ఎనుముల రేవంత్ రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్గా ఎనుముల రేవంత్ రెడ్డి గుర్తింపు సాధించారు. దూకుడు ఆయనకు ప్లస్.. ఓ రకంగా మైనస్ కూడా అదే. తెలంగాణ రాష్ట్రానికి ఆయన రెండో ముఖ్యమంత్రి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకు ముందు తెలంగాణ పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మల్కాజిగిరి నియోజకవర్గ లోక్సభ సభ్యుడిగా ఉన్న ఆయన.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009-2014 వరకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2004-2018 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు.
రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. బీఏ వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి.. ధివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతా రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె నైమిషా రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.
విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి.. 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తెలంగాణ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Telangana Global Summit: ప్రపంచాన్ని ఆకర్షించడమే లక్ష్యం..! 2047వైపు రేవంత్ సర్కార్ తొలి అడుగు.. హైలెట్స్ ఇవే
రాజకీయంగా బయట భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు గానీ.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో మాత్రం ఒకే మాట వినిపించింది, ఒకే బాట కనిపించింది. ఐటీ, ఏఐ, క్వాంటం రంగాల్లో హైదరాబాద్ పక్క రాష్ట్రాలతోనే పోటీపడుతోంది. ఒకవిధంగా బెంగళూరుకు గట్టి పోటీ ఇస్తోంది హైదరాబాద్. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలంటే.. దాదాపుగా పెట్టుబడుల్లో మెజారిటీ శాతం రాష్ట్రానికే రావాలి.
- Shaik Madar Saheb
- Updated on: Dec 8, 2025
- 9:49 pm
Telangana Rising Global Summit: ఒక్కరోజే రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం.. జూ ఏర్పాటుకు వంతారా ఎంఓయూ
గుజరాత్లోని జామ్ నగర్లో రిలయన్స్ సంస్థ వంతార పేరుతో అటవీ జంతువుల పరిరక్షణ కోసం అతిపెద్ద జూపార్క్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి తరహా జూపార్క్ తెలంగాణలోనూ ఏర్పాటు చేయనున్నారు. గ్లోబల్ సమ్మిట్లో దీనికి సంబంధించిన ఎంవోయూ జరిగింది.
- Venkatrao Lella
- Updated on: Dec 8, 2025
- 8:25 pm
Telangana Rising Global Summit 2025: క్యూర్, ప్యూర్, రేర్ మోడల్తో తెలంగాణ అభివృద్ది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. క్యూర్ , ప్యూర్, రేర్ మోడల్ తో తెలంగాణ అభివృద్దిలో ముందుకు సాగుతోందని భట్టి పేర్కొన్నారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. కేవలం పెట్టుబడులు ఆకర్షించడానికి సమ్మిట్ పెట్టలేదని.. తమ విజన్ ఏంటో అందరికీ వివరిస్తామని తెలిపారు.
- Shaik Madar Saheb
- Updated on: Dec 8, 2025
- 4:59 pm
CM Revanth Reddy: చైనా, జపాన్ లాంటి పెద్ద దేశాలతోనే మాకు పోటీ.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గ్లోబల్ సమ్మిట్ నేడు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలు, పెట్టుబడిదారులకు అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. తెలంగాణ అభివృద్ది దిశగా వెళ్తుందన్నారు.
- Venkatrao Lella
- Updated on: Dec 8, 2025
- 7:29 pm
Telangana Rising Global Summit 2025: అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోంది: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు మహాత్మాగాంధీ, అంబేద్కర్ స్ఫూర్తి అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. సోనియా, మన్మోహన్ సారథ్యంలో తెలంగాణ కల సాకారం అయిందని.. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందని తెలిపారు. 2047 నాటికి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకున్నామని.. ఆర్థిక వేత్తల అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నామన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Dec 8, 2025
- 3:59 pm
Kishan Reddy: హైదరాబాద్ దేశానికి అతిపెద్ద ఆర్థిక కేంద్రం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మట్ ఘనంగా ప్రారంభమైంది.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించి కీలక ఉపన్యాసం చేశారు. లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోందని అన్నారు. అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయన్నారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Dec 8, 2025
- 5:03 pm
Telangana Global Summit: 2047నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా తెలంగాణ
ప్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై సదస్సును ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు రోజలు పాటు ఈ సదస్సు జరగనుంది.
- Venkatrao Lella
- Updated on: Dec 8, 2025
- 3:50 pm
Telangana: తెలంగాణ ప్రభుత్వ విజన్లో మేము భాగమవుతాం -అక్కినేని నాగార్జున
భారత్ ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల మెగా ఈవెంట్ నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ను మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా ప్రొజెక్ట్ చేస్తోంది. ఫ్యూచర్ సిటీని గ్లోబల్ సిటీగా ప్రపంచానికి పరిచయం చేయబోతుంది. విశ్వనగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడగలదని చూపే సంకల్పంతో ముందుకు సాగుతోంది. 2047 టార్గెట్గా తెలంగాణ అభివృద్ధిపై స్పెషల్ రోడ్మ్యాప్ సిద్ధం చేసింది. 22 ఏళ్ల తర్వాత తెలంగాణ ఎలా ఉండాలో చర్చించే వేదిక సమ్మిట్ అంటోంది రాష్ట్ర ప్రభుత్వం.
- Ram Naramaneni
- Updated on: Dec 8, 2025
- 1:37 pm
Telangana: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధం.. రేవంత్ సర్కార్ లిఖిస్తున్న ఓ కొత్త అధ్యాయం
అంతా సిద్ధమైంది.. మరికొద్దిసేపట్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతుంది. ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. టార్గెట్ 2047.. త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం ఏర్పాట్లు, అతిథుల ఆహ్వానాలు, సెక్యూరిటీ, ఒప్పందాలు.. అన్ని విషయాలపై మినిట్ టు మినిట్.. పాయింట్ టు పాయింట్.. అన్ని మీకు అందించబోతుంది టీవీ9.
- Ram Naramaneni
- Updated on: Dec 8, 2025
- 11:59 am
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం.. వాటి పేర్లు మార్పు..
గ్లోబల్ సమ్మిట్ క్రమంలో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేసేందుకు నగరంలోని రోడ్లకు పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. గ్లోబల్ సమ్మిట్కు అంతర్జాతీయ ప్రతినిధులు వస్తున్న క్రమంలో ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.
- Venkatrao Lella
- Updated on: Dec 8, 2025
- 11:39 am
పోటీ పక్క రాష్ట్రాలతో కాదు.. ప్రపంచ దేశాలతో.. గ్లోబల్ సమ్మిట్కి సర్వం సిద్ధం!
మా పోటీ పక్క రాష్ట్రాలతో కాదు.. ప్రపంచ దేశాలతో అంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. గ్లోబల్ సమ్మిట్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సమ్మిట్ ద్వారా 2047నాటికి 3 ఫైనాన్షియల్ మెగా-గోల్స్ సాధించే లక్ష్యంగా ముందుకెళ్తోంది రేవంత్ ప్రభుత్వం. సమ్మిట్ ద్వారా 3 ఫైనాన్షియల్ మెగా-గోల్స్ సాధించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
- Balaraju Goud
- Updated on: Dec 7, 2025
- 6:48 pm
ప్రపంచ స్థాయి ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యం.. గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధం!
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. 2047నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యంగా సమ్మిట్ నిర్వహించనున్నారు. మొత్తం 1,686 మంది ప్రతినిధులు, 42 దేశాల నుంచి 255 మంది అంతర్జాతీయ డెలిగేట్లు హాజరు కానున్నారు.
- Balaraju Goud
- Updated on: Dec 6, 2025
- 7:58 am