AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) చరిత్ర సృష్టించారు. ఉద్యమమే ఊపిరిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు కేసీఆర్. గత ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. గత ఎన్నికల సమయంలో తనకు రూ.58.92 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తన ఎన్నికల అఫిడవిడ్‌లో కేసీఆర్ వెల్లడించారు. అయితే తన పేరిట కారు లేదని తెలిపారు.

మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మించారు. సిద్ధిపేట డిగ్రీ కాలేజీలో బీఏ, ఉస్మానియి యూనివర్సిటీలో ఎంఏ (తెలుగు సాహిత్యం) చదువుకున్నారు. 1969లో శోభను వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత ఉన్నారు.

తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే కేసీఆర్ రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. 70వ దశకంలో యువజన్ కాంగ్రెస్ ద్వారా తన రాజకీయ ప్రవేశం చేశారు. 1982లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 1983లో తన రాజకీయ గురువు అనంతుల మదన్‌ మోహన్‌(కాంగ్రెస్)పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్ కేవలం 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు

ఇంకా చదవండి

Ande Sri Death: అధికార లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు.. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ సంతాపం..

తెలంగాణ తన ఒడిలోంచి ఓ స్వరాన్ని కోల్పోయింది.. చేనేత దారంలా మాటలను నేసిన రచయిత అందెశ్రీ ఇకలేరు.. ప్రముఖ రచయిత అందెశ్రీ సోమవారం ఉదయం (64) కన్నుమూశారు. ఉదయం లాలాపేటలోని ఇంట్లో అందెశ్రీ కుప్పకూలారు. ఆయన్ను గాంధీ ఆస్పత్రికి.. తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.

KTR: ‘రేవంత్ ఏం తిట్టినా, సహనం కోల్పోవద్దని కేసీఆర్ నాకు చెప్పారు’

రేవంత్ రెడ్డి విమర్శలపై సంయమనం పాటించాలని కేసీఆర్ తనకు సూచించినట్లు కేటీఆర్ వెల్లడించారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు, దిగజారుడు ఆరోపణల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు రాజకీయ నాయకులపై నమ్మకం కోల్పోయారని, పార్టీ నాయకత్వాలు తమ సభ్యులను నియంత్రించాలని ఆయన పిలుపునిచ్చారు.

Telangana Politics: వ్యూహం మారింది.. గేరు మార్చింది.. వారి విషయంలో బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్..

ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో కారు పార్టీ గేర్ మారుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో.. సుప్రీంకోర్టులో పోరాటం చేస్తోన్న బీఆర్ఎస్‌.. ఇప్పుడు ప్లాన్‌-Cతో ప్రజల్లోనూ తేల్చుకునేందుకు సిద్ధమైంది. అనర్హత ఎమ్మెల్యేల విషయంలో వ్యూహం మార్చి.. వాళ్ల వాళ్ల నియోజకవర్గా్ల్లోనే సభలు స్టార్ట్‌ చేయడం ఆసక్తి రేపుతోంది.

BRS: ప్రాణసమానమైన కూతురిపై కేసీఆర్ వేటు వేయడానికి కారణాలు ఇవేనా..?

అనుకున్నంతా అయ్యింది... బీఆర్‌ఎస్‌లో కవిత ప్రస్థానం ముగిసింది. పార్టీని ఇబ్బంది పెట్టేలా ఆమె వ్యవహరిస్తున్న తీరును.. ఇక ఎంతమాత్రం ఉపేక్షించని గులాబీఅధిష్ఠానం కన్నెర్ర చేసింది. గీతదాటితే, హద్దుమీరితే... కన్నకూతురైనా లెక్కచేయనన్న సంకేతాలు పంపిన గులాబీ దళపతి.. కవితపై బహిష్కరణ వేటు వేశారు. కొంతకాలంగా పార్టీపైనా, పార్టీ నేతలపైనా విమర్శలు గుప్పిస్తున్న కవిత తీరుపై.... ఎట్టకేలకు చర్యలు తీసుకున్న అధినేత కేసీఆర్‌, ఏకంగా పార్టీ నుంచి బయటకు సాగనంపేశారు.

సీబీఐ కావాలా..? సీబీసీఐడీ కావాలా..? ఏ విచారణ కావాలో తేల్చుకోండిః సీఎం రేవంత్ రెడ్డి

అసంపూర్తి సమాచారంతో హరీష్ రావు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారని రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం (ఆగస్టు 31) కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో లఘుచర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు.

Telangana Assembly: బిగ్‌ డే.. పంచాయతీ, మున్సిపల్ చట్టసవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజుకు చేరాయి. అధికార కాంగ్రెస్ ఇవాళ్టి సెషన్‌ను బిగ్‌ డేగా భావిస్తుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం అనంతరం.. కాళేశ్వరం నివేదికను సభలో ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. ముందుగా ప్రభుత్వం, పంచాయతీ, మున్సిపల్ చట్టసవరణ, బీసీలకు 42%రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టింది. చర్చ అనంతరం.. బిల్లులను సభ ఆమోదించింది.

Telangana Assembly: కేసీఆర్ వస్తారా..? అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక

కాళేశ్వరం అంశం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇప్పటికే దీనిపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో.. దీన్ని అసెంబ్లీలో పెట్టి చర్చించేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు సభలో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అనుతివ్వాలంటున్న బీఆర్ఎస్.. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టకుండా చూడాలని హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో మాజీ సీఎం సభకు రావాలని అధికార పార్టీ డిమాండ్ చేస్తుంటే.. కేసీఆర్‌ సభకు రావాల్సిన అవసరం లేదని వాదిస్తోంది కారు పార్టీ. ఇంతకీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? రారా?

Telangana Assembly: కేసీఆర్ వస్తారా? కౌంటర్ ఇస్తారా? అసెంబ్లీ సమావేశాల్లో దానిపైనే ప్రధాన చర్చ..

ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం నివేదికపైనే ఫోకస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. సభ సాక్షిగానే బీఆర్ఎస్ అవినీతి బయటపెడతామని కాంగ్రెస్ చెబుతుంటే.. అదే సభలో ప్రభుత్వం కుట్రలను తిప్పికొడతామంటోంది బీఆర్ఎస్.. దీంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కబోతున్నాయి.. ఈ నేపథ్యంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది.

Jagadish Reddy: పార్టీలో అందరూ సమానమే.. కవిత గురించి మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఏమన్నారంటే..

రాజకీయాల్లో ఎవరూ ఎవర్ని ఎలిమినేట్‌ చేయలేరు.. మా ప్రెసిడెంట్‌ KCR .. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR.. పార్టీలో అందరూ సమానమే.. 2028లో కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు.. అంటూ టీవీ9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ దుష్ప్రచారం వాళ్లకే రివర్సు కొడుతుంది.. రిపోర్టులు బయటికొస్తే అసలు కథ మొదలవుతుంది.. అంటూ వ్యాఖ్యానించారు.

Target BRS: ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా.. ముప్పేట దాడితో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి..!

ప్రతిపక్షానికి ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతుంది అధికార పక్షం. మొన్న ఫోన్ ట్యాపింగ్, తాజాగా కాళేశ్వరం కమిషన్ అంటూ.. ముప్పేట దాడితో.. బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇదే అదునుగా ప్రత్యర్థి బీజేపీ సైతం తన పావులు కదుపుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో గులాబీ నేతలకు గాలం వేసింది.