ఎనుముల రేవంత్ రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్గా ఎనుముల రేవంత్ రెడ్డి గుర్తింపు సాధించారు. దూకుడు ఆయనకు ప్లస్.. ఓ రకంగా మైనస్ కూడా అదే. తెలంగాణ రాష్ట్రానికి ఆయన రెండో ముఖ్యమంత్రి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకు ముందు తెలంగాణ పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మల్కాజిగిరి నియోజకవర్గ లోక్సభ సభ్యుడిగా ఉన్న ఆయన.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009-2014 వరకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2004-2018 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు.
రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. బీఏ వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి.. ధివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతా రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె నైమిషా రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.
విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి.. 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తెలంగాణ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
TG Govt Jobs 2025: నిరుద్యోగులకు సీఎం రేవంత్ భారీ శుభవార్త.. వచ్చే రెండేళ్లలో మరో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
CM Revanth Reddy Promises 1 Lakh Jobs To Fulfilled In Next 2 Years: నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ తీపి కబురు చెప్పారు. త్వరలో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు హుస్నాబాద్ సభలో ప్రకటించారు. 2023 డిసెంబర్ 3న పదేళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడారని, శ్రీకాంతాచారి బలిదానం ఇదే రోజు జరిగిందని గుర్తు చేశారు. ఆయన స్పూర్తితో..
- Srilakshmi C
- Updated on: Dec 4, 2025
- 10:40 am
గేమ్ ఛేంజర్.. ముఖ్యమంత్రే గోల్కీపర్ అయిన వేళ.. భాగ్యనగరంలో పాన్ ఇండియా మెస్సీ మేళా..!
మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. ప్రపంచం మొత్తం మనవైపే చూడాలి అనుకున్నప్పుడు... అప్లై చేయాల్సిన ఫార్ములాలు ఈ రెండే. సీఎం రేవంత్ రెడ్డి ఈమధ్య తరచుగా ఓ స్టేట్మెంట్ ఇస్తున్నారు. తెలంగాణ పోటీపడుతున్నది పక్క రాష్ట్రాలతో కాదు ఇతర దేశాలతో అని. గ్లోబల్ కాంపిటిషన్లో తెలంగాణను పెట్టాలనేదే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ కూడా.
- Shaik Madar Saheb
- Updated on: Dec 3, 2025
- 9:47 pm
Kishan Reddy: భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితి.. ఏకపక్షంగా జీవో తీసుకొచ్చారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భూములు అమ్మకపోతే తెలంగాణ ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.. HILT పాలసీ పేరుతో మరో భూదందాకు తెరలేపారని, 9వేల ఎకరాలు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏకపక్షంగా జీవో తీసుకొచ్చి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని.. కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: Dec 4, 2025
- 8:49 am
ఢిల్లీలో కొనసాగుతున్న తెలంగాణ సీఎం రేవంత్ పర్యటన.. ప్రధాని మోదీ, రాహుల్తో భేటీ
పాతికేళ్ల టార్గెట్.. ఫ్యూచర్కు రోడ్ మ్యాప్. తెలంగాణ రైజింగ్ 2047 అంటే.. రాష్ట్ర భవిష్యత్తుకే విజన్ డాక్యుమెంట్ అంటోంది రేవంత్ సర్కార్. రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం అయ్యేలా పక్కా ప్రణాళికలు రచిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వ. అతి త్వరలోనే జరగబోయే గ్లోబల్ సమ్మిట్.. గ్రాండ్గా జరగాలి. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్ప దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా అతిరథ మహారథులను హైదరాబాద్కు ఆహ్వానిస్తున్నారు.
- Balaraju Goud
- Updated on: Dec 3, 2025
- 2:11 pm
దేవుళ్లపై రేవంత్రెడ్డి హాట్ కామెంట్స్.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై భగ్గుమంటున్న బీజేపీ నేతలు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు బీజేపీ నేతలు. మూడు కోట్ల హిందు దేవతలున్నారని ఒక్కొక్కరు ఒక్కో ఓదేవుడిని నమ్ముతారని, అన్ని రకాల దేవుళ్లు ఉన్నట్టే కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల వ్యక్తులు ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. దేవుళ్లపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
- Balaraju Goud
- Updated on: Dec 3, 2025
- 10:34 am
Telangana Rising-2047: భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్.. పొరుగు రాష్ట్రాల నుంచి సహకారం..!
వరల్డ్ ఫేమస్ స్పోర్ట్స్ స్టార్ మెస్సీ హైదరాబాద్ రాబోతున్నారు. ఆయనతో కలిసి ఫుట్బాల్ అడబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. ఆ క్రీడా వేదికపై కూడా తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ను ప్రమోట్ చెయ్యబోతున్నారు. సో, గ్లోబల్ సమిట్ కోసం గ్లోబును చుట్టెయ్యాలన్నంత కమిట్మెంట్తో నడుస్తోంది రేవంత్ సర్కార్.
- Balaraju Goud
- Updated on: Dec 3, 2025
- 7:10 am
Telangana: తెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. 300 మందికి ఉద్యోగాలు..
తెలంగాణను దేశ డిఫెన్స్ స్ట్రాటజిక్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర రోడ్మ్యాప్ రూపొందించనుంది. అడ్వాన్స్డ్ UAV, డ్రోన్ల ఉత్పత్తిపై దృష్టి సారించింది. మహేశ్వరంలో రూ.850 కోట్లతో JSW-షీల్డ్ AI UAV ఫెసిలిటీ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఇది ఏటా 300 డ్రోన్లను ఉత్పత్తి చేసి, 300 ఉద్యోగాలు సృష్టిస్తుంది.
- Krishna S
- Updated on: Dec 2, 2025
- 6:41 pm
CM Revanth Reddy: మెస్సీతో ఆట.. తెలంగాణ 2047 విజన్తో అనుసంధానం
హైదరాబాద్, డిసెంబర్ 2: ఈ నెల 13వ తేదీన ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీతో కలిసి ఆడేందుకు నేను ఇప్పటి నుంచే ఫుట్బాల్ ప్రాక్టీస్ మొదలు పెట్టాను. ఇది కేవలం ఆటగాళ్ల మధ్య స్నేహపూర్వక మ్యాచ్ కాదు... ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్ లక్ష్యాలను ప్రపంచ మీడియా దృష్టికి తీసుకొచ్చే ఒక వ్యూహాత్మక వేదిక.
- Phani CH
- Updated on: Dec 2, 2025
- 4:24 pm
CM Revanth Reddy: రెండో రోజు ఫుడ్బాల్ ప్రాక్టీస్.. మెస్సీని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్న సీఎం రేవంత్
ప్రపంచ ఫుడ్బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీతో మ్యాచ్ కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సన్నద్దం అవుతున్నారు. ఇందులో భాగంగానే రెండో రోజులు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీ గ్రౌండ్స్లో ఇతర ప్లేయర్లతో కలసి ఆయన ఫుడ్బాల్ ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సీఎంవో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
- Anand T
- Updated on: Dec 2, 2025
- 1:14 pm
తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యం ఏంటో తెలుసా..? ప్రధాన ఫోకస్ దేని మీద..?
భారత్లో ఎన్నో నగరాలున్నాయ్. తెలంగాణ కంటే, హైదరాబాద్ కంటే ధనిక రాష్ట్రాలు, రాజధానులున్నాయ్. పైగా చైనా, జపాన్ వంటి దేశాలతో.. న్యూయార్క్, టోక్యో వంటి నగరాలతోనే తమకు పోటీ అంటోంది తెలంగాణ. ఇన్ని నగరాలు, రాష్ట్రాలను కాదని హైదరాబాద్ అండ్ తెలంగాణలోనే ఈ స్థాయి అభివృద్ధి ఎలా సాధ్యం? దీనికో సమాధానం ఉంది. కొన్నేళ్లలో అమెరికా, ఆసియా, యూరప్లో పనిచేసే యూత్, టాలెంట్ ఉన్న యూత్ ఉండేది మనదేశంలోనే. అవకాశాలన్నీ కట్టగట్టుకుని వెతుక్కుంటూ వచ్చేది భారత్నే. ఒకసారి భారత్వైపు చూశాక.. వాళ్లని తమ రాష్ట్రానికి రప్పించుకోవడమే అసలు టాలెంట్. ఏ రాష్ట్రంలో అడుగుపెడితే బెనిఫిట్ ఉంటుందో చూస్తాయి ఇంటర్నేషనల్ కంపెనీలు. తెలంగాణలో ఉన్న ఆ అవకాశాలను చూపించడానికే ఈ గ్లోబల్ సమిట్, ఈ విజన్ డాక్యుమెంట్. ఈ ముందుచూపుతోనే 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీని టార్గెట్గా పెట్టుకుంది తెలంగాణ.
- Balaraju Goud
- Updated on: Nov 29, 2025
- 9:49 pm