![కేసీఆర్](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/11/kcr-6.jpg)
కేసీఆర్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) చరిత్ర సృష్టించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఈ సారి విజయం సాధించి సీఎంగా హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఉద్యమమే ఊపిరిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు కేసీఆర్. ప్రస్తుత ఎన్నికల్లో గజ్వేల్తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. తనకు రూ.58.92 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తన ఎన్నికల అఫిడవిడ్లో కేసీఆర్ వెల్లడించారు. అయితే తన పేరిట కారు లేదని తెలిపారు.
మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మించారు. సిద్ధిపేట డిగ్రీ కాలేజీలో బీఏ, ఉస్మానియి యూనివర్సిటీలో ఎంఏ (తెలుగు సాహిత్యం) చదువుకున్నారు. 1969లో శోభను వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత ఉన్నారు.
తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే కేసీఆర్ రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. 70వ దశకంలో యువజన్ కాంగ్రెస్ ద్వారా తన రాజకీయ ప్రవేశం చేశారు. 1982లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 1983లో తన రాజకీయ గురువు అనంతుల మదన్ మోహన్(కాంగ్రెస్)పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్ కేవలం 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ.. ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్నారు.
KCR: ఈ రంగాలపై ప్రభుత్వం పాలసీ ఏంటి.. బడ్జెట్పై కేసీఆర్ కౌంటర్..
తెలంగాణ బడ్జెట్పై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. భట్టి పద్దు బడ్జెట్లాగా లేదు.. రాజకీయ ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు. బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందన్నారు. భట్టి విక్రమార్క బడ్జెట్ను నొక్కి నొక్కి చెప్పడం తప్ప వాస్తవం లేదన్నారు. రాష్ట్రం మీద, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద తమకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందన్నారు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం లేదని విమర్శించారు. ప్రతి ఒక్క అంశాన్ని కూలంకశంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసే బడ్జెట్ ఇది అని కౌంటర్ ఇచ్చారు.
- Srikar T
- Updated on: Jul 25, 2024
- 3:31 pm
Telangana Budget: అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. అయితే సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత పదేళ్ల అస్తవ్యస్త పాలనకు ప్రజలు చరమగీతం పాడామన్నారు.
- Balaraju Goud
- Updated on: Jul 25, 2024
- 12:41 pm
BRS Project Tour: మరోసారి పోరుబాటకు సిద్ధమైన బీఆర్ఎస్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచే షురూ..!
కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ నేతలు పర్యటించనున్నారు. అసెంబ్లీ సమావేశం అనంతరం బయల్దేరి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన తీవ్ర హాట్ టాపిక్గా మారింది.
- Balaraju Goud
- Updated on: Jul 25, 2024
- 8:12 am
Telangana: అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్.. బడ్జెట్ రోజు హాజరుపై వ్యూహం ఇదేనా.?
అసెంబ్లీకి కేసీఆర్ రావడం కొత్త కాదు కదా అని షాక్ అవుతున్నారా? ఆయన అసెంబ్లీకి కొత్తేమీ కాదు కానీ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి అడుగుపెట్టడం మాత్రం మొదటిసారి. ఉద్యమ సమయంలో కేసీఆర్ అసెంబ్లీలో ప్రసంగాలను చాలామంది విన్నారు. ఆయన ప్రసంగాలు అన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఉండేవి. ఇక 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో పదేళ్లపాటు అసెంబ్లీలో అనేక అంశాలపై కొన్ని వందల గంటలు మాట్లాడారు.
- Rakesh Reddy Ch
- Updated on: Jul 24, 2024
- 8:28 pm
Telangana: ‘అసెంబ్లీలో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తాం’.. కేంద్ర బడ్జెట్పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
కాంగ్రెస్, బీజేపీలకు చెరో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిపిస్తే.. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేపు పార్లమెంటులో కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని కోరారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంతో మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రాహుల్ గాంధీ తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడరా? అని ప్రశ్నించారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై సీఎం రేవంత్.. రాహుల్ గాంధీతో పార్లమెంటులో మాట్లాడించాలన్నారు. అలాగే ప్రధాని కార్యాలయం ముందు కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేయాలన్నారు.
- Srikar T
- Updated on: Jul 23, 2024
- 6:52 pm
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమయ్ాయయి.. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు తొలిరోజు సభ్యులు లాస్యనందిత మృతికి సంతాపం తెలపనున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించనుంది..
- Shaik Madar Saheb
- Updated on: Jul 23, 2024
- 11:11 am
Telangana: రేపే అసెంబ్లీ సమావేశాలు.. తొలిసారి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరు..
తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకాబోతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. జూలై 23 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో ముందుగా గవర్నర్ ప్రసంగం ఉండనుంది. జూలై 25న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది సీఎం రేవంత్ సర్కార్. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు బిజీబిజీగా ఉన్నారు. 25న అసెంబ్లీకి హాజరై తెలంగాణ బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క.
- Srikar T
- Updated on: Jul 22, 2024
- 10:08 pm
Telangana Budget Sessions: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్.. ఈ అంశాలపై చర్చ అప్పుడే..
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని అసెంబ్లీ సెక్రటరీ అధికారికంగా వెలువరించారు. తెలంగాణలో బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్ చేశారు. ఈనెల 25న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపట్టనున్నారు ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అమలుతో పాటూ పాలనపై కూడా ఫోకస్ పెట్టింది.
- Srikar T
- Updated on: Jul 18, 2024
- 6:22 pm
కేసీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఎంక్వైరీ జడ్జిని మార్చాలన్న ధర్మాసనం
విద్యుత్ కొనుగోళ్లపై జుడీషియల్ కమిషన్ను రద్దు చేయాలంటూ కేసీఆర్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే, విచారణలో కీలక వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్. విచారణ జరుగుతుండగానే.. జూన్ 11న కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహా రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై సీజేఐ అభ్యంతరం వ్యక్తం చేశారు.
- Balaraju Goud
- Updated on: Jul 16, 2024
- 1:49 pm
Telangana: బీఆర్ఎస్ను వీడనున్న ఎమ్మెల్యేలు.. కొనసాగనున్న ఫిరాయింపుల పర్వం.?
తెలంగాణలో బీఆర్ఎస్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్లోకి రాజేందర్నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తిరుమల దర్శనానికి వెళ్లిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఈరోజు తిరుపతి నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం. సాయంత్రం 7 గంటలకు మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు జంపింగ్ లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
- Srikar T
- Updated on: Jul 12, 2024
- 1:32 pm
BRS లో ఏం జరుగుతోంది..? ఇద్దరు నేతలు వారం రోజుల పాటు ఢిల్లీలో ఏం చేశారు?
భారత రాష్ట్ర సమితిలో ఏం జరుగుతుంది. పార్టీలో ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ ఇద్దరు వారం రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో ఏం చేశారు? ఢిల్లీ పర్యటన తర్వాత రెండు రోజులుగా కేసీఆర్ తో ఏం చర్చిస్తున్నారు? ఇదంతా ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారింది. త్వరలో కీలక నిర్ణయాలు ఉంటాయనేది బయటకు వినిపిస్తున్న టాక్..!
- Rakesh Reddy Ch
- Updated on: Jul 11, 2024
- 9:26 pm
KCR: కేసీఆర్కు హైకోర్టు షాక్.! ఆ పిటిషన్ కొట్టివేత..
విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన కోర్టు పిటిషన్ రద్దు చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణకు ఆదేశిస్తూ జస్టిస్ నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు మాజీ సీఎం కేసీఆర్.
- Anil kumar poka
- Updated on: Jul 4, 2024
- 5:34 pm
బీఆర్ఎస్ కార్యక్రమాలకు మాజీ మంత్రి దూరం.. మౌనం వెనుక ఆంతర్యమేంటి..!
మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్నెల్యే గంగుల కమలాకర్ ఎప్పుడూ దూకుడుగా ఉంటారు. స్వపక్షం అయినా, విపక్షం అయినా హడావిడి చేస్తుంటారు. కానీ బీఅర్ఎస్ అధికారం దిగిపొయాక గంగుల సైలెంట్ అయ్యారు. బీఅర్ఎస్ ఇచ్చిన నిరసన కార్యక్రమాలలో కూడా దూరంగా ఉంటున్నారు. పార్టీ అధికారిక కార్యక్రమంలో పాల్గోన్నా అంత దూకుడుగా కనిపించడం లేదు. మరి గంగుల కమలాకర్ మనసులో ఏముంది. అయన ఎలాంటి స్ఠెప్పుతో ముందుకు వెళ్తారనే చర్చ జోరుగా సాగుతుంది.
- G Sampath Kumar
- Updated on: Jul 4, 2024
- 11:42 am
KCR: కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు ఖాయం.. టార్చ్ లైట్ పట్టుకొని జనమే వస్తారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు ఖాయం.. ఉన్న పథకాలు తీసేశారని ప్రజలు ఆలోచిస్తున్నారు.. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది.. బీఆర్ఎస్లోకి నాయకులు తిరిగి వస్తారు.. పార్టీ కేడర్ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి.. అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం యాదవులకు గొర్రెలు ఇవ్వడం లేదని.. చేప పిల్లల పంపిణీ, ఫీజ్ రీయంబర్స్మెంట్ తీసేశారు.. అంటూ ఫైర్ అయ్యారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 4, 2024
- 9:46 am
KCR: ఈసారి వచ్చేది మన ప్రభుత్వమే.. 15 ఏళ్లు అధికారంలో ఉంటాం.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఈసారి మళ్ళీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటుందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందని, ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత ఛీ అనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో ఎన్ టి ఆర్ పాలన తర్వాత మళ్ళీ అలాగే జరిగిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్లతో కేసీఆర్ మంగళవారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 2, 2024
- 6:51 pm