తెలుగు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్ల అనుభవం ఉంది..2009లో సిటీ ఛానల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2012లో ప్రజాశక్తి,లోకల్ టైమ్స్ పేపర్లో రిపోర్టర్ గా పనిచేసాను..2014 లో 99టీవీలో ఉమ్మడి మెదక్ జిల్లా రిపోర్టర్ గా చేసాను.. 2019లో టీవీ9లో జాయిన్ అయ్యాను..ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నాను…
ఆడంబరాల కంటే ఆధ్యాత్మికతే మిన్న: భగవద్గీతనే పెళ్లి పత్రికగా మార్చిన దంపతులు!
వివాహ వేడుక అనగానే ఖరీదైన డెకరేషన్లు, లక్షల రూపాయల ఖర్చుతో కూడిన వెడ్డింగ్ కార్డ్స్ గుర్తుకు వస్తాయి. కానీ సంగారెడ్డి జిల్లాలో ఒక కుటుంబం మాత్రం తమ ఇంటి వివాహాన్ని హిందూ ధర్మ ప్రచారానికి, సమాజ హితానికి ఒక మార్గంగా ఎంచుకుంది. ఆడంబరాల కంటే విజ్ఞానాన్ని పంచడమే మిన్న అని నిరూపిస్తూ వారు చేసిన ప్రయోగం ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోంది.
- P Shivteja
- Updated on: Apr 28, 2026
- 8:36 pm
Hyderabad: మరీ ఇలా ఉన్నవేంట్రా బాబు..! రూ.10కి సాంబార్ ఇవ్వలేదని తల్వార్తో దాడి.. ఆ తర్వాత
సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని ఓ కర్రీ పాయింట్లో రూ.20 సాంబార్ తగ్గింపు విషయంలో మద్యం మత్తులో ఉన్న జీవన్, క్యాషియర్ ఉదయ్పై తల్వార్తో దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ఉదయ్కు తీవ్ర గాయాలయ్యాయి.. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడు జీవన్ పరారీలో ఉన్నాడు, పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.
- P Shivteja
- Updated on: Apr 26, 2026
- 11:35 am
తండాలో కలకలం.. భార్య-కొడుకు కలిసి భర్తను చంపి.. సినిమా స్టైల్లో నాటకం!
మెదక్ జిల్లాలో కుటుంబ కలహాలు హత్యకు దారితీశాయి. మద్యం సేవించి తరచూ గొడవపడుతున్నాడన్న కోపంతో భార్య, కుమారుడు కలిసి ఇంటి యజమానిని హత్య చేశారు. అనంతరం అది ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి చనిపోయినట్లు చూపించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.
- P Shivteja
- Updated on: Apr 22, 2026
- 9:03 pm
ఇనుప రాడ్లు, ఖాళీ సీసాలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు..! కారణం ఏంటంటే..
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం హరిచంద్ తండాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాహం చిలికి చిలికి గాలివానలా మారింది. ఇనుప రాడ్లు, ఖాళీ సీసాలతో పరస్పర దాడుల వరకు దారితీసింది. ఈ హింసాత్మక ఘటన తండాలో తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
- P Shivteja
- Updated on: Apr 21, 2026
- 9:29 pm
అమ్మో నిమ్మ..! ఇటు కొనలేం.. అటు తాగలేం.. ఎండల్లో మండిపోతున్న ధరలు.. కేజీ ఎంతంటే..
తెలుగు రాష్ట్రాల్లో భానుడు సెగలు గక్కుతున్నాడు. ఎండ తీవ్రతకు జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం, వేడి ఉక్కపోతతో జనం విలవిలలాడుతున్నారు.. ఈ క్రమంలో.. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని పానీయాలను ఆశ్రయిస్తున్నారు.
- P Shivteja
- Updated on: Apr 20, 2026
- 6:03 pm
ఘనంగా ఎంగేజ్మెంట్.. నాలుగు రోజుల్లో పెళ్లి.. కానీ, ఇంతలోనే..
మరో నాలుగు రోజుల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాలి.. పచ్చని పందిరి కింద కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన యువకుడు.. విధి ఆడిన వింత నాటకంలో అనంత లోకాలకు వెళ్లిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో పెళ్లింట పెను విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడంతో ఆ తల్లికి గుండెకోత మిగిలింది.
- P Shivteja
- Updated on: Apr 20, 2026
- 4:46 pm
Telangana: వాహనదారులకు సర్ఫ్రైజ్.. ఆలోచింప చేస్తున్న పోలీసుల పని తీరు!
చట్టం తన పని తాను చేస్తుంది అనుకుంటే తప్పు. చట్టం మీ ప్రాణాలను కాపాడుతుందని నిరూపిస్తున్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీసులు. వినూత్న రీతిలో వాహనదారులకు అవగాహన కల్పిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా..
- P Shivteja
- Updated on: Apr 18, 2026
- 7:23 pm
30 ఏళ్లు వచ్చినా పెళ్లి కావట్లేదని నిండు జీవితాన్ని ముగించాడు..
పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో జోగిపేట సమీపంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి మాటలకు నొచ్చుకున్న అతను క్షణికావేశంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పూర్తి వివరాలు కథనం లోపల ...
- P Shivteja
- Updated on: Apr 18, 2026
- 12:54 pm
నందగోకుల్ వెళ్ళాలంటే అంటే హెల్మెట్ ఉండాల్సిందే.. లేదంటే నో ఎంట్రీ
వారం కిందట పోలీసు శాఖ గ్రామంలో అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించింది. మరుసటి రోజు సర్పంచి భానుప్రకాష్ రెడ్డి పాలకవర్గం,గ్రామ పెద్దలతో సమావేశమయ్యారు. అందరి సమ్మతితో తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని నిర్ణయించారు.ఈ విషయం పై గ్రామంలో దండోరా వేయించారు.
- P Shivteja
- Updated on: Apr 18, 2026
- 12:52 pm
Viral Video: బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
ఓ వ్యక్తి బయటకు వెళ్దామని ఇంటి దగ్గర పార్క్ చేసిన తన బైక్ను తీసుకునేందుకు వెళ్లాడు. బైక్ తీసి కీ ఆన్ చేద్దామని వెళ్లగా అక్కడ ఏవో శబ్ధాలు వినిపించాయి. ఏంటా అని కాస్తా ఎనక్కి జరిగి క్షుణ్నంగా పరిశీలించాడు. ఇంకేముంది ఓ నాగుపాము బైక్ దూమ్లో బుసలు కొడుతూ కనిపించింది. అది చూసి ఆవ్యక్తి ఒక్కసారిగా కంగుతిన్నాడు. స్థానికుల సహాయంతో పామును అక్కడి నుంచి వెళ్లగొట్టాడు.
- P Shivteja
- Updated on: Apr 17, 2026
- 2:04 pm
Telangana: గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయడం లేదని.. గ్రామస్తులు ఏం చేశారో చూడండి
మెదక్ జిల్లాలో గ్యాస్ కష్టాలు పతాక స్థాయికి చేరాయి. బుక్ చేసినా గ్యాస్ రావడం లేదంటూ.. రోజుల తరబడి ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో సామాన్యుల సహనం నశించింది. ఇక లాభం లేదని శివంపేట మండలం దొంతిలో గ్రామస్తులు అధికారుల తీరుపై కన్నెర్ర జేశారు. గ్రామానికి వచ్చిన గ్యాస్ ఆటోను అడ్డుకుని, బలవంతంగా సిలిండర్లు తీసుకెల్లారు.
- P Shivteja
- Updated on: Apr 14, 2026
- 6:15 pm
Telangana: మరణంలోనూ జీవిస్తూ.. చనిపోతూ 8 మందికి జీవితాన్ని ప్రసాదించిన యువకుడు
చదువుకుని ప్రయోజకుడై తన కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్న ఆ యువకుడు. విధి వంచనతో అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. కానీ తాను వెళ్తూ వెళ్తూ మరో ఎనిమిది మందికి చూపుని, శ్వాసని, కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్ గ్రామానికి చెందిన నక్కల ఉదయ్ కిరణ్ అవయవ దానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచాడు.
- P Shivteja
- Updated on: Apr 14, 2026
- 5:44 pm