తెలుగు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్ల అనుభవం ఉంది..2009లో సిటీ ఛానల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2012లో ప్రజాశక్తి,లోకల్ టైమ్స్ పేపర్లో రిపోర్టర్ గా పనిచేసాను..2014 లో 99టీవీలో ఉమ్మడి మెదక్ జిల్లా రిపోర్టర్ గా చేసాను.. 2019లో టీవీ9లో జాయిన్ అయ్యాను..ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నాను…
Sangareddy: పశువులను మేపడానికి వెళ్లిన కాపలాదారులు.. కనిపించినవి చూసి స్టన్
సంగారెడ్డి జిల్లా మెలిగిరిపేట గ్రామ శివారులో 20కి పైగా మొసలి పిల్లలు, 60కిపైగా గుడ్లు లభించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వాటిని సురక్షితంగా మంజీరా వన్యప్రాణి అభయారణ్యానికి తరలించారు. అయితే తల్లి మొసలి ఆచూకీపై గ్రామస్తుల్లో ఇంకా ఆందోళన కొనసాగుతోంది.
- P Shivteja
- Updated on: Jun 8, 2026
- 7:27 pm
మూగజీవిపై ఇంత ప్రేమా? మనుషుల లాగే కొండేంగకు అంత్యక్రియలు.. ఎక్కడో తెలుసా?
మూగజీవాల పట్ల మనుషులు క్రూరంగా ప్రవర్తిస్తున్న ఈ రోజుల్లో.. ఒక కొండెంగ చనిపోతే ఆ ఊరంతా కన్నీరుమున్నీరైంది. తమ ఇంట్లో మనిషి చనిపోతే ఎలాగైతే అంత్యక్రియలు నిర్వహిస్తారో.. అలాగే ఆ మూగజీవికి కన్నీటి వీడ్కోలు పలికారు. సిద్దిపేట జిల్లాలో మానవత్వాన్ని చాటిన ఈ అరుదైన సంఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది
- P Shivteja
- Updated on: Jun 5, 2026
- 9:49 pm
రైతుల ప్రాణాలు బలి తీసుకుంటున్న వరి కొయ్యలు.. 5 రోజుల్లో ఇద్దరు మృతి! ఏం జరిగిందంటే?
పొలాన్ని శుభ్రం చేద్దామనుకున్న రైతుల ప్రాణాలను వరికొయ్యలే బలితీసుకుంటున్నాయి. ఐదు రోజుల వ్యవధిలోనే సిద్దిపేట జిల్లాలో ఇద్దరు రైతులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. వరి కోతల తర్వాత మిగిలిన కొయ్యలను తగలబెట్టే క్రమంలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి..
- P Shivteja
- Updated on: Jun 4, 2026
- 5:25 pm
అడవి పూలే దండలుగా.. పచ్చటి ఆకుల అక్షింతలుగా.. ఉపాధిహామీ సాక్షిగా ఆత్మీయ కల్యాణం!
పెళ్లి అంటే పూల పందిరి, పట్టుచీరలు, తలంబ్రాలు, వందల మంది అతిథులు ఉంటారు. కానీ ఓ దగ్గర జరిగిన పెళ్లికి కేవలం ఆత్మీయత మాత్రమే తోడు అయ్యింది. ఇక్కడ జరిగిన పెళ్లికి మంగళసూత్రాలు లేవు.. బాజాభజంత్రీలు లేవు.. చుట్టు ఉన్న అడవిలో దొరికిన రంగురంగుల పూలనే పూల దండలుగా మార్చారు. పచ్చటి ఆకులనే అక్షింతలుగా, ఒడిబియ్యంగా ఉపయోగించారు.
- P Shivteja
- Updated on: Jun 4, 2026
- 3:38 pm
‘నేను తీసుకోని లోన్ ఎలా కట్టాలి?’.. బ్యాంక్ నోటీసులతో రైతు ఏం చేశాడంటే..?
Sangareddy Farmer News: సంగారెడ్డి జిల్లాలో ఓ రైతు తీసుకోని రుణం తన పేరుపై నమోదైందని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ను ఆశ్రయించాడు. బ్యాంక్ రికార్డుల్లో పొరపాటు కారణంగా లోన్ కట్టాలంటూ అధికారులు వేధిస్తున్నారని రైతు శంకరయ్య కన్నీటి పర్యంతమై ప్రజావాణిలో న్యాయం కోరాడు.
- P Shivteja
- Updated on: Jun 4, 2026
- 12:01 pm
Telangana: అయ్యో రైతన్నా.. ఎంత కష్టమొచ్చే.. కళ్ల ముందే పంట మొత్తం.. వీడియో చూడండి..
రెక్కలు ముక్కలు చేసుకుని, అప్పులు తెచ్చి పండించిన పంట అది.. మరో రెండు రోజుల్లో చేతికి డబ్బులొస్తాయనుకున్న తరుణంలో విధి ఎంత దారుణంగా కన్నెర్ర జేసిందంటే.. కండ్లముందే 40 బస్తాల ధాన్యం బూడిదైపోయింది. మెదక్ జిల్లాలో అడవిలో పెట్టిన మంటల కారణంగా సర్వస్వం కోల్పోయిన ఒక సామాన్య అన్నదాత కన్నీటి గాథ ఇదీ..
- P Shivteja
- Updated on: Jun 4, 2026
- 11:51 am
Telangana: నువ్వేం తల్లివమ్మా.. అప్పుడే పుట్టిన బిడ్డను హాస్పిటల్ వెనకాల వదిలేసి వెళ్లిన మహిళ!
సంగారెడ్డిలో మానవత్వం మంటగలిసే సంఘటప వెలుగు చూసింది. ఓ మహిళ అప్పుడే పుట్టిన పసికందును ప్రభుత్వ ఆసుపత్రి వెనుక వదిలివేసి వెళ్లిపోయింది. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు సకాలంలో పసికందను హాస్పిటల్కు తరలించడంతో పెను విషాదం తప్పింది. హాస్పిటల్ సిబ్బంది ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- P Shivteja
- Updated on: Jun 2, 2026
- 5:42 pm
భర్త కళ్లముందే ఘోరం.. సంతకు వెళ్లి వస్తుండగా అడ్డుకుని.. మహిళ గొంతు కోసి కిరాతకం.. !
సంగారెడ్డి జిల్లాలోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత భయంకరమైన, సంచలన ఘటన వెలుగుచూసింది. సంతకు వెళ్లి భర్తతో కలిసి బైక్పై తిరిగి వస్తున్న ఒక మహిళను గుర్తు తెలియని దుండగులు అడ్డుకుని, అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘోర ఉదంతం బొల్లారం పారిశ్రామికవాడలోని ఐడీఏ క్రీడా ప్రాంగణం వద్ద తీవ్ర కలకలం రేపింది.
- P Shivteja
- Updated on: May 31, 2026
- 7:14 pm
నువ్వేం మనిషి అంజయ్య.. అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను చంపి..
Bike Dispute Tragedy: అదనపు కట్నం కోసం జరిగిన వేధింపులు ఓ నవవధువు ప్రాణాన్ని బలిగొన్నాయి. బైక్ కొనివ్వలేదనే కారణంతో భర్త తన భార్యను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. భార్య మృతితో తీవ్ర ఆందోళనకు గురైన అతడు అనంతరం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
- P Shivteja
- Updated on: May 30, 2026
- 5:45 pm
ఆ ఒక్క రశీదు నమ్మి ఘోరంగా మోసపోయిన ప్రజాప్రతినిధి! సర్పంచ్ ఖాతా ఖాళీ!
ఎదుటివారి ఆశనే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే అత్యాశను పెట్టుబడిగా మార్చుకుంటూ సామాన్యులనే కాదు, ఏకంగా ప్రజాప్రతినిధులను సైతం బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ సర్పంచ్ సైబర్ కేటుగాళ్ల మాయమాటలు నమ్మి ఏకంగా రూ. 3.92 లక్షలు సమర్పించుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
- P Shivteja
- Updated on: May 30, 2026
- 12:00 pm
Telangana: రాత్రి పడుకుని.. ఉదయం లేచి చూసేసరికి ఆ కాలనీలోని కార్లన్నీ ఇలానే
సంగారెడ్డి జిల్లా జోగిపేట హౌసింగ్ బోర్డు కాలనీలో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు రెచ్చిపోయారు. ఇండ్ల ముందు రోడ్డుపై పార్క్ చేసిన కార్లను టార్గెట్ చేస్తూ రాళ్లు, కర్రలతో విండ్షీల్డ్లు, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అర్ధరాత్రి పెద్ద శబ్దాలు రావడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం లేచి చూసేసరికి..
- P Shivteja
- Updated on: May 29, 2026
- 9:55 pm
ఖాకీ ఓవర్ యాక్షన్.. న్యాయం కోసం వస్తే అడవిలో వదిలేసిన ఎస్సై.. పోలీస్ స్టేషన్ ముట్టడించిన మహిళలు!
రక్షణ కల్పించాల్సిన ఖాకీలే బాధితుల పట్ల రాక్షసంగా ప్రవర్తిస్తే ఇక సామాన్యులకు దిక్కెవరు? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రభుత్వం ఎంత చెబుతున్నా, క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల ప్రవర్తన వల్ల పోలీస్ శాఖకే మచ్చ వస్తోంది. న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఒక వృద్ధురాలికి సంగారెడ్డి జిల్లా ఝరాసంగం పోలీస్ స్టేషన్లో ఘోర అవమానం ఎదురైంది. బాధితురాలిని ఆదుకోవాల్సిన ఎస్సై, ఆమెను నడి అడవిలో వదిలేసి రావడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అసలేం జరిగిందంటే?:
- P Shivteja
- Updated on: May 26, 2026
- 9:07 pm