పవన్ కళ్యాణ్
అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించారు. జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ను ఆయన ఫ్యాన్స్ పవన్ స్టార్, జనసేనానిగా పిలుచుకుంటారు. 1971 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో పవన్ జన్మించారు. అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల మక్కువ పెంచుకున్న పవన్.. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేశారు. తొలిప్రేమ, సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్ చిత్రాలు పవన్కు మంచి గుర్తింపు సాధించిపెట్టాయి. 27 ఏళ్ల సినీ ప్రస్థానంలో పవన్ సినిమాలు కలెక్షన్ల రికార్డులను తిరగరాసాయి. నిర్మాత, దర్శకుడిగానూ ప్రయత్నించారు. జపాన్ దర్శకుడు అకీరా కురసోవా స్ఫూర్తితో దర్శకుడుగా ‘జానీ’ చిత్రాన్ని రూపొందించారు. పవన్కు మార్షల్ ఆర్ట్స్లోనూ ప్రవేశం ఉంది.
2008లో తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం చేశారు. ప్రజా రాజ్యం పార్టీ యువజన విభాగానికి అధ్యక్షునిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత ఆ పార్టీని వీడిన పవన్.. 2014 మార్చిలో జనసేన పార్టీని స్థాపించారు. 2019లో 140 నియోజకవర్గాల నుంచి జనసేన పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నుంచి పోటీచేసి, రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి చెవిచూశారు. ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రమే జనసేన విజయం సాధించింది. 2024లో ఏపీలో జరిగే జమిలి ఎన్నికల్లో టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
సోషల్ మీడియాలోనూ పవన్ కళ్యాణ్కు విశేషమైన ఆదరణ ఉంది. ఇటీవల ఇన్స్టాగ్రమ్లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్కు ఒక్క పోస్ట్ చేయకుండానే లక్షల సంఖ్యలో ఫాలోవర్లు చేరారు. జనసేనాన్ని క్రేజ్ అలాంటిది మరి..!
Allu Arjun: ఇంటికెళ్లి మరీ పవన్ను పరామర్శించిన బన్నీ
ఇటీవల శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించినట్లు సమాచారం. ఇద్దరూ ఆరోగ్యం, కుటుంబ విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మెగా-అల్లు కుటుంబాల మధ్య విభేదాలున్నాయనే ప్రచారానికి ఈ భేటీతో చెక్ పడుతుందా అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం పవన్ రాజకీయాలపై, అల్లు అర్జున్ తన కొత్త సినిమా ‘రాకా’పై దృష్టి సారిస్తున్నారు.
- Phani CH
- Updated on: Jun 12, 2026
- 5:48 pm
తిరుపతిలో కూటమి గర్జన.. రెండేళ్ల పాలనపై ప్రజల ముందుకు ప్రోగ్రెస్ కార్డ్!
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తిరుపతి వేదికగా శుక్రవారం (జూన్ 12) భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. "2 ఏళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం" పేరుతో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. గత రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రజలకు సమగ్ర నివేదిక అందించేందుకు ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది.
- Balaraju Goud
- Updated on: Jun 12, 2026
- 10:59 am
Pawan Kalyan-Allu Arjun: పవన్ కల్యాణ్ను కలిసిన అల్లు అర్జున్! ఆరోగ్య పరిస్థితిపై ఆరా
ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిశారు. బుధవారం (జూన్ 10) రాత్రి పవన్ కల్యాణ్ ఇంటికెళ్లిన బన్నీ ఆయనను పరామర్శించారు. డిప్యూటీ సీఎం ఆరోగ్య పరిస్థితి గురించి అన్ని విషయాలు అడిగి తెలసుకున్నారు.
- Basha Shek
- Updated on: Jun 11, 2026
- 1:18 pm
Jabardasth Satya Sri: ఆ స్టార్ హీరోకు వీరాభిమానిని.. కానీ ఆయన సినిమాలో చేయనని చెప్పా.. ఆ తర్వాత నన్ను పిలిచి..
జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో లేడీ కమెడియన్ సత్యశ్రీ కూడా ఒకరు. చమ్మక్ చంద్రతో కలిసి ఆమె చేసిన స్కిట్స్ బుల్లితెర ఆడియెన్స్ ను బాగా నవ్వించాయి. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు వెండితెరపైనే ఎక్కువగా కనిపిస్తోంది.
- Basha Shek
- Updated on: Jun 9, 2026
- 7:25 pm
ప్రకాశం జిల్లాలో అరుదైన ఘటన.. పవన్ కళ్యాణ్ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ నటుడిగానే కాకుండా ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పదవీబాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక పవన్ నటించిన ఓజీ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే..
- Rajeev Rayala
- Updated on: Jun 6, 2026
- 4:38 pm
Andhra Politics: ఆంధ్రా పాలిటిక్స్ గురూ.. టాపిక్ ఏదైనా టాప్ లేచిపోవాల్సిందే..!
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమవుతోంది.. ఈ తరుణంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
- Shaik Madar Saheb
- Updated on: Jun 4, 2026
- 9:46 pm
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. లండన్ తరహాలో ‘అమరావతి ఐ’.. గోవా తరహాలో ‘బీచ్ షాక్స్’..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు సాగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పర్యాటకం, ఉపాధి, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ప్రభుత్వం పలు సంచలన, కీలక అంశాలకు పచ్చజెండా ఊపింది. గోవా తరహాలో బీచ్ టూరిజం డెవలప్మెంట్, లండన్ తరహాలో 'అమరావతి ఐ' వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు ఉద్యోగులకు మేలు చేకూర్చే పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
- Balaraju Goud
- Updated on: Jun 4, 2026
- 9:09 pm
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాలపై నా స్టాండ్ ఎప్పుడూ ఒక్కటేః పవన్ కల్యాణ్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యల చుట్టూ తిరుగుతున్న రాజకీయ మంట ఇంకా చల్లారలేదు. తాను తెలంగాణ ప్రజలను కించపరచలేదని పవన్ క్లారిటీ ఇచ్చినప్పటికీ, ఆయనపై విమర్శల దాడి మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఎక్స్ (X) వేదికగా పవన్ కల్యాణ్ తెలంగాణపై తన స్థిరమైన వైఖరిని స్పష్టం చేశారు.
- Balaraju Goud
- Updated on: Jun 4, 2026
- 7:16 pm
బద్దలైన అస్తిత్వ అగ్నిపర్వతం.. రెండు రాష్ట్రాలను కుదిపేస్తున్న పవన్ కళ్యాణ్ పొలిటికల్ డైనమైట్లు!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఊహించని అగ్గి రాజుకుంది. పదేళ్ల ఆవిర్భావ వేడుకల వేళ, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ అస్తిత్వ రాజకీయాల తేనెతుట్టె ఒక్కసారిగా కదిలింది. అస్తిత్వ అగ్నిపర్వతం భళ్లున బద్దలై, రెండు రాష్ట్రాల నేతల మధ్య డైలాగ్ డైనమైట్లు పేలేలా చేస్తోంది. తెలంగాణ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? ఇక్కడికి వచ్చి రాజకీయం చేసే హక్కు ఎవరికి ఉంది? అనే యక్ష ప్రశ్నలతో 'తెంగాణం' మరోసారి భగభగా మండుతోంది.
- Balaraju Goud
- Updated on: Jun 2, 2026
- 9:49 pm
పవన్ తిరిగితే జనాలు వస్తారు కానీ ఓట్లేయరు! ‘జనసేనాని’కి మంత్రి పొన్నం స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "తెలంగాణ ఎవరి అయ్యా జాగీరు కాదు, ఇది నాలుగు కోట్ల ప్రజల జాగీరు" అంటూ ఆయన ఘాటుగా కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్, ఇక్కడికి వచ్చి చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు.
- Balaraju Goud
- Updated on: Jun 2, 2026
- 7:09 pm
“ఇప్పుడు డిసైడ్ అయ్యా.. ఇకపై తెలంగాణలో నేనే తిరుగుతా.. ప్రజా సమస్యలపై పోరాడుతా”: పవన్
తెలంగాణ రాజకీయాల్లో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించాయి. "తెలంగాణలో నన్ను అడుగుపెట్టనివ్వమని బెదిరిస్తున్నారు.. తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?" అంటూ ఆయన కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు జన సైనికులం భయపడేవాళ్లం కాదన్నారు.
- Balaraju Goud
- Updated on: Jun 2, 2026
- 5:36 pm
Pawan Kayan: మీ అయ్య జాగీరా..? తెలంగాణ నడిబొడ్డున జనసేన పుట్టింది.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించాలనుకున్న జనసేన సమావేశానికి అనుమతి లభించకపోవడంతో పవన్ కల్యాణ్ హైదరాబాద్లోని తన నివాసం నుంచి మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై తనకు ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతమని పేర్కొన్న ఆయన, జనసేన తెలంగాణలోనే పుట్టిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో తన ప్రవేశాన్ని ప్రశ్నిస్తున్న వారిపై తీవ్రంగా స్పందించిన పవన్, తెలంగాణ ఎవరి జాగీరు కాదని అన్నారు. రేవంత్ రెడ్డిపై కూడా తన అభిప్రాయాలను వెల్లడిస్తూ పలు రాజకీయ వ్యాఖ్యలు చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: Jun 2, 2026
- 5:07 pm