ఎనుముల రేవంత్ రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్గా ఎనుముల రేవంత్ రెడ్డి గుర్తింపు సాధించారు. దూకుడు ఆయనకు ప్లస్.. ఓ రకంగా మైనస్ కూడా అదే. తెలంగాణ రాష్ట్రానికి ఆయన రెండో ముఖ్యమంత్రి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకు ముందు తెలంగాణ పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మల్కాజిగిరి నియోజకవర్గ లోక్సభ సభ్యుడిగా ఉన్న ఆయన.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009-2014 వరకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2004-2018 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు.
రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. బీఏ వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి.. ధివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతా రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె నైమిషా రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.
విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి.. 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తెలంగాణ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై రేవంత్ ఫోకస్.. అనుమతుల కోసం కేంద్రమంత్రి ఖట్టర్తో కీలక భేటీ!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కీలక ప్రాజెక్టులకు కేంద్ర అనుమతుల అంశాలపై వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ను కలిసి హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 ప్రాజెక్టుకు తక్షణ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
- Gopikrishna Meka
- Updated on: Jun 12, 2026
- 1:28 pm
PM Modi: ప్రపంచం ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంటోంది: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్ సమావేశంలో 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంపై చర్చించారు. మానవాభివృద్దిపై దృష్టి పెట్టాలని మోదీ పిలపునిచ్చారు. ఉపాధి అవకాశాలు పెరగాలంటే యువత నైపుణ్యాలను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో జీడీపీపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు మోదీ.
- Shaik Madar Saheb
- Updated on: Jun 11, 2026
- 9:21 pm
Telangana: మహిళా శక్తికి పట్టాభిషేకం.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..
మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీకి అద్దె బస్సులు ఇచ్చే వినూత్న పథకంలో భాగంగా రెండో విడత కింద 553 కొత్త బస్సులను మంగళవారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రతి బస్సుపై మహిళా సంఘాలకు నెలకు రూ.69 వేల వరకు అద్దె రానుంది. అంతేకాకుండా పలు కీలక నిర్ణయాలు ప్రకటించనున్నారు.
- Prabhakar M
- Updated on: Jun 9, 2026
- 1:14 pm
గ్లోబల్ సిటీ వైపు గ్రేటర్ అడుగులు.. పేదలకు అన్యాయం జరగనివ్వం.. మూసీ కాలుష్యాన్ని వదిలిపెట్టం: సీఎం రేవంత్
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలనను మరింత సులభతరం చేసేందుకు ఉప్పల్ భగాయత్ ఫేజ్-3 లోని 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.98 కోట్లతో నిర్మించనున్న నూతన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు రూ.960 కోట్లతో ఏఓసీ (AOC) సెంటర్లో ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణం, రూ.416 కోట్లతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్లో 6 వరుసల ఫ్లైఓవర్ నిర్మాణం, రూ.37.50 కోట్లతో 100 పడకల మల్కాజిగిరి జిల్లా ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు.
- Balaraju Goud
- Updated on: Jun 7, 2026
- 9:31 pm
తేల్చుకుందాం రా..! రెండేళ్లు Vs పదేళ్లు.. ఇష్యూ ఏదైనా బస్తీ మే సవాల్
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తన రెండున్నరేళ్ల పాలనను బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో పోల్చుతూ బహిరంగ సవాల్ విసిరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం, ధాన్యం కొనుగోళ్లు, నీటి పంపకాల వంటి కీలక అంశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఆరోపణలు-ప్రత్యారోపణలు ముదురుతున్నాయి. 2028 ఎన్నికల లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు ప్రజా సమస్యలనే అస్త్రంగా చేసుకుని రాజకీయ సమరానికి సిద్ధమవుతున్నాయి.
- Shaik Madar Saheb
- Updated on: Jun 6, 2026
- 9:56 pm
చుక్క నీరు వదులుకోం.. చిల్లర పంచాయతీలు చేయం.. జల హక్కుల్లో రాజీ పడం: సీఎం రేవంత్ రెడ్డి!
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా, పెండింగ్లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు.
- Balaraju Goud
- Updated on: Jun 5, 2026
- 8:34 pm
పొలం గట్టుపై పొలిటికల్ వార్.. పిచ్చెక్కిస్తున్న పార్టీల లడాయి.. తెలంగాణలో ‘రైతే రాజు’కీయం!
జూన్ 2 తెలంగాణ రాష్ట్రానికి 12వ పుట్టినరోజు. ఆవిర్భావ వేడుకలు ఊరూవాడా అట్టహాసంగా ముగిశాయి. రాజకీయ పార్టీలైతే సంబరాలతో పాటు పనిలో పనిగా చిచ్చుబుడ్లు కూడా వెలిగించుకున్నాయి. పాత చిచ్చులను కొత్తగా వెలిగించుకుని, ఆ మంటల నుంచి చలి కాచుకుంటున్నాయి. ఒక పార్టీపై మరొకటి, ఇష్యూ బేస్డ్గా చురకలంటించుకుని, చిత్తశుద్ధిని లెక్కలేసుకుంటున్నాయి. ముఖ్యంగా మూడు ప్రధాన అంశాలు మూడు పార్టీల మధ్య దూరాన్ని బాగా పెంచేశాయి. విచిత్రం ఏంటంటే, ఆ మూడూ రైతుకు సంబంధించిన టాపిక్లే. నాగలి పట్టకపోయినా, దుక్కి దున్నకపోయినా, సాగు చెయ్యకపోయినా, పార్టీ కండువాలేసుకుని రైతు సంక్షేమం కోసం వీళ్లు పడే పాట్లు చూస్తే, ఔరా అనిపిస్తోంది.
- Balaraju Goud
- Updated on: Jun 3, 2026
- 9:50 pm
ఎన్ని ఇబ్బందులున్నా రైతుల నుంచి చివరి గింజ వరకు కొంటాం: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేసిన ఆయన, ఇప్పటివరకు పంట కొనుగోళ్లపై రూ.82 వేల కోట్లు చెల్లించామని తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో ప్రజాస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Jun 2, 2026
- 11:37 am
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ బిగ్ అనౌన్స్మెంట్.. వారందరికీ పండుగే..
ఇందిరమ్మ ఇళ్లపై సీం రేవంత్ కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త తెలిపారు. కొత్తగా మరో రెండున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఈ ప్రకటన చేశారు.
- Venkatrao Lella
- Updated on: Jun 1, 2026
- 10:09 pm
పట్టణ పేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల కానుక.. ఎప్పటి నుంచంటే.. ?
పట్టణ ప్రాంతాల్లోని పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అత్యాధునిక ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో తొలివిడతగా మంజూరు చేసిన లక్ష ఇళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.
- Balaraju Goud
- Updated on: May 30, 2026
- 1:23 pm
‘జమీందారీ పోకడలు పక్కన పెట్టండి.. జనంలోకి వెళ్లండి’.. లీడర్లకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్!
ఇప్పటి వరకు పాలనపై ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టే పనిలో పడ్డారు. మెయిన్గా పార్టీపైనా, లీడర్లపైనా దృష్టి పెట్టారు. కొందరు నేతల తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. 'జమీందారీ పోకడలు పక్కన పెట్టండి.. జనంలోకి వెళ్లండి' అంటూ గట్టిగానే మాట్లాడారు. తనతో సహా ఎవరికీ మినహాయింపులు లేవంటూ కఠిన నిబంధనలు పెట్టారు. మరి పీఏసీ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆ కీలక వ్యాఖ్యలు ఏంటి? ఎమ్మెల్యేలకు ఇచ్చిన టార్గెట్ ఏంటి?
- Balaraju Goud
- Updated on: May 30, 2026
- 8:02 am
Telangana: పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య.. ఫీజుల బాదుడు నుంచి ఊరట..!
Telangana Public Schools: ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (TPS)’ అనే కొత్త విద్యా విధానాన్ని తీసుకొస్తోంది. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్లో విద్య, కార్పొరేట్ స్థాయి వసతులు, అల్పాహారం, భోజనం, స్నాక్స్తో కూడిన సెమీ రెసిడెన్షియల్ విధానం ఇందులో ప్రత్యేకత. ఒక్కో పాఠశాలలో సుమారు 1,500 మంది విద్యార్థులు చదివేలా రూపకల్పన చేయగా, రాష్ట్రవ్యాప్తంగా 99 నియోజకవర్గాల్లో ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
- Vidyasagar Gunti
- Updated on: May 28, 2026
- 5:36 pm