తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 నుండి 2017 వరకు V6 న్యూస్ ఢిల్లీ మరియు హైద్రాబాద్ రిపోర్టర్ గా పని చేసాను.. ప్రతిష్టాత్మక తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే క్రమం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఢిల్లీ నుండి రిపోర్టింగ్ చేశాను.. 2017లో టివి9 లో అడుగుపెట్టాను.. రెండేళ్ల పాటు హైద్రాబాద్ రిపోర్టర్ గా పనిచేసి అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధిగా బదిలీ అయి ఐదేళ్ల పాటు గ్రౌండ్ రూరల్ నుండి రిపోర్టింగ్ చేశాను ..కామారెడ్డి జిల్లా లో గుహ లో ఇరుక్కుపోయిన రాజు అనే వ్యక్తి ని రెస్క్యూ చేయడానికి 12 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ ను కళ్లకు కడుతూ రిపోర్టింగ్ చేశాను , అందుకు గాను టీవీ9 నెట్వర్క్ నుండి బెస్ట్ పర్ఫామెన్స్ సర్టిఫికెట్ అందుకున్నాను ..2018, 2023 జనరల్ ఎన్నికల తర్వాతా ఇప్పుడు హైదరాబాద్ కు బదిలీ అయి టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారాలు రిపోర్ట్ చేస్తున్నాను
CM Revanth: వారంలో రెండుసార్లు విజిట్.. వారికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
విద్యాశాఖపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. స్కూల్స్తోపాటు ఇంటర్ కాలేజీల బలోపేతంపైనా దృష్టి సారించింది. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి.. ఇంటర్లో జాయిన్ అయ్యే విద్యార్థుల సంఖ్య తగ్గడంపై సీరియస్ అయ్యారు. ఇకపై ఇంటర్ జాయినింగ్స్ స్పెషల్ ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు.
- Prabhakar M
- Updated on: Jun 25, 2025
- 9:32 pm
Telangana: రైతు నేస్తం.. మరో సభకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన..
కాంగ్రెస్ సర్కార్ మరో సభకు సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు అందించిన రైతు భరోసాపై.. ప్రభుత్వ విజయాన్ని ప్రజల మధ్య పంచుకునేందుకు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో “రైతు భరోసా విజయోత్సవ సభ” నిర్వహించనున్నట్టు వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
- Prabhakar M
- Updated on: Jun 23, 2025
- 3:39 pm
Telangana: పెన్షన్ అవకతవకలపై ప్రభుత్వం ఫోకస్.. డిజిటల్ ఆడిట్ దిశగా అడుగులు!
రాష్ట్రంలోని పెన్షన్ పంపిణీ అవకతవకలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఉపాధి హామీ పథకం తరహాలో చేయూత పెన్షన్లపై సామాజిక తనిఖీలు నిర్వహించాలని యోచిస్తోంది. పెన్షన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత సాధించడం, అక్రమాలను అరికట్టడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందిస్తున్నటు సమాచారం.
- Prabhakar M
- Updated on: Jun 20, 2025
- 7:50 pm
Hyderabad: దూకుడుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్
తెలంగాణలో స్థిరాస్తి రంగం పుంజుకుంటూ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 3020 కోట్ల ఆదాయం లభించింది. గతేడాదితో పోలిస్తే 17.72% వృద్ధి సాధించడంతో.. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్లు, ప్లాట్ల కొనుగోలు, విక్రయాలు పెరిగాయి .
- Prabhakar M
- Updated on: Jun 14, 2025
- 1:30 pm
Rythu Bharosa: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్న్యూస్.. ఎన్నికలకు ముందే “రైతు భరోసా” నిధుల విడుదల!
తెలంగాణంలో రైతు భరోసా నిధులు చెల్లింపులకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. వానాకాలం సాగు ప్రారంభానికి ముందు రైతులకు పెట్టుబడి సాయంగా ‘రైతు భరోసా’ నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆర్థిక వనరుల సమీకరణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం, వచ్చే 10 నుంచి 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలన్న ఆలోచనలో ఉంది.
- Prabhakar M
- Updated on: Jun 14, 2025
- 12:03 pm
Telangana: రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు సబ్ కమిటీ ఆమోదం.. 5 వేల ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణలో ఉపాధిని కల్పించే పరిశ్రమలను ప్రోత్సహించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సూచించారు. ఆదాయం, ఉద్యోగావకాశాలు అందించే పరిశ్రమలు రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సబ్ కమిటీ సమావేశంలో హుండయ్ పరిశ్రమకు ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సందర్భంగా ఆయన అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేశారు.
- Prabhakar M
- Updated on: May 26, 2025
- 9:14 am
Telangana: తెలంగాణ విద్యుత్తు రంగానికి దిశానిర్దేశం.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Telangana: అవుటర్ రింగ్ రోడ్ పొడవునా సోలార్ విద్యుత్తును వినియోగించుకునే ప్రణాళికపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే పాదచారుల మార్గాలు, నాలాలపై సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమీక్షా
- Prabhakar M
- Updated on: May 16, 2025
- 7:59 pm
Telangana: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు భారీ స్పందన.. అప్పుడే టార్గెట్ పూర్తి..!
ఈసారి సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్కు రూ.500 బోనస్ ప్రకటించింది. ఇప్పటివరకు అందిన సన్న రకం ధాన్యంపై రూ.767 కోట్ల బోనస్ చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విధంగా రైతులకు గరిష్ట ధర అందిస్తూ, ప్రభుత్వ ఖరీదుపై ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా గణనీయంగా కొనసాగుతోంది.
- Prabhakar M
- Updated on: May 13, 2025
- 7:48 pm
Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు షాక్.. సిబిల్ లేకపోతే లోన్ రానట్టేనా..?
రాజీవ్ యువ వికాసం స్కీమ్లో సిబిల్ స్కోర్ కీలకం కానుంది. పథకం ద్వారా ప్రభుత్వ సహాయంతో లోన్ పొందాలనుకునే యువతకు క్రెడిట్ స్కోర్ను ప్రధాన అర్హతగా నిర్ణయించనున్నారు. దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లేదా గతంలో రుణాలు తీసుకుని చెల్లించకపోతే వారి దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
- Prabhakar M
- Updated on: May 5, 2025
- 10:38 am
Telangana: రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్న వారికి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కార్డులలో కొత్త పేర్లు చేర్చడానికి పౌరసరఫరాల శాఖకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. దాంతో తెలంగాణ పౌరసరఫరాల శాఖ రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేరిక కోసం దరఖాస్తులను పరిశీలించి ఆమోదిస్తోంది.
- Prabhakar M
- Updated on: May 3, 2025
- 8:22 am
వావ్.. వాటే ఐడియా గురూ.. సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంట్లో మొక్కల అద్దె ట్రెండ్
ఈ వేసవిలో కొత్త గ్రీన్ ట్రెండ్ బాగా నడుస్తోంది. వేసవి వేడిని చల్లబరిచేందుకు హైదరాబాద్, విజయవాడలో ఇలాంటి ఓ సరికొత్త ఐడియా జనాలను ఆకర్షిస్తోంది. మొక్కల అద్దె సేవలు! ఇంటిని అందంగా, చల్లగా మార్చే ఈ ట్రెండ్ యువతలో సందడి చేస్తోంది? ఆన్లైన్లో బుక్ చేస్తే మొక్కలు మీ ఇంటికి చేరతాయి.. సీజన్ తర్వాత తిరిగి తీసుకెళతారు. ఈ పర్యావరణ హిత ఆలోచన గురించి పూర్తిగా తెలుసుకోండి!
- Prabhakar M
- Updated on: Apr 22, 2025
- 2:05 pm
CM Revanth Reddy: కలిసి నడుద్దాం..నవ ప్రపంచాన్ని నిర్మిద్దాం.. జపాన్ వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ ఆహ్వానం!
తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం రేవంత్ రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచ దేశాలకు తెలియజేశారు. జపాన్ పర్యటనలో భాగంగా ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్ పోలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం పాల్గొంది. ఈ ఎక్స్ పోలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
- Prabhakar M
- Updated on: Apr 21, 2025
- 7:04 pm