తెలుగు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్ల అనుభవం ఉంది..2009లో సిటీ ఛానల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2012లో ప్రజాశక్తి,లోకల్ టైమ్స్ పేపర్లో రిపోర్టర్ గా పనిచేసాను..2014 లో 99టీవీలో ఉమ్మడి మెదక్ జిల్లా రిపోర్టర్ గా చేసాను.. 2019లో టీవీ9లో జాయిన్ అయ్యాను..ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నాను…
35 ఏళ్లుగా ఎదురుచూసిన క్షణం.. ఆలయంలోకి దళితుడు చేరుకున్న క్షణం
35 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం కమలాపూర్లో దళితులకు హనుమాన్ ఆలయ ప్రవేశం కల్పించారు. ‘సమానత్వమే సనాతన ధర్మం’ అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దళిత యువకుడు ప్రవీణ్ను డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తన భుజాలపై మోసుకుంటూ ఆలయంలోకి తీసుకెళ్లిన దృశ్యం అందరినీ కదిలించింది.
- P Shivteja
- Updated on: Aug 20, 2026
- 7:11 pm
ఘోర ప్రమాదం.. ఒక్కసారిగా బావిలోకి దూసుకెళ్లిన కారు..! కుటుంబం మొత్తం బలి
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు బావిలో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన రాజు, భాగ్యతో పాటు వారి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. సిద్దిపేట నుంచి బల్వంతపూర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు నలుగురి మృతదేహాలను వెలికితీసి దుబ్బాక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
- P Shivteja
- Updated on: Aug 20, 2026
- 9:29 am
ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు.. ప్రజావాణిలో వృద్ధుడి కన్నీటి గాథ!
కంటికి రెప్పలా పెంచిన చేతులే ఈరోజు ఆకలితో అల్లాడిపోతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను ప్రయోజకులను చేసిన ఆ తండ్రికి, చివరకు బుక్కెడు అన్నం పెట్టే నాథుడే కరువయ్యాడు. ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా ఆ వృద్ధుడు ఆకలి తీర్చుకోవడానికి ఊరంతా భిక్షాటన చేయాల్సి వస్తోంది. మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటన సమాజంలో మానవ సంబంధాలు ఎంత దిగజారిపోతున్నాయో చాటిచెబుతోంది.
- P Shivteja
- Updated on: Aug 19, 2026
- 5:24 pm
Medak: పక్కాగా ప్లాన్ చేశారు.. రాత్రి పూట వచ్చి పని పూర్తి చేసి వెళ్లారు..
మెదక్ జిల్లాలో దొంగలు వరుస ఏటీఎం చోరీలకు పాల్పడ్డారు. ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో గవ్వలపల్లి, మంభోజిపల్లిలోని ఎస్బీఐ ఏటీఎంలను టార్గెట్ చేశారు. మంభోజిపల్లిలో గ్యాస్ కట్టర్తో ఏటీఎం మిషన్ను ధ్వంసం చేసి రూ.14 లక్షల నగదును దోచుకెళ్లారు. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి దర్యాప్తు ముమ్మరం చేశారు.
- P Shivteja
- Updated on: Aug 19, 2026
- 4:29 pm
Viral Video: ఇలాంటి చోరీ ఎప్పుడూ చూసుండరు.. రెప్పపాటులో రూ.10లక్షల బంగారం ఎత్తుకెళ్లిన మహిళ!
బంగారం కొంటామని షాప్కు వచ్చారు.. మంచి డిజైన్లు చూపెట్టమని సిబ్బందిని మాటల్లో పెట్టారు. కట్ చేస్తే క్షణాల్లో రూ. 10 లక్షల విలువైన ఆభరణాలతో అక్కడి నుంచి పరారయ్యారు. సంగారెడ్డి జిల్లాలోని ఓ గోల్డ్ షాప్లో వెలుగు చూసిన ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
- P Shivteja
- Updated on: Aug 19, 2026
- 2:28 pm
Telangana: మాటల్లో పెట్టి.. మాయం.. ముక్కుపుడక కోసం వచ్చి ఏం చేశారో వీడియోలో చూడండి..
ముక్కుపుడక కావాలంటూ వచ్చారు.. వందల రూపాయల వస్తువు కొనేందుకు వచ్చినట్లే నటించి ఏకంగా రూ.10 లక్షల బంగారు నగల బాక్సునే లేపేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని జ్యువెలరీ షాపులో నలుగురు కిలాడీ లేడీస్ వేసిన పక్కా స్కెచ్ ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- P Shivteja
- Updated on: Aug 18, 2026
- 1:43 pm
Telangana: ఆస్తి పిచ్చి.. 62 ఏళ్ల భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగిని.. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ఏఎన్ఎం వృత్తిలో ఉంది. కానీ, ఆమె మనసు మొత్తం డబ్బు పై పేరాశతో నిండిపోయింది. ముసలి వయసులో తోడుగా ఉండాల్సిన భర్తను రోకలిబండతో కొట్టి ప్రాణాలు తీసింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగిన ఈ ఘోరం సంచలనంగా రేపింది.
- P Shivteja
- Updated on: Aug 17, 2026
- 3:55 pm
Watch: ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీటీవీ దృశ్యాలతో కిల్లర్ తల్లి, కొడుకు అరెస్ట్!
దుబ్బాక మండలం రామక్కపేట శివారులో ఈ నెల 8వ తేదీన ఒక మహిళ దహనమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ మర్డర్ మిస్టరీ సిద్దిపేట పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. అయితే, కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో విచారణ చేపట్టగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య కేసును ఛేదించిన తీరు చూసి స్వయంగా పోలీసులే కంగుతిన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
- P Shivteja
- Updated on: Aug 16, 2026
- 9:15 pm
అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాన్పు కోసం ఆస్పత్రిలో చేరిన అనిత అనే గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ నెల 10న ఆస్పత్రిలో చేరిన ఆమెకు బుధవారం ఉదయం డెలివరీ చేయాల్సి ఉండగా.. మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, బంధువులు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
- P Shivteja
- Updated on: Aug 12, 2026
- 7:28 pm
కమ్యూనిటీ సెంటర్ టాయిలెట్లో షాకింగ్ సీన్..! అమానుష ఘటనతో హడలెత్తిపోయిన స్థానికులు
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నప్రేమే కరువైందో లేదా సమాజానికి భయపడి చేసిన పాపాన్ని దాచుకోవాలనుకున్నారో తెలియదు గానీ, అప్పుడే కళ్లు తెరిచిన ఒక పసిగుడ్డును అత్యంత ఘోరంగా ప్రాణాలు తీశారు. మానవత్వం పూర్తిగా మంటగలిసిపోయేలా జరిగిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవజాత శిశువును కాలితో తొక్కి దారుణంగా చంపేశారు గుర్తుతెలియని కిరాతకులు. పూర్తి వివరాల్లోకి వెళితే..
- P Shivteja
- Updated on: Aug 12, 2026
- 5:22 pm
Telangana: “రెండు బస్తాలైనా ఇప్పించండి సారూ..” యూరియా కోసం సిబ్బంది కాళ్లపై పడ్డ అన్నదాత!
దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు ఎరువుల కష్టాలు తప్పడం లేదు. పంట చేతికి వచ్చే కీలక సమయంలో యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలు ఆందోళన కలిగిస్తున్నాయి. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట పీఏసీఎస్ కేంద్రం వద్ద చోటుచేసుకున్న ఓ ఘటన రైతుల దుస్థితికి అద్దం పడుతోంది. యూరియా బస్తాలు దొరకక తీవ్ర ఆవేదనకు గురైన ఓ రైతు.. కనీసం రెండు బస్తాలైనా ఇప్పించాలంటూ సొసైటీ సిబ్బంది కాళ్లపై పడి వేడుకున్నాడు.
- P Shivteja
- Updated on: Aug 12, 2026
- 4:42 pm
Road Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
Road Accident: రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలు జరుగకుండా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ప్రతి రోజు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, ఓవర్టెక్, మద్యం తాగి వాహనాలు నడపడం ఇలా రకరకాల కారణాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలతో ఎందరో అమాయకులు బలయవుతున్నారు.
- P Shivteja
- Updated on: Aug 12, 2026
- 12:21 pm