ఎనుముల రేవంత్ రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్గా ఎనుముల రేవంత్ రెడ్డి గుర్తింపు సాధించారు. దూకుడు ఆయనకు ప్లస్.. ఓ రకంగా మైనస్ కూడా అదే. తెలంగాణ రాష్ట్రానికి ఆయన రెండో ముఖ్యమంత్రి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకు ముందు తెలంగాణ పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మల్కాజిగిరి నియోజకవర్గ లోక్సభ సభ్యుడిగా ఉన్న ఆయన.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009-2014 వరకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2004-2018 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు.
రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. బీఏ వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి.. ధివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతా రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె నైమిషా రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.
విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి.. 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తెలంగాణ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇంకా చదవండిహైడ్రాపై తగ్గేదేలే..! హైదరాబాద్కి సరికొత్త అందాలు జోడిస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి సంచలన పోస్ట్
హైడ్రాపై విమర్శలు, హైకోర్టు తీర్పుతో రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ సీఎం రేవంత్రెడ్డి మరోసారి హైడ్రాకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఉప్పల్ నల్లచెరువు పునరుజ్జీవ పనులను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టు చేసిన ఆయన.. చెరువుల పరిరక్షణ అంటే భావితరాల భవిష్యత్తును కాపాడటమేనని పేర్కొన్నారు. హైడ్రా పనితీరును కొనియాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
- Shaik Madar Saheb
- Updated on: Aug 1, 2026
- 9:53 pm
Revanth Reddy: హైడ్రాపై వెనుకంజ వేసే ప్రసక్తే లేదు.. హైకోర్టు ఆదేశాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన ఇదే..
హైడ్రా వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పరిశీలించిన తర్వాత తదుపరి కార్యాచరణపై స్పందిస్తామని తెలిపారు.
- Gopikrishna Meka
- Updated on: Jul 28, 2026
- 5:09 pm
జనావాసాల మధ్యలోనే ఇందిరమ్మ ఇండ్లు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ మహానగరం చుట్టూ క్యూర్ (CURE) పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు ప్రజల పని ప్రదేశాలకు దగ్గరగా, జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం (జూలై 24) క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సీఎం ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
- Prabhakar M
- Updated on: Jul 24, 2026
- 7:04 pm
ధరణి Vs భూభారతి.. 18 లక్షల ఎకరాలకు అసలు ఓనర్ ఎవరు? లెక్కతేలాలి..!
భూమి అనేది ఒక బరువైన సెంటిమెంట్..! బలమైన భావోద్వేగం. అరెకరం భూమి ఉన్నా సన్నకారోడైనా, వందెకరాలున్న భూస్వామైనా... నేలతల్లితో వాళ్లకుండే ఎటాచ్మెంటే వేరు. సగటు రైతు తన భూమిని ఆత్మగా భావిస్తాడు, దాంతో బంధుత్వం కలుపుకుంటాడు. తనది అనుకున్న భూమ్మీద ఎవ్వడొచ్చి చెయ్యి పెట్టినా సహించలేడు. ఓనర్షిప్ ప్రశ్నార్థకమైనప్పుడు.. భూమ్మీద తనకుండే హక్కును లాక్కోవాలని చూస్తే తల్లడిల్లిపోతాడు. ఒక్కోసారి తిరగబడతాడు. భూతగాదాల్లో సొంత కుటుంబాల్నే కాదనుకున్న రక్తచరిత్రలను చాలానే చూశాం. మరి, అవతలోడొచ్చి మన భూమిని రోడ్డు మీదకు లాగితే? ఊరుకుంటాడా? గత ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అదేగా జరిగింది..! ఏకంగా ప్రభుత్వాలనే మార్చేసింది భూ సెంటిమెంట్. ఏపీలో పాస్బుక్కు మీద ముఖ్యమంత్రి ఫోటో ఉండడాన్ని రైతు ఎంత సీరియస్గా తీసుకున్నాడో ఓడిపోయిన పార్టీకి తర్వాత తెలిసొచ్చింది. తెలంగాణలో ధరణి వెబ్సైట్ మీద వ్యతిరేక ప్రచారం పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీని మట్టికరిపించింది. ఇప్పుడు మళ్లీ ఆ ధరణి చట్టాన్నే తవ్వితీసి, మరో ఎలక్షన్కి సై అంటోంది రూలింగ్ పార్టీ. ధరణి భూస్థాపితమైన దాదాపు మూడేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ల్యాండ్మైనింగ్ దేనికోసం..? ప్రభుత్వ అంతరార్థం ఏమై ఉంటుంది..?
- Balaraju Goud
- Updated on: Jul 18, 2026
- 9:40 pm
తెలంగాణ దంగల్ 2029కి సెమీఫైనల్స్ షురూ.. జీరో ఫోబియా.. ఏ పార్టీలకు..?
మొదటి నుంచీ తెలంగాణ రైజింగ్ అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ, డెవలప్మెంట్ సబ్జెక్ట్లో భిన్నాభిప్రాయాలుంటే ఉండొచ్చు. పొలిటికల్గా మాత్రం తెలంగాణ రైజింగే..! దీంతో టాప్గేర్లోకి వచ్చాయి మూడు పార్టీలు. ఎవరి బ్యాటింగ్ వాళ్లు ఆడుతూ, స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నారు. మూడు పార్టీల మధ్య ఒక నంబర్గేమ్ కూడా మొదలైంది. దంగల్ 2028.. కాదు.. కాదు.. తెలంగాణ దంగల్ 2029కి సెమీఫైనల్స్ షురూ అయ్యింది. డీటెయిల్డ్గా చూద్దాం..
- Balaraju Goud
- Updated on: Jul 17, 2026
- 10:46 pm
హరీష్రావు సూచనలతోనే ఈటల రాజేందర్ మాట్లాడారు: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
గోదావరి జలాల వినియోగంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటల అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, ఆయన బీఆర్ఎస్ అజెండాను ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. మేడిగడ్డ, కన్నెపల్లి పంప్హౌస్లో తలెత్తిన సమస్యలను ప్రస్తావిస్తూ, కేసీఆర్ ప్రభుత్వం హయాంలోనే లోపాలు బయటపడ్డాయని సీఎం పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ నివేదికలో కూడా ఈ అంశాలు స్పష్టంగా నమోదయ్యాయని వెల్లడించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 11, 2026
- 6:23 pm
CM Revanth Reddy: 2028లో కాదు.. తెలంగాణలో ఎన్నికలు జరిగేది అప్పుడే.. గెలిచేది మేమే: సీఎం రేవంత్
రాష్ట్రంలో రాబోయే ఎన్నికలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికలు 2028 డిసెంబర్లో జరగవని.. 2029 జూన్లోనే శాసన సభ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. అలాగే మళ్లీ రెండో సారి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టే అధికారంలోకి వస్తుందని, ప్రజా పాలనే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
- Anand T
- Updated on: Jul 10, 2026
- 6:55 pm
మారబోతున్న భాగ్యనగరం.. ‘మూసీ’ నదికి అదిరిపోయే కొత్త లుక్.. ప్లాన్ చూస్తే షాకే!
హైదరాబాద్ మహానగర ముఖచిత్రాన్ని మార్చేలా ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. భవిష్యత్తు సవాళ్లు, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ఏకంగా లక్షన్నర క్యూసెక్కుల గరిష్ఠ వరద ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా మూసీ నది డిజైన్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు తొలి దశ పనుల అంచనాలు, నిధుల సమీకరణ, అమలు విధానంతో కూడిన సమగ్ర నివేదికను పురపాలక శాఖ ఇటీవల మంత్రివర్గానికి సమర్పించింది.
- Prabhakar M
- Updated on: Jul 3, 2026
- 1:45 pm
తెలంగాణ పాలిటిక్స్లో ‘11 AM’ హైటెన్షన్: ఒకే ముహూర్తం.. మూడు వేదికలు.. ‘సై’ అంటే ‘సై’ అంటున్న కాంగ్రెస్ – బీఆర్ఎస్!
తెలంగాణ రాజకీయం ప్రస్తుతం తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య నడుస్తున్న ‘డేట్, టైమ్, లొకేషన్’ సవాళ్లు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ను పీక్స్కు తీసుకెళ్లాయి. నిన్నటివరకు కేవలం ప్రెస్ మీట్లు, ట్వీట్లకే పరిమితమైన విమర్శల పర్వం.. ఇప్పుడు "ఇవాళ ఉదయం 11 గంటల" డెడ్లైన్కు చేరింది. ముహూర్తం ఒక్కటే అయినప్పటికీ, నేతలు కొట్లాడేందుకు ఎంచుకున్న వేదికలు మాత్రం మూడు కావడం విశేషం. అటు తెలంగాణ భవన్, ఇటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, మరోవైపు గన్ ఫౌండ్రీ అమరవీరుల స్థూపం.. ఎక్కడ చూసినా 11 గంటల సమయం చుట్టూనే ఉత్కంఠ తిరుగుతోంది.
- Balaraju Goud
- Updated on: Jul 2, 2026
- 10:49 am
Telangana: ధరణి, భూ భారతి పోర్టళ్లలో అక్రమాలు..! విచారణకు రేవంత్ సర్కార్ ప్రత్యేక కమిటీ
ధరణి, భూభారతి పోర్టళ్లలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఫోరెన్సిక్ ఆడిట్లో భద్రతా లోపాలు గుర్తించిన నేపథ్యంలో, బాధ్యులను గుర్తించి చర్యలు సూచించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సాంకేతిక సిఫార్సులు చేయాలని కమిటీకి బాధ్యతలు అప్పగించింది.
- Prabhakar M
- Updated on: Jul 2, 2026
- 7:21 am
రాజకీయానికి శ్రీకారం చుట్టిన నేల.. మిడ్జిల్లో సీఎం రేవంత్ భావోద్వేగ పర్యటన..!
ప్రజాప్రతినిధిగా తన రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టిన మిడ్జిల్ మండలానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి చేరుకోనున్నారు. తొలి విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు జూలై 4న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. జడ్పీటీసీ సభ్యుడిగా ప్రారంభమైన తన ప్రజా ప్రస్థానం 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.
- Prabhakar M
- Updated on: Jul 2, 2026
- 10:36 am
CM Revanth Reddy: ఒట్టేసి చెబుతున్నా.. ఆ రెండు విషయాలు జరిగే తీరుతాయి: సీఎం రేవంత్ రెడ్డి
ఒట్టేసి మరీ చెబుతున్నా.. మూసీ ప్రక్షాళన అస్సలూ ఆగదని నల్గొండ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 2034 వరకు ఎగిరేది కాంగ్రెస్ జెండాయేనని ఆయన అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించడంతో పాటు బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై విమర్శలు సంధించారు.
- Anand T
- Updated on: Jun 28, 2026
- 9:44 pm