తెలుగు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్ల అనుభవం ఉంది..2009లో సిటీ ఛానల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2012లో ప్రజాశక్తి,లోకల్ టైమ్స్ పేపర్లో రిపోర్టర్ గా పనిచేసాను..2014 లో 99టీవీలో ఉమ్మడి మెదక్ జిల్లా రిపోర్టర్ గా చేసాను.. 2019లో టీవీ9లో జాయిన్ అయ్యాను..ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నాను…
Telanagana: అబ్బా.. ఏం ప్లానయ్యా.. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ డాక్టర్.. అసలు మ్యాటర్ తెలిస్తే..
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ కొందరు ప్రభుత్వ వైద్యులు మాత్రం తమ బాధ్యతను గాలికొదిలేస్తున్నారు. డ్యూటీకి డుమ్మాలు కొడుతూ దర్జాగా గడుపుతున్నారు. అంతేకాదు.. తన స్థానంలో ఓ ప్రైవేట్ డాక్టర్లను ఉంచి.. జీతం మాత్రం వాళ్లు కొట్టేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.
- P Shivteja
- Updated on: Aug 7, 2026
- 6:06 pm
అర్థరాత్రి ఆపదలో ఉన్న తల్లీబిడ్డకు అండగా.. మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటన మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. నాలుగు నెలల చంటిబిడ్డకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో ప్రవళిక అనే మహిళ రాత్రి ఒంటి గంట సమయంలో ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుంది. పాపలో ఎలాంటి చలనం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె మహిళల వార్డు సమీపంలో సహాయం కోసం ఎదురుచూస్తూ నిలిచింది.
- P Shivteja
- Updated on: Aug 6, 2026
- 9:12 am
గదిలోకి మాస్క్ లేకుండా రావొద్దు.. హీలియం గ్యాస్ పీల్చుకుని చార్టర్డ్ అకౌంటెంట్ సూసైడ్..
సిద్దిపేటకు చెందిన ఓ చార్టర్డ్ అకౌంటెంట్ హీలియం గ్యాస్ పీల్చి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. బెలూన్లలో ఉపయోగించే హీలియం గ్యాస్ను ప్రాణాంతకంగా వినియోగిస్తున్న ప్రమాదకర ధోరణిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హీలియం శరీరంలో ఆక్సిజన్కు బదులుగా చేరడం వల్ల ప్రాణాపాయం సంభవిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారు తప్పనిసరిగా కుటుంబ సభ్యులు లేదా నిపుణుల సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
- P Shivteja
- Updated on: Aug 5, 2026
- 7:16 am
భార్యను చంపి.. దర్గాలో పీర్ల ముందు పడేశాడు! వారం రోజుల ముందే..
సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను కత్తితో హత్య చేసిన భర్త, మృతదేహాన్ని దర్గా సమీపంలో పడేసి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
- P Shivteja
- Updated on: Aug 4, 2026
- 10:00 pm
ఛీ.. ఛీ నువ్వేం తండ్రివయ్యా.. గొడవ పడుతుండగా నవ్వాడని.. కొడుకుని ఏం చేశాడో చూడండి..
కన్న కొడుకనే జాలి లేకుండా ఓ తండ్రి కిరాతకానికి ఒడిగట్టాడు. భార్యతో గొడవపడుతుండగా.. కొడుకు చూసి నవ్వాడనే కోపంతో ఎనిమిదేళ్ల బాలుడిపై వేడి నీళ్లు పోసి తీవ్రంగా గాయపరిచాడు. సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
- P Shivteja
- Updated on: Aug 4, 2026
- 9:28 pm
తస్సాదియ్యా.. కలెక్టర్నే బెదిరించిన ఇంటర్పోల్ అధికారులు! చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్
మెదక్ కలెక్టరేట్లో ఇద్దరు వ్యక్తులు తాము ఇంటర్పోల్ అధికారులమంటూ నకిలీ ఐడీ కార్డులతో కలెక్టర్ను కలిసేందుకు ప్రయత్నించారు. భూ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఒత్తిడి తెచ్చారు. అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా, నిందితులు హైదరాబాద్కు చెందిన వారిగా తేలి అరెస్టయ్యారు.
- P Shivteja
- Updated on: Aug 4, 2026
- 7:07 pm
Sangareddy: కాలం మారినా స్నేహం మారలేదు.. 37 ఏళ్ల తర్వాత ఐటీఐ మిత్రుల ఆత్మీయ కలయిక
మూడు దశాబ్దాలకు పైగా గడిచినా స్నేహం మాత్రం చెక్కుచెదరలేదు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐ 1987–89 ఫిట్టర్ బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు 37 ఏళ్ల తర్వాత ఒకేచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. హోదాలు, ఉద్యోగాలు, ఆర్థిక స్థాయిలను పక్కనబెట్టి ఆత్మీయంగా కలుసుకున్న ఈ సమ్మేళనం స్నేహానికి కాలంతో సంబంధం లేదని మరోసారి నిరూపించింది.
- P Shivteja
- Updated on: Aug 4, 2026
- 8:59 am
Telangana: చూడ్డానికి అమాయకుల్లానే ఉన్నారు.. కానీ వీళ్లు ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే!
వ్యాపారం అంటూ వచ్చారు.. అందరితో మంచిగా మెలిగారు. పరిచయం పెంచుకున్నారు. నమ్మకాన్ని కూడగట్టారు. ఆ తర్వాతే ఆసలు పథకాన్ని అమలు చేశారు. అధిక లాభాలు ఇస్తామని.. చిట్టీల పేరుతో జనాల నుంచి కోట్లాది రూపాయలు కాజేశారు. డబ్బులు చేతికందగానే.. చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రే చెక్కేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు.
- P Shivteja
- Updated on: Aug 3, 2026
- 5:25 pm
‘నన్ను పెళ్లి చేసుకుంటే జన్మ సార్థకం’.. దొంగ బాబా లీలలు! కట్ చేస్తే చితకబాదిన జనాలు
గుప్తనిధుల పేరుతో ఓ కుటుంబాన్ని నమ్మించి నగదు, బంగారు ఆభరణాలు కాజేసిన నకిలీ బాబా బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. కష్టాలు తీరుస్తానంటూ మాయమాటలు చెప్పి మోసం చేసిన అతడిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు..
- P Shivteja
- Updated on: Aug 3, 2026
- 4:53 pm
Harish Rao: ఆపదలో అండగా.. పేద విద్యార్థిని డాక్టర్ కలకు ఊపిరిపోసిన ఎమ్మెల్యే హరీష్ రావు!
రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా.. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవడంలో తన మార్క్ చాటుకుంటున్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. నాలుగేళ్ల క్రితం తండ్రిని కోల్పోయి చదువు ఆగిపోయే పరిస్థితిలో ఉన్న సిద్దిపేట చిన్నారి అఖిలకు అండగా నిలిచిన ఆయన తాజాగా ఆమె నీట్లో మంచి మార్కులు సాధించడంతో ఇంటికి పిలిచి మరీ అభినందించారు. ఆమె ఎంబీబీఎస్ చదువుకయ్యే పూర్తి ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చి గొప్ప మనసును చాటుకున్నారు.
- P Shivteja
- Updated on: Aug 2, 2026
- 7:25 pm
సంగారెడ్డిలో హైటెన్షన్.. వట్పల్లి పోలీస్ స్టేషన్పై గ్రామస్తుల దాడి.. ఏం జరిగిందంటే..
సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో అనుమానాస్పదంగా మృతి చెందిన యువకుడు బీరప్ప ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని చెట్టుపై నుంచి దించారని ఆరోపిస్తూ దరఖాస్తుపల్లి గ్రామస్తులు వట్పల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఫర్నిచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా, దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసే దిశగా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
- P Shivteja
- Updated on: Aug 1, 2026
- 7:03 pm
Video: అర్ధరాత్రి ఘోరం.. తెల్లారేసరికి ఇంటి ముందు 40 మూగ జీవాలు మృతి.. అసలేం జరిగిందంటే?
Siddipet News: సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామంలో వీధి కుక్కల గుంపు గొర్రెల మందపై దాడి చేసి 40 గొర్రెలను చంపేసింది. ఈ ఘటనలో గొర్రెల పెంపకందారుడు శ్రీనివాస్కు సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. బాధితుడికి నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
- P Shivteja
- Updated on: Jul 22, 2026
- 9:26 pm