వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత. ధివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడైన వైఎస్ జగన్.. నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి. వైఎస్ జగన్ 1972 డిసెంబర్ 21న కడప జిల్లా పులివెందులలో జన్మించారు. ఆయన బీ.కామ్, ఎంబీఏ చదువుకున్నారు. 1996లో భారతిని జగన్ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పారిశ్రామిక వేత్తగా కెరీర్ ప్రారంభించిన జగన్.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై కడప ఎంపీగా గెలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో జగన్ సాధించిన తొలి విజయం ఇదే. అదే సంవత్సరం హెలికాప్టర్ ప్రమాదంలో తండ్రి వైఎస్సార్ మరణించడంతో జగన్ జీవితంలో పెను కుదుపు ఏర్పడింది. వైఎస్సార్ మరణం తర్వాత ఓదార్పు యాత్ర ద్వారా ప్రజలకు జగన్ దగ్గరయ్యారు. వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్పు యాత్ర ద్వారా పరామర్శించారు.

కాంగ్రెస్ పార్టీతో విబేధాల కారణంగా.. 2010లో తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన జగన్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరిట కొత్త పార్టీని ప్రారంభించారు. 2011లో కడప లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలిచారు. తండ్రి పరపతిని వాడుకుని అక్రమాస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ చేత అరెస్టైన జగన్.. 16 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన జగన్.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు 2017లో ప్రజాసంకల్ప యాత్రను చేపట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో 151 స్థానాల్లో గెలిచి ఏపీ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

ఇంకా చదవండి

Andhra Pradesh: వైసీపీ అధినేత జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. వరుసగా పార్టీని వీడుతున్న ముఖ్యనేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో అంతే ధీటుగా పార్టీకి గుడ్‌ బై చెప్పిన నేతలు రియాక్ట్ అవుతున్నారు. మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, విజయసాయిరెడ్డిలు వైఎస్ జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Budget 2025: బడ్జెట్ సమావేశాలు.. టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం.. మరి వైసీపీ పరిస్థితేంటి..?

పార్లమెంట్ సమావేశాలు ఈనెల 31న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.. దీంతో టీడీపీ ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. నిధులు ఎలా రాబట్టాలి... బడ్జెట్‌పై చర్చలో ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారు. మరి వైసీపీ పరిస్థితేంటి...? బడ్జెట్‌పై చర్చలేవి...? నేతలతో మీటింగులెక్కడ...? విజయసాయి తర్వాత రాజ్యసభలో వైసీపీ టీమ్‌ లీడ్‌ ఎవరు...? ఇప్పుడివే అంశాలు చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ సెలెన్స్‌పై చర్చలూ ఊపందుకున్నాయి.

YS Jagan: అక్రమాస్తుల కేసులో జగన్‌కు బిగ్ రిలీఫ్

సుప్రీం కోర్టులో ఏపీ మాజీ సీఎం జగన్‌కు ఊరట లభించింది. సీబీఐ కేసుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. బెయిల్‌ రద్దుకు సహేతుకమైన కారణాలు లేవని, అలాంటప్పుడు రద్దు అవసరం లేదని ధర్మాసనం చెప్పింది. అలాగే కేసును బదిలీ చేయాల్సిన అవసరమూ లేదని స్పష్టం చేసింది.

Tirupati stampede: మోక్షమార్గంలో మృత్యుపాశం.. ఈ పాపం ఎవరిది..?

ఉత్తర ద్వార దర్శనం చేసుకుని మోక్షం పొందాలన్న తీరాలన్న భక్తుల కోరిక ప్రాణాల మీదకు తెచ్చిందా? చిన్న పొరపాట్లు పెద్ద ప్రమాదాలు.! తిరుపతి తొక్కిసలాట విషయంలో జరిగింది అదేనా..? పోలీస్ అధికారి అనాలోచిత చర్య ఆరుగురి ప్రాణాలు తీసిందా..? ప్రాథమిక దర్యాప్తులో బయటపడుతున్న నిజాలు. వైకుంఠ విషాదం!

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన జగన్.. ఏమన్నారంటే

అల్లు అర్జున్ అరెస్ట్ పై సినీ సెలబ్రెటీలతో పాటూ రాజకీయనాయకులు కూడా స్పందిస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండిస్తున్నారు.

వైసీపీకి డబుల్ షాక్ ఇచ్చిన ముఖ్యనేతలు.. ఆ ఇద్దరి ఫ్యూచర్‌ ప్లాన్స్‌ ఏంటి…?

వాలంటీర్ల వ్యవస్థ వచ్చాక ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు ఇతర ప్రజా ప్రతినిధులకు విలువ లేకుండా పోయిందని వైసీపీ వీడుతున్న నేతలు ఆరోపిస్తున్నారు.

Avanthi Srinivas: ఇది మంచి పద్దతి కాదు.. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా.. సంచలన వ్యాఖ్యలు

సాధారణ ఎన్నికల్లో అసాధారణ ఓటమిని మూటగట్టుకున్న వైసీపీకి.. షాకుల మీదద షాకులు తగులుతున్నాయి.. ఇప్పటికే, పలువురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, పలువురు నేతలు పార్టీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. తాజాగా.. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ రాజీనామా చేశారు..

YS Jagan: డైవర్షన్‌ పాలిటిక్స్‌.. డిప్యూటీ సీఎం ఆ షిప్‌ దగ్గరకు ఎందుకు వెళ్లలేదు.. జగన్ సంచలన వ్యాఖ్యలు

సీఎం చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయలేక ప్రతీ నెల ఒక అంశం తీసుకొచ్చి ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఆర్థిక మంత్రి పయ్యావుల సొంత వియ్యంకుడు రేషన్‌ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నా... ఆ షిప్‌ దగ్గరకు మాత్రం డిప్యూటీ సీఎం వెళ్లలేదని ఆయన అన్నారు.

YS Jagan: కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరుబాట.. కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్

ఏపీలో పాలనపై అందరూ అసంతృప్తితో ఉన్నారని.. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు సంధించారు.. బుధవారం తాడేపల్లిలోని తన కార్యాయలంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రదాన కార్యదర్శులు, రీజినల్‌ కోఆర్డినేటర్లతో వైసీపీ చీఫ్ జగన్‌ సమావేశం అయ్యారు.

YS Jagan: మళ్లీ ఆర్థిక వివాదాల్లో వైసీపీ అధినేత.. అసత్యాలు ప్రచారం చేస్తే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తాః జగన్

ప్రస్తుతం కార్యకర్తలపైన నేతలపైన వరుసగా కేసులు నమోదవుతున్న తరుణంలో తాజాగా జగన్‌పైన సైతం కేసులు నమోదైతే పరిస్థితి ఏంటన్న ఆందోళన ఆ పార్టీ నేతలను వెంటాడుతుంది.