తెలుగు మీడియాలో 22 సంవత్సరాల అనుభవం ఉంది. మొదటగా మూవీ మార్కెట్ మ్యాగజైన్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నేను.. అనంతరం జీ తెలుగు, ఎన్టీవీ సంస్థలలో సినిమా ఇన్చార్జిగా పని చేసాను. ప్రస్తుతం టీవీ9 సంస్థలో ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ గా పని చేస్తున్నాను. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని శాఖలపై ఉన్న అవగాహన మేరకు నా వార్తలు ఇక్కడ ప్రచురిస్తున్నా..
గ్యాప్ ఇవ్వలా.. వచ్చింది అంటున్న స్టార్ హీరోస్
టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు ఒక సినిమా పూర్తయ్యాక వెంటనే మరో సినిమా సెట్స్లోకి వెళ్లడం లేదు. మేకోవర్స్, గాయాలకు చికిత్స, ప్రీ-ప్రొడక్షన్ పనులు, కథలపై మరింత శ్రద్ధ వంటి కారణాలతో నెలల తరబడి విరామం తీసుకుంటున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్, చిరంజీవి వంటి స్టార్ హీరోలందరూ ఇదే ట్రెండ్ను అనుసరిస్తుండటం ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారితీస్తోంది.
- Lakshminarayana Varanasi
- Updated on: Jun 13, 2026
- 4:19 pm
బడ్జెట్ కాదమ్మా.. కంటెంట్ పెంచండి
ప్యాన్ ఇండియా సినిమాల పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టడం కంటే, బలమైన కథా కంటెంట్పైనే దృష్టి పెట్టాలని కమల్ హాసన్ సూచించారు. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ‘పుష్పక విమానం’ వంటి చిత్రాలు కాలాతీత క్లాసిక్స్గా నిలిచాయని గుర్తు చేశారు. భారీ సెట్లు, కలెక్షన్ల కంటే సృజనాత్మకతే సినిమాను చిరస్థాయిగా నిలబెడుతుందని ఆయన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.
- Lakshminarayana Varanasi
- Updated on: Jun 13, 2026
- 4:14 pm
రిలీజ్ కాదు.. రీచ్ మీద ఫోకస్ పెట్టండి
ప్యాన్ ఇండియా సినిమా అంటే కేవలం అన్ని భాషల్లో విడుదల చేయడం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించి విజయాన్ని సాధించడం కూడా. సరైన రిలీజ్ టైమ్, బలమైన కథ, దేశమంతా కనెక్ట్ అయ్యే ఎమోషన్, స్టార్ హీరోతో పాటు దర్శకుడి బ్రాండ్ విలువ కూడా కీలకం. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కల్కి, సలార్ వంటి చిత్రాలే నిజమైన ప్యాన్ ఇండియా విజయాలకు ఉదాహరణలుగా నిలిచాయి.
- Lakshminarayana Varanasi
- Updated on: Jun 13, 2026
- 4:07 pm
అందనంత ఎత్తులో ఉన్న నయన్, త్రిష.. కారణం అదేనా..?
కొత్త హీరోయిన్లు వరుసగా ఇండస్ట్రీలోకి వస్తున్నా, త్రిష మరియు నయనతార క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. భారీ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒక్కో చిత్రానికి రూ.10 నుంచి 15 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారు. సౌత్ సినీ పరిశ్రమలో ఇప్పటికీ వీరిద్దరే అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులుగా కొనసాగుతున్నారు.
- Lakshminarayana Varanasi
- Updated on: Jun 13, 2026
- 3:59 pm
Aditya Dhar: టాలీవుడ్ వైపు చూస్తున్న ధురంధర్ దర్శకుడు.. రేసులో ఆ హీరో..!
‘ధురంధర్’ విజయంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన దర్శకుడు ఆదిత్య ధర్ తదుపరి ప్రాజెక్ట్పై ఆసక్తికర ప్రచారం సాగుతోంది. అల్లు అర్జున్తో సినిమా వార్తల తర్వాత ఇప్పుడు ఆయన చూపు ప్రభాస్పై పడినట్లు టాక్ వినిపిస్తోంది. భారీ స్థాయి కథకు సరిపోయే హీరోగా ప్రభాస్ను భావిస్తున్న ఆదిత్య ధర్, ఇటీవల ముంబైలో ఆయనతో కథా చర్చలు జరిపినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
- Lakshminarayana Varanasi
- Updated on: Jun 13, 2026
- 3:51 pm
ఇక కష్టమే.. OTTపై చెప్పేదొకటి.. చేసేదొకటి
బాలీవుడ్లో సినిమాలు సాధారణంగా 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుంటే, టాలీవుడ్లో మాత్రం చాలా చిత్రాలు నెల రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్కు చేరుతున్నాయి. దీనికి మల్టీప్లెక్స్ విధానాలు, థియేట్రికల్ రెవెన్యూ పంపకం, ఓటీటీ డీల్స్ విలువ, నిర్మాతల వ్యాపార ప్రయోజనాలు వంటి పలు కారణాలు ఉన్నాయి. ఉత్తరాది ఫార్ములా దక్షిణాదిలో ఎందుకు అమలు కావడం లేదో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం.
- Lakshminarayana Varanasi
- Updated on: Jun 13, 2026
- 3:31 pm
ట్రైలర్ కాదు.. చిన్న సైజ్ సినిమా చూపిస్తున్నారుగా..!
ఒకప్పుడు రెండు నిమిషాలకే పరిమితమైన సినిమా ట్రైలర్లు ఇప్పుడు నాలుగు నుంచి ఐదు నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కథ, పాత్రలు, విజువల్ గ్రాండియర్ను మరింతగా చూపించేందుకు దర్శకులు, నిర్మాతలు ట్రైలర్ నిడివిని పెంచుతున్నారు. తాజాగా ‘వెల్కమ్ టు ది జంగిల్’ ట్రైలర్ 4 నిమిషాలకు పైగా ఉండగా, ‘సింగం అగైన్’ ఇప్పటికీ అత్యంత పొడవైన ట్రైలర్లలో ఒకటిగా నిలిచింది.
- Lakshminarayana Varanasi
- Updated on: Jun 13, 2026
- 3:00 pm
మెగాఫోన్ పడుతున్న కుర్ర హీరోలు.. సాహసమనే చెప్పాలేమో..?
టాలీవుడ్లో యువ హీరోలు ఇప్పుడు నటనతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతున్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రకటించగా, ఇప్పటికే విశ్వక్ సేన్, రామ్, విశాల్ వంటి హీరోలు కూడా మెగాఫోన్ పట్టారు. తమ కథలను తామే తెరకెక్కిస్తూ నటుడు-దర్శకులుగా కొత్త ట్రెండ్కు శ్రీకారం చుడుతున్నారు.
- Lakshminarayana Varanasi
- Updated on: Jun 13, 2026
- 2:57 pm
రూ.300 కోట్ల సినిమాకు 30 రోజుల ఓటీటీ విండో.. ఇదెక్కడి న్యాయమో మరి..?
వందల కోట్లు వసూలు చేస్తున్న సినిమాలు కూడా కేవలం 30 రోజుల్లోపే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. థియేటర్లలో ఇంకా మంచి వసూళ్లు వస్తున్నప్పటికీ నిర్మాతలు డిజిటల్ డీల్స్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ధోరణి కొనసాగితే ప్రేక్షకుల థియేటర్ అలవాట్లు మారిపోవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
- Lakshminarayana Varanasi
- Updated on: Jun 13, 2026
- 2:54 pm
Sing Geetham Movie Review: సింగ్ గీతం సినిమా రివ్యూ.. 94 ఏళ్ల సింగీతం శ్రీనివాసరావు మ్యాజిక్ చేశారా..?
ఇండియన్ సినిమా రూపురేఖలు మార్చేసిన దర్శకులలో ముందుండే పేరు లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆయన నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు అలా చరిత్రలో నిలిచిపోయాయి. 94 ఏళ్ల వయస్సులో ఆయన నుంచి వచ్చిన అందమైన చందమామ కథ లాంటి సినిమా ‘సింగ్ గీతం’. నాగ్ అశ్విన్ విజన్ ఈ సినిమాకు తోడైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
- Lakshminarayana Varanasi
- Updated on: Jun 12, 2026
- 1:27 pm
సీక్వెల్ బిజినెస్.. బ్రాండ్తోనే పనైపోతుందా..?
టాలీవుడ్లో ప్రస్తుతం సీక్వెల్స్ హవా కొనసాగుతోంది. ‘కల్కి 2’, ‘సలార్ 2’, ‘దేవర 2’, ‘ఓజీ 2’, ‘జై హనుమాన్’, ‘మిరాయ్ 2’ వంటి చిత్రాలు భారీ అంచనాలతో సిద్ధమవుతున్నాయి. రాబోయే మూడేళ్లలో విడుదలయ్యే ఈ ఫ్రాంచైజీ సినిమాల మొత్తం వ్యాపార విలువ దాదాపు రూ.5,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే అన్ని సీక్వెల్స్ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటాయా అన్నదే ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.
- Lakshminarayana Varanasi
- Updated on: Jun 7, 2026
- 7:17 pm
ఆ ఒక్కటీ ఉంటే చాలంటున్న స్టార్ హీరోలు..!
ఒకప్పుడు కమర్షియల్ సినిమాల్లో హీరోలకు నటనకు పెద్దగా అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. రామ్ చరణ్ ‘పెద్ది’, అల్లు అర్జున్ ‘పుష్ప’, ఎన్టీఆర్-చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలు కమర్షియల్ విజయంతో పాటు నటనకు కూడా గుర్తింపు తెచ్చాయి. స్టార్ హీరోలు ఇప్పుడు మాస్ ఎలిమెంట్స్తో పాటు అవార్డు స్థాయి పర్ఫార్మెన్స్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
- Lakshminarayana Varanasi
- Updated on: Jun 7, 2026
- 7:15 pm