AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎనుముల రేవంత్ రెడ్డి

ఎనుముల రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్‌గా ఎనుముల రేవంత్ రెడ్డి గుర్తింపు సాధించారు. దూకుడు ఆయనకు ప్లస్.. ఓ రకంగా మైనస్ కూడా అదే. తెలంగాణ రాష్ట్రానికి ఆయన రెండో ముఖ్యమంత్రి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకు ముందు తెలంగాణ పీసీసీ చీఫ్‌‌గా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మల్కాజిగిరి నియోజకవర్గ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఆయన.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009-2014 వరకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2004-2018 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు.

రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. బీఏ వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి.. ధివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతా రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె నైమిషా రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.

విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి.. 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తెలంగాణ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇంకా చదవండి

CM రిక్వెస్ట్ తో వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి వెళ్లిన మెగాస్టార్

దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. తెలంగాణను ప్రపంచ వేదికపై నిలబెట్టాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. చిరంజీవి ఆహ్వానాన్ని మన్నించి సమ్మిట్‌లో పాల్గొని, డాక్యుమెంటరీని వీక్షించారు. వారి అనుబంధం, తెలంగాణ భవిష్యత్తు విజన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

  • Phani CH
  • Updated on: Jan 22, 2026
  • 7:33 pm

CM Revanth Reddy- Chiranjeevi: ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి.. ఫోటోస్..

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. చిరంజీవి సైతం ఆ దేశంలోని జ్యూరిక్ లో ఉన్నారని తెలుసుకున్న సీఎం సదస్సుకు రావాలని ఆహ్వానించారు. దీంతో చిరు ఆ సదస్సుకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

CPI: ఖమ్మం ఖిల్లాలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..  బ్రిటిషర్ల ఆలోచనతోనే బీజేపీ ముందుకు సాగుతోందని ఆరోపించారు. పేదల కోసం కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి.. జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొస్తే.. బీజేపీ ఈ పథకాన్ని రద్దు చేసిందని విమర్శించారు. రాజ్యాంగాన్ని చెరబట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు

Telangana: చదువే పెదోడి ఆస్తి.. అక్షర ఆయుధంతోనే సమస్యలు పరిష్కారం.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఆస్తిగా ఇవ్వడానికి భూములు లేవు.. అందుకే నా పేద బిడ్డలకు అక్షర ఆయుధాన్ని అందిస్తున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. విద్య ద్వారానే సామాజిక గౌరవం సాధ్యమని అన్నారు .రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక సాయం వంటి విప్లవాత్మక మార్పులతో విద్యా రంగాన్ని పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు.

కొత్త అజెండాతో విదేశీ పెట్టుబడులే లక్ష్యం.. దావోస్‌ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణకు భారీ విదేశీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. జనవరి 19వ తేదీన స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు సీఎం బృందం వెళ్లనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) వార్షిక సదస్సులో పాల్గొననుంది. ఈ పర్యటనలో తెలంగాణ భవిష్యత్ పారిశ్రామిక దిశను నిర్దేశించే కీలక అజెండాలతో ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది.

హైదరాబాద్ మెట్రోను L&T నుంచి టేకోవర్ చేసుకోని పేర్లను పంపండి.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణం.. ప్రతిపాదనలు, కమిటీ పేర్ల విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి .. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. L&T నుంచి 'మెట్రో నెట్వర్క్' ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ఆ తర్వాత మెట్రో రెండో దశ నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు పంపాలని కోరారు.

ఏ క్షణానైన మోగనున్న మున్సిపల్ ఎన్నికల నగారా.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగబోతోంది. ఈ నేపథ్యంలో క్వార్టర్ ఫైనల్స్ కొట్టాం, రేపటిరోజున సెమీఫైనల్స్ కూడా కొట్టబోతున్నాం.. అని మున్సిపల్ పోరుపై ఆశాజనకంగా ఉంది హస్తం పార్టీ. మొత్తం 117 మున్సిపాలిటీలు.. 6 కార్పొరేషన్లు. 52 లక్షలకు పైగా ఉన్న పట్టణ ఓటర్లే టార్గెట్‌గా ఇవాళ్టి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన సాగనుంది.

ఇది కదా కావాల్సింది.. పంచాయతీలకు సంక్రాంతి గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల

సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గ్రామీణ పరిపాలనను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రూ.277 కోట్ల నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నిర్ణయం తీసుకున్నారు.

Telangana: వనదేవతల చెంత కేబినెట్ భేటీ.. మేడారంలోనే చారిత్రక సమావేశం..!

రాష్ట్ర పాలనలో అరుదైన అధ్యాయానికి తెరలేవనుంది. ఇప్పటివరకు సచివాలయానికే పరిమితమైన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈసారి అడవీ బాట పట్టనుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మల క్షేత్రంలోనే జనవరి 18వ తేదీన కేబినెట్ భేటీ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం.

Telangana: ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. సచివాలయం వేదికగా కీలక ప్రకటన..

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అపరిష్కృతంగా ఉన్న డీఏ ఫైలుపై సంతకం చేయడంతో పాటు ఊహించని విధంగా కోటి రూపాయల ప్రమాద బీమాను ప్రకటించి ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.

AP – TG: పరిష్కారం దిశగా ఏపీ, తెలంగాణ నీటి వివాదాలు..! చంద్రబాబు, రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి మంటలు తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇతర నేతల మాటలు ఎలా ఉన్నా.. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు సామరస్యపూర్వక పరిష్కారమే బెటరని కామెంట్ చేయడం కొత్త సరికొత్త చర్చకు దారి తీస్తోంది. నేతలు.. చర్చలకు సిద్ధమని సంకేతాలివ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Telangana Assembly Live: కృష్ణా, గోదావరి జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. అసెంబ్లీ సమావేశాలు లైవ్

అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అమాంతం హీట్ పెరిగింది. అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇవాళ మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.. హిల్ట్ పాలసీ, కోర్ అర్బన్ ఏరియాపై ఇవాళ చర్చ జరగనుంది.. అలాగే.. మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా, గోదావరి జలాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.