తెలుగు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్ల అనుభవం ఉంది..2009లో సిటీ ఛానల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2012లో ప్రజాశక్తి,లోకల్ టైమ్స్ పేపర్లో రిపోర్టర్ గా పనిచేసాను..2014 లో 99టీవీలో ఉమ్మడి మెదక్ జిల్లా రిపోర్టర్ గా చేసాను.. 2019లో టీవీ9లో జాయిన్ అయ్యాను..ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నాను…
Telangana: ఇంటికి తాళం వేసి కాశీ వెళ్లిన ఓనర్స్.. మార్నింగ్ పనిమనిషి వచ్చి చూడగా..
సిద్దిపేట జిల్లాలో భారీ దొంగతనం కలకలం రేపింది. అర్థరాత్రి ఎవరూ లేని ఇంట్లోకి దూరిన కొందరు దుండగులు.. ఇంట్లోని లాకర్ను ధ్వంసం చేసి అందులో ఉన్న బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. మార్నింగ్ ఇల్లు క్లీన్ చేసేందుకు వచ్చిన పనిమనిషి తాళాలు పగిలిపోయి ఉండడాన్ని చూడడంతో అసలు విషయం వెలుగలోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- P Shivteja
- Updated on: Jun 29, 2026
- 5:02 pm
నువ్వేం మగాడివిరా.. అనుమానంతో పుట్టబోయే బిడ్డకు DNA టెస్ట్ చేయాలంటూ వేధింపులు.. పాపం సుస్మిత..
కడుపులో ఉన్న బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేయాలంటూ భర్త, అత్త వేధింపులకు గురిచేయడంతో ఐదు నెలల గర్భిణి సుస్మిత ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు భర్త, అత్తపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
- P Shivteja
- Updated on: Jun 27, 2026
- 5:25 pm
Telangana: ఫ్యాక్షన్ సినిమాను మించిన ట్విస్ట్లు.. ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా ఎలా మారారో తెలిస్తే..
మెదక్ జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరి మధ్య మొదలైన చిన్న వివాదం.. చివరకు రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈఎంఐ గొడవలు, కుటుంబ అవమానాలు వెరసి.. ఒకరినొకరు మట్టుబెట్టుకునేలా చేశాయి. ఇంతకీ ఆ ఇద్దరి స్నేహితుల మధ్య జరిగిందేంటో తెలుసుకోవాలంటే ఈ పూర్తి స్టోరీ చదవాల్సిందే.
- P Shivteja
- Updated on: Jun 23, 2026
- 3:37 pm
Telangana: మనవడే యముడయ్యాడు.. బైక్ కొనేందుకు నగలు ఇవ్వలేదని.. ఫ్రెండ్తో కలిసి..
ఆశకు అంతు లేదు.. అనుబంధాలకు విలువ లేదు అన్నట్లుగా మారింది ప్రస్తుత సమాజం. బైక్ కొనుక్కోవాలనే ఓ జల్సా రాయుడి కోరిక.. ఏకంగా అమ్మమ్మ ప్రాణాలనే బలి తీసుకుంది. బండి కొనేందుకు అమ్మమ్మ ఒంటిపై ఉన్న నగలపై కన్నేసిన మనవడు.. ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆమెది సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ చివరకు పోలీసులకు చిక్క కటకటాల పాలయ్యాడు.
- P Shivteja
- Updated on: Jun 23, 2026
- 2:20 pm
Medchal: కామమోహంలో కన్నబిడ్డను బలి చేసిన తల్లి.. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న వేళ ఏడ్చాడని..
ప్రియుడితో ఉన్న సమయంలో అడ్డువస్తున్నాడనే కారణంతో రెండేళ్ల కుమారుడిని తల్లి, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో కలకలం రేపింది. ఫిట్స్తో మృతి చెందినట్లు నమ్మించి అంత్యక్రియలు నిర్వహించినా, 20 రోజుల తర్వాత నిజం బయటపడడంతో పోలీసులు తల్లిని అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలిస్తున్నారు.
- P Shivteja
- Updated on: Jun 20, 2026
- 7:03 pm
స్మార్ట్ఫోన్ కొనడం ప్రాణాల మీదకు తెచ్చింది.. ఈఎంఐ భయంతో యువకుడి ఆత్మహత్య!
మెదక్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఈఎంఐపై కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నర్సాపూర్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో జరిగింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- P Shivteja
- Updated on: Jun 17, 2026
- 4:11 pm
Telangana: ఇదేందిరా సామి.. ఉత్త వాటర్ క్యాన్ రూ.75 వేలా..!
సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం శంకరయ్యకుంట గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన బాలవికాస్ వాటర్ ప్లాంట్లో తొలి వాటర్ క్యాన్కు నిర్వహించిన వేలం ఆసక్తికరంగా మారింది. ప్లాంట్ నిర్వహణ కోసం మూలనిధి సమీకరించే ఉద్దేశంతో నిర్వహించిన వేలంలో గ్రామానికి చెందిన ఏర్వ శ్రీను రూ.75 వేల బిడ్ వేసి తొలి క్యాన్ను సొంతం చేసుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఆయన క్యాన్ను అందుకున్నారు.
- P Shivteja
- Updated on: Jun 16, 2026
- 7:49 pm
Telangana: మహిళా లెక్చరర్కు అసభ్యకర మెసేజ్లు.. సీన్కట్చేస్తే.. కాంట్రాక్టర్ కుమారుడికి ఊహించని షాక్..
మెదక్ జిల్లా కౌడిపల్లిలోని దారుణం వెలుగు చూసింది. స్థానికంగా గిరిజన గురుకుల కాలేజీలో విధులు నిర్లవహిస్తున్న లెక్చరర్పై కన్నేసిన క్యాటరింగ్ కాంట్రాక్టర్ కుమారుడు.. ఆమెను వేధింపులకు గురి చేయడంతో పాటు దాడికి కూడా పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- P Shivteja
- Updated on: Jun 16, 2026
- 1:31 pm
కూర్చొనే అవకాశం కూడా లేదే.. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల నరక యాతన
ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్న అవి ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు.. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం కారణంగా నెలలు నిండిన గర్భిణీ స్త్రీలు నరక యాతన అనుభవిస్తున్నారు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేకపోవడంతో గంటల తరబడి నేలపైనే కూర్చోవాల్సిన దుస్థితి దాపురించింది.
- P Shivteja
- Updated on: Jun 16, 2026
- 12:50 pm
పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
Medak Baby Sale Case: ఉమ్మడి మెదక్ జిల్లాలో మరో శిశు విక్రయ ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ గ్రామానికి చెందిన మహిళ తన రెండు నెలల మగ శిశువును దత్తత ఇచ్చినట్లు చెబుతుండగా, డబ్బుల కోసం అక్రమంగా విక్రయించారనే అనుమానాలపై మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శిశు విక్రయానికి సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
- P Shivteja
- Updated on: Jun 15, 2026
- 5:34 pm
పురి విప్పి నాట్యం చేసే నెమళ్లకు ఏమైంది.. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా నిశ్శబ్దం.. అసలేం జరిగిందంటే..
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండరాజుపల్లి గ్రామ పరిధిలోని ఏనుగురాళ్ల సమీపంలో ఐదు నెమళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కళేబరాలను స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. విషపు గింజలు కారణమా? లేక ఏదైనా వ్యాధి ప్రభావమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
- P Shivteja
- Updated on: Jun 15, 2026
- 1:49 pm
ఫ్రీగా బంగారాన్ని మెరిపిస్తామంటూ మాయ చేశారు! ఒంటరి మహిళను టార్గెట్ చేసి..
పాత బంగారం ఉచితంగా శుభ్రం చేస్తామంటూ వచ్చిన మోసగాళ్లు సిద్దిపేటలో ఒక అమాయక మహిళను వంచించారు. చాకచక్యంగా ఆమె పుస్తెల తాడు నుండి 9 గ్రాముల బంగారాన్ని కత్తిరించి మాయం చేశారు. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి నూతన మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.
- P Shivteja
- Updated on: Jun 14, 2026
- 1:08 pm