AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎనుముల రేవంత్ రెడ్డి

ఎనుముల రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్‌గా ఎనుముల రేవంత్ రెడ్డి గుర్తింపు సాధించారు. దూకుడు ఆయనకు ప్లస్.. ఓ రకంగా మైనస్ కూడా అదే. తెలంగాణ రాష్ట్రానికి ఆయన రెండో ముఖ్యమంత్రి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకు ముందు తెలంగాణ పీసీసీ చీఫ్‌‌గా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మల్కాజిగిరి నియోజకవర్గ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఆయన.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009-2014 వరకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2004-2018 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు.

రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. బీఏ వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి.. ధివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతా రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె నైమిషా రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.

విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి.. 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తెలంగాణ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇంకా చదవండి

Video: కొండా సురేఖ బర్తరఫ్.. మీసం మెలేసిన కొండా మురళీ!

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించే అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఆమె భర్త కొండా మురళీ బాల్కనీ నుంచి మీసం మెలేస్తూ అభిమానులకు అభివాదం చేయడం వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • SN Pasha
  • Updated on: Sep 3, 2026
  • 4:51 pm

సీఎం రేవంత్ బ్లాక్ మెయిల్ చేశారు.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేసే అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. తన బర్తరఫ్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి సోదరులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉన్నారని ఆరోపించారు.

  • SN Pasha
  • Updated on: Sep 3, 2026
  • 4:17 pm

హస్తినలో హైటెన్షన్.. తెలంగాణ కేబినెట్ మార్పులపై ఆసక్తికర పరిణామాలు.. జరిగేది అదేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో కీలక భేటీ నిర్వహించగా, కేబినెట్ విస్తరణ, శాఖల మార్పులు, నామినేటెడ్ పోస్టులు, మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై చర్చ జరిగినట్లు సమాచారం. ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ నేతల వరుస భేటీల నేపథ్యంలో హైకమాండ్ నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది.

తుమ్మిడిహెట్టి ఎత్తుపై తెలంగాణ కీలక ప్రతిపాదన.. మహారాష్ట్రను ఒప్పించేందుకు రంగంలోకి సీఎం రేవంత్..!

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా 152 మీటర్ల ఎత్తును మహారాష్ట్ర ముందు ఉంచి, కనీసం 150 మీటర్ల నిర్మాణానికి ఒప్పందం కోరుతోంది. ఈ అంశంపై ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ముంపు, భూసేకరణ నివేదికలను పరిగణనలోకి తీసుకుని నిర్మాణంపై చర్చలు జరుగనున్నాయి.

కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..! కేబినెట్ విస్తరణపై సర్వత్రా ఉత్కంఠ..

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం నుంచి రెండు రోజుల పాటు దిల్లీలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రులతో భేటీలతో పాటు కాంగ్రెస్‌ అధిష్ఠానంతోనూ కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహారంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్.. ఆ మార్గంలో మూసి వరద కష్టాలకు చెక్.. ఇక ప్రయాణం సులభం..

హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్. మూసారాంబాగ్‌ వంతెన పూర్తిగా అందుబాటులోకి రానుంది. రూ.52 కోట్లతో 400 మీటర్ల పొడవున నిర్మించిన ఈ బ్రిడ్జిని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. దీంతో అంబర్‌పేట్‌–మూసారాంబాగ్‌ మధ్య రాకపోకలు సులభం కానున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో మూసీ వరదల కారణంగా ఏర్పడే ట్రాఫిక్‌ ఇబ్బందులకు పరిష్కారం లభించనుంది.

తెలంగాణ ఓటర్ల జాబితాలో బిగ్ ట్విస్ట్.. ఈసీకి సీఎం రేవంత్ రెడ్డి సంచలన లేఖ!

తెలంగాణలో 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి కీలక లేఖ రాశారు. ఓటర్ల జాబితా సవరణలో అర్హత ఉన్న ఒక్క ఓటరు పేరు కూడా తొలగిపోకూడదని, అదే సమయంలో అనర్హులైన వారి పేర్లు జాబితాలో ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. SIR ప్రక్రియలో ఓటర్లకు తగిన సమయం, అవసరమైన సహాయం అందించేలా విధానపరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

వివాదం తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసేందుకు మంత్రి కొండా సురేఖ అపాయింట్‌మెంట్..!

మంత్రి కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలతో తలెత్తిన వివాదంపై టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి రాఖీ కట్టేందుకు సురేఖ అపాయింట్‌మెంట్ కోరారు. ఇది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం ఆమెపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.

భారీ క్రేన్ పై నుంచి మీరాలం చెరువు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లోని మీరాలం చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. భారీ క్రేన్ పైనుంచి చెరువు చుట్టూ కొనసాగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు.. చెరువు పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మీరాలం చెరువు అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న పలు మౌలిక వసతుల పనులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారో తెలుసా..?

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. కొండా సురేఖ అంశాన్ని క్రమశిక్షణ కమిటీతో పాటు ఏఐసీసీ చూసుకుంటుందని స్పష్టం చేశారు. మరోవైపు క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం కావడం, టీపీసీసీ నేతలు హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పడంతో సురేఖపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నది తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

కేంద్రం వైఖరి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం.. అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..

అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. యూకే పర్యటనకు అనుమతిచ్చి అమెరికా పర్యటనను అడ్డుకోవడం వెనుక కేంద్రం ఉద్దేశమేంటని ప్రశ్నించారు. తన పర్యటనను అడ్డుకున్నా తెలంగాణ అభివృద్ధి లక్ష్యాన్ని మాత్రం ఆపలేరని స్పష్టం చేశారు. కేంద్రం వైఖరి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించిన రేవంత్ రెడ్డి.. విద్య, క్రీడలు, పెట్టుబడుల కోసం అమెరికా పర్యటనకు వెళ్లాలని భావించామని తెలిపారు.

కేంబ్రిడ్జ్‌తో తెలంగాణ కొత్త బంధం.. విద్య, పరిశోధన, స్టార్టప్‌లపై భారీ ప్లాన్! సీఎం రేవంత్‌ కీలక చర్చలు!

లండన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో కీలక చర్చలు జరిపారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్‌లలో అంతర్జాతీయ భాగస్వామ్యానికి ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో కేంబ్రిడ్జ్ సహకారం కోరారు. ఇరుపక్షాలు సంయుక్త ప్రాజెక్టులు, యువతకు ఇంక్యుబేషన్, మెంటరింగ్‌పై దృష్టి సారించనున్నాయి. ఇది తెలంగాణ ఉన్నత విద్యకు భారీ ముందడుగు.