చిన్నప్పటి నుంచే జర్నలిజంపై ఉన్న ఆసక్తి నన్ను ఈ వృత్తిలోకి తీసుకొచ్చింది. 2013 నుంచి జర్నలిజంలో కొనసాగుతూ, 2017లో టీవీ9లో చేరాను. హైదరాబాద్ రిపోర్టర్గా ప్రారంభించి, అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధిగా నాలుగేళ్ల పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి విస్తృతంగా రిపోర్టింగ్ చేశాను.
కామారెడ్డి జిల్లాలో గుహలో చిక్కుకున్న రాజు రెస్క్యూ ఆపరేషన్ను 12 గంటల పాటు ప్రత్యక్షంగా కవర్ చేసి, ఆ కథనాలకు గాను టీవీ9 నెట్వర్క్ నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ సర్టిఫికేట్ అందుకున్నాను. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన కార్యక్రమానికి సంబంధించి దక్షిణ కొరియా పర్యటనలో ప్రభుత్వ ప్రతినిధి బృందంతో కలిసి వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక కథనాలు అందించాను.
ప్రస్తుతం హైదరాబాద్లో టీవీ9 స్పెషల్ కరస్పాండెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారాలతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలను కవర్ చేస్తున్నాను.
Seaplane: జస్ట్ 45 మినెట్స్.. హైదరాబాద్ టూ విజయవాడ మధ్య సీప్లేన్ సేవలు.. ఎప్పటినుంచంటే?
రెండు తెలుగురాష్ట్రాల ప్రజలకు ఇదో గుడ్న్యూస్ చెప్పాలి. ఎందుకంటే త్వరలోనే హైదరాబాద్లోని హుస్సెన్ సాగర్ నుంచి విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వరకు సీ-ప్లేన్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో చర్చించినట్టు తెలుస్తోంది.
- Prabhakar M
- Updated on: Aug 10, 2026
- 11:44 am
తెలంగాణ ప్రజలకు ఒకే రోజు 10 శుభవార్తలు..! ఆగస్ట్ 15న ప్రారంభించబోయే కొత్త పథకాలు ఇవే!
రాష్ట్ర ప్రజలకు ఈ సారి ప్రందాగస్ట్ కొత్త ఊపును ఇవ్వబోతుంది. ఒకటి కాదు రెండు ఏకంగా ఒక్కరోజే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు 10 గుడ్న్యూస్లు చెప్పబోతుంది. ఈ స్వాతంత్ర్య దినోవత్సవం సందర్భంగా ఇప్పటికే ఉన్న పథకాల విస్తరణతో పాటు కొత్త పథకాల ప్రారంభానికి తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేస్తోంది. కాబట్టి ఆ రోజు ఏ ఏ ప్రకటనలు వెలువడే ఛాన్స్ ఉందో చూద్దాం పదండి.
- Prabhakar M
- Updated on: Aug 9, 2026
- 10:45 am
గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే కొత్త పింఛన్ల డబ్బులు.. చేయూతకు దరఖాస్తు గడువు ఎప్పటివరకంటే..
తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శనివారం నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, దివ్యాంగులతో పాటు థలసీమియా, సికిల్సెల్, హిమోఫీలియా బాధితులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
- Prabhakar M
- Updated on: Aug 8, 2026
- 9:33 am
గుడ్న్యూస్.. ఇక ఆఫీస్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. త్వరలో ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు!
రాష్ట్రంలోని గ్రామీన ప్రాంతాల ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పబోతుంది. త్వరలో టీ-ఫైబర్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి గ్రామానికి హై-స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తూ, ఇంటివద్దకే ప్రభుత్వ సేవలు చేరేలా చర్యలు చేపడుతోంది. డిజిటల్ ఆఫీస్ ప్రాజెక్ట్తో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తిస్థాయి పేపర్లెస్ అడ్మినిస్ట్రేషన్ను వేగవంతం చేస్తోంది. అలాగే త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్ వ్యవస్థలతో పాటు బ్లాక్చెయిన్ ఆధారిత సర్టిఫికెట్ల జారీని అందుబాటులోకి తీసుకురానుంది.
- Prabhakar M
- Updated on: Aug 7, 2026
- 10:04 pm
Telangana: రేవంత్ సర్కార్ సూపర్ స్కెచ్.. జీఎస్టీ విధానంలో మార్పులు..! పన్ను దొంగలకు ఇక దడే!
పన్నులు కట్టకుండా తప్పించుకునే వ్యాపారులకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జీఎస్టీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించాలని భావిస్తోంది. తద్వారా పన్ను ఎగ్గోట్టేవారికి చెక్ పెట్టడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా బోపేతం చేయవచ్చని ప్రభుత్వం అంచనావేస్తోంది.
- Prabhakar M
- Updated on: Aug 7, 2026
- 9:22 pm
గుడ్ న్యూస్.. ఇక సరికొత్తగా రేషన్ కార్డులు.. పంపిణీ ఎప్పటినుంచో తెలుసా..?
తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మంజూరైన 1.05 కోట్ల లామినేటెడ్ (పీవీసీ) స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనుంది. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకేసారి లబ్ధిదారులకు కార్డులు అందజేయనున్నారు. క్యూఆర్ కోడ్, ఆధునిక భద్రతా ఫీచర్లతో రూపొందించిన ఈ కార్డులు వాటర్ప్రూఫ్గా ఉండటంతో పాటు సులభంగా వినియోగించుకునేలా రూపొందించారు.
- Prabhakar M
- Updated on: Aug 6, 2026
- 11:17 am
Cm Revanth Reddy: పెట్టుబడులే టార్గెట్.. మరో విదేశీ పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణ రాష్ట్రాలనికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా మరోసారి విదేశీ టూర్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే దావోస్, సింగపూర్ వంటి దేశాల్లో పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చిన సీఎం తాజాగా యునైటెడ్ కింగ్డమ్, అమెరికా, జర్మనీ, చైనా దేశాల్లో పర్యటించి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు సిద్దమయ్యారు.
- Prabhakar M
- Updated on: Aug 5, 2026
- 3:52 pm
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే చాలు.. ఉచిత శిక్షణ, వసతి.. ఇదిగో పూర్తి వివరాలు
ఇంటర్ పూర్తి చేసిన ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థినులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇండిగోరీచ్ భాగస్వామ్యంతో ఉచిత కమర్షియల్ పైలట్ శిక్షణ, వసతి, భోజనం, వైద్య బీమా, మెంటార్షిప్ వంటి పూర్తి సౌకర్యాలు కల్పించనున్నాయి. అర్హులైన విద్యార్థినులు అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుని విమానయాన రంగంలో కెరీర్ నిర్మించుకునే అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
- Prabhakar M
- Updated on: Aug 5, 2026
- 8:08 am
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రారంభ దశలో కొన్ని రకాల డిస్కౌంట్ ఆఫర్లు, ప్రత్యేక టికెట్లు అందుబాటులో ఉండేవి. వాటికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చినప్పటికీ, ఆర్థిక నష్టాల కారణంగా ఆ పథకాలను నిలిపివేశారు. ఇప్పుడు మెట్రో నిర్వహణలో ప్రభుత్వ పాత్ర పెరగడంతో ప్రజల అవసరాలకు..
- Prabhakar M
- Updated on: Aug 5, 2026
- 7:42 am
CM Revanth Reddy: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీపై బిగ్ అప్డేట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం!
రాష్ట్రంలో 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.. అయితే నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ప్రభుత్వం దృష్టికి రావడంతో దీనిపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
- Prabhakar M
- Updated on: Aug 4, 2026
- 9:55 pm
Telangana: తెలంగాణలో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్.. గ్రామాల్లో కూడా..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా టీ ఫైబర్ నెట్వర్క్ మాత్రమే ఉపయోగించాలి. దీని ద్వారానే ఇంటర్నెట్ సేవలు పొందాలి. ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా ఇంటర్నెట్ సేవలు పొందటానికి వీల్లేదు. ఈ మేరకు కీలక ఆదేశాలిచ్చారు.
- Prabhakar M
- Updated on: Aug 4, 2026
- 8:57 pm
Job Opportunities: నెలకు రూ.2లక్షల జీతంతో ఉద్యోగాలు.. వారికి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త!
యువతలో నైపుణ్యాలు పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ వేగంగా ముందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) భవన నిర్మాణానికి మంత్రి వివేక్ వెంకటస్వామి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన యువతకు నైపుణ్య శిక్షణతో పాటు దేశ, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
- Prabhakar M
- Updated on: Aug 4, 2026
- 3:30 pm