తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 నుండి 2017 వరకు V6 న్యూస్ ఢిల్లీ మరియు హైద్రాబాద్ రిపోర్టర్ గా పని చేసి 2017లో టివి9 లో అడుగుపెట్టాను.. రెండేళ్ల పాటు హైద్రాబాద్ రిపోర్టర్ గా పనిచేసి ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Telangana: ధరణి సమస్యలపై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష.. కీలక ఆదేశాలు..
ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్లో తలెత్తిన సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్నారు. సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుల పట్టాదారు పాసుబుక్కులకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
- Prabhakar M
- Updated on: Jul 26, 2024
- 7:56 pm
CM Relief Fund: పక్కాగా.. పారదర్శకంగా!.. ఇక నుంచి ఆన్లైన్లో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల స్వీకరణ..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) దరఖాస్తులను ఇక నుంచి ఆన్ లైన్ లో స్వీకరించనున్నారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
- Prabhakar M
- Updated on: Jul 2, 2024
- 8:39 pm
Telangana: కేబినెట్ విస్తరణకు సర్కార్ ఏర్పాట్లు.. రేపు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్.. లిస్టులో ఉన్నదెవరంటే..?
తెలంగాణ లో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. జూలై 4 మంత్రి వర్గ పునర్వవస్థీకరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే కేబినెట్ విస్తరణ లో ఎవరికి అవకాశం దక్కనుంది. విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ ఎలాంటి కసరత్తు చేస్తున్నారు..? హైకమాండ్ చేసిన సూచనలు ఏంటి..?
- Prabhakar M
- Updated on: Jul 2, 2024
- 3:39 pm
సీఎం రేవంత్ రెడ్డితో భేటీకానున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..
తెలంగాణ ముఖ్యమంత్రికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. జూలై 6న భేటీ కానున్నట్లు లేఖలో ప్రతిపాదించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు చేపట్టిన విశేషమైన పనికి నా హృదయపూర్వక అభినందనలు. మీ అంకితభావం, నాయకత్వం తెలంగాణ ప్రగతికి, అభివృద్ధికి గణనీయంగా తోడ్పడ్డాయి. తెలుగు మాట్లాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండింటికీ సుస్థిరమైన పురోగతి, శ్రేయస్సును నిర్ధారించడానికి సన్నిహిత సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
- Prabhakar M
- Updated on: Jul 2, 2024
- 4:57 pm
విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై అందులోనే డిజిటల్ పాఠాలు.. అప్పటి నుంచే అమలు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పూర్తి స్థాయి డిజిటల్ పాఠాలు అందించేందుకు టి-సాట్ నెట్వర్క్ ప్రణాళిక సిద్దం చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటి నుండి 10వ తరగతి విద్యార్థులకు పూర్తి స్థాయి పాఠ్యాంశాలు ప్రసారం చేసేందుకు షెడ్యూల్ ఖరారైంది. విద్యా శాఖ క్యాలండర్ ను అనుసరించి టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ప్రసారాలకు సంబందించి ఆదివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. గత పదిహేను రోజులుగా బ్రిడ్జ్ కోర్స్ పాఠ్యాంశాలు ప్రసారం చేసిన టి-సాట్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబందించి 223 పాఠశాలల పని రోజుల్లో 749 గంటల కంటెంట్ ను 1,498 పాఠ్యాంశ భాగాలుగా విద్యా ఛానల్ లో ప్రసారం చేస్తున్నట్లు సీఈవో వివరించారు.
- Prabhakar M
- Updated on: Jun 30, 2024
- 3:34 pm
Telangana: కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్లో ఆ మంత్రి ప్రత్యేక ఆకర్షణ..
ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న రాజకీయ ప్రకంపణల్లో ఆయనే కీలకం. ఎక్కడ ఎవరు కండువా కప్పుకున్నా ఆ మంత్రి లేకుండా మంత్రాంగం ముందుకు జరగడం లేదన్న చర్చ జోరుగా నడుస్తోంది. ప్రతి ఆకర్ష్లో ఆయన అపరేషన్ ఉండాల్సిందే అంటున్నారు కొందరు. జిల్లాతో సంబంధం లేకుండా ఎవరి జాయినింగ్ అయినా ఆయనే దగ్గరుండి అపరేషన్ కంప్లీట్ చేస్తున్నారట.
- Prabhakar M
- Updated on: Jun 25, 2024
- 5:33 pm
Telangana: తెలంగాణలో ప్రక్షాళన వేగవంతం.. ఐఏఎస్ అధికారుల బదిలీపై కొనసాగుతున్న సస్పెన్స్!
తెలంగాణలో మరికొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసే అంశంపై సర్కారు కసరత్తు చేస్తోంది. ఈసారి కొంతమంది సీనియర్ ఐఏఎస్లకు కూడా స్థానచలనం ఉండొచ్చని తెలుస్తోంది. శనివారం 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం..10 మంది ఐఏఎస్ అధికారులకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.
- Prabhakar M
- Updated on: Jun 19, 2024
- 11:36 am
Telangana: యువతకు గుడ్ న్యూస్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చాలని డిసైడ్ అయింది. ఇందుకోసం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకుంది.
- Prabhakar M
- Updated on: Jun 18, 2024
- 5:06 pm
Revanth Reddy: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డిని పిలవకపోవడానికి కారణం అదేనా..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అహ్వానం అందలేదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం..!
- Prabhakar M
- Updated on: Jun 11, 2024
- 4:54 pm
Revanth Reddy: సీఎం సచివాలయానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు? కారణం ఏంటో తెలుసా?
తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబందించి కోద్ది రోజులగా చాల ఇంట్రేస్టింగ్ విషయాలు కనిపిస్తున్నాయి. గత కోద్ది రోజులుగా సీఎం రేవంత్ సచివాలయానికి దూరంగా ఉండటం ఇప్పుడు హట్ టాఫిక్ గా మారుతుంది. సచివాలయం నుండి కాకుండా ముఖ్యమైన రీవ్యూలు పోలిస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి చేయడం ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తి రేపుతుంది. దీనికి ప్రధాన కారణం సచివాలయంలో వాస్తు మార్పులేనా..? అందుకే సీఎం..
- Prabhakar M
- Updated on: Jun 11, 2024
- 11:38 am
Telangana: సీఎంవోలో భారీగా మార్పులకు రంగం సిద్దం.. కసరత్తు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
మొన్నటిదాకా ఎలక్షన్ కోడ్. ప్రభుత్వం అధికారంలోకొచ్చాక పాలనాయంత్రాంగం ప్రక్షాళనకు టైమే దొరకలేదు. అందుకే పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే పాలనపై ఫుల్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ సర్కార్. సీఎంవోలో మార్పులకు కసరత్తు చేస్తున్నారు సీఎం రేవంత్రెడ్డి. తెలంగాణలో ఉన్నతాధికారుల బదిలీలు భారీగా ఉండబోతున్నాయా?
- Prabhakar M
- Updated on: Jun 7, 2024
- 4:56 pm
Telangana: పాలనపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్.. ఇకపై అక్కడి నుంచే సమీక్షలు, సమావేశాలు ..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక నుండి రోజు సచివాలయానికి రాన్నున్నారు. గత రెండు నెలలుగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో సచివాలయానికి దూరంగా ఉన్నారు సీఎం రేవంత్. మార్చి 16 నుండి జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో సీఎం పరిపాలనాపరమైన అంశాలకు దూరంగా ఉన్నారు. సమీక్షలు, సమావేశాలు నిర్వహించడానికి, అధికారులను కలవడానికి అనుమతి లేకపోవడంతో సీఎం తన నివాసం జూబ్లీహిల్స్ నుండే కార్యక్రమాలు నిర్వహించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల ప్రచారాలను కూడ అక్కడి నుండే నిర్వహించారు సీఎం రేవంత్.
- Prabhakar M
- Updated on: Jun 7, 2024
- 9:18 am