ఎనుముల రేవంత్ రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్గా ఎనుముల రేవంత్ రెడ్డి గుర్తింపు సాధించారు. దూకుడు ఆయనకు ప్లస్.. ఓ రకంగా మైనస్ కూడా అదే. తెలంగాణ రాష్ట్రానికి ఆయన రెండో ముఖ్యమంత్రి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకు ముందు తెలంగాణ పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మల్కాజిగిరి నియోజకవర్గ లోక్సభ సభ్యుడిగా ఉన్న ఆయన.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009-2014 వరకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2004-2018 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు.
రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. బీఏ వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి.. ధివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతా రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె నైమిషా రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.
విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి.. 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తెలంగాణ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తెలంగాణకు రెట్టింపు నిధులు కావాలా? అయితే ‘మేరే సే జోడో’.. రేవంత్కు ప్రధాని మోదీ ఆఫర్!
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా "మేరే సే జోడో" (నాతో జతకట్టండి) అనే మాట మార్మోగిపోతోంది. ప్రధాని మోదీ చేసిన "మేరే సే జోడో" కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. హైదరాబాద్లోని HICCలో రూ. 9,377 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సరికొత్త రాజకీయ చర్చకు దారితీసింది.
- Balaraju Goud
- Updated on: May 10, 2026
- 5:41 pm
“నాడు నాటిన మొక్క.. నేడు మహావృక్షమైంది.. మీరే కాపాడుకోవాలి”.. కోడంగల్లో సీఎం రేవంత్ భావోద్వేగం!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రతినబూనారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి మరియు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కొడంగల్ చేరుకున్న సీఎంకు ఘనస్వాగతం లభించింది.
- Balaraju Goud
- Updated on: May 8, 2026
- 4:44 pm
Revanth Reddy: కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కేరళలో యూడీఎఫ్ కూటమి సాధించిన ఘన విజయంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక విజయంగా అభివర్ణిస్తూ, పార్టీ అగ్రనేతలను ప్రశంసించారు. తన ప్రచారానికి లభించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపు తెలంగాణ కాంగ్రెస్లో నూతనోత్తేజాన్ని నింపింది. కాంగ్రెస్ పాలనలో కేరళ అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
- Prabhakar M
- Updated on: May 4, 2026
- 4:43 pm
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని.. తుమ్మిడిహెట్టిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అడుగు..!
ఉత్తర తెలంగాణ రైతాంగం దశాబ్దాల కల అయిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తోంది. ఈ ప్రాజెక్టును కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే త్వరలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.
- Prabhakar M
- Updated on: May 1, 2026
- 10:08 am
డెలివరీ బాయ్స్, డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ ‘మే డే’ కానుక.. గిగ్ వర్కర్ల బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని లక్షలాది మంది గిగ్ వర్కర్ల జీవితాల్లో మే డే (మే 1) కొత్త వెలుగులు నింపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ బిల్లు'కు రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో, నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ వంటి ప్లాట్ఫామ్లలో పనిచేసే డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు చట్టబద్ధమైన రక్షణ లభించనుంది.
- Prabhakar M
- Updated on: May 1, 2026
- 9:45 am
Viral: అతను పోలీసే కాదు.. డ్రెస్ వేసుకుని దర్జాగా సెక్రటేరియట్ లోపలికి వెళ్లాడు.. సీన్ కట్ చేస్తే..
తెలంగాణ సచివాలయంలో నకిలీ పోలీసు యూనిఫాంలో నిఖిల్ యాదవ్ ప్రవేశించి, రీల్స్ చేయడంతో హై సెక్యూరిటీ భద్రతా వైఫల్యం బయటపడింది. ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద డ్యూటీలో ఉన్నట్లు ప్రకటించిన ఈ వ్యక్తి.. నిజానికి నేర చరిత్ర కలిగిన వాడు. అతడు పోలీస్ కాదని తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఈ ఘటన సచివాలయ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 29, 2026
- 12:50 pm
Revanth Reddy: అద్భుతం జరగబోతుంది.. ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేట్లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. సింగపూర్, టోక్యో తరహాలో ప్రపంచస్థాయి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ఆయన తెలిపారు. రైతులు భాగస్వామ్యులై భూములివ్వాలని కోరారు. వారికి మంచి ఉద్యోగాలు, స్కిల్ యూనివర్సిటీలో శిక్షణ ఇస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ అభివృద్ధికి కొత్త మార్గాన్ని సూచిస్తుంది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 28, 2026
- 8:52 pm
రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సహకరించండి.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని, చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి అవసరమైన భూసేకరణ, రహదారుల విస్తరణపై వ్యక్తిగత చొరవ చూపాలని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. నగర రవాణా వ్యవస్థ మెరుగుపడాలంటే రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
- Balaraju Goud
- Updated on: Apr 28, 2026
- 1:39 pm
బీఆర్ఎస్ పని అయిపోయింది.. కొత్త పార్టీకి తావులేదు.. ఇక కాళేశ్వరం లెక్కలు తేలుస్తాం: రేవంత్ రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. మీడియా చిట్చాట్లో భాగంగా ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కీలక విమర్శలు చేశారు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం నుంచి బీఆర్ఎస్ కనుమరుగవుతోందని ఆయన జోస్యం చెప్పారు.
- Balaraju Goud
- Updated on: Apr 28, 2026
- 8:33 am
గవర్నర్ శివప్రతాప్ శుక్లా కీలక నిర్ణయం.. అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్
తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాజీ టీమిండియా క్రికెటర్ అజారుద్దీన్, ఎం. కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో అజారుద్దీన్, కోదండరాం ఇద్దరూ మండలికి వెళ్లడం ఖరారైంది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 25, 2026
- 1:24 pm
అజారుద్దీన్ ఎమ్మెల్సీపై వీడని ఉత్కంఠ.. గ్రీన్ సిగ్నల్ వస్తుందా? లేదా ప్లాన్ బీ అమలవుతుందా?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి మాజీ క్రికెటర్, ప్రస్తుత మంత్రి మహ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీ కోటాపైనే ఉంది. గవర్నర్ నిర్ణయం కోసం కాంగ్రెస్ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. అయితే, అజారుద్దీన్పై గతంలో ఉన్న కొన్ని కేసులు ఆయన నామినేషన్కు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది.
- Balaraju Goud
- Updated on: Apr 23, 2026
- 10:06 am
Telangana: రేవంత్, కేసీఆర్.. మధ్యలో బీజేపీ.. వార్ జోన్ షురూ అయినట్టేనా?
ముఖ్యంగా రేవంత్ మార్క్ ఆఫ్ గవర్నెన్స్ని టార్గెట్ చేశారు మాజీ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పథకాల్ని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేశారు. ఒక్కో పథకాన్ని గుర్తు చేస్తూ పాయింట్ టూ పాయింట్ నిగ్గదీసే ప్రయత్నం చేశారు. జనం కూడా రేవంత్ ప్రభుత్వంపై మొహం మొత్తి, తన రీఎంట్రీని కోరుకుంటున్నారు అన్నట్టుగా సాగింది కేసీఆర్ స్పీచ్.
- Shaik Madar Saheb
- Updated on: Apr 21, 2026
- 9:51 pm