చిన్నప్పటి నుంచే జర్నలిజంపై ఉన్న ఆసక్తి నన్ను ఈ వృత్తిలోకి తీసుకొచ్చింది. 2013 నుంచి జర్నలిజంలో కొనసాగుతూ, 2017లో టీవీ9లో చేరాను. హైదరాబాద్ రిపోర్టర్గా ప్రారంభించి, అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధిగా నాలుగేళ్ల పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి విస్తృతంగా రిపోర్టింగ్ చేశాను.
కామారెడ్డి జిల్లాలో గుహలో చిక్కుకున్న రాజు రెస్క్యూ ఆపరేషన్ను 12 గంటల పాటు ప్రత్యక్షంగా కవర్ చేసి, ఆ కథనాలకు గాను టీవీ9 నెట్వర్క్ నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ సర్టిఫికేట్ అందుకున్నాను. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన కార్యక్రమానికి సంబంధించి దక్షిణ కొరియా పర్యటనలో ప్రభుత్వ ప్రతినిధి బృందంతో కలిసి వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక కథనాలు అందించాను.
ప్రస్తుతం హైదరాబాద్లో టీవీ9 స్పెషల్ కరస్పాండెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారాలతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలను కవర్ చేస్తున్నాను.
ఉన్నత విద్యలో హైదరాబాద్ హాట్రిక్ రికార్డు.. దేశంలోనే నంబర్ 1గా ఎడ్యుకేషన్ హబ్గా భాగ్యనగరం!
తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి (ట్రైసిటీస్) జిల్లాలు దేశంలోనే ఉన్నత విద్యకు ప్రధాన కేంద్రాలుగా సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ AISHE నివేదిక ప్రకారం, అత్యధిక సంఖ్యలో కాలేజీలు కలిగిన జిల్లాల జాబితాలో ఈ మూడు జిల్లాలు జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచాయి. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఆధునిక సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ కోర్సులు, వేగంగా విస్తరిస్తున్న ఐటీ రంగంతో పాటు మహిళల భాగస్వామ్యం ఊహించని స్థాయిలో పెరగడం తెలంగాణ విద్యా రంగానికి కొత్త ఊపిరి పోసింది.
- Prabhakar M
- Updated on: Jul 22, 2026
- 10:22 am
మహిళా సంఘాలకు సూపర్ గుడ్న్యూస్! ఫిక్కీ వేదికగా సీఎం రేవంత్ కీలక హామీలు..
హైదరాబాద్లో జరిగిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్రను కొనియాడిన ఆయన, 2023లో ప్రజా ప్రభుత్వం ఏర్పడటానికి మహిళల ఆశీస్సులు, మద్దతే ప్రధాన కారణమని కృతజ్ఞతలు తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు విప్లవాత్మక నిర్ణయాలను ఈ వేదికగా సీఎం పంచుకున్నారు.
- Prabhakar M
- Updated on: Jul 18, 2026
- 9:29 pm
ఎల్నివో ఎఫెక్ట్.. డేంజర్ జోన్లో తెలంగాణలో 92 శాతం గ్రామాలు
తెలంగాణలో ఎల్నివో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాలు చేరుకుని చాలా రోజులు అవుతున్నా.. వర్షాలు పడటం లేదు. ప్రతీ ఏడాది సాధారణంగా ఈ సమయంలో భారీగా వర్షాలు కురుస్తాయి. కానీ ఈ సారి లోటు వర్షపాతం నమోదవుతోంది. దీంతో అన్నదాతలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.
- Prabhakar M
- Updated on: Jul 18, 2026
- 1:13 pm
Telangana: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్పై బిగ్ అప్డేట్.. హైదరాబాద్కు మీదుగా 3 కారిడార్లకు గ్రీన్సిగ్నల్
తెలంగాణను దేశ హైస్పీడ్ రైలు నెట్వర్క్తో అనుసంధానించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ను కేంద్రంగా చేసుకుని ప్రతిపాదించిన మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లకు సంబంధించిన సవరించిన ఎలైన్మెంట్లు, స్టేషన్లు, డిపోల ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
- Prabhakar M
- Updated on: Jul 18, 2026
- 11:15 am
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే సిమెంట్, స్టీల్..!
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులపై నిర్మాణ వ్యయ భారం తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే సిమెంట్, స్టీల్ అందించే దిశగా కంపెనీలతో చర్చలు జరుపుతోంది. సిమెంట్ బస్తాను రూ.220కు అందించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై కంపెనీలు స్పందించగా, త్వరలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. దీంతో ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయంలో వేల రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
- Prabhakar M
- Updated on: Jul 16, 2026
- 8:21 am
సూపర్ గుడ్ న్యూస్.. ఇకపై అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో బ్రేక్ఫాస్ట్..
తెలంగాణలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో వచ్చే నెల నుంచి చిన్నారులకు అల్పాహారం అందించనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. ప్రస్తుతం రెండు జిల్లాల్లో విజయవంతంగా అమలవుతున్న పైలట్ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారుల పోషకాహారం, ఆరోగ్యం, హాజరు శాతాన్ని మెరుగుపరచడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.
- Prabhakar M
- Updated on: Jul 16, 2026
- 7:29 am
ఎల్-నినోకు తెలంగాణ రెడీ.. రైతుల కోసం మూడు దశల కార్యాచరణ
ఎల్-నినో ప్రభావంతో వానాకాలం-2026లో ఏర్పడే సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం మూడు దశల కంటింజెన్సీ ప్లాన్ సిద్ధం చేసింది. రైతులకు నష్టం జరగకుండా విత్తనాలు, ఎరువుల నిల్వలు, వారంవారీ వ్యవసాయ–వాతావరణ బులెటిన్లు, ప్రత్యామ్నాయ పంటలపై మార్గదర్శకాలు అమలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
- Prabhakar M
- Updated on: Jul 13, 2026
- 5:15 pm
అదిరిపోయే గుడ్ న్యూస్.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్లో భారీ మార్పులు..? ఇక సాయం నేరుగా..
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలలో కీలక మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం చెక్కుల రూపంలో అందిస్తున్న రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని ఇకపై డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేసే విధానాన్ని పరిశీలిస్తోంది.
- Prabhakar M
- Updated on: Jul 11, 2026
- 3:56 pm
Telangana: తెలంగాణ వాసులకు బంపర్ ఆఫర్.. లోగో డిజైన్ చేస్తే.. రూ.1 లక్ష బహుమతి
రాష్ట్రప్రజలకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎల్ఐజీ ప్రాజెక్టు పేరు పెట్టి కాంటెస్ట్ పెట్టిన ప్రభుత్వం తాజాగా మరో కాంటెస్ట్తో ముందుకొచ్చింది. ఈసారి ఈ ఎల్ఐడీ పథకానికి కావాల్సిన విధంగా లోగో డిజైన్ చేసిన వారికి రూ.లక్ష బహుమతి అందజేయనున్నట్టు ప్రకటించింది. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం పదండి.
- Prabhakar M
- Updated on: Jul 8, 2026
- 5:04 pm
Telangana Dharani: ధరణి అక్రమాలపై సిట్ దర్యాప్తు.. 2020 నుంచి భూ లావాదేవీలన్నీ పరిశీలన
Telangana Dharani: ధరణి అక్రమాలపై ఇప్పటివరకు జరిగిన విచారణ వివరాలను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అధికారులు సమర్పించినట్లు సమాచారం. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం..
- Prabhakar M
- Updated on: Jul 8, 2026
- 12:08 pm
రైతులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్న్యూస్.. మళ్లీ అకౌంట్లోకి డబ్బులు.. మీకు వచ్చాయా
తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు అందిస్తున్న వానాకాలం పెట్టుబడి సాయం మరో విడత నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ విడతలో 7 నుంచి 8 ఎకరాల సాగుభూమి ఉన్న రైతుల ఖాతాల్లో మొత్తం రూ.259.73 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.
- Prabhakar M
- Updated on: Jul 7, 2026
- 6:35 pm
మారబోతున్న భాగ్యనగరం.. ‘మూసీ’ నదికి అదిరిపోయే కొత్త లుక్.. ప్లాన్ చూస్తే షాకే!
హైదరాబాద్ మహానగర ముఖచిత్రాన్ని మార్చేలా ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. భవిష్యత్తు సవాళ్లు, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ఏకంగా లక్షన్నర క్యూసెక్కుల గరిష్ఠ వరద ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా మూసీ నది డిజైన్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు తొలి దశ పనుల అంచనాలు, నిధుల సమీకరణ, అమలు విధానంతో కూడిన సమగ్ర నివేదికను పురపాలక శాఖ ఇటీవల మంత్రివర్గానికి సమర్పించింది.
- Prabhakar M
- Updated on: Jul 3, 2026
- 1:45 pm