![ఎనుముల రేవంత్ రెడ్డి](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/11/revanth-reddy-150-150.png)
ఎనుముల రేవంత్ రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్గా ఎనుముల రేవంత్ రెడ్డి గుర్తింపు సాధించారు. దూకుడు ఆయనకు ప్లస్.. ఓ రకంగా మైనస్ కూడా అదే. తెలంగాణ పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి.. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్కు తెలంగాణలో పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం మల్కాజిగిరి నియోజకవర్గ లోక్సభ సభ్యుడిగా ఉన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి సీఎం రేసులో ఉన్న వారిలో అగ్రస్థానం రేవంత్దే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009-2014 వరకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2004-2018 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు.
రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. బీఏ వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి.. ధివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మేనకోడలు గీతను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది.
విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి.. 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తెలంగాణ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Niti Aayog Meeting: ఇవాళ ఢిల్లీలో నీతి ఆయోగ్ కీలక భేటీ.. బాయ్కాట్ చేస్తున్న సీఎంలు ఎవరు?
ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో నీతి ఆయోగ్ కీలక భేటీ కానుంది. అయితే.. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతుండగా, కొందరు సీఎంలు బాయ్కాట్ చేస్తుండడం హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ.. నీతి ఆయోగ్ భేటీకి హాజరయ్యే ముఖ్యమంత్రులు ఎవరు?.. బాయ్కాట్ చేస్తున్న సీఎంలు ఎవరు?
- Balaraju Goud
- Updated on: Jul 27, 2024
- 7:15 am
Telangana: ధరణి సమస్యలపై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష.. కీలక ఆదేశాలు..
ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్లో తలెత్తిన సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్నారు. సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుల పట్టాదారు పాసుబుక్కులకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
- Prabhakar M
- Updated on: Jul 26, 2024
- 7:56 pm
Hyderabad: పింక్ బ్రాండ్కి చెక్ పెడుతున్న సీఎం రేవంత్.. కాంగ్రెస్ మార్క్ మార్పుకు రంగం సిద్ధం!
హైదరాబాద్ మహా నగరంపై పింక్ బ్రాండ్ని చెరిపేసి, మూడు రంగుల మార్కు, మార్పు చూపించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారా? బడ్జెట్లో హైదరాబాద్కు హై ప్రయారిటీ, వేల కోట్ల కుమ్మరింపు దానిలో భాగమేనా? మార్పు మంత్రంతో హమారా షహర్లో ఎలాంటి మార్పులు రానున్నాయి?
- Balaraju Goud
- Updated on: Jul 26, 2024
- 8:14 am
NITI Aayog Meeting: కేంద్ర బడ్జెట్పై ఇండియా కూటమి సీఎంల కన్నెర్ర.. రేవంత్ రెడ్డి, స్టాలిన్ బాటలోనే మమతా బెనర్జీ..
కేంద్ర బడ్జెట్పై కన్నెర్ర చేస్తున్న ఇండియా కూటమి ముఖ్యమంత్రులు... నీతి ఆయోగ్ మీటింగ్ని బాయ్కాట్ చేయడమే కాదు, అదే రోజు పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునివ్వడం హాట్టాపిక్గా మారింది.
- Shaik Madar Saheb
- Updated on: Jul 25, 2024
- 9:37 pm
KCR: ఈ రంగాలపై ప్రభుత్వం పాలసీ ఏంటి.. బడ్జెట్పై కేసీఆర్ కౌంటర్..
తెలంగాణ బడ్జెట్పై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. భట్టి పద్దు బడ్జెట్లాగా లేదు.. రాజకీయ ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు. బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందన్నారు. భట్టి విక్రమార్క బడ్జెట్ను నొక్కి నొక్కి చెప్పడం తప్ప వాస్తవం లేదన్నారు. రాష్ట్రం మీద, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద తమకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందన్నారు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం లేదని విమర్శించారు. ప్రతి ఒక్క అంశాన్ని కూలంకశంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసే బడ్జెట్ ఇది అని కౌంటర్ ఇచ్చారు.
- Srikar T
- Updated on: Jul 25, 2024
- 3:31 pm
Telangana Budget: అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. అయితే సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత పదేళ్ల అస్తవ్యస్త పాలనకు ప్రజలు చరమగీతం పాడామన్నారు.
- Balaraju Goud
- Updated on: Jul 25, 2024
- 12:41 pm
Telangana Budget: తెలంగాణ బడ్జెట్కు రేవంత్ కేబినెట్ ఆమోదం.. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి
తెలంగాణ బడ్జెట్కు రేవంత్ రెడ్డి కేబినెట్ ఆమోదం తెలిపింది. శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024- 25 వార్షిక సంవత్సరం బడ్జెట్ ప్రతులను ఉపముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు.
- Balaraju Goud
- Updated on: Jul 25, 2024
- 12:07 pm
Telangana Budget: తెలంగాణ అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్.. శాసనసభలో భట్టి, కౌన్సిల్లో శ్రీధర్బాబు
తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణ బడ్జెట్ సుమారు 3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశమై.. తెలంగాణ బడ్జెట్ 2024-25కు ఆమోదం తెలుపనుంది.
- Balaraju Goud
- Updated on: Jul 25, 2024
- 7:55 am
Telangana: అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్.. బడ్జెట్ రోజు హాజరుపై వ్యూహం ఇదేనా.?
అసెంబ్లీకి కేసీఆర్ రావడం కొత్త కాదు కదా అని షాక్ అవుతున్నారా? ఆయన అసెంబ్లీకి కొత్తేమీ కాదు కానీ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి అడుగుపెట్టడం మాత్రం మొదటిసారి. ఉద్యమ సమయంలో కేసీఆర్ అసెంబ్లీలో ప్రసంగాలను చాలామంది విన్నారు. ఆయన ప్రసంగాలు అన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఉండేవి. ఇక 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో పదేళ్లపాటు అసెంబ్లీలో అనేక అంశాలపై కొన్ని వందల గంటలు మాట్లాడారు.
- Rakesh Reddy Ch
- Updated on: Jul 24, 2024
- 8:28 pm
Telangana: ‘అసెంబ్లీలో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తాం’.. కేంద్ర బడ్జెట్పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
కాంగ్రెస్, బీజేపీలకు చెరో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిపిస్తే.. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేపు పార్లమెంటులో కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని కోరారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంతో మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రాహుల్ గాంధీ తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడరా? అని ప్రశ్నించారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై సీఎం రేవంత్.. రాహుల్ గాంధీతో పార్లమెంటులో మాట్లాడించాలన్నారు. అలాగే ప్రధాని కార్యాలయం ముందు కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేయాలన్నారు.
- Srikar T
- Updated on: Jul 23, 2024
- 6:52 pm
CM Revanth: తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది.. బడ్జెట్పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల కక్ష పూరితంగా వ్యవహరించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 18సార్లు తాము మంత్రుల బృందంతో కలిసి రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి సమస్యలు తీర్చాలని కేంద్ర మంత్రులను కోరినట్లు తెలిపారు. చాలా సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర సమస్యలపై వివరించామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై స్పందించారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ది కోసం కేంద్రం ఆలోచన చేయడం లేదన్నారు.
- Srikar T
- Updated on: Jul 23, 2024
- 6:02 pm
Telangana: గుడ్ న్యూస్.. తెలంగాణలో ప్రతి మండలానికి ఓ ఇంటర్నేషనల్ స్కూల్..!
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులపై సీఎం రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అందులో భాగంగానే మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించామని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న తరువాత అక్కడి లాబీలో భట్టి మీడియా చిట్ చాట్లో మాట్లాడారు విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని స్పష్టం చేశారు.
- Srikar T
- Updated on: Jul 23, 2024
- 4:09 pm
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమయ్ాయయి.. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు తొలిరోజు సభ్యులు లాస్యనందిత మృతికి సంతాపం తెలపనున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించనుంది..
- Shaik Madar Saheb
- Updated on: Jul 23, 2024
- 11:11 am
Telangana: రేపే అసెంబ్లీ సమావేశాలు.. తొలిసారి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరు..
తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకాబోతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. జూలై 23 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో ముందుగా గవర్నర్ ప్రసంగం ఉండనుంది. జూలై 25న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది సీఎం రేవంత్ సర్కార్. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు బిజీబిజీగా ఉన్నారు. 25న అసెంబ్లీకి హాజరై తెలంగాణ బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క.
- Srikar T
- Updated on: Jul 22, 2024
- 10:08 pm
CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్, మంత్రుల బృందం బిజీబిజీ.. ఈ అంశాలే అజెండాగా పర్యటన..
అటు పాలనాపరమైన భేటీలు.. ఇటు పార్టీపరమైన భేటీలు.. మొత్తంగా ఢిల్లీ టూర్లో తెలంగాణ సీఎం రేవంత్ బిజీబిజీగా గడిపారు. హస్తినలో ముఖ్యమంత్రి సహా మంత్రుల బృందం చాలామందితే కలిసింది. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. వరుసగా కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారు. కేంద్రమంత్రులను కలిసిన సీఎం రేవంత్ బృందం.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు. జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కలిసిన సీఎం రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని వివరించారు.
- Srikar T
- Updated on: Jul 22, 2024
- 8:57 pm