ఎనుముల రేవంత్ రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్గా ఎనుముల రేవంత్ రెడ్డి గుర్తింపు సాధించారు. దూకుడు ఆయనకు ప్లస్.. ఓ రకంగా మైనస్ కూడా అదే. తెలంగాణ రాష్ట్రానికి ఆయన రెండో ముఖ్యమంత్రి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకు ముందు తెలంగాణ పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మల్కాజిగిరి నియోజకవర్గ లోక్సభ సభ్యుడిగా ఉన్న ఆయన.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009-2014 వరకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2004-2018 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు.
రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. బీఏ వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి.. ధివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతా రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె నైమిషా రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.
విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి.. 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తెలంగాణ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
CM Revanth Reddy: ఆ జిల్లా వాసులకు సీఎం అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలోనే కోట్ల రూపాయలతో..
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో టాప్ ఉంటానే ఉద్దేశంలో తెలంగాణ సర్కార్ ఎప్పికప్పుడూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగానే ఉత్తర తెలంగాణలోని బాసర పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇక ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6వ తేదీన బాసరలో పర్యటించనున్న ఆయన ఆలయ అభివృద్ధి కోసం రూ.300 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
- Prabhakar M
- Updated on: Apr 4, 2026
- 2:58 pm
Hyderabad: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వైపు వెళ్తున్నారా.. వాహనదారులకు బిగ్ అలర్ట్..!
హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. ఈ క్రమంలోనే అత్యంత రద్దీ కలిగిన జూబ్లీహిల్స్ చౌరస్తా సిగ్నల్ ఫ్రీగా మారబోతుంది. ఈ జంక్షన్లో అండర్పా్సలు, ప్లైఓవర్ల నిర్మాణం ద్వారా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- Balaraju Goud
- Updated on: Apr 4, 2026
- 8:53 am
CM Revanth Reddy: మా ట్రాక్ రికార్డ్ తెలియాలంటే తెలంగాణకు రండి.. వారికి సీఎం రేవంత్ సవాల్
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేరళలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళ నేతల సమక్షంలో UDF మేనిఫెస్టో విడుదల చేసిన ఆయన కేరళలో ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని UDF ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు.యూడీఎఫ్ ప్రకటించిన హామీలపై విమర్శలు చేస్తున్న నేతలు.. అవి ఎలా అమలవుతాయో తెలియాలంటే తెలంగాణకు రావాల్సిందేనని సవాల్ విసిరారు
- Anand T
- Updated on: Apr 3, 2026
- 11:52 am
వాట్సాప్లో సర్కార్ సేవ.. ఈ నెంబర్కు మెసేజ్ చేస్తే చాలు.. అరచేతిలో ప్రభుత్వ సర్వీసులు!
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో ముందడుగు వేసింది. ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభంగా అందించేందుకు వాట్సాప్ను ప్రధాన వేదికగా మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అనేక శాఖలకు చెందిన సేవలు ఒక్క మెసేజ్తోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
- Prabhakar M
- Updated on: Apr 3, 2026
- 8:55 am
Rythu Bharosa: రెండో విడత రైతు భరోసాపై సర్కార్ గుడ్ న్యూస్.. ఒకేసారి అందరికీ డబ్బులు.. ఎవరెవరికీ ఎంత?
తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త ప్రకటించింది. రైతు భరోసాకు సంబంధించి మరో ముఖ్య నిర్ణయం వెలువడింది. రైతు భరోసా పథకంలో భాగంగా రెండో విడత నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఏప్రిల్ రెండో వారంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
- Prabhakar M
- Updated on: Apr 3, 2026
- 8:34 am
గొప్ప మనస్సు చాటుకున్న ముఖ్యమంత్రి.. ఆపద్భాంధవుడు ట్యాంక్ బండ్ శివకు అండగా సర్కార్!
అందరి ప్రాణాలు కాపాడే ఆపద్భాంధవుడు ట్యాంక్ బండ్ శివకే కష్టమొచ్చింది. ట్యాంక్ బండ్పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివ దీనస్థితి తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలించిపోయారు. శివ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున సాయం అందించారు.
- Balaraju Goud
- Updated on: Apr 1, 2026
- 7:42 am
Telangana: హాట్ హాట్గా సాగిన బడ్జెట్ సమావేశాల్లో ఏయే అంశాలకు ఆమోదం లభించిందంటే..?
పేరుకు బడ్జెట్ సెషన్ కాని.. జరిగిందంతా వేరే! గవర్నర్ ప్రసంగం నుంచే మొదలైన రభస స్టోన్ క్రషింగ్ వరకు పొలిటికల్ టెంపరేచర్ రోజు రోజుకు పెరిగింది. గాంధీ-గాడ్సేల నుంచి ఇందిరాగాంధీ వరకు.. ఎథిక్స్ కమిటీ నుంచి సీబీసీఐడీ వరకు.. సారీల నుంచి సవాళ్ల వరకు అధికార, విపక్షాలు ఢీ అంటే ఢీ అనేలా సాగాయి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.
- Balaraju Goud
- Updated on: Mar 31, 2026
- 7:42 am
కాసేపట్లో భద్రాద్రిలో సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్ దంపతులు
దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో కాసేపట్లో లోకకల్యాణానికి సర్వం సిద్ధమైంది. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. సీతారాముల కల్యాణానికి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. భక్తకోటి మురిసేలా ఘనంగా ఏర్పాట్లు చేశారు. రాములోరి కల్యాణఘట్టాన్ని ప్రత్యక్షంగా కన్నులారా వీక్షించి తరించేందుకు భక్తకోటి పెద్దఎత్తున తరలివస్తుంది.
- Balaraju Goud
- Updated on: Mar 27, 2026
- 11:16 am
CM Revanth Reddy: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథక పరిమితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథక పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే సీపెక్ సర్వే ఆధారంగా గుర్తించిన అన్ని కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా వర్తింపజేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. తాజా బడ్జెట్లో కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదని, ఒక విప్లవాత్మక సామాజిక భద్రతకు ముందడుగు అని సీఎం స్పష్టం చేశారు.
- Balaraju Goud
- Updated on: Mar 26, 2026
- 12:33 pm
CM Revanth Reddy: నర్మెట్ట పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అదే వేదికపై నుంచి రైతులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రైతుభరోసా తొలి విడత నిధులను కూడా ఆయన విడుదల చేశారు. సోమవారం రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమకానున్నాయి.
- Anand T
- Updated on: Mar 22, 2026
- 5:40 pm
అద్దిరిపోయే పెర్ఫామెన్సులు ఇక్కడ.. అందాల్సిన పురస్కారాలెక్కడ? విభజన తర్వాత స్క్రీన్ప్లే మారిందా?
నాటోన్లీ ఫార్మా, ఐటీ, బిర్యానీ.. సినిమా ఐకాన్గా కూడా హైదరాబాద్కి దేశవ్యాప్త గుర్తింపు ఉంది.. దీన్ని గ్లోబల్ సైజుకు తీసుకెళదామని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా స్క్రీన్ప్లే రాసుకుంటోంది. సౌత్ కొరియా తరహాలో సినిమా రంగాన్ని ఎంకరేజ్ చేయాలని ఒక స్కెచ్ కూడా వేసుకుంది. కానీ, తెలుగు సినిమాకు రెండో కన్ను ఆంధప్రదేశ్ వాయిస్ ఏంటి? మాకు ఇప్పుడే తెలియాలి అని ఓపెన్గానే అడుగుతోంది ఇండస్ట్రీ పెద్దరికం. ఒక్క టాలీవుడ్.. రెండు రాష్ట్రాలు.. ఎవరికెంత ఎటాచ్మెంట్..?
- Balaraju Goud
- Updated on: Mar 20, 2026
- 9:45 pm
ఇండియన్ మూవీస్కు గ్లోబల్ హబ్గా హైదరబాద్ను తీర్చిదిద్దబోతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
గద్దర్ అవార్డుల వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున సినీ ప్రముఖులకు. యువనటులకు.. మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా గుర్తించింది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్, ఐటీ, ఫార్మా పరిశ్రమలకు, బిర్యానీకి మాత్రమే కాదు దేశ స్థాయిలో సినిమాకు హైదరాబాద్ ఒక కేంద్రంగా రాణించనిలని ప్రభుత్వం భావిస్తుంది.
- Rajeev Rayala
- Updated on: Mar 19, 2026
- 11:16 pm