తెలుగు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్ల అనుభవం ఉంది..2009లో సిటీ ఛానల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2012లో ప్రజాశక్తి,లోకల్ టైమ్స్ పేపర్లో రిపోర్టర్ గా పనిచేసాను..2014 లో 99టీవీలో ఉమ్మడి మెదక్ జిల్లా రిపోర్టర్ గా చేసాను.. 2019లో టీవీ9లో జాయిన్ అయ్యాను..ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నాను…
ఒకేరోజు ఇద్దరు బాధితులు.. కట్ చేస్తే రూ. 2 కోట్లు హాంఫట్..
సైబర్ నేరగాళ్లు రూట్ మారుస్తున్నారు. బాగా చదువుకోని, ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నవారినే టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాను సైతం శాసించే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కూడా అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. వాళ్లు చెప్పే మాయమాటలను గుడ్డిగా నమ్ముతు.. ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఏకంగా ఓటీపీలను సైతం చెప్పేస్తున్నారు. సంపాదించిన సొమ్మునంతా ఆ కేటుగాళ్ల చేతుల్లో పెడుతున్నారు. ఆ తర్వాత మోసపోయామని గ్రహించి విలవిల్లాడుతున్నారు.
- P Shivteja
- Updated on: Jul 26, 2024
- 3:40 pm
Watch Video: సిద్దిపేటకు మరో అరుదైన గుర్తింపు.. స్టీల్ బ్యాంకుకు జాతీయ స్థాయిలో ప్రశంసల వెల్లువ..
సిద్దిపేట అన్నింటిలో ఆదర్శం. దేశస్థాయిలో అవార్డు వచ్చిందంటే సిద్దిపేట పేరులేకుండా ఉండదు. సిద్దిపేటలో ఏ కార్యక్రమం తలపెట్టినా దేశ, రాష్ట్రస్థాయిలో అమలు కావాల్సిందే. సిద్దిపేట ను చూసి నేర్చుకున్న దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు ఎన్నో ఉన్నాయి. గతంలో ఒక మారు మూల గ్రామం అయిన ఇబ్రహీంపూర్లో ఇంకుడు గుంతల కార్యక్రమం చేపడితే దేశ, విదేశాల మన్నలని పొందింది. అదే స్ఫూర్తితో ఎన్నో కార్యక్రమాలకు సిద్దిపేట వేదిక అయింది.
- P Shivteja
- Updated on: Jul 25, 2024
- 4:30 pm
Watch Video: నాడు జలకళ.. నేడు వెలవెల.. ఏడారిని తలపిస్తున్న రిజర్వాయర్ అదే..
ఉమ్మడి మెదక్ జిల్లాలో భూగర్భజలాలు, సాగునీరు లేక రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాడు జలకళతో కళకళాడిన రిజర్వాయర్లు, నేడు పూర్తిగా అడుగంటి పోతున్నాయి. ఇక మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోసే రంగనాయక సాగర్ రిజర్వాయర్లో నీటి ఎద్దడి నెలకొంది. రంగనాయక సాగర్ జలాశయం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్ధిపేట జిల్లా, చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ గ్రామాల సమీపంలో నిర్మించారు. ఇది 2,300 ఎకరాల్లో రూ. 3,300 కోట్ల వ్యయంతో 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు.
- P Shivteja
- Updated on: Jul 22, 2024
- 6:32 pm
Telangana 9 ఏళ్ళకు విరబూసిన బ్రహ్మ కమలం.. మహాశివుడికి నైవేధ్యంగా ప్రత్యేక పూజలు
శివునికి ఇష్టమైన పువ్వు బ్రహ్మకమలం పువ్వులు.. ఇవి తెలంగాణ ప్రాంతంలో అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ బ్రహ్మ కమలం పూలు అంటే ఎక్కువగా హిమాలయ పర్వతాల్లో, కేరళ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూసే ఈ పూలు సిద్ధిపేట జిల్లాలోని పరశురాములు, స్వాతి దంపతుల ఇంటి పెరట్లో విరబూశాయి.
- P Shivteja
- Updated on: Jul 20, 2024
- 11:07 am
ఖాకీ వనంలో గంజాయి మొక్కలు.. తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్న వాస్తవాలు..!
మెదక్ జిల్లాలో పోలీస్ శాఖ అపఖ్యాతి మూటగట్టుకుంటోంది. వరుస ఘటనలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రక్షించాల్సిన రక్షకభట్లే, భక్షక భటులుగా మారుతున్నారు. ఖాకw వనంలో గంజాయి మొక్కల్ల కొంతమంది పోలీసులు అవినీతి సొమ్ముకు అలవాటు పడి, ఏసీబీ అధికారులకు చిక్కుతున్నారు. గతంలో అరెస్టు అయినా.. ఆ ఎస్ఐ తీరు ఎందుకు మారలేదు..?
- P Shivteja
- Updated on: Jul 13, 2024
- 7:32 pm
Ashada Masam: ఆషాడ మాసంలో గోరింటాకు పండగ.. అసలు రహస్యం ఇదేనట..!
పురాణాల్లోనూ గోరింటాకు ప్రత్యేక స్థానం ఉంది. మన సంస్కృతిలో పడుచమ్మాయిల చేతులు, గోరింటాకు ఎర్రగా పండితే, మంచి భర్త వస్తాడని చెబుతుంటారు. ఏళ్ల నుండి వస్తున్న సాంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నామని ఇక్కడ మహిళలు చెప్తున్నారు. ఫాస్ట్ కల్చర్ లో పడిపోకుండా ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటూ ఈ ఆనవాయితీని కంటిన్యూ చేస్తున్నారు.
- P Shivteja
- Updated on: Jul 12, 2024
- 4:15 pm
Telangana: నరకానికి కేరాఫ్ అడ్రస్.. ఆ రహదారుల మరమ్మత్తుకు నోచుకోని సర్కార్..
రెండు తెలుగు రాష్ట్రల్లో ఆ రోడ్డుకు ఒక ప్రత్యేకత ఉంది. 50 కిలోమీటర్ల మేర ఒక్క మూలమలుపు కూడా ఆ రోడ్డుపై కనిపించదు. ఆ రోడ్డుపై ప్రయాణం అంటేనే ఒకప్పుడు సాఫీగా సాగిపోయేది. అలాంటి ప్రత్యేకత ఉన్న రోడ్డు ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. సంగారెడ్డి జిల్లా అందోలు నియోజకవర్గం పరిధిలో ఈ అంతర్ రాష్ట్ర రహదారి చాలా ఫెమస్. అల్లదుర్గ్ ఐబీ చౌరస్తా నుండి మెటల్కుంట వరకు 50 కిలో మీటర్ల ఉన్న ఈ రోడ్డుపై ఒక్క ములమలుపు కూడా లేకుండా నిర్మాణం చేపట్టారు. దీన్ని చూడడానికి కూడా అప్పట్లో చాలామంది వచ్చేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది.
- P Shivteja
- Updated on: Jul 12, 2024
- 10:34 am
Cyber Frauds: మహిళలు, యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులే టార్గెట్.. రెచ్చిపోతున్న మాయగాళ్లు..!
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి..టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు జనం సొమ్మును దోచేస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇతర యాప్లు, లింకులు, ఈ మెయిల్స్తో హ్యాకర్ల మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై నేరాల నియంత్రణపై దృష్టిపెట్టారు.
- P Shivteja
- Updated on: Jul 7, 2024
- 4:21 pm
School Train: విద్యా బోధనకు కొత్త శ్రీకారం.. ప్రకృతి అందాలను పాఠాలుగా మార్చి రైలు బడి..!
స్కూల్కు వచ్చే పిల్లలు చుక్ బుక్ బండి అంటూ రైలు ఆట ఆడుకుంటుంటారు. అటువంటిది రైలు స్కూల్ కే వచ్చేస్తే ఎలా ఉంటుంది. ఇదిగో ఇలాఉంటుంది. అదొక రైలు బడి. పిల్లలు పాఠశాలకు పెద్ద ఎత్తున వచ్చేలా ఆకర్షించేందుకు కొత్త విధానంలో బోధనకు శ్రీకారం చుట్టారు ఉపాధ్యాయులు.
- P Shivteja
- Updated on: Jul 2, 2024
- 6:29 pm
Edupayala Vana Durga: తెల్లనిపువ్వులతో ఏడుపాయల వన దుర్గకు అలంకరణ.. అమ్మవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు
మంగళవారం కావడంతో తెల్లవారుజామున ఏడుపాయల వనదుర్గభవాని అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన, ప్రత్యేక పూజలు చేశారు. తెల్లని పూలు మల్లెపూలు, సన్నజాజులు ,లిల్లీలతో అమ్మవారిని పూజించడం వలన ఆరోగ్యం, మనశ్శాంతి, సంతానం కలుగుతుందనీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు పార్థివ శర్మ తెలిపారు.
- P Shivteja
- Updated on: Jul 2, 2024
- 12:48 pm
కేవలం రూ. 5లక్షలతోనే అన్ని సౌకర్యాలతో కంటైనర్ హోమ్.. సొంత ఇంటి కల నెరవేర్చుకున్న దంపతులు
యూట్యూబ్ ద్వారా ఈ ఇంటి గురించి తెలుసుకున్నామని.. స్థానిక మర్పడగ గ్రామంలో ఇదే మాదిరిగా కట్టిన ఇంటిని సందర్శించి కంటైనర్ ఇంటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇంటి నిర్మాణానికి కేవలం డబ్బు మాత్రమే ఇచ్చామని.. ఫ్యాన్లు, టాయిలెట్ లతో సహా మిగతా పనులు మొత్తం గృహ నిర్మాణ సంస్థ వారే పూర్తి చేసి ఇస్తారని తెలిపారు. దశాబ్దాల కాలం పాటు ఇల్లు చెక్కుచెదరకుండా ఉంటుందన్నారు.
- P Shivteja
- Updated on: Jul 1, 2024
- 3:24 pm
చిన్నవయసులో పెద్ద మనసు.. మానవత్వం చాటుకున్న చిన్నారి..
డెలివరీ అయిన పేదరాలికి ఓ చిన్నారి తన కిడ్డీ బ్యాంక్లో జమ చేసుకున్న రూ.4వేల నగదును అందజేసి మానవత్వాన్ని చాటుకుంది. మనూరు మండలం బోరంచ గ్రామానికి చెందిన యువకుడు ప్రశాంత్ ఇంట్లో చిన్న కిరాణాకొట్టు నిర్వహించుకొంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు.
- P Shivteja
- Updated on: Jun 28, 2024
- 8:02 pm