AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: ఇదేంది మావ సీన్‌ రివర్స్‌ అయ్యింది.. ఈమె ప్లాన్‌ అట్టర్‌ప్లాప్‌.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..!

Income Tax: ఈమె ప్లాన్‌ అట్టర్‌ప్లాప్‌.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. ఇదేంది మావ సీన్‌ రివర్స్‌ అయ్యింది! ఈ మహిళ ప్లాన్‌ మామూలుగా లేదుగా. అనుకున్నది ఒక్కటి.. అయ్యిందొక్కటి. ఈమె చేసిన ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌ అయ్యింది. చివరకు ఉత్తపుణ్యాన రూ.50 లక్షలు బొక్కపడింది. ఏకంగా ఆదాయపు పన్ను శాఖనే బురిడి కొట్టించాలనుకుంది. పాపం చివరకు ఏమైందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

Income Tax: ఇదేంది మావ సీన్‌ రివర్స్‌ అయ్యింది.. ఈమె ప్లాన్‌ అట్టర్‌ప్లాప్‌.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..!
Income Tax
Subhash Goud
|

Updated on: Mar 04, 2026 | 5:58 PM

Share

Income Tax: ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు చాలా చురుగ్గా ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి ఆర్థిక వ్యవహారాలపై కన్నేసి ఉంచుతుంది. ఇటీవల కాలం నుంచి పన్ను ఎగవేతదారుల సంఖ్య పెరిగిపోవడం, నల్లధనం పెరుగుతుండటంతో మరింత అప్రమత్తమైపోయింది. దీంతో వీటిని గుర్తించడంలో చాలా అప్రమత్తంగా ఉంది. ఆదాయం లేదా లావాదేవీలలో అసాధారణ పెరుగుదల ఉంటే, అది త్వరలోనే దాని దృష్టికి వస్తుంది. వారిని గుర్తించడానికి ఈ శాఖ AI వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. ఇటీవల ఒక మహిళ బీమా ప్రీమియంలు చెల్లించడానికి తన ప్రకటించిన ఆదాయం కంటే పది రెట్లు ఎక్కువ మొత్తాన్ని ఉపయోగించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది ఐటీ శాఖ దృష్టిని ఆకర్షించింది. కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన పాఠం కావచ్చు.

ప్రతిభ అనే మహిళ ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి తన ఐటీఆర్‌లో తన వార్షిక ఆదాయం రూ.4.81 లక్షలుగా ప్రకటించారు. అయితే ఆమె ఆ సంవత్సరం రూ.50 లక్షల బీమా ప్రీమియం చెల్లించింది. ఇది రెవెన్యూ శాఖ దృష్టికి వచ్చింది.

ఇది కూడా చదవండి: పీఎం కిసాన్‌లో రైతుల పేర్లను తొలగిస్తున్న కేంద్రం.. 22వ విడత ఆలస్యం అందుకేనా?

ఇవి కూడా చదవండి

ప్రకటించిన ఆదాయం 4.81 రూపాయలుగా ఉన్నప్పుడు బీమా ప్రీమియం చెల్లించడానికి రూ.50 లక్షలు ఎక్కడి నుండి వచ్చాయనే దానిపై ఐటీ శాఖ అనుమానం వ్యక్తం చేసింది. ఆ డబ్బు మూలాన్ని సరిగ్గా వివరించనప్పుడు దానిని వివరించలేని పెట్టుబడిగా పరిగణిస్తారు.

ఏదైనా ఆస్తి కొనుగోలు చేసినప్పుడు పెద్ద మొత్తంలో బీమా ప్రీమియం చెల్లించినప్పుడు, పెద్ద మొత్తంలో బ్యాంకు డిపాజిట్ చేసినప్పుడు, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినప్పుడు, పన్ను అధికారులు ఆ లావాదేవీ చేసిన వ్యక్తి ఆదాయ వివరాలను పరిశీలిస్తారు. వారు ఐటీ రిటర్న్‌లో దాఖలు చేసిన వివరాలను పరిశీలిస్తారు.

కోర్టులో ఆ మహిళ ఇచ్చిన వివరణ ఏంటో తెలుసా?

ఆ రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయన్న ప్రశ్నకు ఆ మహిళ అది తన వ్యక్తిగత డబ్బు కాదని.. తన కుటుంబానికి చెందిన హిందూ అవిభక్త కుటుంబం (HUF)కి చెందిన డబ్బు అని వివరించింది. తన కుటుంబానికి చెందిన ఆపిల్ తోట నుండి వచ్చే వ్యవసాయ ఆదాయం అది.

ఇది కూడా చదవండి: SBI Insurance Policy: గోల్డెన్‌ ఛాన్స్‌.. ఏడాదికి రూ.3,000 కడితే చాలు రూ.60 లక్షల ప్రమాద బీమా.. ఎలాంటి వాటికి వర్తిస్తుందంటే..

అటువంటి సందర్భంలో నగదు ప్రవాహ రికార్డులు, MOU లేదా సేల్ డీడ్ లేదా నిర్దిష్ట ఆదాయాన్ని చూపించే ఏవైనా ఇతర అమ్మకపు పత్రాలు ఉన్నాయా అని తనిఖీ తనిఖీ చేస్తుంది. ఈ మహిళ కేసులో కూడా దీనిని తనిఖీ చేశారు. కానీ ఎలాంటి పత్రాలను గుర్తించలేదు అంటే ఆమె కుటుంబం వద్ద రూ. 50 లక్షల ప్రీమియం చెల్లించడానికి తగినంత డబ్బు ఉందని నిరూపించడానికి ఎటువంటి పత్రం లేదు. ఆ మహిళ వివరణ ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను సంతృప్తి పరచలేదు. తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వచ్చింది. జరిమానాతో సహా రూ.50 లక్షల పన్నులు చెల్లించాలని ఆమెను ఆదేశించారు. మీరు దేనిలోనైనా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెడుతున్నప్పుడు, ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో సరైన డాక్యుమెంటేషన్ కలిగి ఉండటం చాలా ముఖ్యం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us