నా పేరు తాండ్ర ఆనంద్. టీవీ9లో సబ్ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ పొలిటికల్, స్పోర్ట్స్, క్రైమ్కు సంబంధించిన వార్తలు రాస్తుంటాను. అలాగే వైరల్ కంటెంట్ అందిస్తుంటాను. 2022లో నా ఈ జర్నలిజం కేరీర్ను ప్రారంభించాను. గతంలో బిగ్టవీ, ఎన్హెచ్ టీవీ, స్టూడియో ఎన్ టీవీలో పనిచేశాను. నేను జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేశాను.
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. తాజాగా భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమైనట్టు తెలుస్తోంది. సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరగగా.. మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు పురుషులు ఉన్నట్టు సమాచారం.
- Anand T
- Updated on: Dec 18, 2025
- 11:19 am
Delhi High Court: పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు.. ఏంటంటే?
Mutual consent divorce : భార్యభర్తల విడాకుల ప్రక్రియపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పువెలువరించింది. భార్యభర్తలు పరస్పర అంగీకారంతో విడాకులకు తీసుకునేందుకు కోర్టులో మొదటి పిటిషన్ దాఖలు చేసే ముందు ఒక సంవత్సరం విడివిడిగా ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టం (HMA) సెక్షన్ 14(1) ప్రకారం తగిన సందర్భాలలో దీనిని రద్దు చేయవచ్చని హైకోర్టు పేర్కొంది.
- Anand T
- Updated on: Dec 18, 2025
- 9:52 am
Telangana: అయ్యో.. పోలింగ్ రోజే ఎంత ఘోరం.. ఓట్లు లెక్కిస్తూ కుప్పకూలిన అధికారి.. కాసేపటికే..
Telangana Panchayat Elections 2025: తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికల వేళ ములుగు జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. వెంకటాపురం మండల కేంద్రంలో ఎన్నికల విధులు నిర్వహిస్తుండగా ఒత్తిడికి గురై గుండెపోటులో మరణించాడు MPDO రాజేంద్రప్రసాద్. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
- Anand T
- Updated on: Dec 18, 2025
- 8:59 am
Scrub Typhus: వామ్మో.. ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. ఇప్పటి వరకు ఎంతమంది మరణించారంటే?
ఏపీలో స్క్రబ్ టైఫస్ విశ్వరూపం దాలుస్తోంది. రోజురోజుకు స్క్రబ్ టైఫస్ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,806 పాజిటీవ్ కేసులు నమోదు కాగా సుమారు 15 మంది ఈ వ్యాధి కారణంగా మృత్యువాత పడ్డారు. ఈ మరణాలకు స్క్రబ్ టైఫస్తోపాటు దీర్ఘకాలిక, ఇతర అనారోగ్య సమస్యలు కూడా కారణమని వైద్యులు నిర్ధారించారు.
- Anand T
- Updated on: Dec 18, 2025
- 8:28 am
Picture Puzzle: దమ్ముంటే కాస్కో.. 13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు!
Brain Teaser: అప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, బ్రెయిన్ టీజర్స్, పజిల్స్ ఫోటోలు ఎప్పటికప్పుడూ జనాల తెలివితేటలను సవాల చేస్తూనే ఉంటాయి. జనాలు కూడా వాటిని ఛాలెంజ్గా తీసుకొని సాల్వ్ చేస్తుంటారు. ఇలా ప్రక్రియ కొన్ని వారికి నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవడానికి కూడా సహాయ పడుతుంది. దీంతో పాటు వారి తెలివితేటలను పెంచుతూ కొత్త సవాళ్లు ఎదురైనప్పుడు ఎలా మందుకెల్లాలో అనేది నేర్పిస్తాయి. కాబట్టి మీరు కూడా అలాంటి ఫజిల్స్ను సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి.
- Anand T
- Updated on: Dec 18, 2025
- 8:06 am
Gold Price Today: తగ్గని బంగారం జోరు.. మళ్లీ ఊపందుకుంటున్న ధరలు.. తులం ఎంటంటే?
Gold Price Today:రెండ్రోజుల పాటు భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు పుంజుకున్నాయి. నిన్న ఒక్కరోజే భారీగా తులం బంగారంపై రూ.650 పెరగ్గా.. ఇవాళ మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. బుధవారం నుంచి గురువారం మధ్య కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో బంగారం మళ్లీ ఆల్లైం హైకి చేరుకుంది. కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
- Anand T
- Updated on: Dec 18, 2025
- 8:06 am
PM Modi: ఇథియోపియా గడ్డపై భారత సాంస్కృతిక గీతం.. వందేమాతరం ఆలాపనతో మోదీ భావోద్వేగం!
ఇథియోఫియా ప్రధాని అబీ అహ్మద్ ఏర్పాటు చేసిన విందుకు భారత ప్రధాని మోదీ హాజరయ్యారు. మోదీ అక్కడికి వెళ్లిన తర్వాత ఇథియోపియన్ గాయకులు భారతీయ సాంస్కృతిక గీతం వందేమాతరాన్ని పాడి వినపించారు. విదేశీ గడ్డపై భారత సాంస్కృతిక గీతాన్ని విన్న ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో సంతోషించారు.
- Anand T
- Updated on: Dec 17, 2025
- 1:00 pm
Special Trains: సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్న్యూస్.. ఆ రూట్లో ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే
Sankranthi Special Trains 2025: తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పెరగనున్న రద్దీ, ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించుకుంది. పండుగకు ప్రయాణికులు జిల్లా మీదుగా రాకపోకలు సాగించేందుకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు మంగళవారం ప్రకటించింది.
- Anand T
- Updated on: Dec 17, 2025
- 11:18 am
అమెరికాలోని భారతీయులకు గుడ్న్యూస్.. ఇక పాస్పోర్ట్, వీసాలకు పరుగులు అక్కర్లేదు.. ఎందుకంటే?
అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు, ముఖ్యంగా లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో ఉండేవారికి ఇదో శుభవార్తనే చెప్పొచ్చు. ఎందుకంటే భారత ప్రభుత్వం అమెరికాలోని భారతీయ డయాస్పోరాకు కాన్సులర్ సేవలను మరింత సులభతరం చేయడానికి కొత్త చొరవలు తీసుకుంటోంది. డిసెంబర్ 15, 2025 నుండి లాస్ ఏంజిల్స్లో కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ (ICAC) ప్రారంభమైంది. ఇది VFS గ్లోబల్ నిర్వహిస్తోంది.
- Anand T
- Updated on: Dec 17, 2025
- 9:50 am
PM Modi: ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా.. ప్రధాని మోదీని వరించిన మరో అత్యున్నత పురస్కారం
ప్రధాని నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారమైన ‘ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ను ఆదేశ ప్రధాని అబీ అహ్మద్ అలీ మంగళవారం ప్రధాని మోదీకి అందజేశారు. భారత్-ఇథియోపియా మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక ప్రాత పోశించినందుకు గాను ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. దీంతో ప్రపంచంలో ఈ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోదీ నిలిచారు.
- Anand T
- Updated on: Dec 17, 2025
- 9:21 am
Lionel Messi: వంతారా జూని సందర్శించిన లియోనెల్ మెస్సీ.. వన్య ప్రాణులతో వండర్ఫుల్ మూమెంట్స్
Lionel Messi Vantara visit : గోట్ ఇండియా టూర్లో భాగంగా భారత్లో పర్యటిస్తున్న ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ.. కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ పర్యటన తర్వాత అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణా కేంద్రం వంతారాను సందర్శించారు. అక్కడ ప్రకృతి అందాలు, రకరకాల వన్య ప్రాణులను తిలకించాడు. అలాగే సాంప్రదాయ హిందూ ఆచారాలలో పాల్గొన్నాడు
- Anand T
- Updated on: Dec 17, 2025
- 8:28 am
Gold Price Today: పసిడి పరుగులకు బ్రేక్.. మళ్లీ దిగొచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
Gold Price Today: గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. నిన్నటి నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇది పసిడి ప్రియులకు కాస్తా ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తుంది. నిన్నటి పోల్చుకుంటే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. కాబట్టి ఈరోజు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
- Anand T
- Updated on: Dec 17, 2025
- 11:21 am