AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) చరిత్ర సృష్టించారు. ఉద్యమమే ఊపిరిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు కేసీఆర్. గత ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. గత ఎన్నికల సమయంలో తనకు రూ.58.92 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తన ఎన్నికల అఫిడవిడ్‌లో కేసీఆర్ వెల్లడించారు. అయితే తన పేరిట కారు లేదని తెలిపారు.

మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మించారు. సిద్ధిపేట డిగ్రీ కాలేజీలో బీఏ, ఉస్మానియి యూనివర్సిటీలో ఎంఏ (తెలుగు సాహిత్యం) చదువుకున్నారు. 1969లో శోభను వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత ఉన్నారు.

తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే కేసీఆర్ రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. 70వ దశకంలో యువజన్ కాంగ్రెస్ ద్వారా తన రాజకీయ ప్రవేశం చేశారు. 1982లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 1983లో తన రాజకీయ గురువు అనంతుల మదన్‌ మోహన్‌(కాంగ్రెస్)పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్ కేవలం 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు

ఇంకా చదవండి

KCR Birthday: బర్త్‌డే స్పెషల్.. 10 వేల మందితో ఫోటో దిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇదిగో వీడియో

పది కాదు ఇరువై కాదు.. ఏకంగా 10వేల మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలతో ఫోటో దిగారు మాజీ సీఎం కేసీఆర్. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన వాళ్లతో ప్రేమగా మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ 72వ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.

KTR: కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామన్నారు.. కానీ తెలంగాణయే కేసీఆర్ ఆనవాళ్లు

కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని కొందరు మాట్లాడుతున్నారని, కానీ తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్లని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేస్తూ, తెలంగాణనే కేసీఆర్ స్థాపించిన గొప్ప వారసత్వమని, దానిని ఎవరూ చెరివేయలేరని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామనే వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

  • Phani CH
  • Updated on: Feb 17, 2026
  • 6:18 pm

Telangana Election Results and Winners 2026 LIVE: కొత్తగూడెంలో ఉత్కంఠ.. కేటీఆర్ ఆఫర్‌కు సీపీఐ ఓకే అంటుందా..?

Telangana Municipal Election Results and Winners 2026 LIVE Updates in Telugu: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు విడదుల అవుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ దూకుడు చూపిస్తుంది. మరికొన్ని చోట్ల హంగ్ ఏర్పడింది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో కల్వకుంట్ల కవితకు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలు షాక్ ఇచ్చారు.

KCR: గజ్వేల్ మా ఇలాకా.. చూపిస్తాం మా తడాఖా

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంగా దీనిపై అన్ని పార్టీల దృష్టి పడింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ముమ్మరంగా ప్రచారం చేస్తూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో గజ్వేల్ మున్సిపాలిటీ ఎన్నికలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

  • Phani CH
  • Updated on: Feb 5, 2026
  • 9:00 pm

బీఆర్ఎస్ జాతిపిత కామెంట్స్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్‌ రియాక్ట్.. ఏమన్నారంటే?

మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయ మరింతగా హీటెక్కుతోంది. జాతిపిత కామెంట్ తెలంగాణలో రాజకీయ రచ్చకు కారణమవుతోంది. బీఆర్ఎస్ చేస్తున్న జాతిపిత ప్రచారంపై సీఎం రేవంత్ తనదైన శైలిలో విరుచుపడ్డారు. అలాంటి పనులు చేసిన వాళ్లు జాతిపిత అవుతారా ? అంటూ మండిపడ్డారు. అయితే సీఎం కామెంట్స్‌కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది కారు పార్టీ.

ముగిసిన కేసీఆర్ విచారణ.. ప్రజల దృష్టి మళ్లీంచడానికే సిట్ విచారణ పేరుతో వేధింపులుః కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ నాలుగు గంటల 45 నిమిషాల పాటు కొనసాగింది. మద్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి వచ్చిన అధికారులు.. ఏడు గంటల 45 నిమిషాలకు వెళ్లిపోయారు. విచారణ సమయంలో కేసీఆర్‌ ఇంటి పరిసరాల్లో ఐదుగురు డీసీపీలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగు అంచెల భద్రత పెట్టారు.

KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ డే.. ప్రారంభమైన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విచారణ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇవాళ బిగ్‌ డే.. నందినగర్‌ ఇంట్లో KCR విచారణ ప్రారంభమైంది. మాజీ CM కేసీఆర్‌ నుంచి సిట్‌ ఏ సమాచారం రాబట్టాలనుకుంటోంది.. ఈ కేసులో అరెస్టైన కొందరు అధికారులు విచారణలో చెప్పిన అంశాల ఆధారంగా ఏయే ప్రశ్నలు అడగబోతోంది.. ఇదే ఇప్పుడు విచారణలో కీలకంగా మారింది.

KCR: మాజీ సీఎంగా విచారణకు సిద్ధం.. కానీ.. సిట్ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రియాక్షన్ ఇదే..

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్‌ కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. నందినగర్ నివాసంలో నోటీసులు అందించింది. శుక్రవారం విచారణకు హాజరు కావాలని సిట్ లేఖలో కోరింది. అయితే.. సిట్ నోటీసులపై కే. చంద్రశేఖర్ రావు స్పందించారు.

Telangana: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో సంచలనం.. కేసీఆర్‌కు సిట్‌ అధికారుల నోటీసులు..!

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో సంచలనం చోటు చేసుకుంది. తాజాగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడానికి సిద్ధమయ్యారు. 2023లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో కుట్ర కోణాన్ని ఛేదించేందుకు ప్రత్యేక విచారణ బృందం (సిట్) తన పరిధిని విస్తృతం చేస్తోంది.

ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సంక్రాంతి వేడుకలు

సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పండుగ వాతావరణంలో కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి సంబరాల్లో పాల్గొన్నారు. టీవీ9 దృశ్యాలలో కనిపించిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

KCR: కష్టపడి చదవండి.. తండ్రులను కోల్పోయిన బీటెక్ విద్యార్థులకు కేసీఆర్ ఆర్థిక భరోసా

మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదవశాత్తూ తండ్రులను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఇద్దరూ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు కాలేజ్‌ పూర్తి ఫీజు చెల్లించడంతో పాటు ఇతర అవసరాలకు గాను ఆర్థికసాయం అందించి భరోసా కల్పించారు. వారికి ధైర్యం చెప్పి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

బాగున్నారా.. అమ్మ..! రాష్ట్ర మహిళా మంత్రులకు.. మాజీ సీఎం కేసీఆర్ ఆత్మీయ పలకరింపు..!

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ కలిశారు. మేడారం జాతరకు రావాలని కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. మేడారం మహా జాతరకు కేసీఆర్‌ను ఆహ్వానించడంతో సానుకూలంగా స్పందించారని సీతక్క తెలిపారు. KCR దంపతులు తమకు చీరలు బహుకరించడం సంతోషంగా ఉందని మంత్రులు సీతక్క, కొండా సురేఖ అన్నారు.