
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత. ధివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడైన వైఎస్ జగన్.. నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి. వైఎస్ జగన్ 1972 డిసెంబర్ 21న కడప జిల్లా పులివెందులలో జన్మించారు. ఆయన బీ.కామ్, ఎంబీఏ చదువుకున్నారు. 1996లో భారతిని జగన్ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పారిశ్రామిక వేత్తగా కెరీర్ ప్రారంభించిన జగన్.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై కడప ఎంపీగా గెలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో జగన్ సాధించిన తొలి విజయం ఇదే. అదే సంవత్సరం హెలికాప్టర్ ప్రమాదంలో తండ్రి వైఎస్సార్ మరణించడంతో జగన్ జీవితంలో పెను కుదుపు ఏర్పడింది. వైఎస్సార్ మరణం తర్వాత ఓదార్పు యాత్ర ద్వారా ప్రజలకు జగన్ దగ్గరయ్యారు. వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్పు యాత్ర ద్వారా పరామర్శించారు.
కాంగ్రెస్ పార్టీతో విబేధాల కారణంగా.. 2010లో తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన జగన్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరిట కొత్త పార్టీని ప్రారంభించారు. 2011లో కడప లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలిచారు. తండ్రి పరపతిని వాడుకుని అక్రమాస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ చేత అరెస్టైన జగన్.. 16 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన జగన్.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు 2017లో ప్రజాసంకల్ప యాత్రను చేపట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో 151 స్థానాల్లో గెలిచి ఏపీ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
బేతాల కథలతో అరెస్టులు.. ఏపీ లిక్కర్ స్కామ్పై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి భగ్గుమన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వ్యక్తులను మేనేజ్ చేస్తూ.. తనపై తిప్పుకుంటున్నారన్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. చంద్రబాబుకు లొంగిపోయారన్నారు. కూటమికి మేలు చేసేందుకే విజయసాయి రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారని జగన్ గుర్తు చేశారు.
- Balaraju Goud
- Updated on: May 22, 2025
- 1:37 pm
YSRCP: ప్చ్.. బీజేపీతో జట్టు కట్టుంటే కథ మరోలా ఉండేది.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేల సంచలన కామెంట్స్..
2019 ఎన్నికల్లో 151 స్థానాలతో ఘన విజయాన్ని అందుకున్న వైసిపి 2024 ఎన్నికల్లో ఊహించని విధంగా 11 స్థానాలకే పరిమితం అయిపోయింది. వై నాట్ 175 నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల వల్లే తమకు ఈ స్థాయి ఫలితాలకు పరిమితం అయ్యామంటూ.. పార్టీ అధినేత నుంచి ముఖ్య నేతలు అందరూ ఇదే మాట్లాడారు.
- Ch Murali
- Updated on: May 18, 2025
- 8:35 pm
YS Jagan: దీన్ని ప్రజాస్వామ్యం అంటారా?.. వైసీపీ అధినేత జగన్ సంచలన ట్వీట్..
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారంటూ వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానాన్ని ఉద్దేశించి ట్వీట్ చేసిన వైసీపీ అధినేత జగన్.. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేశారన్నారు. బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్గా ఉన్న బీసీ మహిళను పదవి నుంచి దించేసారు.. టీడీపీ చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం అని అన్నారు జగన్..
- Shaik Madar Saheb
- Updated on: Apr 20, 2025
- 7:03 am
Andhra Politics: జగన్ సెక్యూరిటీపై రాజకీయ సెగలు.. మంత్రి నిమ్మల ఏమన్నారంటే..
మ్మడి అనంతపురం జిల్లా రామగిరిలో జగన్ టూర్ సందర్భంగా భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ను చూడడానికి జనం భారీగా తరలిరావడంతో, ఆ తాకిడికి హెలికాప్టర్ విండ్ షీల్డ్ డ్యామేజ్ అయింది. దీంతో జగన్ బెంగళూరుకు కారులో వెళ్లిపోయారు. ఈ ఘటనపై రాజకీయాలు వేడెక్కాయి..
- Shaik Madar Saheb
- Updated on: Apr 11, 2025
- 9:36 am
YS Jagan: జగన్ సెక్యూరిటీపై రాజుకున్న రచ్చ.. హెలికాప్టర్ విండ్ షీల్డ్ డ్యామేజ్.. ఎస్పీ ఏమన్నారంటే..
Security Breach In YS Jagan's Tour: సరైన సెక్యూరిటీ ఇచ్చామంటారు పోలీసులు. పూర్తిగా ఇవ్వలేదంటారు వైసీపీ నేతలు. ఏపీ రాజకీయం ఇప్పుడు జగన్ సెక్యూరిటీ చుట్టూ తిరుగుతోంది. జగన్ రాప్తాడు పర్యటనలో భద్రతా లోపాలున్నాయంటూ మండిపడుతోంది వైసీపీ. ఇక గతంలో జరిగిన సంఘటనలను కూడా గుర్తు చేస్తోంది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 9, 2025
- 9:08 am
Nara Lokesh: ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి.. వైసీపీకి ప్రతిపక్ష హోదాపై నారా లోకేష్ ఏమన్నారంటే..
నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. అధికారంలో ఉంది వైసీపీ కాదు.. కూటమి ప్రభుత్వం అంటూ హెచ్చరించారు మంత్రి లోకేష్. డిప్యూటీ సీఎం పవన్ను ఉద్దేశిస్తూ జగన్ కామెంట్ చేస్తూ.. దానికి కౌంటర్ ఇవ్వడమే కాకుండా సవాల్ కూడా చేశారు మంత్రి లోకేష్.. మీడియాతో మాట్లాడిన లోకేష్ ఏమన్నారంటే..
- Shaik Madar Saheb
- Updated on: Mar 5, 2025
- 8:36 pm
AP Assembly: ప్రతిపక్షహోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం.. వైసీపీ డిమాండ్పై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
ప్రతిపక్ష హోదా విషయంలో తగ్గేదేలే.. అని వైసీపీ నేతలు అంటుంటే.. అసలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేదేలే.. అంటున్నారు కూటమి నేతలు.. ఏపీ బడ్జెట్ సమావేశాల వేళ వైసీపీ-కూటమి నేతల మధ్య విపక్ష హోదా మరోసారి అగ్గి రాజేసింది. ప్రతిపక్ష హోదా మా హక్కు అని ఫ్యాన్ పార్టీ డిమాండ్ చేస్తుంటే.. అడుక్కుంటే LOP హోదా ఇవ్వరని కౌంటర్ ఇస్తోంది సర్కార్.
- Shaik Madar Saheb
- Updated on: Feb 24, 2025
- 10:21 pm
AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం.. ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ డిమాండ్..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాలకు హాజరవుతున్నామని వైసీపీ ప్రకటించడంతో వాతావరణం ఆసక్తికరంగా మారింది. జగన్తో సహా ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదాను డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- Shaik Madar Saheb
- Updated on: Feb 23, 2025
- 3:58 pm
మాజీ సీఎం జగన్పై కుట్ర జరుగుతోంది.. రక్షణ కల్పించండి.. ప్రధాని మోదీకి వైసీపీ లేఖ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పంచాయితీ మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ తగ్గించారని వైసీపీ ఆరోపిస్తుంటే.. ఎన్నికల కోడ్ ఉందనే విషయం కూడా వైసీపీ అధినేతకు తెలియదా? అని అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది. ఇప్పటికే జగన్కు ప్రతిపక్ష హోదాపై కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న వైసీపీ.. ఇప్పుడు భద్రత అంశంపైనా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది.
- Balaraju Goud
- Updated on: Feb 20, 2025
- 6:50 pm
YS Jagan: గుంటూరు మిర్చి యార్డుకు వైఎస్ జగన్.. మిర్చి రైతులతో భేటీ.. లైవ్ వీడియో
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు.. జగన్ వెంట వైసీపీ ముఖ్యనేతలు ఉన్నారు. జగన్ రాకతో మిర్చి యార్డుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకున్నారు. మిర్చి యార్డుకు చేరుకున్న జగన్ మిర్చిని పరిశీలించి.. రైతులతో మాట్లాడనున్నారు..
- Shaik Madar Saheb
- Updated on: Feb 19, 2025
- 11:19 am