నా పేరు తాండ్ర ఆనంద్. టీవీ9లో సబ్ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ పొలిటికల్, స్పోర్ట్స్, క్రైమ్కు సంబంధించిన వార్తలు రాస్తుంటాను. అలాగే వైరల్ కంటెంట్ అందిస్తుంటాను. 2022లో నా ఈ జర్నలిజం కేరీర్ను ప్రారంభించాను. గతంలో బిగ్టవీ, ఎన్హెచ్ టీవీ, స్టూడియో ఎన్ టీవీలో పనిచేశాను. నేను జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేశాను.
Operation Sindoor: దేశభక్తి అంటే ఇదే.. 17 మంది ఆడబిడ్డలకు సిందూర్ అని పేరు పెట్టిన తల్లిదండ్రులు..
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషర్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లొని 9 ఉగ్రస్థావరాలపై దాడి చేసి సుమారు 100 మంది వరకు ఉగ్రవాదులను అంతం చేసింది. 26 మంది అమాయకుల ప్రాణాలకు ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆ సైనక చర్య భారత ప్రజల్లో స్పూర్తిని నింపుతోంది. ఇలా ఆపరేషన్ సిందూర్ నుంచి ప్రేరణ పొందిన కొందరు తల్లిదండ్రులు ఇటీవల జన్మించిన వారి పిల్లలకు "సిందూర్" అనే పేరు పెట్టారు.
- Anand T
- Updated on: May 12, 2025
- 6:18 pm
Next Test Captain: బుమ్రా కీలక నిర్ణయం.. కెప్టెన్సీ రేసు నుంచి సైడ్.. ఇక కెప్టెన్ అతడేనా?
జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న భారత్ vs ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ముందు బీసీసీఐకు పెద్ద సవాల్ ఎదురైంది. తాజాగా టెస్ట్ క్రికెట్కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో జట్టు కొత్త సారథిని ఈ నెలలోనే బీసీసీఐ ఎంపిక చేయాల్సి ఉంది. అయితే రోహిత్ స్థానంలో బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిద్దామనుకున్న బీసీసీఐకు బుమ్రా షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. టెస్ట్ కెప్టెన్సీ రేసు నుంచి బుమ్రా తప్పుకున్నట్టు తాజా నివేదికల ప్రకారం తెలుస్తోంది. దీంతో బీసీసీఐ ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంట నెలకొంది.
- Anand T
- Updated on: May 12, 2025
- 5:18 pm
CM Revanth Reddy: హైదరాబాద్కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి..మన విజయాలను ప్రపంచానికి చాటి చెప్పండి-సీఎం రేవంత్!
సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)కు హబ్గా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వీటితో పాటు AI-రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు. హైదరాబాద్లోని నానక్రామ్గూడలో సొనాటా సాఫ్ట్వేర్ సంస్థ నూతన ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించిన ఆయన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించినట్లు తెలిపారు.
- Anand T
- Updated on: May 12, 2025
- 5:33 pm
Andhra News: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆ ఛార్జీల పెంపుపై మంత్రి కీలక ప్రకటన!
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ చార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వానికి విద్యుత్ చార్జీలు పెంచే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. యాక్సిస్ గ్రూప్ ఎనర్జీ పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని.. ప్రజలు స్వేచ్ఛగా తిరగాలనే కారంణానే ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని మంత్రి గొట్టిపాటి అన్నారు.
- Anand T
- Updated on: May 12, 2025
- 1:49 pm
Maharashtra : మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం.. 22 గోదాములు దగ్ధం?
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. భివండీలో ఉన్న రిచ్ ల్యాండ్ కాంపౌండ్ వద్ద మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మంటలు పరిసర ప్రాంతాలకు వ్యాపించడంతో చుట్టుపక్కనున్న సుమార్ 22 గోదాములు పూర్తిగా మంటల్లో కాలిపోయినట్టు తెలుస్తోంది. ఈ గోదాముల్లో పెద్ద మొత్తంలో రసాయనాలు, ప్రింటింగ్ యంత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నట్టు సమాచారం.
- Anand T
- Updated on: May 12, 2025
- 11:25 am
Road Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. 13 మంది మృతి, 30 మందికి గాయాలు!
ఛత్తీస్గడ్లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు అదుపుతప్పి ప్యాసింజర్ వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. సుమారు 30 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో తొమ్మిది మంది మహిళలు నలుగురు చిన్నారులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఓ వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా రాయ్పూర్-బలోద బజార్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
- Anand T
- Updated on: May 12, 2025
- 10:40 am
Rajnath Singh: భారత్ సైనిక పరాక్రమానికి ఆపరేషన్ సిందూర్ నిదర్శనం- రాజ్నాథ్ సింగ్
భారత్ ఎన్నటికీ ఉగ్రవాదాన్ని సహించదు.. ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేయాలని భారత దేశానికి ఉన్న దృఢ సంకల్పానికి భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నిదర్శనమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్తో పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని ఆయన అన్నారు.
- Anand T
- Updated on: May 11, 2025
- 5:33 pm
New Ration Cards: ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. రేషన్ కార్డుల జారీపై కీలక అప్డేట్!
రేషన్ కార్డు జారీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారు ఇప్పుడు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గతంలో వచ్చిన 3.36 లక్షల దరఖాస్తులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలిపారు. ఈ నెల 15 నుంచి ‘మనమిత్ర’ అనే వాట్సాప్ సేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు అధికారులు.
- Anand T
- Updated on: May 11, 2025
- 3:14 pm
Pakistan Army: పుల్వామా దాడిలో పాక్ పాత్ర.. నిజాలు బయటపెట్టిన పాక్ సైనిక అధికారి!
ఫిబ్రవరి 14, 2019న జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఆత్మహుతి బాంబు దాడిపై పాకిస్తాన్ సంచలన ప్రకటన చేసింది. గత కొన్ని ఏళ్లుగా ఈ దాడితో మకు సంబంధం లేదన్న పాక్ ఇప్పటికి నిజాన్ని ఒప్పుకుంది. ఈ ఉగ్రదాడి వెనుక తమ సైన్యం హస్తం ఉందని పాకిస్థాన్ సైనిక ఉన్నతాధికారి ఔరంగజేబ్ అహ్మద్ అంతర్జాతీయ మీడియా సమక్షంలో ఈ నిజాన్ని అంగీకరించాడు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేల పాక్ ప్రకటనపై ప్రాధాన్యతను సంతరించుకుంది.
- Anand T
- Updated on: May 11, 2025
- 2:09 pm
Pawan Kalyan: వీరజవాన్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా.. ప్రభుత్వం తరపున రూ.50 లక్షలు, పవన్ రూ.25లక్షల ప్రకటన!
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ దేశ రక్షణలో వీరమరణం పొందిన సైనికుడు మురళీనాయక్ భౌతికకాయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. జవాన్ స్వస్థలమైన కళ్లితండాకు వెళ్లి మురళీనాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
- Anand T
- Updated on: May 11, 2025
- 12:52 pm
Rajasthan: సరిహద్దుల్లో ఉద్రిక్తల వేళ.. సెల్ఫోన్ వెలుగుల్లో పెళ్లి వేడుక!
భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ రాజస్థాన్లో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది..భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో బ్లాకౌట్ ప్రకటించగా సెల్ఫోన్ వెలుగుల్లో పెళ్లి చేసుకుంది ఓ జంట. సరిగ్గా తాలికట్టే సమాయానికి కరెంట్ పోవడంతో అక్కడున్న వారందరూ తమ ఫోన్లలో టార్చ్ లైట్స్ ఆన్ చేయడంతో వధువు మెడలో మూడు ముళ్లు వేశాడు వరుడు.
- Anand T
- Updated on: May 11, 2025
- 10:51 am
Hyderabad: కొత్త కారులో నైట్ రైడ్కు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు!
శుక్రవారం హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదం మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కొత్త కారులో సరదాగా నైట్రైడ్కు బయల్దేరిన ముగ్గురు స్నేహితులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ముగ్గురు స్నేహితుల కలిసి వెళ్తున్న కారు ఓఆర్ఆర్పై ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా మరో యువకుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు
- Anand T
- Updated on: May 11, 2025
- 9:50 am