AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

P Shivteja

P Shivteja

Reporter - TV9 Telugu

shivatheja.pulluri@tv9.com

తెలుగు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్ల అనుభవం ఉంది..2009లో సిటీ ఛానల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2012లో ప్రజాశక్తి,లోకల్ టైమ్స్ పేపర్లో రిపోర్టర్ గా పనిచేసాను..2014 లో 99టీవీలో ఉమ్మడి మెదక్ జిల్లా రిపోర్టర్ గా చేసాను.. 2019లో టీవీ9లో జాయిన్ అయ్యాను..ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నాను…

Read More
పోలీసులకు దొరక్కుండా ఇన్‌స్టాగ్రామ్ కాల్స్.. కట్ చేస్తే.. సీన్ రివర్స్ చేసిన ఖాకీలు!

పోలీసులకు దొరక్కుండా ఇన్‌స్టాగ్రామ్ కాల్స్.. కట్ చేస్తే.. సీన్ రివర్స్ చేసిన ఖాకీలు!

పోలీసుల నిఘా నుండి తప్పించుకోవడానికి నేరస్థులు సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు. సాధారణ ఫోన్ కాల్స్ చేస్తే లొకేషన్ ఆధారంగా పోలీసులు సులభంగా పట్టుకుంటారనే భయంతో, కేవలం ఇన్‌స్టాగ్రామ్ కాల్స్ మాత్రమే మాట్లాడుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ములుగు మండలం చిన్నతిమ్మాపూర్ గ్రామంలో జరిగిన 20 తులాల భారీ బంగారం, నగదు దొంగతనం కేసులో

రాత్రైనా ఇంటికి చేరుకోని ఆ ముగ్గురు పిల్లలు.. కాసేపటికే ఊరంతా పరుగులు! ఏం జరిగిందంటే

రాత్రైనా ఇంటికి చేరుకోని ఆ ముగ్గురు పిల్లలు.. కాసేపటికే ఊరంతా పరుగులు! ఏం జరిగిందంటే

సంగారెడ్డి జిల్లా రైకోడ్ మండలం రామోజిపల్లి గ్రామంలో ఈతకు వెళ్లిన ముగ్గురు మైనర్ బాలురు చెరువులో మునిగి మృతి చెందారు. మృతులను నిరంజన్ (13), బసవరాజు (10), మరియు మణి (12) గా గుర్తించారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఈత కొట్టడానికి చెరువులోకి దిగారు. లోతు అంచనా వేయలేక కాసేపటికే ముగ్గురూ మృత్యువాత పడ్డారు..

స్కూల్‌ టీచర్స్‌ వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన అర్టెంట్‌ అనే ఒక్క మెసేజ్.. క్లిక్ చేయగానే..

స్కూల్‌ టీచర్స్‌ వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన అర్టెంట్‌ అనే ఒక్క మెసేజ్.. క్లిక్ చేయగానే..

సమయం, సందర్భం చూసి సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను దోచుకుంటున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి వాట్సాప్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. తోటి ఉపాధ్యాయులు, మిత్రుల నుండి లక్ష రూపాయలకు పైగా కాజేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మనకు తెలిసిన వారే కదా అని వాట్సాప్ మెసేజ్‌లను నమ్మితే ఎంతటి ప్రమాదమో ఈ ఘటన నిరూపిస్తోంది. అసలేం జరిగిందంటే..

దారుణం… భార్యపై అనుమానంతో భర్త కిరాతకం.. గొడ్డలితో రెండు కాళ్లు నరికేసి..

దారుణం… భార్యపై అనుమానంతో భర్త కిరాతకం.. గొడ్డలితో రెండు కాళ్లు నరికేసి..

కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే ఆమెపై కసాయిగా మారాడు. అనుమానం అనే పెనుభూతం ఆలుమగల బంధాన్ని బలితీసుకుంది. క్షణికావేశంలో ఒక వ్యక్తి చేసిన పని ఇప్పుడు ఒక మహిళను ప్రాణాపాయ స్థితిలోకి నెట్టడమే కాకుండా, ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసింది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం గంగోజిపేట గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బ్యాంక్‌ మేనేజర్ లీలలు.. పనిచేస్తున్న చోటే గుట్టుగా కోట్ల స్కాం..! ఫేక్‌ గోల్డ్‌తో ఏకంగా..

బ్యాంక్‌ మేనేజర్ లీలలు.. పనిచేస్తున్న చోటే గుట్టుగా కోట్ల స్కాం..! ఫేక్‌ గోల్డ్‌తో ఏకంగా..

ఆన్‌లైన్ బెట్టింగుల వ్యసనం ఎంతోమంది జీవితాలను అధోగతి పాలు చేస్తుంది...తాజాగా బెట్టింగ్‌లకు అలవాటు పడ్డ, ఒక బాధ్యతాయుతమైన బ్యాంక్ మేనేజర్‌ను ఘరానా కేడీగా మార్చింది...నమ్మి కుర్చీ ఇస్తే.. ఏకంగా తను పనిచేసే బ్యాంకుకే కన్నం వేశాడు ఆ మేనేజర్..భార్య, స్నేహితుల ఐడీ కార్డులతో నకిలీ ఖాతాలు తెరిచి..వన్ గ్రామ్ గోల్డ్‌ను అసలు బంగారంగా నమ్మించి కోట్లకు కోట్లు నొక్కేశాడు.. పూర్తి వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఘోర ప్రమాదం.. వడ్లు ఆరబెట్టే యంత్రంలో చిక్కుకున్న మహిళా కూలీ తల!

ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఘోర ప్రమాదం.. వడ్లు ఆరబెట్టే యంత్రంలో చిక్కుకున్న మహిళా కూలీ తల!

అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించే ధాన్యం కొనుగోలు కేంద్రం ఒక పేద కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పని కోసం వెళ్లిన చోట యంత్రం రూపంలో మృత్యువు కబళించడంతో ఒక మహిళా కూలీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. క్షణాల్లోనే తల యంత్రంలోకి వెళ్లడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

Telangana: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. జాబ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చారు.. కట్‌చేస్తే..

Telangana: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. జాబ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చారు.. కట్‌చేస్తే..

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. నిండు నూరేళ్లు కలిసి ఉంటామని బాసలు చేశారు. పెద్దలను ఒప్పించి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కానీ, ఆ బంధం నెల రోజులు కూడా నిలవలేదు.. చిన్నపాటి అనుమానం పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది. భార్య ఆత్మహత్య చేసుకుందన్న బాధతో, భర్త కూడా తనువు చాలించిన హృదయ విదారక ఘటన సిద్దిపేట జిల్లాలో కలకలం రేపుతోంది.

Telangana: హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆ పక్కనే కనిపించిన సూసైడ్ నోట్.. ఓపెన్ చేయగా..

Telangana: హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆ పక్కనే కనిపించిన సూసైడ్ నోట్.. ఓపెన్ చేయగా..

సాధారణంగా మద్యం తాగి ఆటో నడిపే వారిని చూసాం.. కానీ ఇక్కడో ఆటో డ్రైవర్ మాత్రం అందుకు బిన్నంగా ఎలుకల మందు తాగి ఆటో నడిపాడు. అవును వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. విషం శరీరమంతా పాకడంతో నియంత్రణ కోల్పోయి రోడ్డుపై ఆరబోసిన వరికుప్పలను ఢీకొట్టి బోల్తా పడ్డాడు. ఇంతకు అతను ఎలుకల మందు ఎందుకు తాగాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

మొగుడు పెళ్ళాం మధ్య గొడవ.. సర్దిచెప్పడానికి వచ్చిన అత్త.. కాసేపటికే తలుపు వేసి..

మొగుడు పెళ్ళాం మధ్య గొడవ.. సర్దిచెప్పడానికి వచ్చిన అత్త.. కాసేపటికే తలుపు వేసి..

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా వట్‌పల్లిలో తీవ్ర కలకలం రేపిన ఘటన ఇది. మద్యం మత్తుకు బానిసైన ఓ అల్లుడు, గొడవలు సర్దుబాటు చేసేందుకు వచ్చిన అత్తపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్సాన్‌పల్లి నుంచి వచ్చిన బాధితురాలు వట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడు మహ్మద్ గరీబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తు మనుషులను ఎలా మృగంగా మారుస్తుందో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

ప్రాణ స్నేహితుడినే పొట్టనబెట్టుకున్న కానిస్టేబుల్.. ఎందుకో తెలిసి పోలీసులే షాక్..!

ప్రాణ స్నేహితుడినే పొట్టనబెట్టుకున్న కానిస్టేబుల్.. ఎందుకో తెలిసి పోలీసులే షాక్..!

రక్షక భట నిలయంలో ఉండి సమాజాన్ని కాపాడాల్సిన ఒక కానిస్టేబుల్, వ్యసనాలకు బానిసై కరడుగట్టిన నేరస్తుడిగా మారాడు. సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రకంపనలు సృష్టించింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల మత్తులో పడి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన కానిస్టేబుల్, తనకి ఆర్థికంగా ఆసరాగా నిలిచిన స్నేహితుడినే అత్యంత కిరాతకంగా అంతమొందించాడు.

చనిపోయిందని నమ్మించి శిశువు మాయం.. చివరికి వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం!

చనిపోయిందని నమ్మించి శిశువు మాయం.. చివరికి వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం!

మెదక్ జిల్లాలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళకు ఆడ శిశువు జన్మించగా, ఆ శిశువు మృతి చెందిందని తప్పుడు సమాచారం ఇచ్చి, అక్రమంగా విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేయగా, సంబంధిత ఆసుపత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు.

Telangana: ఆ ఇంటిని మృత్యువు ముసిరింది.. ఒకరు వెంట ఒకరు…

Telangana: ఆ ఇంటిని మృత్యువు ముసిరింది.. ఒకరు వెంట ఒకరు…

అనుమానం అగ్నికుండలా చెలరేగి ఒక కుటుంబాన్ని పూర్తిగా మింగేసింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఇద్దరి ప్రాణాలు తీసుకోగా, ఆ బాధను తట్టుకోలేక కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకం. వారం రోజుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో సదాశివపేటలో విషాదం అలుముకుంది.