తెలుగు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్ల అనుభవం ఉంది..2009లో సిటీ ఛానల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2012లో ప్రజాశక్తి,లోకల్ టైమ్స్ పేపర్లో రిపోర్టర్ గా పనిచేసాను..2014 లో 99టీవీలో ఉమ్మడి మెదక్ జిల్లా రిపోర్టర్ గా చేసాను.. 2019లో టీవీ9లో జాయిన్ అయ్యాను..ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నాను…
భర్త కళ్లల్లో కారం కొట్టి దారుణం.. శనివారం అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో కుటుంబ కలహాల నేపథ్యంలో శ్రీరాములు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. భార్య సబిత, కుమారుడు భారత్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను, ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.
- P Shivteja
- Updated on: Sep 19, 2026
- 3:04 pm
డీజేలు లేవు, ఆర్భాటం లేదు.. స్వచ్చమైన భక్తి, భజనతో 80 ఏళ్లుగా ఏకదంతుడికి పూజలు!
డీజేల హోరు లేదు.. లేజర్ లైట్ల జిలుగులు లేవు.. ఉన్నదల్లా కేవలం అచ్చమైన భక్తి, తరతరాల సంప్రదాయం! బ్రిటీష్ కాలం నుంచి నేటి వరకు 80 ఏళ్లుగా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా, చక్రి భజనలతోనే గణనాథుడికి సేవలు చేస్తూ.. నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు సిద్దిపేట జిల్లా కొడకండ్ల గ్రామస్తులు.
- P Shivteja
- Updated on: Sep 19, 2026
- 3:22 pm
Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆస్పత్రులకు తరలింపు!
Sangareddy Food Poisoning News: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దలోడి ZP హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. భోజనం చేసిన తర్వాత సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పలువురిని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
- P Shivteja
- Updated on: Sep 17, 2026
- 10:07 pm
వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థుల దుర్మరణం!
వినాయక నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గణనాథుడి నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. పెద్దకంజర్లలోని నేరెడుచెరువులో ఈ విషాద ఘటన జరిగినట్లు సమాచారం. మృతులంతా శిరీష చారిటబుల్ ట్రస్ట్లో చదువుతున్న విద్యార్థులుగా తెలుస్తోంది.
- P Shivteja
- Updated on: Sep 17, 2026
- 10:47 am
Telangana: ధాన్య లక్ష్మి ఒడిలో లంబోదరుడు.. రామకోటి రామరాజు వినూత్న కళారూపం
వినాయక చవితి వచ్చేసింది.. దేశ వ్యాప్తంగా వీధివీధిన రకరకాల గణపయ్య విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అయితే సిద్దిపేట జిల్లాలో వినాయక చవితి సందర్భంగా భక్తికి సృజనాత్మకతను జోడిస్తూ నవధాన్యాలతో ఓ భక్తుడు రూపొందించిన గణపయ్య చిత్రం ఇప్పుడు అందరినీ తెగ ఆకట్టుకుంటుంది.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- P Shivteja
- Updated on: Sep 15, 2026
- 2:17 pm
ఇలా ఉన్నావేంట్రా బాబూ.. మెదక్ జిల్లాలో వింత చోరీ.. వెళ్తూ వెళ్తూ దొంగ ఏం చేశాడంటే..
మెదక్ జిల్లా చేగుంటలో వింత దొంగతనం వెలుగుచూసింది. నవదుర్గ హోటల్లోకి అర్ధరాత్రి చొరబడిన ఓ గుర్తుతెలియని వ్యక్తి సుమారు 300 మీటర్ల కేబుల్ వైరును కట్ చేసి ఎత్తుకెళ్లాడు. అంతేకాకుండా కిచెన్లోని పెరుగు డబ్బా, మరికొన్ని కిరాణా వస్తువులను కూడా తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిర్వాహకుల ఫిర్యాదుతో చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- P Shivteja
- Updated on: Sep 13, 2026
- 5:25 pm
Telangana: 1 నుంచి 30 అంకెలు చెప్పలేదని విద్యార్థిని చితకబాదిన టీచర్
Telangana: మూడో తరగతి విద్యార్థిని ఉపాధ్యాయుడు దారుణంగా కొట్టడం కలకలం రేపింది. 1 నుంచి 30 అంకెలు చెప్పలేదనే కారణంతో ఎనిమిదేళ్ల అర్హయ్ను టీచర్ చితకబాదగా, వీపుపై గాయాలయ్యాయి. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, పాఠశాల స్థాయిలో వివాదం సద్దుమణిగింది. విద్యార్థులపై టీచర్..
- P Shivteja
- Updated on: Sep 12, 2026
- 8:20 pm
ఎన్నికల హామీలే ఇప్పుడు భారంగా.. ప్రజాప్రతినిధులకు వినాయక చందాల సెగ!
మెదక్ జిల్లాలో ప్రజాప్రతినిధులకు వినాయక చవితి చందాల సెగ తగులుతోంది. ఎన్నికల ఖర్చుల నుంచి కోలుకోకముందే, గణపతి మండపాల నిర్వాహకులు చందాల కోసం ఒత్తిడి పెంచుతున్నారు. సర్పంచ్ నుండి ఎమ్మెల్యేల వరకు అందరూ ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు. గత ఎన్నికల హామీలు, అదనపు ఖర్చులు కలగలిపి, ఈ పండుగ నేతలకు కొత్త తలనొప్పిగా మారింది. కొందరు స్వంత నిధులతో ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు.
- P Shivteja
- Updated on: Sep 12, 2026
- 6:07 pm
అయ్యో కొడుకా ఎంత పని చేశావ్.. కన్నతల్లి మరణవార్త తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య..
తల్లి ప్రేమకు వెలకట్టలేమనడానికి ఈ ఘటన ఒక నిదర్శనం, కానీ ఆ ప్రేమ ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. కన్నతల్లి ఇక లేదనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేక 19 ఏళ్ల కుమారుడు చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో చోటుచేసుకున్న ఈ దారుణ సంఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
- P Shivteja
- Updated on: Sep 12, 2026
- 5:48 pm
సంగారెడ్డి జిల్లాలో ఘరానా మోసం.. స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ రుణాల్లో రూ.30 లక్షల అవకతవకలు
సంగారెడ్డి జిల్లాల్లో ఘరానా మోసం వెలుగు చూసింది. మహిళా సంఘాలకు మంజూరైన స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ సుమారు రూ.30 లక్షల మేర అవకతవకలు జరిగినట్టు తేలడంతో మహిళా సంఘ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకొని.. తమకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
- P Shivteja
- Updated on: Sep 12, 2026
- 11:09 am
Telangana: 10 వేల బస్తాల ధాన్యాన్ని ఎలుకలు తినేసాయట..
తూప్రాన్లోని మల్కాపూర్ సాయి బాలాజీ రైస్ మిల్లులో భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ధాన్యం బస్తాల్లో వరి పొట్టు కనిపించడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. 2022-23, 2024-25 సీజన్లకు సంబంధించిన 10,424 ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ధాన్యం ఎలుకలు తినేశాయని మిల్లు యాజమాన్యం చెప్పగా.. అధికారులు రికార్డులు, నిల్వలను పరిశీలించి కేసు నమోదు చేసి మిల్లును సీజ్ చేశారు.
- P Shivteja
- Updated on: Sep 10, 2026
- 5:25 pm
కల్లు దుకాణాలపై ఈగల్ టీం దాడులు.. 45 బాక్సుల కల్లు సీసాలు స్వాధీనం!
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 221 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లలో దశలవారీగా ఈ పార్లర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా ముందుగా 96 క్యాంటీన్లలో విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఈ క్యాంటీన్లలో భోజనం, పలు రకాల పిండి వంటకాలు అందిస్తున్నప్పటికీ.. వినియోగదారుల నుంచి..
- P Shivteja
- Updated on: Sep 10, 2026
- 12:55 pm