పవన్ కళ్యాణ్
అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించారు. జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ను ఆయన ఫ్యాన్స్ పవన్ స్టార్, జనసేనానిగా పిలుచుకుంటారు. 1971 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో పవన్ జన్మించారు. అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల మక్కువ పెంచుకున్న పవన్.. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేశారు. తొలిప్రేమ, సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్ చిత్రాలు పవన్కు మంచి గుర్తింపు సాధించిపెట్టాయి. 27 ఏళ్ల సినీ ప్రస్థానంలో పవన్ సినిమాలు కలెక్షన్ల రికార్డులను తిరగరాసాయి. నిర్మాత, దర్శకుడిగానూ ప్రయత్నించారు. జపాన్ దర్శకుడు అకీరా కురసోవా స్ఫూర్తితో దర్శకుడుగా ‘జానీ’ చిత్రాన్ని రూపొందించారు. పవన్కు మార్షల్ ఆర్ట్స్లోనూ ప్రవేశం ఉంది.
2008లో తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం చేశారు. ప్రజా రాజ్యం పార్టీ యువజన విభాగానికి అధ్యక్షునిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత ఆ పార్టీని వీడిన పవన్.. 2014 మార్చిలో జనసేన పార్టీని స్థాపించారు. 2019లో 140 నియోజకవర్గాల నుంచి జనసేన పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నుంచి పోటీచేసి, రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి చెవిచూశారు. ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రమే జనసేన విజయం సాధించింది. 2024లో ఏపీలో జరిగే జమిలి ఎన్నికల్లో టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
సోషల్ మీడియాలోనూ పవన్ కళ్యాణ్కు విశేషమైన ఆదరణ ఉంది. ఇటీవల ఇన్స్టాగ్రమ్లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్కు ఒక్క పోస్ట్ చేయకుండానే లక్షల సంఖ్యలో ఫాలోవర్లు చేరారు. జనసేనాన్ని క్రేజ్ అలాంటిది మరి..!
ఇంకా చదవండిWatch: ఎగిరే పక్షి.. అద్భుతం.. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం.. !
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ద్వారం తెరుచుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2026 ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, అరకు లోయ ప్రకృతి అందాలు, గిరిజన చుట్టిళ్ల వాస్తుశిల్పం, ఎగిరే పక్షి ఆకృతిని ప్రతిబింబించేలా టెర్మినల్ భవనాన్ని అత్యాధునికంగా నిర్మించారు.
- Balaraju Goud
- Updated on: Aug 1, 2026
- 12:52 pm
ప్రధాని మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ జాతికి అంకితం..
విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (ఆగస్టు 1) ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
- Balaraju Goud
- Updated on: Aug 1, 2026
- 11:48 am
Watch: ప్రపంచ రికార్డు థింసాతో ప్రధానికి గ్రాండ్ వెల్కమ్.. భోగాపురం మెరిసింది..
విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆకాశం నుంచి చూస్తే అద్భుతంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు విమానాశ్రయ ప్రాంగణంలో వేలాది మంది గిరిజన కళాకారులు సంప్రదాయ థింసా నృత్యం ప్రదర్శించారు.
- Balaraju Goud
- Updated on: Aug 1, 2026
- 11:12 am
PM Modi in AP Live: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. ఇది, ఇప్పటి తరం విమానాశ్రయం.. దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్.. జెన్జీకి తగ్గట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ, న్యూయెస్ట్ ఐడియాలజీతో రూపుదిద్దుకుంది. ప్రపంచస్థాయి ప్రమాణాలు-వసతులు ఈ ఎయిర్పోర్ట్ సొంతం. మొత్తం, రూ.5,640 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. 36 నెలల టార్గెట్ పెట్టుకుని నిర్మాణం ప్రారంభిస్తే.. 31 నెలల రికార్డు టైమ్లోనే పూర్తిచేశారు.
- Balaraju Goud
- Updated on: Aug 1, 2026
- 2:15 pm
అరుదైన వృక్ష జాతి మొక్కకు పేరు పెట్టిన పవన్ కల్యాణ్.. దీని స్పెషల్ ఏంటో తెలుసా..?
తిరుపతి జిల్లా తూర్పు కనుమల్లో కొత్తగా గుర్తించిన అరుదైన వృక్ష జాతికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ "క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్" అనే పేరు పెట్టారు. ఉబ్బలమడుగు జలపాతం సమీపంలో మాత్రమే కనిపించే ఈ మొక్క ప్రత్యేక సుగంధ ఆకులు, అరుదైన జీవ వైవిధ్య లక్షణాలతో శాస్త్రవేత్తలను ఆకట్టుకుంది. అంతరించిపోతున్న జాతిగా గుర్తించిన ఈ మొక్క ఆవిష్కరణ తూర్పు కనుమల జీవ వైవిధ్య ప్రాధాన్యాన్ని మరోసారి చాటింది.
- Shaik Madar Saheb
- Updated on: Jul 29, 2026
- 4:17 pm
Tollywood : ఒళ్లు హూనం చేసుకుంటున్న స్టార్ హీరోలు.. వరుస ప్రమాదాలతో ఫ్యాన్స్లో కంగారు
టాలీవుడ్ లో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినిమా షూటింగ్స్ లో హీరోలు వరుసగా గాయాలపాలు అవుతున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ కాలికి గాయం అయ్యింది. అలాగే రామ్ చరణ్ చేతి మణికట్టుకు గాయం అయ్యింది. పవన్ కళ్యాణ్ భుజాలకు ఇటీవలే సర్జరీ చేయించుకున్నారు. తాజాగా తారక్ భుజానికి గాయం అయ్యింది.
- Rajeev Rayala
- Updated on: Jul 28, 2026
- 11:59 am
Andhra Politics: గోదావరి టు కృష్ణా.. ఏపీలో మళ్లీ కాపు చిచ్చు.. ఏ పార్టీకి బిగుస్తుంది ఉచ్చు..?
ఆంధ్రప్రదేశ్లో మరోసారి కాపు రాజకీయాలు హాట్టాపిక్గా మారాయి. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో టీడీపీ నేత బొండా ఉమ చేసిన వ్యాఖ్యలు కూటమిలో కలకలం రేపాయి. కాపు ఓటు బ్యాంక్పై అన్ని ప్రధాన పార్టీలు దృష్టి సారించిన వేళ, ఈ పరిణామం ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం చేకూరుస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
- Shaik Madar Saheb
- Updated on: Jul 27, 2026
- 9:50 pm
నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి, వ్యవసాయం, విద్య తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్, ప్రజలకు ఉపయోగపడే అనేక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించి, పనులను వేగంగా పూర్తి చేసి నిర్ణీత గడువులో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది.
- Balaraju Goud
- Updated on: Jul 23, 2026
- 4:33 pm
Pawan Kalyan : కాలినడకన తిరుమలకు పవన్ కళ్యాణ్ సతీమణి.. పవర్ స్టార్ ఆరోగ్యం కోసం అలిపిరి మెట్లెక్కిన అన్నా..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే భుజానికి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ముంబైలోని ధీరుబాయ్ కోకిలాబెన్ ఆసుపత్రిలో పవన్ కు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే పవన్ త్వరగా కోలుకోవాలని ఆయన సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
- Rajitha Chanti
- Updated on: Jul 18, 2026
- 9:05 am
Pawan Kalyan: జీసస్ క్రైస్ట్ బయోపిక్.. పవన్ కల్యాణ్- సింగీతంల ‘ప్రిన్స్ ఆఫ్ పీస్’ ఎందుకు ఆగిపోయిందో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్- లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్ లో 'ప్రిన్స్ ఆఫ్ పీస్' అట్టహాసంగా ప్రారంభమైంది. జీసస్ క్రైస్ట్ బయోపిక్ గా తెరకెక్కాల్సిన ఈ మూవీ కోసం బెత్లహేం, జెరూసలేం వంటి ప్రదేశాలలో లోకేషన్ల వేట కూడా నిర్వహించారు. కానీ ఏమైందో తెలియదు కానీ ఈ క్రేజీ ప్రాజెక్టు ఆగిపోయింది.
- Basha Shek
- Updated on: Jul 17, 2026
- 6:02 pm
అప్పుడు సినిమాలు లేక పిచ్చెక్కిపోయింది.. ఆ పెద్ద హీరోలను ఛాన్స్ ఇవ్వమని అడిగా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న కోట శ్రీనివాసరావు.. గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన స్టార్ హీరోల పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
- Rajeev Rayala
- Updated on: Jul 15, 2026
- 12:13 pm
CM Devendra Fadnavis: పవన్ కల్యాణ్ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ముంబైలోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. శస్త్రచికిత్స అనంతరం ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే ఉంటూ వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు.
- Phani CH
- Updated on: Jul 13, 2026
- 10:29 pm