ఎనుముల రేవంత్ రెడ్డి

ఎనుముల రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్‌గా ఎనుముల రేవంత్ రెడ్డి గుర్తింపు సాధించారు. దూకుడు ఆయనకు ప్లస్.. ఓ రకంగా మైనస్ కూడా అదే. తెలంగాణ పీసీసీ చీఫ్‌‌గా ఉన్న రేవంత్ రెడ్డి.. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు తెలంగాణలో పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం మల్కాజిగిరి నియోజకవర్గ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి సీఎం రేసులో ఉన్న వారిలో అగ్రస్థానం రేవంత్‌దే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009-2014 వరకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2004-2018 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు.

రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. బీఏ వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి.. ధివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మేనకోడలు గీతను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది.

విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి.. 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తెలంగాణ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇంకా చదవండి

Lok Sabha Election: కాంగ్రెస్ – సీపీఎం మద్య కుదిరిన దోస్తీ.. ఆ నియోజకవర్గం మినహా అన్నిచోట్ల మద్దతు!

తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై సీపీఎం నేతలతో చర్చించామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వీరయ్యతోపాటు పలువురు కీలక నేతలు సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా.. పార్లమెంట్‌ ఎన్నికల్లో మద్దతుపై చర్చించారు. భువనగిరి పార్లమెంట్‌తో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సీపీఎం నేతలను కోరినట్లు చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి

Telangana: దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం..

మాటకు మాట.. విమర్శకు ప్రతివిమర్శ.. ఎత్తుకు పైఎత్తుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల రణరంగంలో దూసుకెళ్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కనీసం 12 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తు అభ్యర్థుల కోసం ప్రచారం చేయడమే కాకుండా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో రేవంత్ రెడ్డి సఫలీకృతులవుతున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఈ జిల్లా గులాబీ అడ్డా.. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీమంత్రి హరీష్‌ రావు..

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మెదక్ రోడ్ షోలో ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. అమరవీల స్థూపం వద్దకు రాజీనామా పత్రంతో తాను వస్తానని.. నువ్వు వస్తావా.. అని ప్రశ్నించారు. ఆగష్టు 15 లోపు రుణమాఫీ చేయడం నిజమైతే, ఆరు హామీలు అమలు చేయడం నిజం అయితే అమరవీరుల స్థూపం వద్దకు రా.. రాజీనామా లేఖలను ఇద్దరం మేధావుల చేతిలో పెడదామన్నారు. నువ్వు చెప్పినవి అమలు చేస్తే తన రాజీనామా లేఖను ఆ మేధావులు, స్పీకర్‎కి ఇస్తారు.

  • Srikar T
  • Updated on: Apr 25, 2024
  • 3:01 pm

Revanth Reddy: దేశంలో రిజర్వేషన్ల రద్దుకు కుట్ర.. బీజేపీపై సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు

బీజేపీ నయవంచన పేరుతో ప్రజా ఛార్జ్‌షీట్‌ని కాంగ్రెస్‌ ఆవిష్కరించింది. పదేళ్ల మోసం- వందేళ్ల విధ్వంసం అంటూ బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా.. కృష్ణా జలాల్లో వాటా వంటి అంశాలతో ఛార్జ్‌షీట్ లో పలు విషయాలను ప్రస్తావించింది.. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

CM Revanth: ‘వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు’.. జనజాతర సభలో సీఎం రేవంత్..

తెలంగాణలో రెండో రాజధానిగా వరంగల్‌కు అన్ని అర్హతలున్నాయన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. హైదరాబాద్‌తో పాటు వరంగల్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా నిధులు కేటాయించి అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. వరంగల్‌ జనజాతర సభలో పాల్గొన్న ఆయన.. కడియం కావ్యను గెలిపించాలని ప్రజలను కోరారు. అలాగే వరంగల్‌కి ఎన్నో అభివృద్ధి హామీలిచ్చారు. వరంగల్‌కి ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో పాటు.. ఎయిర్‌పోర్టు తీసుకొస్తామన్నారు సీఎం.

  • Srikar T
  • Updated on: Apr 24, 2024
  • 9:43 pm

Revanth Reddy: భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. డబుల్ డిజిట్ సీట్లలో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై సీఎం రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. సికింద్రాబాద్‌లో దానం నాగేందర్‌ గెలుపుతో 2004, 2009 రిపీట్‌ అవుతుందన్నారు రేవంత్‌రెడ్డి. సికింద్రాబాద్‌లో ఎవరు ఎంపీగా గెలిస్తే కేంద్రంలో ఆ పార్టీదే గెలుపన్నారు.

KCR: అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. ఇంజనీరింగ్ భాషే తెలియదు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్‌ నాటకాలు ప్రజలకు తెలిసిపోయాయి.. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి ఖాయం.. కేసీఆర్‌ ఆనవాళ్లను తీసేస్తామని రేవంత్‌ అన్నారు.. మీరు కూర్చున్న సచివాలయం నేను కట్టిందే.. యాదాద్రి ఆలయం కట్టింది నేనే కూలగొడతారా..? కేసీఆర్‌ అంటే హిస్టరీ ఆఫ్‌ తెలంగాణ.. నా ఆనవాళ్లను తీసేయడం ఎవరి వల్లా కాదు.. అంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు అన్నారు.

Telangana Congress: సస్పెన్స్.. ఆ మూడు స్థానాల్లో అభ్యర్థులెవరు..? తెలంగాణ కాంగ్రెస్‌ కేడర్‌లో ఉత్కంఠ..

తెలంగాణ కాంగ్రెస్‌లో మూడు స్థానాల్లో ఎంపీ అభ్యర్థులపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. సస్పెన్స్‌ కొనసాగుతున్నప్పటికీ అభ్యర్థులు మాత్రం సమయం లేదు మిత్రమా అంటూ నామినేషన్ వేసేశారు. కరీంనగర్‌, హైదరాబాద్‌, ఖమ్మం స్థానాల్లో ఫైనల్ అయ్యే అభ్యర్థులు వాళ్లేనా? చివరి నిమిషంలో మార్పులు చేర్పులతో ఏఐసీసీ షాక్ ఇస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది.

మెదక్ సభలో రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు..

మెదక్ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. మెదక్‎లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత జిల్లా అయిన మెదక్‎కి ఏమి చేయలేదు అని సీఎం రేవంత్ కౌంటర్ చేశారు. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు పై తీవ్ర విమర్శలు చేసారు. ఆ తరువాత అంతే స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్‎కి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు.

Telangana: తెరపైకి గత సెంటిమెంట్.. మెదక్ సభలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

సీఎం రేవంత్ రెడ్డి మెదక్ నియోజకవర్గంలో పర్యటించి సెంటిమెంట్ కురిపించారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. పార్లమెంట్‌ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరుతోంది. తాజాగా.. మెదక్‌ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్‌, బీజేపీపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి.

  • Srikar T
  • Updated on: Apr 21, 2024
  • 7:42 am

Kishan Reddy: బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. రేవంత్ మళ్లీ మోసం చేస్తున్నారు.. కిషన్ రెడ్డి ఫైర్..

బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ నేతల తీరుపై తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని బీఆర్‌ఎస్‌ నేతలు ఇంకా జీర్జించుకోలేక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు కిషన్‌రెడ్డి. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి..మళ్లీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

Revanth Reddy: జైపాల్‌ రెడ్డి, జానా రెడ్డి కాదు.. ఇక్కడున్నది రేవంత్‌.. టచ్ చేస్తే మాడి మసై పోతారు..

ఏడుపాయల దుర్గమ్మ, మెదక్ చర్చి సాక్షిగా నేను మాటిస్తున్నా.. ఆగస్ట్ 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం.. వచ్చే ఏడాది పంటకు రూ.500 బోనస్ ఇచ్చే బాధ్యత నాది.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వంద రోజులకే దిగిపొమ్మని కేసీఆర్ అంటున్నారు.. దిగిపోవడానికి తాము అల్లా టప్పాగా అధికారంలోకి రాలేదని.. BRSను తొక్కుకుంటూ అధికారంలోకి వచ్చామన్నారు.

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎ వెనుక అసలు కారణం ఏంటి..

తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి కమాండర్‌గా మారారా? హైకమాండ్‌ రేవంత్‌ మాటకే ఎక్కువ విలువ ఇస్తోందా? అధిష్టానం అండతో ఎంపీ టిక్కెట్లు అనుచరులకే కట్టుబెట్టుకుంటున్నారా? వయా ఢిల్లీ ఫార్ములాతో మంత్రులకు సైతం చెక్‌ పెడుతున్నారా? ఇంతకీ.. తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో రేవంత్‌ స్ట్రాటజీ ఏంటి?

  • Srikar T
  • Updated on: Apr 20, 2024
  • 7:34 am

Telangana: భద్రాద్రి రాముడి సాక్షిగా రుణమాఫీపై రైతులకు రేవంత్ గుడ్ న్యూస్.. మరో శుభవార్త కూడా

పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాను అయ్య, మామ పేరు చెప్పుకుని అధికారంలోకి రాలేదని.. బరాబర్ జనంలో నుంచి వచ్చినట్లు తెలిపారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఆగస్టు పదిహేనో తేదీలోగా చేస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో వచ్చిన వాగ్దానాలన్నీ ఖచ్చితంగా మీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.

Telangana: సీఎం రేవంత్ రెడ్దికి సవాలుగా ఆ రెండు నియోజకవర్గాలు.. గెలిచేందుకు వ్యూహాలివే..

తెలంగాణ కాంగ్రెస్‎కు పార్లమెంట్ ఎన్నికలు పెద్ద సవాల్‎గా మారాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మెజార్టీ సీట్లు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఫలితాల్లో తేడా వచ్చిందంటే అదో పెద్ద చర్చకు దారితీస్తోంది. అందుకే పిసిసి చీఫ్‎గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా మెజార్టీ సీట్లు సాధించే పనిలో పడ్డారు. అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుకొని ప్రచారం వరకు అంతా తానే నడిపిస్తున్నారు.

తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?
OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?