తెలుగు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్ల అనుభవం ఉంది..2009లో సిటీ ఛానల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2012లో ప్రజాశక్తి,లోకల్ టైమ్స్ పేపర్లో రిపోర్టర్ గా పనిచేసాను..2014 లో 99టీవీలో ఉమ్మడి మెదక్ జిల్లా రిపోర్టర్ గా చేసాను.. 2019లో టీవీ9లో జాయిన్ అయ్యాను..ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నాను…
Sangareddy: పండగ పూట ఇదేం పనిరా.. అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
భార్యాభర్తల మధ్య గొడవలు హద్దులు దాటుతున్నాయి. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. అలిగి పుట్టింటికి వెళ్లిన భార్యను కాపురానికి రమ్మని పిలిచిన భర్తకు నిరాకరణ ఎదురవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. ఏకంగా అత్తారింటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు.
- P Shivteja
- Updated on: Jan 16, 2026
- 8:36 pm
Hyderabad: దారుణం.. మరో వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా.. ఇకనైనా మారండి బ్రదర్..
చైనా మాంజా దారాలు కోసుకుపోతూ.. జనాల ప్రాణాలమీదకు వస్తున్నాయి. కొన్నిరోజులుగా వాహనదారుల పీకల మీదకు వస్తున్నాయి చైనా మాంజా దారాలు. తాజాగా.. ఓ బైకర్ ను బలి తీసుకుంది.. సంగారెడ్డి ఫసల్వాదిలో చైనా మాంజా చుట్టుకుని.. ఓ వ్యక్తి మరణించాడు.. బైక్పై వెళ్తున్న వ్యక్తికి చైనా మాంజా చుట్టుకుని గొంతు కోసుకుపోయింది..
- P Shivteja
- Updated on: Jan 14, 2026
- 3:24 pm
Telangana: అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
ఎదగని నారుమళ్లు.. ఇప్పుడు అన్నదాతను వెంటాడుతున్న ఆందోళన ఇది. గత కొద్ది రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాను వణికిస్తున్న రికార్డు స్థాయి చలి, సామాన్యులనే కాదు, పొలాల్లో పచ్చని ఆశలు సాగు చేస్తున్న రైతన్నను కూడా కోలుకోలేని దెబ్బ తీస్తోంది. ఎదగాల్సిన నారు పసుపు రంగులోకి మారి ఎండిపోతుండటంతో, చేతికొచ్చిన సమయం, పెట్టిన పెట్టుబడి రెండూ వృధా అవుతున్నాయని రైతులు వాపోతున్నారు
- P Shivteja
- Updated on: Jan 13, 2026
- 9:48 pm
Telangana: లక్షల జీతాలు ఇచ్చేది ఇందుకేనేమో?.. అధికారి ఒడ్డున కూర్చొని.. రైతుతో మరమ్మత్తులు..
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఎంతోమంది ప్రాణాల మీదకు వస్తున్న అధికారుల తీరులో మాత్రం అసలు మార్పు రావడం లేదు. తాజాగా మెదక్ జిల్లాలో మరోసారి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఓ గ్రామంలో విద్యుత్ వైర్లు తెగి పొలంలో పడగా.. వాటని రైతు చేత తీపించాడు స్థానిక ఏఈ దీంతో.. ఆ అధికారి తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- P Shivteja
- Updated on: Jan 12, 2026
- 2:59 pm
Sound Library: సంగారెడ్డి పట్టణంలో సౌండ్ లైబ్రరీ.. దృష్టిలోపం ఉన్నవారికి ఎంతో ఉపయుక్తం
సంగారెడ్డి జిల్లా అధికారులు మరో వినూత్న ప్రయత్నంతో అంధులకు వెన్నుదన్నుగా నిలిచారు. వినడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకునేలా దివ్యాంగుల కోసం ప్రత్యేక లైబ్రరీని ప్రారంభించారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయం రాష్ట్రంలోనే మొట్టమొదటి అందుల సౌండ్ లైబ్రరీ కావడం విశేషం. దక్షిణ భారతదేశంలో తొలి శ్రవణ గ్రంథాలయంపై టీవీ9 స్పెషల్ స్టోరీ.
- P Shivteja
- Updated on: Jan 11, 2026
- 10:44 am
KCR: కష్టపడి చదవండి.. తండ్రులను కోల్పోయిన బీటెక్ విద్యార్థులకు కేసీఆర్ ఆర్థిక భరోసా
మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదవశాత్తూ తండ్రులను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఇద్దరూ ఇంజినీరింగ్ విద్యార్థులకు కాలేజ్ పూర్తి ఫీజు చెల్లించడంతో పాటు ఇతర అవసరాలకు గాను ఆర్థికసాయం అందించి భరోసా కల్పించారు. వారికి ధైర్యం చెప్పి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
- P Shivteja
- Updated on: Jan 9, 2026
- 12:24 pm
దారి వెంట వెళ్తున్న మూడేళ్ల బాలుడు.. ఒక్కసారిగా దాడి చేసిన 15 కుక్కలు..!
చిన్న పిల్లలపై వీధి కుక్కల దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. ఇంట్లో నుండి పిల్లలను బయటకు పంపాలంటేనే తల్లితండ్రులు వణికిపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో మూడేళ్ల బాలుడిపై సుమారు 15 కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. దాడి దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని రక్షించిన స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
- P Shivteja
- Updated on: Jan 8, 2026
- 6:46 pm
Artificial Lungs: కృత్రిమ ఊపిరితిత్తులు వస్తున్నాయ్.. IIT హైదరాబాద్లో పరిశోధనలు షురూ!
ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతో జట్టు కడుతూ వడివడిగా అడుగులు వేస్తోంది. తాజాగా జర్మనీకి చెందిన ప్రసిద్ధ ఇన్స్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్ తో కలిసి సంయుక్తంగా కృత్రిమ ఊపిరితిత్తుల తయారీకి పరిశోధనలు చేపడుతోంది. అందులో భాగంగా బయో ఇంజినీరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను..
- P Shivteja
- Updated on: Jan 7, 2026
- 9:11 pm
పాపం..! అల్లుడు ఇంటికి వచ్చాడని మర్యాద చేస్తే.. ఎంతకూ తెగించాడు..!
‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు..’ అనే పాట అక్షర సత్యం అనిపిస్తుంది ఒక్కోసారి..! బంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోతున్నాయి. డబ్బు.. అస్తి కోసం సొంత వాళ్ళను సైతం హతమారుస్తున్నారు కొంతమంది. వావి వరసలు మరిచి మృగాళ్ల వ్యవహరిస్తున్నారు. అచ్చు ఇలాగే వ్యవహరించాడు సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి.. ఆస్తి కోసం సొంత అల్లుడే అత్తను అత్యంత పాశవికంగా చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది.
- P Shivteja
- Updated on: Jan 7, 2026
- 8:28 pm
లంచం తీసుకుంటూ అడ్డగా బుక్కైన రెవెన్యూ ఇన్స్పెక్టర్.. నెట్టింట వీడియో వైరల్..!
అవినీతి అధికారులపై ఓ వైపు ఏసీబీ వరుస దాడులు చేస్తున్నా.. కొందరు అధికారుల్లో మార్పు రావడం లేదు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ లంచం తీసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియోలో వైరల్గా మారాయి. ఈ విషయం కాస్తా, ఉన్నతాధికారులకు చేరింది. సదరు అధికారిపై శాఖాపరమైన చర్యలకు సిద్దమయ్యారు.
- P Shivteja
- Updated on: Jan 7, 2026
- 7:45 pm
Telangana: కొడుకు కాదు కిరాతకుడు.. కన్న తండ్రినే కడతేర్చాడు.. కారణం తెలిస్తే..
పైసా పైసా ఏం చేస్తావు అంటే.. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెడతా అందట.. సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తుంటే పెద్దలు చెప్పిన ఈ మాటలే నిజం అన్పిస్తున్నాయి. ఎందుకంటే డబ్బు మోజులో పడి కొందరు దుర్మార్గులు రక్తబంధాలను తెంచుకుంటున్నారు. కన్నవారని, తోడబుట్టిన వారని కూడా చూడకుండా కడతేర్చుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో వెలుగు చూసింది.
- P Shivteja
- Updated on: Jan 7, 2026
- 3:24 pm
ఓం భీం బుష్.. ఇంటికి లచ్చిందేవి వచ్చిందంటూ నమ్మించారు.. కట్చేస్తే..
కాట్రియాల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వద్దకు సిరిసిల్ల జిల్లాకు చెందిన కదకంచి రాజారాం, కద కంచి రాకేష్, సాదుల అశోక్ అనే ముగ్గురు దుండగులు వెళ్ళి మీ ఇంట్లో బంగారం ఉందని, పూజలు చేస్తే బంగారం బయటకు వస్తుందని నమ్మబలికారు. దీనికి ఖర్చు అవుతుందని వివరించారు.
- P Shivteja
- Updated on: Jan 7, 2026
- 11:37 am