AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎనుముల రేవంత్ రెడ్డి

ఎనుముల రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్‌గా ఎనుముల రేవంత్ రెడ్డి గుర్తింపు సాధించారు. దూకుడు ఆయనకు ప్లస్.. ఓ రకంగా మైనస్ కూడా అదే. తెలంగాణ రాష్ట్రానికి ఆయన రెండో ముఖ్యమంత్రి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకు ముందు తెలంగాణ పీసీసీ చీఫ్‌‌గా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మల్కాజిగిరి నియోజకవర్గ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఆయన.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009-2014 వరకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2004-2018 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు.

రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. బీఏ వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి.. ధివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతా రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె నైమిషా రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.

విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి.. 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తెలంగాణ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇంకా చదవండి

మారబోతున్న భాగ్యనగరం.. ‘మూసీ’ నదికి అదిరిపోయే కొత్త లుక్.. ప్లాన్ చూస్తే షాకే!

హైదరాబాద్ మహానగర ముఖచిత్రాన్ని మార్చేలా ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. భవిష్యత్తు సవాళ్లు, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ఏకంగా లక్షన్నర క్యూసెక్కుల గరిష్ఠ వరద ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా మూసీ నది డిజైన్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు తొలి దశ పనుల అంచనాలు, నిధుల సమీకరణ, అమలు విధానంతో కూడిన సమగ్ర నివేదికను పురపాలక శాఖ ఇటీవల మంత్రివర్గానికి సమర్పించింది.

తెలంగాణ పాలిటిక్స్‌లో ‘11 AM’ హైటెన్షన్: ఒకే ముహూర్తం.. మూడు వేదికలు.. ‘సై’ అంటే ‘సై’ అంటున్న కాంగ్రెస్ – బీఆర్ఎస్!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య నడుస్తున్న ‘డేట్, టైమ్, లొకేషన్’ సవాళ్లు రాష్ట్రంలో పొలిటికల్ హీట్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాయి. నిన్నటివరకు కేవలం ప్రెస్ మీట్లు, ట్వీట్లకే పరిమితమైన విమర్శల పర్వం.. ఇప్పుడు "ఇవాళ ఉదయం 11 గంటల" డెడ్‌లైన్‌కు చేరింది. ముహూర్తం ఒక్కటే అయినప్పటికీ, నేతలు కొట్లాడేందుకు ఎంచుకున్న వేదికలు మాత్రం మూడు కావడం విశేషం. అటు తెలంగాణ భవన్, ఇటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, మరోవైపు గన్ ఫౌండ్రీ అమరవీరుల స్థూపం.. ఎక్కడ చూసినా 11 గంటల సమయం చుట్టూనే ఉత్కంఠ తిరుగుతోంది.

Telangana: ధరణి, భూ భారతి పోర్టళ్లలో అక్రమాలు..! విచారణకు రేవంత్ సర్కార్ ప్రత్యేక కమిటీ

ధరణి, భూభారతి పోర్టళ్లలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఫోరెన్సిక్ ఆడిట్‌లో భద్రతా లోపాలు గుర్తించిన నేపథ్యంలో, బాధ్యులను గుర్తించి చర్యలు సూచించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సాంకేతిక సిఫార్సులు చేయాలని కమిటీకి బాధ్యతలు అప్పగించింది.

రాజకీయానికి శ్రీకారం చుట్టిన నేల.. మిడ్జిల్‌లో సీఎం రేవంత్ భావోద్వేగ పర్యటన..!

ప్రజాప్రతినిధిగా తన రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టిన మిడ్జిల్‌ మండలానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి చేరుకోనున్నారు. తొలి విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు జూలై 4న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. జడ్పీటీసీ సభ్యుడిగా ప్రారంభమైన తన ప్రజా ప్రస్థానం 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.

CM Revanth Reddy: ఒట్టేసి చెబుతున్నా.. ఆ రెండు విషయాలు జరిగే తీరుతాయి: సీఎం రేవంత్ రెడ్డి

ఒట్టేసి మరీ చెబుతున్నా.. మూసీ ప్రక్షాళన అస్సలూ ఆగదని నల్గొండ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 2034 వరకు ఎగిరేది కాంగ్రెస్ జెండాయేనని ఆయన అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించడంతో పాటు బీఆర్ఎస్‌ పదేళ్ల పాలనపై విమర్శలు సంధించారు.

  • Anand T
  • Updated on: Jun 28, 2026
  • 9:44 pm

AI యుగంలో సరికొత్త విప్లవం.. హైదరాబాద్‌లో దేశంలోనే తొలి ‘డేటా సెంటర్ సిటీ’!

సాంకేతిక రంగంలో ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హైదరాబాద్ మహానగరం, ఇప్పుడు మరో సంచలన ప్రాజెక్టుకు వేదిక కాబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకునేందుకు భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా, కేవలం డేటా సెంటర్ల కోసమే ఒక పూర్తి 'డేటా సెంటర్ నగరాన్ని' (Data Center City) అభివృద్ధి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో ఈ ప్రాజెక్ట్ దేశంలోనే ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.

గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా.. గుంపు మేస్త్రీనే అంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద సాధారణ ప్రమాద మరణాలకు రూ.1.25 కోట్ల వరకు, విమాన ప్రమాదాల్లో రూ.3 కోట్ల వరకు బీమా రక్షణ లభించనుంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పథకాన్ని ప్రారంభిస్తూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. “నేను గుంపు మేస్త్రీనే.. మంత్రివర్గమే నా గుంపు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రలు, కేంద్ర మంత్రి సమక్షంలో ఆవిష్కృతం!

కర్ణాటకలోని విజయనగర జిల్లా పరిధిలోని తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో గురువారం ( జూన్ 25, 2026) ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రూ.51 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన 33 కొత్త స్పిల్ వే (క్రస్ట్) గేట్లను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కలిసి అధికారికంగా ప్రారంభించారు.

Telangana Politics: రేవంత్‌ అండ్ కిషన్‌..! మధ్యలో మెట్రో రైల్.. ఎవరి ఎత్తుగడలు వాళ్లవే

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 అంశం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో కలిసి మెట్రో ప్రాజెక్టుపై చర్చించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాంగ్రెస్-బీజేపీ మధ్య అవగాహన రాజకీయాలు నడుస్తున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, రాష్ట్ర అభివృద్ధి కోసమే కలిసి పనిచేస్తున్నామని ఇరు పార్టీలు చెబుతున్నాయి. మెట్రో నుంచి సింగరేణి వరకు వివిధ అంశాలపై మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కుతోంది.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-2కు లైన్ క్లియర్ అవుతోందా..! ఆ గంటన్నరపాటు ఏం జరిగింది..

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు సంబంధించి ఢిల్లీలో జరిగిన కీలక భేటీలు సానుకూల సంకేతాలను ఇస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిశారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన చర్చల్లో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ, రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న తొలి దశ మెట్రోకు సంబంధించిన IRFC రుణం, తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.

తెలంగాణకు రక్షణ రంగం బూస్ట్.. కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ!

న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కీలక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్.. 22 రకాల వస్తువులతో యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్!

తెలంగాణలో విద్యా, క్రీడా రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం (జూన్ 19) హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి సీఎం విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేశారు.

పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి
పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి
ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !
ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !
అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ
అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ
బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా..
బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా..
51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
సీఎం విజయ్ 'జన నాయగన్' సినిమా సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఇదే!
సీఎం విజయ్ 'జన నాయగన్' సినిమా సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఇదే!
మాటలే తూటాలు.. ఏపీలో జోరుగా పక్కా లోకల్‌ పాలిటిక్స్‌
మాటలే తూటాలు.. ఏపీలో జోరుగా పక్కా లోకల్‌ పాలిటిక్స్‌
భారీ రెమ్యునరేషన్ తో 'బిగ్‌బాస్' ఆఫర్ వచ్చింది: జబర్దస్త్ బ్యూటీ
భారీ రెమ్యునరేషన్ తో 'బిగ్‌బాస్' ఆఫర్ వచ్చింది: జబర్దస్త్ బ్యూటీ
చిగుళ్ల నుంచి రక్తస్రావమా? వెంటనే ఈ రక్త పరీక్ష చేయించుకోండి..
చిగుళ్ల నుంచి రక్తస్రావమా? వెంటనే ఈ రక్త పరీక్ష చేయించుకోండి..
గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టమే..
గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టమే..