చిన్నప్పటి నుంచే జర్నలిజంపై ఉన్న ఆసక్తి నన్ను ఈ వృత్తిలోకి తీసుకొచ్చింది. 2013 నుంచి జర్నలిజంలో కొనసాగుతూ, 2017లో టీవీ9లో చేరాను. హైదరాబాద్ రిపోర్టర్గా ప్రారంభించి, అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధిగా నాలుగేళ్ల పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి విస్తృతంగా రిపోర్టింగ్ చేశాను.
కామారెడ్డి జిల్లాలో గుహలో చిక్కుకున్న రాజు రెస్క్యూ ఆపరేషన్ను 12 గంటల పాటు ప్రత్యక్షంగా కవర్ చేసి, ఆ కథనాలకు గాను టీవీ9 నెట్వర్క్ నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ సర్టిఫికేట్ అందుకున్నాను. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన కార్యక్రమానికి సంబంధించి దక్షిణ కొరియా పర్యటనలో ప్రభుత్వ ప్రతినిధి బృందంతో కలిసి వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక కథనాలు అందించాను.
ప్రస్తుతం హైదరాబాద్లో టీవీ9 స్పెషల్ కరస్పాండెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారాలతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలను కవర్ చేస్తున్నాను.
HYDRAA: రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ.. వచ్చే ఏడాదికి మరో భారీ లక్ష్యం
HYDRAA: చెరువుల ఆక్రమణలను తొలగించడంలో హైడ్రా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటివరకు 449.11 ఎకరాల మేర చెరువు భూములను కాపాడింది. మొదటి విడతలో చేపట్టిన ఆరు చెరువుల పునరుద్ధరణ పనుల్లో భాగంగా తమ్మిడికుంట, కూకట్పల్లి నల్లచెరువు, ఉప్పల్ నల్లచెరువు, సున్నం చెరువు..
- Prabhakar M
- Updated on: Jun 10, 2026
- 7:55 am
Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..
తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు బోధన ఫీజులు, ఉపకార వేతనాల మంజూరులో కీలక మార్పులు చేసింది. 2026-27 నుంచి డీబీటీ ద్వారా నేరుగా విద్యార్థుల ఖాతాల్లో ఫీజులు జమ చేయడం, ఏడాది పొడవునా ఈ-పాస్ దరఖాస్తులు స్వీకరించడం, ఆటోమేటిక్ రెన్యువల్ వంటి కొత్త విధానాలను అమల్లోకి తీసుకురానుంది.
- Prabhakar M
- Updated on: Jun 10, 2026
- 6:46 am
Telangana: మహిళా శక్తికి పట్టాభిషేకం.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..
మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీకి అద్దె బస్సులు ఇచ్చే వినూత్న పథకంలో భాగంగా రెండో విడత కింద 553 కొత్త బస్సులను మంగళవారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రతి బస్సుపై మహిళా సంఘాలకు నెలకు రూ.69 వేల వరకు అద్దె రానుంది. అంతేకాకుండా పలు కీలక నిర్ణయాలు ప్రకటించనున్నారు.
- Prabhakar M
- Updated on: Jun 9, 2026
- 1:14 pm
Telangana: తెలంగాణ యువతకు గోల్డెన్ ఛాన్స్.. గ్లోబల్ కెరీర్కు గేట్వేగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు
తెలంగాణ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే సువర్ణావకాశం కల్పిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ ఉన్న సరికొత్త టెక్నాలజీపై పట్టు సాధించేందుకు వీలుగా పాత ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న విద్యార్థులకు స్టైపెండ్లు అందిస్తూ, ప్రపంచ స్థాయి నైపుణ్యాలను నేర్పిస్తోంది. మల్లేపల్లి ఏటీసీని సందర్శించిన మంత్రి వివేక్ వెంకటస్వామి.. క్రమశిక్షణ, అంకితభావం ఉంటే యువత అంతర్జాతీయ కెరీర్ను నిర్మించుకోవచ్చని పిలుపునిచ్చారు.
- Prabhakar M
- Updated on: Jun 5, 2026
- 9:10 pm
Telangana: ప్రజలకు సూపర్ గుడ్న్యూస్.. మీకు నచ్చిన చోటే 400 చదరపు అడుగుల విశాలమైన ఇళ్లు!
తెలంగాణ రాష్ట్రంలోని పేదలు, అల్పాదాయ, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. సొంత ఇంటి కల నిజం చేసుకోవాలనుకునే వారికి ఆసరాగా నిలుస్తూ.. ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా ఒక అద్భుతమైన గృహ నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టింది. కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
- Prabhakar M
- Updated on: Jun 5, 2026
- 6:27 pm
Telangana: భూముల రేట్లు డబుల్.. నేటి నుంచే అమల్లోకి.. ఎక్కడ ఎంత పెరిగిందంటే..?
తెలంగాణ వ్యాప్తంగా సవరించిన భూముల మార్కెట్ విలువలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయంతో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల మోత మోగనుంది. వ్యవసాయ భూముల విలువలను ఏకంగా 50 నుంచి 100 శాతం వరకు పెంచేయడంతో రియల్ ఎస్టేట్ సరికొత్త అధ్యాయం మొదలైంది. ఓఆర్ఆర్ పరిధితో పాటు కోకాపేట, రాయదుర్గం వంటి ఏరియాల్లో రేట్లు భారీగా భారీగా పెరిగాయి.
- Prabhakar M
- Updated on: Jun 5, 2026
- 7:28 am
కొత్త గూటికి.. చిట్టి అడుగులు! రికార్డు స్థాయిలో అనాథ పిల్లల దత్తతలు
Telangana Child Adoption: తెలంగాణలో దత్తతల సంఖ్య గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 307 మంది చిన్నారులు కొత్త కుటుంబాల్లోకి అడుగుపెట్టారు. దత్తతపై ప్రజల్లో పెరుగుతున్న సానుకూల దృక్పథం, ప్రభుత్వ అవగాహన కార్యక్రమాల ఫలితంగా అనాథ చిన్నారులకు ప్రేమ, ఆప్యాయతలతో కూడిన కుటుంబాలు దొరుకుతున్నాయి. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు కూడా దత్తత అవకాశాలు పెరగడం ఆశాజనక పరిణామంగా మారింది.
- Prabhakar M
- Updated on: Jun 4, 2026
- 2:46 pm
Telangana: గ్రామీణ ప్రాంతాలకు రేవంత్ సర్కార్ సూపర్ గుడ్న్యూస్.. కొత్తగా 3 లక్షల కనెక్షన్ల టార్గెట్
Telangana Rural Internet Boost: గ్రామాల్లో నివసించే జనాలకు రేవంత్ సర్కార్ అదరిపోయే గుడ్న్యూస్ చెప్పింది.గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసేందుకు కీలక అడుగు వేసింది. కేంద్ర సహకారంతో రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి హై స్పీడ్ ఇంటర్నెట్ను అందించే దిశగా ముందుకు సాగుతోంది.
- Prabhakar M
- Updated on: Jun 2, 2026
- 10:17 am
Hyderabad: హైదరాబాద్కు గ్లోబల్ దిగ్గజాల క్యూ.. వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..!
Hyderabad: ఐటీ, ఫార్మా, ఫిన్టెక్, రక్షణ, అంతరిక్ష, ఆహార ప్రాసెసింగ్ రంగాల్లో వరుస పెట్టుబడులు తెలంగాణను ప్రపంచ వ్యాపార మ్యాప్లో మరింత బలంగా నిలబెడుతున్నాయి. గ్లోబల్ కంపెనీల రాకతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు లభించనుంది..
- Prabhakar M
- Updated on: Jun 1, 2026
- 11:48 am
Telangana: లాజిస్టిక్స్లో తెలంగాణ జోరు.. రేవంత్ సర్కార్ చర్యలకు కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు..
జాతీయ లాజిస్టిక్స్ ర్యాంకింగ్స్ 2025లో తెలంగాణ రాష్ట్రం ‘హై పెర్ఫార్మర్’గా నిలిచి మరో కీలక మైలురాయిని చేరుకుంది. గతంలో అచీవర్ కేటగిరీలో ఉన్న తెలంగాణ.. ఈసారి మరింత మెరుగైన స్థాయికి చేరుకోవడం విశేషం. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన LEADS-2025 నివేదికలో రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధి, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, లాజిస్టిక్స్ రంగంలో తీసుకున్న చర్యలను ప్రత్యేకంగా ప్రశంసించింది.
- Prabhakar M
- Updated on: May 27, 2026
- 8:11 am
Telangana: హైదరాబాద్లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ.. ఈవీ రంగంలో బిగ్ బూస్ట్..
ప్రపంచ ఈవీ దిగ్గజం టెస్లా కన్ను ఇప్పుడు హైదరాబాద్పై పడిందా? ఎలోన్ మాస్క్ కంపెనీ తెలంగాణ వైపు అడుగులు వేస్తోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో టెస్లా ఇండియా ప్రతినిధులు సమావేశమై కీలక విషయాలపై చర్చించారు. దీనికి సంబంధించిన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందా..
- Prabhakar M
- Updated on: May 22, 2026
- 9:11 pm
Hyderabad: ఎలక్ట్రిక్ వెహికల్ కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్
హైదరాబాద్కు చెందిన టెక్ సంస్థ ఉతమ ఉద్యోగులకు సూపర్ గుడ్న్యూస్ చెప్పింది. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో అజా కన్సల్టింగ్ సర్వీసెస్ ఉద్యోగుల కోసం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈవీలు కొనుగోలు చేసే తమ ఉద్యోగులకు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది.
- Prabhakar M
- Updated on: May 20, 2026
- 2:54 pm