు ప్రముఖ వైద్యులు. మనం ప్రతి నిత్యం వాడే మరియు ఇంట్లో దొరికే కొన్ని పాదార్ధాల ద్వారా మన శరీరం లో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్, బీపీ నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని తెలుపుతున్నారు నిపుణులు.
- Phani CH
- Updated on: Mar 29, 2026
- 6:31 pm
ఆర్బీఐ కీలక నిర్ణయం.. త్వరలో ‘ఈ-చెక్కులు’
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'పేమెంట్స్ విజన్ 2028'ను ప్రకటించింది. డిజిటల్ చెల్లింపులను బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ఇందులో ఈ-చెక్కులు, మోసపూరిత లావాదేవీలపై బ్యాంకుల బాధ్యత పెంపు, అన్ని డిజిటల్ చెల్లింపులకు ఎనేబుల్/డిజేబుల్ సదుపాయం, ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్లపై ఆర్బీఐ నియంత్రణ వంటి కీలక మార్పులున్నాయి. ఇది వినియోగదారులకు మరింత భద్రత, నియంత్రణను అందిస్తుంది.
- Phani CH
- Updated on: Mar 29, 2026
- 5:37 pm
అమెరికాలో అన్నమయ్య భారీ విగ్రహం..
అమెరికాలోని మెంఫిస్లో 111 అడుగుల అన్నమయ్య మహా విగ్రహం నిర్మాణమవుతోంది. తెలుగు సాహిత్యానికి, భక్తి సంగీతానికి పట్టాభిషేకం చేసిన పదకవితా పితామహుడిగా అన్నమాచార్యులు విదేశీ గడ్డపై గౌరవం అందుకోనున్నారు. సుమారు రూ.50 కోట్ల వ్యయంతో ఇండియన్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ పంచలోహ విగ్రహాన్ని 2028 అన్నమయ్య జయంతికి ఆవిష్కరించనున్నారు, మెంఫిస్ను ప్రపంచ భక్తి కేంద్రంగా మార్చనుంది.
- Phani CH
- Updated on: Mar 29, 2026
- 5:34 pm
తిరుమల శ్రీవాణి టికెట్ల బుకింగ్లో కీలక మార్పు
టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ బుకింగ్లో భక్తుల ఇబ్బందులను తొలగించడానికి సరికొత్త 'సింగిల్ ట్రాన్సాక్షన్' విధానాన్ని ప్రవేశపెట్టింది. గతంలో విరాళం, దర్శనం టికెట్ వేర్వేరుగా చెల్లించే పద్ధతిని మార్చి, ఇకపై రూ. 10,500 (విరాళం రూ.10,000 + టికెట్ రూ.500) ఒకేసారి చెల్లించవచ్చు. ఇది సాంకేతిక సమస్యలను అధిగమించి, సమయాన్ని ఆదా చేస్తుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు 800 కరెంట్ బుకింగ్ టిక్కెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు.
- Phani CH
- Updated on: Mar 29, 2026
- 5:32 pm
‘చెడ్డీ గ్యాంగ్’ కలకలం: డాక్టర్ ఇంట్లో చొరబడిన దొంగలు
తిరుపతిలో చెడ్డీగ్యాంగ్ సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. డా. సునంద కుమార్ రెడ్డి నివాసంలో దొంగతనం యత్నం జరిగింది. సీసీటీవీలో గ్యాంగ్ కదలికలు రికార్డయ్యాయి. కుటుంబ సభ్యులు అప్రమత్తమవ్వడంతో చోరీ జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజ్, వేలిముద్రలను పరిశీలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
- Phani CH
- Updated on: Mar 29, 2026
- 5:30 pm
చిరు ఫోటోతో ఓ వ్యక్తి ఆటలు.. కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ మధ్య సోషల్ మీడియా దుర్వినియోగం పెరుగుతోంది. సూరిబాబు అనే వ్యక్తి చిరంజీవి అచేతనంగా ఉన్న ఫోటోను Xలో పోస్ట్ చేయడంతో మెగా అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. ఆ ఫోటోను తొలగించమని కోరినా వినకపోవడంతో ఒక అభిమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సూరిబాబును అరెస్ట్ చేసి, BNS సెక్షన్ 352 కింద కేసు నమోదు చేశారు. ఆన్లైన్లో చేసే ఇటువంటి చర్యలకు చట్టపరమైన పరిణామాలు ఉంటాయని ఇది స్పష్టం చేస్తోంది.
- Phani CH
- Updated on: Mar 29, 2026
- 3:13 pm
అన్నయ్యకు హిట్టు ఇచ్చేందుకు.. బరిలోకి దిగిన చెల్లెలు
మెగా డాటర్ నిహారిక కొణిదెల 'కమిటీ కుర్రాళ్లు'తో నిర్మాతగా అడుగుపెట్టి, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. తన అన్నయ్య వరుణ్ తేజ్తో కలిసి 'బరి' అనే గ్రామీణ నేపథ్య స్పోర్ట్స్ డ్రామాను నిర్మిస్తున్నారు. 'కమిటీ కుర్రాళ్లు' దర్శకుడు యదు వంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ లాంచ్ చేశారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం 'కొరియన్ కనకరాజు'తో బిజీగా ఉన్నారు.
- Phani CH
- Updated on: Mar 29, 2026
- 3:11 pm
Ustaad Bhagat Singh: నార్త్ అమెరికాలో ఉస్తాద్కు.. షాకిచ్చేలా.. కలెక్షన్స్
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉగాది కానుకగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా ₹68.06 కోట్లు వసూలు చేసి విజయవంతమైంది. పవన్ కళ్యాణ్ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ రాబట్టినా, నార్త్ అమెరికాలో మాత్రం $1 మిలియన్ మార్కును కూడా చేరుకోలేకపోయింది. కేవలం ₹6 కోట్లు మాత్రమే రాబట్టి, ట్రేడ్ నిపుణులను షాక్కు గురిచేసింది. అయితే, 'కాలర్ ఎత్తరా' వంటి పాటలు యూట్యూబ్లో దూసుకుపోతున్నాయి.
- Phani CH
- Updated on: Mar 29, 2026
- 3:09 pm
యాక్టింగ్ నేర్పించి, సినిమా ఛాన్స్ ఇస్తే.. నా పైనే నిందలా..!
మోనాలిసా తనను వేధించాడని సనోజ్ మిశ్రాపై చేసిన ఆరోపణలను సనోజ్ ఖండించాడు. 'లవ్ జిహాద్' వివాదం వల్లే మోనాలిసా తనపై నిరాధార ఆరోపణలు చేస్తోందని, ఆమె కుటుంబం ఇప్పటికీ తన ఇంట్లోనే ఉందని తెలిపాడు. మోనాలిసాపై పరువు నష్టం దావా వేస్తానని, న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నానని సనోజ్ మిశ్రా ప్రకటించాడు.
- Phani CH
- Updated on: Mar 29, 2026
- 3:08 pm
రిషబ్ Vs రుక్మిణి.. తెర వెనుక ఏదో జరుగుతోందబ్బా…?
రిషబ్ శెట్టి ఇన్స్టాగ్రామ్లో రుక్మిణి వసంత్, హోంబలే ఫిల్మ్స్, రాజ్ బి. శెట్టిలను అన్ఫాలో చేయడం కన్నడ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. 'జై హనుమాన్' సినిమా కోసం నిష్టగా ఉన్న రిషబ్కు, వారికి మధ్య విభేదాలు వచ్చాయా లేదా ఇది సినిమా ప్రమోషన్ స్ట్రాటజీనా అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. ఈ సడన్ సోషల్ మీడియా మూవ్పై నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- Phani CH
- Updated on: Mar 29, 2026
- 3:07 pm
తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. DL, RC కార్డులు ఇక నేరుగా మీ ఇంటికి
తెలంగాణ వాహనదారులకు శుభవార్త! రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల కోసం RTO కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కొత్త 'సెంట్రలైజ్డ్ కార్డ్ ప్రింటింగ్' విధానం ద్వారా DL, RC కార్డులు నేరుగా పోస్టల్ ద్వారా మీ ఇంటికే వస్తాయి. ఇది ఆలస్యం, మధ్యవర్తుల జోక్యాన్ని తగ్గిస్తుంది, పారదర్శకతను పెంచుతుంది. సులభమైన సేవలతో సమయం ఆదా అవుతుంది.
- Phani CH
- Updated on: Mar 29, 2026
- 1:00 pm
Hey Balwanth: OTTలోకి వస్తున్న సుహాస్ న్యూ ఫిల్మ్
సుహాస్ నటించిన 'హే బల్వంత్' చిత్రం మార్చి 31 నుండి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అడల్ట్ టచ్, హాస్యంతో కూడిన ఈ సినిమా డీసెంట్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. తన తండ్రి వ్యాపారం గురించి తెలుసుకున్న హీరో పడే సంఘర్షణ, ప్రేమ, నైతిక విలువలతో అల్లుకున్న ఈ కుటుంబ హాస్య చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వీక్షించవచ్చు.
- Phani CH
- Updated on: Mar 29, 2026
- 12:57 pm