వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత. ధివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడైన వైఎస్ జగన్.. నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి. వైఎస్ జగన్ 1972 డిసెంబర్ 21న కడప జిల్లా పులివెందులలో జన్మించారు. ఆయన బీ.కామ్, ఎంబీఏ చదువుకున్నారు. 1996లో భారతిని జగన్ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పారిశ్రామిక వేత్తగా కెరీర్ ప్రారంభించిన జగన్.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై కడప ఎంపీగా గెలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో జగన్ సాధించిన తొలి విజయం ఇదే. అదే సంవత్సరం హెలికాప్టర్ ప్రమాదంలో తండ్రి వైఎస్సార్ మరణించడంతో జగన్ జీవితంలో పెను కుదుపు ఏర్పడింది. వైఎస్సార్ మరణం తర్వాత ఓదార్పు యాత్ర ద్వారా ప్రజలకు జగన్ దగ్గరయ్యారు. వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్పు యాత్ర ద్వారా పరామర్శించారు.
కాంగ్రెస్ పార్టీతో విబేధాల కారణంగా.. 2010లో తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన జగన్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరిట కొత్త పార్టీని ప్రారంభించారు. 2011లో కడప లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలిచారు. తండ్రి పరపతిని వాడుకుని అక్రమాస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ చేత అరెస్టైన జగన్.. 16 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన జగన్.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు 2017లో ప్రజాసంకల్ప యాత్రను చేపట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో 151 స్థానాల్లో గెలిచి ఏపీ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
ఒక్కరోజు ముందుగానే..! అక్రమాస్తుల కేసులో ఆరేళ్ల తర్వాత కోర్టు ముందుకు వైఎస్ జగన్..!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గురువార (నవంబర్ 20) నాంపల్లి కోర్టుకు హాజరుకాబోతున్నారు . దాదాపు ఆరేళ్ల తర్వాత CBI కోర్టుకు వస్తున్నారు. ఉదయం 10గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు వైఎస్ జగన్.
- Balaraju Goud
- Updated on: Nov 20, 2025
- 7:23 am
Andhra Politics: జోగి రమేష్ అరెస్ట్తో ఏపీలో పొలిటికల్ తుఫాన్.. నెక్ట్స్ టార్గెట్ ఎవరు?
కల్తీమద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్తో ఏపీలో పొలిటికల్ తుఫాన్ రేగింది. ఆయన అరెస్ట్ అక్రమం అంటోంది.. వైసీపీ. కక్ష సాధింపేనని వాదిస్తోంది. అయితే.. ఫ్యాన్ పార్టీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది అధికార కూటమి. ఇంతకీ.. ఈ కేసులో నెక్ట్స్ టార్గెట్ ఎవరు?
- Shaik Madar Saheb
- Updated on: Nov 2, 2025
- 8:12 pm
Andhra Politics: ఆల్మట్టి ప్రాజెక్ట్ అంశంపై ఏపీలో పొలిటికల్ హీట్.. జగన్ సంచలన వ్యాఖ్యలు.. మంత్రి నిమ్మల కౌంటర్..
ఆల్మట్టి ప్రాజెక్ట్ అంశంపై ఏపీలో పొలిటికల్ వార్ మొదలైంది. కర్నాటక నిర్ణయంతో ఏపీకి అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వానికి పట్టదా? ప్రాజెక్ట్ ఎత్తు పెంచకుండా అడ్డుకోరా? అని జగన్ ప్రశ్నిస్తోంటే.. వట్టి మాటలు కట్టి పెట్టు అంటూ కౌంటర్ ఇస్తోంది అధికారపక్షం.. దీంతో ఏపీ పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి..
- Shaik Madar Saheb
- Updated on: Oct 2, 2025
- 8:06 pm
YS Jagan: రెడ్ బుక్ అంటున్నవారికి డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో చూపిస్తాం: వైసీపీ అధినేత జగన్
ఇప్పుడు రెడ్బుక్ అంటున్న వాళ్లకు డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో చూపిస్తామంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం పార్టీ కీలక నాయకులతో జరిగిన సమావేశంలో మాజీ సీఎం జగన్ డిజిటల్ బుక్ ప్రారంభించారు. అన్యాయానికి గురైన కార్యకర్తలు డిజిటల్ బుక్ ఉపయోగించుకోవాలన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Sep 24, 2025
- 5:24 pm
AP Assembly 2025 Live: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కీలక చర్చ.. ప్రత్యక్ష ప్రసారం..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. సభ్యులు పలు విషయాలపై సభలో చర్చిస్తున్నారు. సోమవారం పది గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. కాగా.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30వరకు జరుగనున్నాయి. మెడికల్ కాలేజీల అంశంతోపాటు.. పలు విషయాలపై చర్చ జరగనుంది..
- Shaik Madar Saheb
- Updated on: Sep 22, 2025
- 10:26 am
AP Assembly Session Live: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. లైవ్ వీడియో
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభమైంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. యూరియా సమస్యపై చర్చించాలని మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ క్రమంలో.. వైసీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Sep 18, 2025
- 12:32 pm
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. వైఎస్ జగన్ హాజరు అయ్యేనా..?
ఇవాళ్టి (సెప్టెంబర్ 18) నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి. 16వ శాసనసభ నాలుగో సమావేశం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ హాలులో మొదలవుతాయి. ఈ సమావేశాలు 7 రోజుల పాటు జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమయంలో కొన్ని ముఖ్య బిల్లులు ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
- Balaraju Goud
- Updated on: Sep 18, 2025
- 8:46 am
YS Jagan: అసలు రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తోందా? వైసీపీ చీఫ్ జగన్ కీలక వ్యాఖ్యలు..
ఏపీలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, ప్రభుత్వం ఎరువురులు సరఫరా చేసి ఉండే రైతులు రోడ్డెక్కేవారా? అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం కనీస బాధ్యతను కూడా నిర్వర్తించడంలేదని మండిపడ్డారు. కుప్పం లోనూ రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వైసీపీ పాలనలో ఎప్పుడూ రైతులు రోడ్డెక్కలేదని.. అప్పుడు లేని రైతు కష్టాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయన్నారు..
- Shaik Madar Saheb
- Updated on: Sep 10, 2025
- 1:35 pm
YS Jagan: కార్యకర్తల కోసం ప్రత్యేక యాప్.. టీడీపీ నేతలకు సినిమా చూపిస్తామన్న జగన్..
కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. వైసీపీ కార్యకర్తలు, సీనియర్ నేతలపై వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ వేధింపులకు సంబంధించి ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఎవరైన వేధిస్తే కార్యకర్తలు ఈ యాప్లో ఆ వివరాలను నమోదు చేయాలని సూచించారు.
- Krishna S
- Updated on: Jul 29, 2025
- 5:52 pm
YS Jagan: రైతులకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. వచ్చేది మా ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి..
వైసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానంటూ జగన్ పేర్కొన్నారు. జగన్ వస్తున్నాడని వేలాది మంది పోలీసులను మొహరించారని.. రైతులను రానీయకుండా అడ్డుకున్నారంటూ ఆరోపించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 9, 2025
- 4:26 pm