ఎనుముల రేవంత్ రెడ్డి

ఎనుముల రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్‌గా ఎనుముల రేవంత్ రెడ్డి గుర్తింపు సాధించారు. దూకుడు ఆయనకు ప్లస్.. ఓ రకంగా మైనస్ కూడా అదే. తెలంగాణ పీసీసీ చీఫ్‌‌గా ఉన్న రేవంత్ రెడ్డి.. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు తెలంగాణలో పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం మల్కాజిగిరి నియోజకవర్గ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి సీఎం రేసులో ఉన్న వారిలో అగ్రస్థానం రేవంత్‌దే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009-2014 వరకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2004-2018 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు.

రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. బీఏ వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి.. ధివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మేనకోడలు గీతను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది.

విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి.. 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తెలంగాణ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇంకా చదవండి

Dharani Portal: ధరణి స్థానంలో భూమాత.. నిర్వహణ బాధ్యతలు ఎన్​ఐసీకి.. ఉత్తర్వులు జారీ

ఇప్పటి వ‌ర‌కు ధరణి బాధ్యతలు నిర్వహిస్తున్న టెరాసిస్ ప్రైవేటు సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేష‌న‌ల్ ఇన్‌ఫ‌ర్మేటిక్ సెంట‌ర్‌ కి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Revanth Reddy: కష్టమే కానీ.. అసాధ్యం అయితే కాదు.. ఐఎస్‌బీ సమ్మిట్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

ప్రజలతో మమేకమైతే ఏదైనా సాధించవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జీవితంలో రిస్క్​ లేకుండా గొప్ప విజయాలు సాధించలేమని తెలిపారు. శంలోని నగరాలతో కాదు న్యూయార్క్, ప్యారిస్ లాంటి నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలంటూ పేర్కొన్నారు.

Telangana GO 29: అసలేంటి జీవో 29.. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలకు కారణం అదేనా..? సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ

తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని.. జీవో 29ను రద్దు చేయాలని.. అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు పలువురు అభ్యర్ధులను అదుపులోకి తీసుకుని వాహనాల్లో తరలించారు. అయితే.. జీవో 29 అంటే ఏమిటి..? ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు.. వివరాలు తెలుసుకోండి..

Telangana Politics: ‘బుల్డోజర్లను సిద్ధం చేశాం.. అక్కడే ఉంటాం’.. మూసీ ప్రాజెక్టుపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం

మూసీ ప్రాజెక్ట్‌కి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌, బీజేపీ గొంతెత్తుతుంటే.. అధికారపక్షం కూడా వాయిస్‌ పెంచింది. మంత్రులు మాటల తూటాలు పేలుస్తున్నారు. పేదలను రోడ్డున పడేస్తే ఊరుకునేది లేదంటున్న బీఆర్‌ఎస్‌.. బాధితులకు అండగా ఉంటానంటోంది. ప్రాజెక్ట్‌ బడ్జెట్‌ని ప్రజల్లో చర్చకు పెడుతోంది. పునరావాసంతో నిర్వాసితులు సంతృప్తిగా ఉంటే.. బీఆర్‌ఎస్‌ ఓర్చుకోలేకపోతోందని ప్రభుత్వం ఫైరవుతోంది.

Adani to Telangana: తెలంగాణ స్కిల్‌ వర్సిటీకి అదానీ ఫౌండేషన్‌ భారీ విరాళం.. ఎంతో తెలుసా..?

నవంబర్‌ 4వ తేదీ నుంచి స్కిల్ యూనివర్శిటీలో కోర్సులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ప్రాధాన్యం ఉన్న ఆరు కోర్సులతో మొదలు పెట్టి.. క్రమంగా మరిన్ని కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

Hyderabad: వారు అలా చేస్తే.. మూసీ ప్రాజెక్ట్ ఆపేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి 

తాము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవనమని చెప్పారు సీఎం రేవంత్. మూసీ దుర్గంధంలో మగ్గిపోతున్న వారికి మెరుగైన జీవితం ఇవ్వాలని ఈ ప్రాజెక్టు తలపెట్టామన్నారు. మెదడులో విషం నింపుకొని కొందరు మూసీ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

Telangana Congress: తెలంగాణ కేబినెట్ విస్తరణ.. కౌన్ బనేగా మినిస్టర్.. రేసులో ఉన్నది వీరేనా..?

తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. నెలాఖరులోపే ఈ ప్రక్రియ పూర్తి కానున్న నేపథ్యంలో ఆశావహులు లాబీయింగ్ మొదలు పెట్టారు. తమ సీనియారిటీ, సిన్సియారిటీ పరిగణించాలంటూ హైకమాండ్‌కి సంకేతాలు పంపుతున్నారు.

Telangana Politics: ముహూర్తం ఫిక్స్.. ప్రజా ఉద్యమాలకు బీజేపీ, బీఆర్ఎస్ ప్లాన్..! రంగంలోకి దిగనున్న గులాబీ బాస్

నవంబర్‌ నుంచి తగ్గేదేలే అంటోంది కాషాయం పార్టీ. డిసెంబర్‌లో దమ్ము చూపిస్తామంటోంది బీఆర్ఎస్‌. ఎవరెన్ని చేసినా, ఎలాంటి డేట్స్‌ ఫిక్స్‌ చేసుకున్నా ఇచ్చిపడేస్తామంటోంది అధికార కాంగ్రెస్‌. మొత్తంగా... తెలంగాణలో ఇయర్‌ ఎండింగ్‌ పాలిటిక్స్‌ ఇష్యూ కాక రేపుతోంది.

Telangana: సివిల్‌ సర్వెంట్ల కొరతపై రేవంత్ సర్కార్ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ఏంటి..? ఆ ఐఏఎస్‌ల నిర్ణయంపై ఉత్కంఠ..

తెలంగాణ రాష్ట్రాన్ని సివిల్‌ సర్వెంట్ల కొరత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పుడే కాదూ... రాష్ట్ర విభజన టైమ్‌ నుంచి ఐఏఎస్‌, ఐపీఎస్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రిటైర్డ్‌ ఆఫీసర్లను సైతం కొనసాగించాల్సి వస్తోందంటే సిచ్యువేషనల్‌ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అసలు రాష్ట్రానికి ఎందుకీ సమస్య...? గత బీఆర్ఎస్ ప్రభుత్వం సివిల్‌ సర్వెంట్ల కొరతపై ఏం చేసింది...? ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేయబోతోంది...?

VLF Radar Station: దేశ భద్రత వేరు.. రాజకీయాలు వేరు.. నేవీ రాడార్‌ సెంటర్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ శంకుస్థాపన..

రాడార్‌పై రాజకీయాలొద్దు. దేశ భద్రత వేరు.. రాజకీయాలు వేరు. ఇవీ దామగుండం నేవీ రాడార్ సెంటర్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు. ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో ఉపయోగమన్న రాజ్‌నాథ్.. రాడార్ స్టేషన్ నిర్మాణంలో నేవీకి పూర్తిగా సహకరిస్తామని సీఎం రేవంత్ తెలిపారు.

Radar Station: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంతో దామగుండం.. అగ్ని గుండంలా మారబోతుందా..?

భారత నావికాదళం 14 ఏళ్ల ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. ఇవాళ (అక్టోబర్ 15) వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ స్టేషన్‌కు ముఖ్యమంత్రి రేవంత్​ సమక్షంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శంకుస్థాపన చేయనున్నారు.

CM Revanth Review: రాబడులు ఎలా పెంచాలి..? ఖజానా నిండేదెలా..? కసరత్తు మొదలు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వసూళ్ల పెంపుపై దృష్టి సారించింది. వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్లు, రవాణా వంటి అన్ని శాఖల నుండి లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం అందాలన్నదే లక్ష్యంగా పెట్టుకుంది.

Telangana: రుణమాఫీకి మరో డెడ్‌లైన్‌.. కాంగ్రెస్‌‌లో డిసెంబర్‌ 9 సెంటిమెంట్..! ఆ నేతల నోట అదే మాట..

రైతే రాజు.. రైతు రుణం మా బాధ్యత.. రైతుల పంట బీమా మా ప్రామిస్.. అంటూ రైతు పాట రిపీటెడ్‌గా పాడుతోంది కాంగ్రెస్ పార్టీ. రుణమాఫీ సబ్జెక్ట్‌లో ఆశించినన్ని మార్కులు పడలేదన్న అభిప్రాయాల్ని తుడిచిపెట్టడానికి శాయశక్తులా కృషి చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. అందుకే.. రుణమాఫీపై అసంతృప్తిగా ఉన్న రైతులకు డిసెంబర్‌9ని డెడ్‌లైన్‌గా విధించిందా..? రేవంత్ టీమ్ పదేపదే చెబుతున్న మాఫీ మాటల్లో అంతరార్థం అదేనా..?

Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ బిజీ.. వరుసగా కేంద్రమంత్రులతో భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ బిజీ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి పనులు, పెండింగ్ నిధులకు సంబంధించిన విషయాలపై డిస్కస్ చేసేందుకు వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. మరి ఎవరితో ఏయే అంశాలపై చర్చించారో తెలుసుకుందాం..చ

మావోయిస్టు ముక్త్‌ భారత్‌‌కు డెడ్‌లైన్‌ ఫిక్స్! సీఎంలతో అమిత్ షా దిశానిర్దేశం.. హాజరు కానున్న చంద్రబాబు, రేవంత్‌

వరుస ఎన్‌కౌంటర్లతో డైలీ హెడ్‌లైన్స్‌. మావోయిస్టులకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు డెడ్‌ లైన్స్‌. అదే ఆపరేషన్‌ కగార్‌. టార్గెట్‌..! మావోయిస్టు ముక్త్‌ భారత్‌. డెడ్‌లైన్‌ 2026.