కేసీఆర్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) చరిత్ర సృష్టించారు. ఉద్యమమే ఊపిరిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు కేసీఆర్. గత ఎన్నికల్లో గజ్వేల్తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. గత ఎన్నికల సమయంలో తనకు రూ.58.92 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తన ఎన్నికల అఫిడవిడ్లో కేసీఆర్ వెల్లడించారు. అయితే తన పేరిట కారు లేదని తెలిపారు.
మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మించారు. సిద్ధిపేట డిగ్రీ కాలేజీలో బీఏ, ఉస్మానియి యూనివర్సిటీలో ఎంఏ (తెలుగు సాహిత్యం) చదువుకున్నారు. 1969లో శోభను వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత ఉన్నారు.
తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే కేసీఆర్ రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. 70వ దశకంలో యువజన్ కాంగ్రెస్ ద్వారా తన రాజకీయ ప్రవేశం చేశారు. 1982లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 1983లో తన రాజకీయ గురువు అనంతుల మదన్ మోహన్(కాంగ్రెస్)పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్ కేవలం 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు
తేల్చుకుందాం రా..! రెండేళ్లు Vs పదేళ్లు.. ఇష్యూ ఏదైనా బస్తీ మే సవాల్
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తన రెండున్నరేళ్ల పాలనను బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో పోల్చుతూ బహిరంగ సవాల్ విసిరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం, ధాన్యం కొనుగోళ్లు, నీటి పంపకాల వంటి కీలక అంశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఆరోపణలు-ప్రత్యారోపణలు ముదురుతున్నాయి. 2028 ఎన్నికల లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు ప్రజా సమస్యలనే అస్త్రంగా చేసుకుని రాజకీయ సమరానికి సిద్ధమవుతున్నాయి.
- Shaik Madar Saheb
- Updated on: Jun 6, 2026
- 9:56 pm
పొలం గట్టుపై పొలిటికల్ వార్.. పిచ్చెక్కిస్తున్న పార్టీల లడాయి.. తెలంగాణలో ‘రైతే రాజు’కీయం!
జూన్ 2 తెలంగాణ రాష్ట్రానికి 12వ పుట్టినరోజు. ఆవిర్భావ వేడుకలు ఊరూవాడా అట్టహాసంగా ముగిశాయి. రాజకీయ పార్టీలైతే సంబరాలతో పాటు పనిలో పనిగా చిచ్చుబుడ్లు కూడా వెలిగించుకున్నాయి. పాత చిచ్చులను కొత్తగా వెలిగించుకుని, ఆ మంటల నుంచి చలి కాచుకుంటున్నాయి. ఒక పార్టీపై మరొకటి, ఇష్యూ బేస్డ్గా చురకలంటించుకుని, చిత్తశుద్ధిని లెక్కలేసుకుంటున్నాయి. ముఖ్యంగా మూడు ప్రధాన అంశాలు మూడు పార్టీల మధ్య దూరాన్ని బాగా పెంచేశాయి. విచిత్రం ఏంటంటే, ఆ మూడూ రైతుకు సంబంధించిన టాపిక్లే. నాగలి పట్టకపోయినా, దుక్కి దున్నకపోయినా, సాగు చెయ్యకపోయినా, పార్టీ కండువాలేసుకుని రైతు సంక్షేమం కోసం వీళ్లు పడే పాట్లు చూస్తే, ఔరా అనిపిస్తోంది.
- Balaraju Goud
- Updated on: Jun 3, 2026
- 9:50 pm
ఉద్యమ కేసీఆర్తో సమస్య లేదు.. సీఎం కేసీఆర్తోనే వచ్చింది.. సంచలన నిజాలు బయటపెట్టిన కవిత
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మార్పు కోసం "తెలంగాణ రక్షణ సేన" పార్టీని స్థాపించానని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు, కఠిన పరిస్థితులు చూశాకే తనలో ఈ మార్పు వచ్చిందన్నారు.
- Balaraju Goud
- Updated on: May 15, 2026
- 5:44 pm
KCR: కష్టపడే వారికే పదవులు.. వచ్చే రెండేళ్లు బీఆర్ఎస్కు చాలా కీలకం: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..
వచ్చే రెండేళ్లు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకమని పార్టీ చీఫ్ కే చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై పోరాటమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్లాలని నేతలకు సూచించారు. పనిచేసే వారికే పార్టీ పదవులు ఇవ్వాలని స్పష్టం చేసిన కేసీఆర్.. రైతులు, యువత, విద్యార్థుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
- Shaik Madar Saheb
- Updated on: May 12, 2026
- 8:59 pm
కేసీఆర్కు ఇష్టమైన కమ్మటి కూర ఇదే.. ఇలా వండితే క్షణాల్లో గిన్నెలు ఖాళీ అవ్వాల్సిందే
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇష్టమైన వంటకాల్లో పాలకూర పప్పు ఒకటి.. ఆయన ఎక్కువగా పాలకూర పప్పును ఇష్టపడతారని నేతలు చెబుతుంటారు. ఎన్నో పోషకాలు నిండిన పాలకూర పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఐరన్, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఈ రుచికరమైన పప్పును ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. తెలంగాణ స్టైల్లో పాలకూర పప్పు తయారీ విధానం, ఆరోగ్య ప్రయోజనాలను ఈ కథనంలో తెలుసుకోండి.
- Shaik Madar Saheb
- Updated on: May 11, 2026
- 12:00 pm
మాజీ సీఎం కేసీఆర్కు ఇష్టమైన కర్రీ ఇదే.. ఎలా వండితే ఇష్టంగా తింటారో తెలుసా?
తెలంగాణాలో చాలా మంది ఫేవరెట్ రాజకీయనాయకుడు ఎవరు అనగానే అందరూ మందుగా చెప్పే పేరు కేసీఆర్. ఈయన తన వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక చాలా మందికి ఈయన ఒక రాజకీయనాయకుడిగానే తెలుసు కానీ, కేసీఆర్ భోజన ప్రియులంట. తినడమే కాదండోయ్, అతిథులకు మర్యాదలు చేయడంలో కూడా ముందుంటారంట.
- Samatha J
- Updated on: May 8, 2026
- 5:00 pm
బీఆర్ఎస్ పని అయిపోయింది.. కొత్త పార్టీకి తావులేదు.. ఇక కాళేశ్వరం లెక్కలు తేలుస్తాం: రేవంత్ రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. మీడియా చిట్చాట్లో భాగంగా ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కీలక విమర్శలు చేశారు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం నుంచి బీఆర్ఎస్ కనుమరుగవుతోందని ఆయన జోస్యం చెప్పారు.
- Balaraju Goud
- Updated on: Apr 28, 2026
- 8:33 am
TRS టు BRS.. కేసీఆర్ ఉద్యమ పార్టీకి పాతిక వసంతాలు..
తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన గులాబీ పార్టీ పాతిక వసంతాలు పూర్తి చేసుకుంది. జలదృశ్యంలో 2001లో మొదలైన TRS పార్టీ 2014లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ జనదృశ్యాన్ని సాక్షాత్కారం చేసింది. తర్వాత దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు BRSగా మారి పాతికేళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకుంది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 27, 2026
- 9:07 am
Telangana: రేవంత్, కేసీఆర్.. మధ్యలో బీజేపీ.. వార్ జోన్ షురూ అయినట్టేనా?
ముఖ్యంగా రేవంత్ మార్క్ ఆఫ్ గవర్నెన్స్ని టార్గెట్ చేశారు మాజీ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పథకాల్ని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేశారు. ఒక్కో పథకాన్ని గుర్తు చేస్తూ పాయింట్ టూ పాయింట్ నిగ్గదీసే ప్రయత్నం చేశారు. జనం కూడా రేవంత్ ప్రభుత్వంపై మొహం మొత్తి, తన రీఎంట్రీని కోరుకుంటున్నారు అన్నట్టుగా సాగింది కేసీఆర్ స్పీచ్.
- Shaik Madar Saheb
- Updated on: Apr 21, 2026
- 9:51 pm
KCR Live: జగిత్యాల నుంచే జైత్రయాత్ర.. 100 శాతం మళ్లీ BRS ప్రభుత్వం వస్తుంది: కేసీఆర్
అప్పుడెప్పుడో BRS రజతోత్సవ సభలో దర్శనమిచ్చిన కేసీఆర్... అడపాదడపా అగుపించినా ప్రజాక్షేత్రంలోకి మాత్రం పూర్తిస్థాయిలో రాలేదు.. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభతో ఆయన మరోసారి... జనంలోకి వస్తుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలని షేక్ చేస్తోంది. అందులోనూ... కాంగ్రెస్తో 40ఏళ్ల జర్నీకి పుల్స్టాప్ పెట్టేసి.. మాజీ మంత్రి జీవన్రెడ్డి BRSలో చేరుతున్న సందర్భంలో ఏర్పాటు చేస్తున్న భారీ చేరిక సభ ఇది. ఒకరకంగా చెప్పాలంటే.. ఉత్తర తెలంగాణలో కారు పార్టీకి ఊపు తీసుకొచ్చే మీటింగ్గా గులాబీ శ్రేణులు చెప్పుకొంటున్నాయి.
- Shaik Madar Saheb
- Updated on: Apr 20, 2026
- 8:35 pm
Telangana: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ మండే.. ఒకేరోజు సీఎం రేవంత్, కేసీఆర్ సభలు..
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. హాట్ సమ్మర్లో అంతే హాట్గా సాగుతున్న పాలిటిక్స్.. సోమవారం జరిగే ముఖ్యనేతల సమావేశాలతో మరింత హీటెక్కే అవకాశం కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్.. ఒకే రోజు రెండు వేర్వేరు సభల్లో పాల్గొనబోతున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Apr 19, 2026
- 9:18 pm
కాకరేపుతోన్న కరీంనగర్ పాలిటిక్స్.. ఒకేరోజు ఇద్దరూ.. తూర్పున సీఎం రేవంత్.. పశ్చిమాన మాజీ సీఎం కేసీఆర్..!
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఏప్రిల్ 20వ తేదీన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ ఒకే జిల్లాలో పర్యటిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ తూర్పున రేవంత్ రెడ్డి పర్యటన ఉంటే, పశ్చిమ దిశలో కేసీఆర్ సభ ఖరారైంది.
- Balaraju Goud
- Updated on: Apr 16, 2026
- 8:25 pm