ఎనుముల రేవంత్ రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్గా ఎనుముల రేవంత్ రెడ్డి గుర్తింపు సాధించారు. దూకుడు ఆయనకు ప్లస్.. ఓ రకంగా మైనస్ కూడా అదే. తెలంగాణ రాష్ట్రానికి ఆయన రెండో ముఖ్యమంత్రి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకు ముందు తెలంగాణ పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మల్కాజిగిరి నియోజకవర్గ లోక్సభ సభ్యుడిగా ఉన్న ఆయన.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009-2014 వరకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2004-2018 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు.
రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. బీఏ వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి.. ధివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతా రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె నైమిషా రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.
విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి.. 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తెలంగాణ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇదేం పద్దతి.. సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారు.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆషామాషీగా IAS కాలేరని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుందన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పలు జిల్లాల కలెక్టర్లపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు కలెక్టర్లు హెడ్క్వార్టర్స్లో ఉండడం లేదన్నారు.
- Balaraju Goud
- Updated on: Mar 3, 2026
- 11:48 pm
శానిటేషన్ నుంచి ఫుడ్ సేఫ్టీ వరకు.. స్ట్రీట్ లైట్స్ నుంచి వాటర్ హార్వెస్టింగ్ వరకు తేడా వస్తే ఊరుకునేదీలేదుః సీఎం రేవంత్
తెలంగాణలో పట్టణాభివృద్ధికి మరింత వేగం.. కోర్ అర్బన్ రీజియన్లో సమగ్ర మార్పుల దిశగా అడుగులు.. అర్భన్ డెవలెప్మెంట్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. సచివాలయంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్యం నుంచి ఫుడ్ సేఫ్టీ వరకు.. స్ట్రీట్ లైట్స్ నుంచి వాటర్ హార్వెస్టింగ్ వరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
- Balaraju Goud
- Updated on: Feb 28, 2026
- 7:32 am
CM Revanth Reddy : దేశం నుంచి ఒకే ఒక్కరు.. సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో మరొక గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థ హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించేందుకు అధికారిక ఆహ్వానం అందింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక సదస్సుకు భారత్ నుంచి ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రమే ఆహ్వానం అందుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
- Prabhakar M
- Updated on: Feb 22, 2026
- 10:04 pm
టార్గెట్ ఫిక్స్.. AI రంగంలోకి అదానీ రాయల్ ఎంట్రీ.. విశాఖ తర్వాత నెక్ట్స్ స్టాప్ హైదరాబాదే..?
అదానీ, గూగుల్, చంద్రబాబు.. ఈ ముగ్గురి మెగా కాంబినేషన్తో వచ్చిందే విశాఖ డేటా సెంటర్. ఇప్పుడు సేమ్ ఈక్వేషన్ రిపీట్. కాకపోతే చిన్న కరెక్షన్. అదానీ, మైక్రోసాఫ్ట్, రేవంత్రెడ్డి.. ఇది కూడా బ్లాక్బస్టర్ కాంబినేషన్ కాబోతోంది. అదానీ అనౌన్స్ చేసిన 9 లక్షల కోట్ల రూపాయల ప్రత్యక్ష పెట్టుబడుల్లో హైదరాబాద్కు వాటా దక్కబోతోంది.
- Balaraju Goud
- Updated on: Feb 18, 2026
- 6:45 am
CM Revanth Reddy: అధికారుల పనితీరుపై రేవంత్ రెడ్డి సీరియస్! క్లాస్ పీకిన సీఏం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమీక్షా సమావేశంలో అధికారులకు "క్లాస్ పీకారు". వారి పనితీరు మెరుగుపరుచుకోవాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై హెచ్చరించారు. ప్రజలకు సేవలను మెరుగుపరచడంలో అలసత్వం వహించవద్దని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఎం కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు.
- Phani CH
- Updated on: Feb 17, 2026
- 8:30 pm
CM Revanth Reddy: పొద్దున్నే ఫీల్డ్లో లేపోతే పోస్ట్ ఊస్టింగే.. అధికారులకు సీఎం సీరియస్ వార్నింగ్!
పనితీరు సరిగా లేకపోయినా, చేసే పనుల్లో జాప్యం జరిగినా పోస్ట్లు ఊడిపోతాయని మున్సిపల్ అధికారులు, సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 3 కార్పొరేషన్లలో శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టాం.. త్వరలో ప్రతి జోన్లో పర్యటిస్తామన్నారు. రోడ్లు శుభ్రంగా లేకపోతే అధికారులను సస్పెండ్ చేస్తామన్నాని తెలిపారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు పొద్దునే ఫీల్డ్లో ఉండాలని స్పష్టం చేశారు.
- Prabhakar M
- Updated on: Feb 17, 2026
- 4:45 pm
Telangana Election Results and Winners 2026 LIVE: కొత్తగూడెంలో ఉత్కంఠ.. కేటీఆర్ ఆఫర్కు సీపీఐ ఓకే అంటుందా..?
Telangana Municipal Election Results and Winners 2026 LIVE Updates in Telugu: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు విడదుల అవుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ దూకుడు చూపిస్తుంది. మరికొన్ని చోట్ల హంగ్ ఏర్పడింది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో కల్వకుంట్ల కవితకు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలు షాక్ ఇచ్చారు.
- Krishna S
- Updated on: Feb 13, 2026
- 10:01 pm
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, స్థానిక సమస్యల పరిష్కారానికి స్థానిక నాయకులకు ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్, మోడీ వంటి నాయకులను పెళ్లి పెద్దలతో పోల్చారు. భూపాలపల్లి అభివృద్ధి కోసం గండ్ర సత్తన్న లాంటి స్థానిక ప్రతినిధులు అవసరమని, వారే అభివృద్ధి పనులను చేపట్టగలరని ఆయన స్పష్టం చేశారు.
- Phani CH
- Updated on: Feb 8, 2026
- 10:38 pm
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మత ప్రాతిపదిక రిజర్వేషన్లు.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్
తెలంగాణను రక్షించుకోవాలంటే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకే ఓటు వేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. మెదక్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన... కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరుపై ఫైర్ అయ్యారు. ముఖ్యంగా మత ఆధారిత రిజర్వేషన్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.
- Balaraju Goud
- Updated on: Feb 6, 2026
- 8:44 pm
CM Revanth Reddy: KCR లా మాట ఇచ్చి తప్పడాలు ఉండవు.. గుళ్లను అభివృద్ధి చేస్తాం
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలోని ఆలయాల అభివృద్ధికి భారీ ప్రణాళికను వెల్లడించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న దేవాలయాలను రూ. 4000-5000 కోట్లతో పర్యాటక, పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కేసీఆర్ మాదిరిగా మాట ఇచ్చి మోసం చేయబోనని స్పష్టం చేశారు.
- Phani CH
- Updated on: Feb 5, 2026
- 9:02 pm
బీఆర్ఎస్ జాతిపిత కామెంట్స్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ రియాక్ట్.. ఏమన్నారంటే?
మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయ మరింతగా హీటెక్కుతోంది. జాతిపిత కామెంట్ తెలంగాణలో రాజకీయ రచ్చకు కారణమవుతోంది. బీఆర్ఎస్ చేస్తున్న జాతిపిత ప్రచారంపై సీఎం రేవంత్ తనదైన శైలిలో విరుచుపడ్డారు. అలాంటి పనులు చేసిన వాళ్లు జాతిపిత అవుతారా ? అంటూ మండిపడ్డారు. అయితే సీఎం కామెంట్స్కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది కారు పార్టీ.
- Balaraju Goud
- Updated on: Feb 4, 2026
- 9:21 pm
Rythu Bharosa: పీఎం కిసాన్, రైతు భరోసా నిధుల విడుదలకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి ఎప్పుడంటే..? ముహూర్తం ఫిక్స్
తెలంగాణలోని రైతులకు డబుల్ బొనాంజా అందనుంది. త్వరలోనే భారీగా అకౌంట్లోకి డబ్బులు జమ కానున్నాయి. పీఎం కిసాన్, రైతు భరోసా నిధులు ఒకేసారి విడుదల కానున్నాయని తెలుస్తోంది. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తవ్వడంతో త్వరలోనే పీఎం కిసాన్ విడుదల చేయనుందని తెలుస్తోంది.
- Venkatrao Lella
- Updated on: Feb 4, 2026
- 7:11 am