Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎనుముల రేవంత్ రెడ్డి

ఎనుముల రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్‌గా ఎనుముల రేవంత్ రెడ్డి గుర్తింపు సాధించారు. దూకుడు ఆయనకు ప్లస్.. ఓ రకంగా మైనస్ కూడా అదే. తెలంగాణ రాష్ట్రానికి ఆయన రెండో ముఖ్యమంత్రి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకు ముందు తెలంగాణ పీసీసీ చీఫ్‌‌గా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మల్కాజిగిరి నియోజకవర్గ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఆయన.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009-2014 వరకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2004-2018 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు.

రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. బీఏ వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి.. ధివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతా రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె నైమిషా రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.

విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి.. 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తెలంగాణ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇంకా చదవండి

తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు.. రేవంత్ బృందం కీలక ఒప్పందం!

తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కార్మిక ఉపాధి శిక్షణ శాఖ అధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) జపాన్‌లోని రెండు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.

కాంగ్రెస్ పార్టీలో చిత్రాలు, విచిత్రాలు కామన్.. కానీ ఈ స్టోరీ అంతకుమించి..!

తెలంగాణలో రాజకీయాలు మామూలుగా ఉండవు. పదవుల కోసం, పనుల కోసం ఎక్కడికైనా వెళతారు. అందులోనూ ప్రభుత్వంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇక కాంగ్రెస్లో ఇంటర్నల్ రాజకీయాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎవరెవరికి హై కమాండ్ నేతలతో ఎలాంటి పరిచయాలు ఉంటాయో చెప్పలేము. అప్పటివరకు పెద్దగా పరిచయం లేని వ్యక్తులు అకస్మాత్తుగా తెరపైకి వస్తారు.

ఫ్యూచర్ సిటీలో మారుబెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడి.. జపాన్‌లో సీఎం రేవంత్ కీలక ఒప్పందం!

సీఎం రేవంత్‌ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు మారుబేని కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు.

జాతీయస్థాయిలో సత్తా చాటిన తెలంగాణ పోలీసులు.. సీఎం రేవంత్ అభినందనలు

తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాజీలేని కర్తవ్య నిర్వహణతో పోలీసులు ప్రజల్లో నమ్మకాన్ని పెంచారని, ప్రజా పాలనలో ఈ విజయం పోలీసు శాఖ సమిష్టి కృషి ఫలితమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి విజయాలను తెలంగాణ పోలీసులు సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

ధరణిలో లేనిదేంటి..? భూభారతిలో ఉన్నదేంటి? అన్ని వివాదాలకు ఇస్తుందా చెల్లుచీటీ?

కేసీఆర్ మానస పుత్రికల్లో ఒకటైన ధరణి పోర్టల్, తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ధరణి పోర్టల్.. ధరణి పోర్టల్‌ని సూపర్ పాపులర్ స్కీమ్‌గా మారిపోయింది. కానీ.. నిర్వహణా లోపాలు, అవకతవకలు, కొందరి చేతివాటం.. అన్నీ కలిపి ధరణి చట్టాన్ని అత్యంత వివాదాస్పదంగా మార్చేశాయి. దాన్నే ఆసరాగా చేసుకుని, ధరణికి ప్రత్యామ్నాయం పేరుతో జనంలోకెళ్లి రాజకీయం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కొట్టింది. అధికారంలోకి వచ్చీరాగానే కోదండరెడ్డి నేతృత్వంలో కమిటి వేసి.. ధరణిలో లొసుగుల్ని పసిగట్టి.. కొత్త చట్టం భూభారతి రూపకల్పనకు నడుంకట్టింది రేవంత్ సర్కార్.

తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరి దగ్గరకైనా వెళ్తా.. ఎన్ని పర్యటనలైనా చేస్తాః సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరి దగ్గరకైనా వెళ్తా.. ఎన్ని పర్యటనలైనా చేస్తానంటున్న సీఎం రేవంత్.. ఇప్పుడు మరో టూర్ ఫిక్స్ చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన కోసం ఏప్రిల్ 15 రాత్రి బెంగుళూరు ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం ఆయనతో కలిసి వెళ్తున్నారు.

అడవులపైకి బుల్డోజర్లా.. వన్యప్రాణులను చంపేస్తారా.. కంచె గచ్చిబౌలి భూములపై స్పందించిన ప్రధాని మోదీ

చోటే భాయ్‌ ఆప్‌ నే క్యా కియా? పచ్చని అడవిపైకి బుల్డోజర్లను పంపిస్తారా? ప్రకృతిని విధ్వంసం చేస్తారా? వన్యప్రాణులను ప్రమాదంలో పడేస్తారా అంటూ ఫైర్ అయ్యారు బడే భాయ్‌ మోదీ. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అడవులను కూడా అంతం చేస్తోందని మండిపడ్డారు.

Telangana: అధికారం మాదే..! తెలంగాణలో పొలిటికల్ జ్యోతిష్యం.. బీఆర్ఎస్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్..

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర గడిచిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంది. కానీ అప్పుడే రాష్ట్రంలో మళ్లీ అధికారంపై కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఈ క్రమంలో అధికారం మాదేనంటూ కేటీఆర్, హరీష్ పేర్కొంటూ బీఆర్ఎస్ లో జోష్ నింపుతున్నారు.. కాగా.. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.

CM Revanth Reddy: హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి గుడ్‌ న్యూస్ చెప్పారు. వందేళ్ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా డ్రైపోర్ట్‌కు మెట్రో విస్తరణ రూప‌క‌ల్పన చేయాల‌ని అధికారులను సీఎం ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దానికోసం అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..!

మూసీ నదికి తిరిగి ప్రాణం పోసే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఎటువంటి వ్యతిరేకత రాకుండా.. పునరుజ్జీవానికి పునాది పడేలా పకడ్బందీగా ప్లాన్ చేస్తోంది. బాపూఘాట్ వద్ద ప్రతిపాదిత గాంధీ సరోవర్, అలాగే మీర్ అలం ట్యాంక్ పై నిర్మించనున్న ఆధునిక బ్రిడ్జి నమూనాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. మరి.. మూసీపై తెలంగాణ సర్కార్ ఎలా ముందుకు వెళ్లబోతుంది? పునురుజ్జీవానికి పునాది ఎక్కడ పడబోతుంది?

పగోడా, పనికిమాలినోడా.. రూ. 10 కోట్లతో SRH కొంపముంచావ్
పగోడా, పనికిమాలినోడా.. రూ. 10 కోట్లతో SRH కొంపముంచావ్
ఓటీటీలో నితిన్ రాబిన్ హుడ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఓటీటీలో నితిన్ రాబిన్ హుడ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
JEE మెయిన్‌ 2025లో తెలుగోళ్ల సత్తా.. ఈసారి కటాఫ్‌ ఎంతో చూశారా?
JEE మెయిన్‌ 2025లో తెలుగోళ్ల సత్తా.. ఈసారి కటాఫ్‌ ఎంతో చూశారా?
సీఎం చంద్రబాబు 75వ పుట్టిన రోజు..ప్రధాని సహా ప్రముఖల శుభాకాంక్షలు
సీఎం చంద్రబాబు 75వ పుట్టిన రోజు..ప్రధాని సహా ప్రముఖల శుభాకాంక్షలు
బాంద్రా వీధుల్లో రచిన్.. గర్ల్ ఫ్రెండ్ తో వీడియో వైరల్!
బాంద్రా వీధుల్లో రచిన్.. గర్ల్ ఫ్రెండ్ తో వీడియో వైరల్!
మెగా DSC 2025 నోటిఫికేషన్ వచ్చేసింది..! జిల్లాల వారీగా ఖాళీలు ఇవే
మెగా DSC 2025 నోటిఫికేషన్ వచ్చేసింది..! జిల్లాల వారీగా ఖాళీలు ఇవే
వేలు చూపిస్తూ, అసభ్య పదజాలంతో టీమిండియా సీనియర్ ప్లేయర్ హల్చల్
వేలు చూపిస్తూ, అసభ్య పదజాలంతో టీమిండియా సీనియర్ ప్లేయర్ హల్చల్
ఓర్నీ.. ఇది ఆటోనా.. విమానమా.. బిజినెస్‌ క్లాస్‌ను మించి వీడియో
ఓర్నీ.. ఇది ఆటోనా.. విమానమా.. బిజినెస్‌ క్లాస్‌ను మించి వీడియో
ఉపేంద్రకు ఇంత పెద్ద కూతురుందా? హీరోయిన్లు కూడా కుళ్లుకునే అందం..
ఉపేంద్రకు ఇంత పెద్ద కూతురుందా? హీరోయిన్లు కూడా కుళ్లుకునే అందం..
IPL లో మెరిసిన ముగ్గురు.. టీమిండియా జెర్సీకి సన్నాహాలు!
IPL లో మెరిసిన ముగ్గురు.. టీమిండియా జెర్సీకి సన్నాహాలు!