కేసీఆర్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) చరిత్ర సృష్టించారు. ఉద్యమమే ఊపిరిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు కేసీఆర్. గత ఎన్నికల్లో గజ్వేల్తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. గత ఎన్నికల సమయంలో తనకు రూ.58.92 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తన ఎన్నికల అఫిడవిడ్లో కేసీఆర్ వెల్లడించారు. అయితే తన పేరిట కారు లేదని తెలిపారు.
మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మించారు. సిద్ధిపేట డిగ్రీ కాలేజీలో బీఏ, ఉస్మానియి యూనివర్సిటీలో ఎంఏ (తెలుగు సాహిత్యం) చదువుకున్నారు. 1969లో శోభను వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత ఉన్నారు.
తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే కేసీఆర్ రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. 70వ దశకంలో యువజన్ కాంగ్రెస్ ద్వారా తన రాజకీయ ప్రవేశం చేశారు. 1982లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 1983లో తన రాజకీయ గురువు అనంతుల మదన్ మోహన్(కాంగ్రెస్)పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్ కేవలం 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సంక్రాంతి వేడుకలు
సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పండుగ వాతావరణంలో కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి సంబరాల్లో పాల్గొన్నారు. టీవీ9 దృశ్యాలలో కనిపించిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
- Samatha J
- Updated on: Jan 16, 2026
- 1:47 pm
KCR: కష్టపడి చదవండి.. తండ్రులను కోల్పోయిన బీటెక్ విద్యార్థులకు కేసీఆర్ ఆర్థిక భరోసా
మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదవశాత్తూ తండ్రులను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఇద్దరూ ఇంజినీరింగ్ విద్యార్థులకు కాలేజ్ పూర్తి ఫీజు చెల్లించడంతో పాటు ఇతర అవసరాలకు గాను ఆర్థికసాయం అందించి భరోసా కల్పించారు. వారికి ధైర్యం చెప్పి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
- P Shivteja
- Updated on: Jan 9, 2026
- 12:24 pm
బాగున్నారా.. అమ్మ..! రాష్ట్ర మహిళా మంత్రులకు.. మాజీ సీఎం కేసీఆర్ ఆత్మీయ పలకరింపు..!
ఎర్రవల్లి ఫామ్హౌస్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ కలిశారు. మేడారం జాతరకు రావాలని కేసీఆర్కు ఆహ్వాన పత్రిక అందజేశారు. మేడారం మహా జాతరకు కేసీఆర్ను ఆహ్వానించడంతో సానుకూలంగా స్పందించారని సీతక్క తెలిపారు. KCR దంపతులు తమకు చీరలు బహుకరించడం సంతోషంగా ఉందని మంత్రులు సీతక్క, కొండా సురేఖ అన్నారు.
- Balaraju Goud
- Updated on: Jan 8, 2026
- 5:40 pm
Telangana Assembly Live: కృష్ణా, గోదావరి జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. అసెంబ్లీ సమావేశాలు లైవ్
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అమాంతం హీట్ పెరిగింది. అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇవాళ మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.. హిల్ట్ పాలసీ, కోర్ అర్బన్ ఏరియాపై ఇవాళ చర్చ జరగనుంది.. అలాగే.. మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా, గోదావరి జలాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Jan 3, 2026
- 3:08 pm
కాంగ్రెస్.. బీఆర్ఎస్ మధ్య PPT వార్.. ఇవాళ పోటాపోటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు
నీళ్లు నిప్పులు అవుతున్నాయి. లెక్కలే అస్త్రాలు అవుతున్నాయి. తెలంగాణ గట్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వార్ నడుస్తోంది. అసెంబ్లీలో ప్రభుత్వం PPTకి సిద్ధమైంది. ఇందుకోసం పోటీగా BRS కూడా PPTకి రెడీ అయింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాడీవేడి రచ్చ మొదలైంది. నీళ్లు నిప్పులుగా మారుతున్నాయి.
- Balaraju Goud
- Updated on: Jan 3, 2026
- 8:51 am
మూడు రోజుల విరామం తర్వాత అసెంబ్లీ షురూ.. స్వయంగా 4బిల్లులు ప్రవేశ పెట్టబోతున్న సీఎం రేవంత్
మూడు రోజుల విరామం తర్వాత ఇవాళ (జనవరి 02) శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఇవాళ సభ వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఐదు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. మోటార్ వెహికల్స్ టాక్సేషన్ గెజిట్ నోటిఫికేషన్లు కూడా సభ ముందు ఉంచుతారని సమాచారం.
- Balaraju Goud
- Updated on: Jan 2, 2026
- 10:18 am
Telangana Assemly: దుమ్ముదుమారమే..! అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్.. మంత్రి శ్రీధర్బాబు ఏమన్నారంటే..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి.. నదీ జలాల పంపిణీ, పాలమూరు ప్రాజెక్ట్లపై చర్చ జరిగే అవకాశం ఉంది.. అయితే.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే హాట్టాపిక్గా మారాయి.. ఇందుకు కారణం అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని ప్రచారం.. కేసీఆర్ అటెండ్ అవుతారా? లేదా?అనేది దానిపై ఉత్కంఠ నెలకొంది.
- Shaik Madar Saheb
- Updated on: Dec 29, 2025
- 7:25 am
వదలొద్దు.. ప్రతిమాటను తిప్పికొట్టండి.. మంత్రుల సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
వదలొద్దూ.. ప్రతిమాటను తిప్పికొట్టిండి.ప్రాజెక్టులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎండగట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. ZPTC, MPTC, GHMC ఎన్నికల్లో రిజల్ట్స్ అంతకు మించి వుండాలన్నారు. లడాయి మొదలైంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ను కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నుంచి కౌంటర్ అటాక్ జోరందుకుంది.
- Prabhakar M
- Updated on: Dec 23, 2025
- 8:13 am
KCR: చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్..
బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. చెక్డ్యామ్లు బాంబులు పెట్టి పేలుస్తారా అని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక పేల్చినోడు పాతాళంలో ఉన్నా పట్టుకొస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రజలు ఆవేశంగా ఉన్నారన్న కేసీఆర్.. ప్రతిపక్షంగా మన బాధ్యతను నిర్వహిద్దామని నేతలకు పిలుపునిచ్చారు. మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలకు నీళ్లిచ్చామన్న కేసీఆర్..90 శాతం పూర్తయిన పాలమూరును..ఇంకా ఎందుకు పూర్తి చేయలేదో ప్రభుత్వాన్ని నిలదీద్దామన్నారు.
- Ram Naramaneni
- Updated on: Dec 21, 2025
- 5:52 pm
చాలా గ్యాప్ తర్వాత మళ్లీ కారెక్కనున్న కేసీఆర్.. తెలంగాణ భవన్కు గులాబీ బాస్..!
మళ్లీ యాక్టివ్ అవుతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటివరకు ఒకే ఎత్తు ఇకనుంచి తెలంగాణ రాజకీయాల్లో మరో ఎత్తు అంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ వెరీ వెరీ స్పెషల్. ఆయన స్పీచ్కు లక్షల్లో వ్యూయర్స్ ఉంటారు. తెలంగాణ ఉద్యమం నుంచి ముఖ్యమంత్రి హోదా వరకు అన్ని పదవుల్లోనూ ఆయన స్టైల్ వేరు. అలాంటి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గత రెండేళ్లుగా సైలెంట్గా ఉండిపోయారు.
- Rakesh Reddy Ch
- Updated on: Dec 19, 2025
- 9:05 pm
KCR: మంచిరోజులు వస్తాయ్.. అధైర్యపడొద్దు: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..
మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు మాజీ సీఎం కేసీఆర్. తనను కలిసిన ఎర్రవల్లి, నర్సన్నపేట సర్పంచ్లను ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్.. అన్ని రోజులు మనవి కావని.. కష్టాలను చూసి అధైర్యపడొద్దని సూచించారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు మెంబర్లు కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు.
- Shaik Madar Saheb
- Updated on: Dec 6, 2025
- 7:34 am
Ande Sri Death: అధికార లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు.. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ సంతాపం..
తెలంగాణ తన ఒడిలోంచి ఓ స్వరాన్ని కోల్పోయింది.. చేనేత దారంలా మాటలను నేసిన రచయిత అందెశ్రీ ఇకలేరు.. ప్రముఖ రచయిత అందెశ్రీ సోమవారం ఉదయం (64) కన్నుమూశారు. ఉదయం లాలాపేటలోని ఇంట్లో అందెశ్రీ కుప్పకూలారు. ఆయన్ను గాంధీ ఆస్పత్రికి.. తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.
- Shaik Madar Saheb
- Updated on: Nov 10, 2025
- 10:03 am