తెలుగు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్ల అనుభవం ఉంది..2009లో సిటీ ఛానల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2012లో ప్రజాశక్తి,లోకల్ టైమ్స్ పేపర్లో రిపోర్టర్ గా పనిచేసాను..2014 లో 99టీవీలో ఉమ్మడి మెదక్ జిల్లా రిపోర్టర్ గా చేసాను.. 2019లో టీవీ9లో జాయిన్ అయ్యాను..ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నాను…
అమ్మమ్మపై అపారమైన ప్రేమ.. తులాభారంతో సన్మానం..! బర్దీపూర్ కుటుంబం ఆదర్శం
సోషల్ మీడియాలో వృద్ధులపై దాడులు, తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తున్న వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో, మానవత్వానికి, కుటుంబ బంధాలకు అద్దం పట్టే సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఝరాసంగం మండలం బర్దీపూర్ గ్రామానికి చెందిన గూటూరు సుగుణమ్మ కుటుంబ సభ్యులు ఆమెపై ఉన్న మమకారాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ఆమె కుమార్తెలు, మనవళ్లు కలిసి సుగుణమ్మకు అత్యంత వైభవంగా తులాభారం నిర్వహించారు.
- P Shivteja
- Updated on: Apr 6, 2026
- 9:03 am
Telangana: 5 పదుల వయసు దాటిన ఆళిపై అనుమానం.. పెనుభూతంగా మారి..
సంగారెడ్డి జిల్లాలో అనుమానం దారుణానికి దారితీసింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. పటాన్ చెరు పరిధిలోని ఏపీఆర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొడుకు, కోడలు బయటకు వెళ్లిన సమయంలో గొడవకు దిగిన భర్త, భార్యపై దాడి చేసి కత్తితో పలు మార్లు పొడిచాడు.
- P Shivteja
- Updated on: Apr 5, 2026
- 7:59 pm
Telangana: తండ్రిని దారుణం కొట్టి చంపిన భార్య, కొడుకు.. తెలంగాణలో ఘాతుకం..
సంగారెడ్డి జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. వృద్దుడిని భార్య, కుమారుడు కలిసి దారుణంగా హత్య చేశారు. కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. గాయాలతో వృద్దుడు ప్రాణాలు విడిచాడు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
- P Shivteja
- Updated on: Apr 1, 2026
- 8:46 pm
Telangana: కోటి ఆశలతో పెళ్లికి సిద్ధమయ్యాడు.. ఎంగేజ్మెంట్ జరిగిన కొన్ని రోజులకే..
పెళ్లి భాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి రద్దు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లిపీటలెక్కాల్సిన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
- P Shivteja
- Updated on: Mar 28, 2026
- 10:27 pm
Telangana: ఫుల్గా తాగాడు.. బైక్ వద్దకు వెళ్లాడు.. కట్చేస్తే.. అతను చేసిన పనికి..
మద్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, అలానే పక్కవారి ప్రాణాలు కూడా తీస్తున్నారు. తాజాగా మద్యం తాగిన మత్తులో ఏం చేస్తున్నానో అనే సోయి లేకుండా ఓ యువకుడు పెట్రోల్ తాగేశాడు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్కు తరించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
- P Shivteja
- Updated on: Mar 28, 2026
- 9:14 pm
Medak: రోడ్డుపై వెళ్తుండగా కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా.. కళ్లు జిగేల్..
ఒక వ్యక్తి పోగొట్టుకున్న తొమ్మిది తులాల బంగారు ఆభరణాలను తూప్రాన్ పోలీసులు గంటలోపే గుర్తించారు. వివరాల ప్రకారం, బంగారు ఆభరణాలు ఉన్న తన బ్యాగ్ను బైక్ హ్యాండిల్కు తగిలించుకున్న తలారి నరసింహులు, శుక్రవారం తూప్రాన్ మండలంలోని బ్రహ్మనాపల్లి రైల్వే గేట్ వద్ద దానిని పోగొట్టుకున్నారు.
- P Shivteja
- Updated on: Mar 28, 2026
- 10:01 am
బెల్ట్ షాపులకు బ్రేక్.. తాగితే రూ. 10 వేలు, అమ్మితే రూ. 50 వేలు ఫైన్! మహిళల మాస్ వార్నింగ్
మెదక్ జిల్లాలో మహిళలు కన్నెర్ర చేసిన ఈ సంఘటన సామాజిక మార్పుకు ఒక గొప్ప ఉదాహరణ. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కారాజుపేట గ్రామ మహిళలు మద్యం మహమ్మారిపై ఉక్కుపాదం మోపారు. గ్రామంలో విచ్చలవిడిగా వెలుస్తున్న బెల్ట్ షాపుల వల్ల యువత ప్రాణాలు కోల్పోవడం, కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడాన్ని నిరసిస్తూ మహిళా సంఘాలన్నీ ఏకమయ్యాయి. విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించిన మహిళలు, గ్రామాన్ని మద్యపాన రహితంగా మార్చేందుకు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
- P Shivteja
- Updated on: Mar 26, 2026
- 6:38 pm
దొంగలు రూటు మార్చారు జాగ్రత్త.. బైక్పై వచ్చి ఏం చేశారో తెలుసా..?
బంగారం కోసం దొంగలు పెట్రేగిపోతున్నారు.. వృద్ధులను టార్గెట్ చేస్తున్నారు.. తాజాగా.. మెదక్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. చిన్నశంకరంపేట మండలం జంగరాయిలో వృద్ధ దంపతులపై దాడి చేసి, వారి ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకెళ్లారు దుండగులు.
- P Shivteja
- Updated on: Mar 25, 2026
- 8:46 pm
Watch Video: ఆస్తుల పంపకాల్లో తేడా.. పోలీసుల ముందే తమ్ముడు-అక్కల రచ్చరంబోలా! వీడియోలు తీసిన జనాలు
సంగారెడ్డిలోని మద్దికుంట తండాకు చెందిన తమ్ముడికి, నర్సాపూర్ తండాలో ఉంటున్న అతని అక్కలకు మధ్య ఆస్తి విషయంలో గత కొద్ది నెలలుగా గొడవ మొదలైంది. తమ్ముడు తమకు అన్యాయం చేస్తున్నాడంటూ అక్కలు ఫిర్యాదు చేసేందుకు సదాశివపేట పట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చారు. అయితే ఇది కుటుంబ వ్యవహారం..
- P Shivteja
- Updated on: Mar 25, 2026
- 9:43 am
Telangana: దారుణం.. అప్పు తీర్చలేదనీ వ్యక్తిపై కల్లు సీసాలతో దాడి! వీడియో వైరల్
అప్పు వివాదం చినికి చినికి గాలివానలా మారింది. బాకీ ఉన్న డబ్బుల కోసం ఓ వ్యక్తిపై కల్లు సీసాలతో అమానుషంగా దాడి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. డబ్బుల కోసమే ఐదుగురు వ్యక్తులు కలిసి ఒకరిపై దాడి చేయడంతో బాధితుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు..
- P Shivteja
- Updated on: Mar 25, 2026
- 8:25 am
Telangana: అమ్మబాబోయ్.. జర్రుంటే ప్రాణాలు పోయేవి.. ఈ వీడియో చూస్తే స్టన్ అవ్వాల్సిందే..
ప్రశాంతంగా ఉన్న పటేల్ పుర వీధిలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి రేగింది. జనవాసాల్లోకి చొరబడిన అడవి పంది కంటపడిన వారిని కంటపడినట్లు వేటాడింది. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడగా.. స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
- P Shivteja
- Updated on: Mar 23, 2026
- 7:37 pm
కాలికి చిన్న గాయం.. ఎలుక కరిచిందేమో అని లైట్ తీసుకుంది.. కొన్ని గంటలు గడిచేసరికి..!
పాము కాటుతో విద్యార్థి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామంలో చోటుచేసుకుంది.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన సింధుజ(17) ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఇల్లు శుభ్రం చేస్తున్న క్రమంలో పాము కాటుకు గురైంది. ఎలుక కరిచిందని భావించిన కుటుంబసభ్యులు నిర్లక్ష్యం చేశారు.
- P Shivteja
- Updated on: Mar 20, 2026
- 9:54 pm