చిన్నప్పటి నుంచే జర్నలిజంపై ఉన్న ఆసక్తి నన్ను ఈ వృత్తిలోకి తీసుకొచ్చింది. 2013 నుంచి జర్నలిజంలో కొనసాగుతూ, 2017లో టీవీ9లో చేరాను. హైదరాబాద్ రిపోర్టర్గా ప్రారంభించి, అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధిగా నాలుగేళ్ల పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి విస్తృతంగా రిపోర్టింగ్ చేశాను.
కామారెడ్డి జిల్లాలో గుహలో చిక్కుకున్న రాజు రెస్క్యూ ఆపరేషన్ను 12 గంటల పాటు ప్రత్యక్షంగా కవర్ చేసి, ఆ కథనాలకు గాను టీవీ9 నెట్వర్క్ నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ సర్టిఫికేట్ అందుకున్నాను. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన కార్యక్రమానికి సంబంధించి దక్షిణ కొరియా పర్యటనలో ప్రభుత్వ ప్రతినిధి బృందంతో కలిసి వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక కథనాలు అందించాను.
ప్రస్తుతం హైదరాబాద్లో టీవీ9 స్పెషల్ కరస్పాండెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారాలతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలను కవర్ చేస్తున్నాను.
ఇన్వెస్ట్ తెలంగాణ 2026: డిఫెన్స్ ఎక్స్పోకు రాజ్నాథ్ సహకారం కోరిన రేవంత్ రెడ్డి
తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేందుకు 2026లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, డిఫెన్స్ ఎక్స్పోకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా డిఫెన్స్ ఎక్స్పో ఏర్పాట్లు, డీఆర్డీఓ భాగస్వామ్యం, ఆదిలాబాద్ విమానాశ్రయం, దేవరకద్ర డీఆర్డీఎల్ ప్రాజెక్టులకు భూకేటాయింపు వంటి కీలక అంశాలపై చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగ ప్రదర్శనకు కేంద్ర సహకారం కోరారు.
- Prabhakar M
- Updated on: Sep 2, 2026
- 4:34 pm
హైదరాబాద్-విజయవాడ హైవేకు మహర్దశ.. ఇక ఎంత టైంలో రీచ్ అవుతారో తెలుసా..?
హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి-65కు భారీ అప్గ్రేడ్కు మార్గం సుగమమైంది. 285 కిలోమీటర్ల మేర రూ.12,073.99 కోట్ల అంచనా వ్యయంతో ఆరు వరుసలుగా హైవేను అభివృద్ధి చేయనున్నారు. సర్వీస్ రోడ్లు, క్రాష్ బారియర్లు, ప్రతి 15-18 కిలోమీటర్లకు ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లతో పాటు ప్రయాణించిన దూరానికే టోల్ వసూలు చేసే విధానాన్ని ప్రతిపాదించారు. ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్-విజయవాడ ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
- Prabhakar M
- Updated on: Sep 2, 2026
- 10:00 am
హస్తినలో హైటెన్షన్.. తెలంగాణ కేబినెట్ మార్పులపై ఆసక్తికర పరిణామాలు.. జరిగేది అదేనా..?
తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో కీలక భేటీ నిర్వహించగా, కేబినెట్ విస్తరణ, శాఖల మార్పులు, నామినేటెడ్ పోస్టులు, మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై చర్చ జరిగినట్లు సమాచారం. ఖర్గే, కేసీ వేణుగోపాల్తో తెలంగాణ నేతల వరుస భేటీల నేపథ్యంలో హైకమాండ్ నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది.
- Prabhakar M
- Updated on: Sep 2, 2026
- 8:13 am
New iPhone: కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నారా?.. ఇది తెలుసుకోకపోతే జేబుకు చిల్లే!
సెప్టెంబర్ నెల వచ్చిందంటే టెక్ ప్రపంచంలో యాపిల్ కొత్త ఉత్పత్తులపై ఆసక్తి మొదలవుతుంది. ఈసారి కూడా సెప్టెంబర్ 9న జరగనున్న యాపిల్ ఈవెంట్పై ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త ఐఫోన్ సిరీస్, అందులోని సాంకేతిక మార్పులు, కెమెరా, చిప్, బ్యాటరీ, ఏఐ ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయనే చర్చ ఇప్పటికే మొదలైంది. అయితే ఈ హైప్ మధ్య మరో ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. అదేంటో చూద్దాం పదండి.
- Prabhakar M
- Updated on: Sep 1, 2026
- 8:48 pm
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు.. 1931 హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు కీలక అప్డేట్
తెలంగాణ ఆరోగ్యశాఖలో మరో భారీ ఉద్యోగ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన నియామకాల్లో భాగంగా మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టుల భర్తీకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదలైంది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) మంగళవారం ఈ జాబితాను ప్రకటించింది. మొత్తం 1931 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక ప్రక్రియలో తదుపరి దశకు తీసుకెళ్లినట్లు బోర్డు వెల్లడించింది..
- Prabhakar M
- Updated on: Sep 1, 2026
- 7:25 pm
తుమ్మిడిహెట్టి ఎత్తుపై తెలంగాణ కీలక ప్రతిపాదన.. మహారాష్ట్రను ఒప్పించేందుకు రంగంలోకి సీఎం రేవంత్..!
తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా 152 మీటర్ల ఎత్తును మహారాష్ట్ర ముందు ఉంచి, కనీసం 150 మీటర్ల నిర్మాణానికి ఒప్పందం కోరుతోంది. ఈ అంశంపై ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ముంపు, భూసేకరణ నివేదికలను పరిగణనలోకి తీసుకుని నిర్మాణంపై చర్చలు జరుగనున్నాయి.
- Prabhakar M
- Updated on: Sep 1, 2026
- 12:14 pm
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..! కేబినెట్ విస్తరణపై సర్వత్రా ఉత్కంఠ..
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మంగళవారం నుంచి రెండు రోజుల పాటు దిల్లీలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రులతో భేటీలతో పాటు కాంగ్రెస్ అధిష్ఠానంతోనూ కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహారంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
- Prabhakar M
- Updated on: Sep 1, 2026
- 8:11 am
IT Sector: ఐటీ రంగంలో మళ్లీ భారీ నియామకాలు.. 1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
IT Sector: భారత ఐటీ, టెక్నాలజీ ఉద్యోగ మార్కెట్లో మళ్లీ నియామకాల వేడి కనిపిస్తోంది. ముఖ్యంగా ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు అవకాశాలు పెరుగుతున్నాయి. టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే..
- Prabhakar M
- Updated on: Sep 1, 2026
- 7:37 am
తెలంగాణ రైజింగ్-2047 విజన్తో సరికొత్త పారిశ్రామిక విప్లవం..10 రంగాలపై ప్రత్యేక ఫోకస్!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు సమగ్రమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. పదేళ్ల నాటి పారిశ్రామిక విధానం స్థానంలో ఆధునిక సాంకేతికత, ఉపాధి కల్పనలకు ప్రాధాన్యమిచ్చే ఇండస్ట్రియల్ పాలసీ 2.0 ని సిద్ధం చేస్తోంది. పారిశ్రామిక అభివృద్ధిని కేవలం హైదరాబాద్కే పరిమితం చేయకుండా జిల్లాలకు, టైర్-2, టైర్-3 పట్టణాలకు విస్తరించడం ఈ విధానం ప్రధాన వ్యూహం.
- Prabhakar M
- Updated on: Aug 31, 2026
- 9:17 am
Hyderabad Metro: పాతబస్తీ నుంచి ఎయిర్పోర్ట్ దాకా.. హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల్లో కీలక అడుగు..
భాగ్యనగర వాసుల ప్రయాణ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేలా హైదరాబాద్ మెట్రో రెండో దశ పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఐటీ కారిడార్లు, పాతబస్తీ వరకు మెట్రో నెట్వర్క్ను విస్తరించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సన్నాహాలు ముమ్మరం చేసింది. అంచనా వ్యయం రూ.38,595 కోట్లతో ప్రతిపాదించిన ఈ భారీ ప్రాజెక్టులో కీలకమైన కన్సల్టెంట్ల ఎంపిక పూర్తైంది.
- Prabhakar M
- Updated on: Aug 24, 2026
- 11:23 am
TIMS: సనత్నగర్ టిమ్స్లో ‘నర్సింగ్ అలారం’.. నర్సులు వచ్చే వరకు మోగుతూనే ఉంటుంది.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే తొలిసారి!
TIMS Hospital: సాధారణంగా సిబ్బంది రక్త నమూనాలు, ఇతర శాంపిల్స్ను చేతితో ల్యాబ్కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థతో ఈ ప్రక్రియకు పట్టే సమయం తగ్గనుంది. ముఖ్యంగా గుండెపోటు, తీవ్రమైన గాయాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో పరీక్షల ఫలితాలు త్వరగా అందితే వైద్యులు..
- Prabhakar M
- Updated on: Aug 24, 2026
- 7:48 am
ఈ నెల కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందా..? కారణం ఇదే
Telangana Power Demand: వర్షాభావ పరిస్థితులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వ్యవసాయ మోటార్ల వినియోగం, ఏసీలు-కూలర్ల వాడకం పెరగడంతో తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరింది. ఆగస్టు 12న రాష్ట్రంలో గరిష్ఠంగా 15,835 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 5,048 మెగావాట్ల పెరుగుదల కనిపించింది.
- Prabhakar M
- Updated on: Aug 14, 2026
- 8:06 am