చిన్నప్పటి నుంచే జర్నలిజంపై ఉన్న ఆసక్తి నన్ను ఈ వృత్తిలోకి తీసుకొచ్చింది. 2013 నుంచి జర్నలిజంలో కొనసాగుతూ, 2017లో టీవీ9లో చేరాను. హైదరాబాద్ రిపోర్టర్గా ప్రారంభించి, అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధిగా నాలుగేళ్ల పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి విస్తృతంగా రిపోర్టింగ్ చేశాను.
కామారెడ్డి జిల్లాలో గుహలో చిక్కుకున్న రాజు రెస్క్యూ ఆపరేషన్ను 12 గంటల పాటు ప్రత్యక్షంగా కవర్ చేసి, ఆ కథనాలకు గాను టీవీ9 నెట్వర్క్ నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ సర్టిఫికేట్ అందుకున్నాను. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన కార్యక్రమానికి సంబంధించి దక్షిణ కొరియా పర్యటనలో ప్రభుత్వ ప్రతినిధి బృందంతో కలిసి వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక కథనాలు అందించాను.
ప్రస్తుతం హైదరాబాద్లో టీవీ9 స్పెషల్ కరస్పాండెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారాలతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలను కవర్ చేస్తున్నాను.
Telangana: రైతన్నలకు సూపర్ గుడ్న్యూస్.. ఆ పంటలు వేస్తే.. ఎకరానికి రూ.5వేల ప్రోత్సాహకం!
రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేవలం వరి మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలు పండించే రైతులకు ప్రోత్సాహకం అందించాలని ప్లాన్ చేస్తుంది. వరికి బదులుగా పెసలు, కందులు, జొన్నలు, మొక్కజొన్న, నూనెగింజలు, కూరగాయలు వంటి పంటలు సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.4 నుంచి 5వేల వరకు ప్రత్సాహకం ఇవ్వాలని ఆలోచిస్తోంది.
- Prabhakar M
- Updated on: Jul 2, 2026
- 7:22 am
Telangana: ధరణి, భూ భారతి పోర్టళ్లలో అక్రమాలు..! విచారణకు రేవంత్ సర్కార్ ప్రత్యేక కమిటీ
ధరణి, భూభారతి పోర్టళ్లలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఫోరెన్సిక్ ఆడిట్లో భద్రతా లోపాలు గుర్తించిన నేపథ్యంలో, బాధ్యులను గుర్తించి చర్యలు సూచించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సాంకేతిక సిఫార్సులు చేయాలని కమిటీకి బాధ్యతలు అప్పగించింది.
- Prabhakar M
- Updated on: Jul 2, 2026
- 7:21 am
రాజకీయానికి శ్రీకారం చుట్టిన నేల.. మిడ్జిల్లో సీఎం రేవంత్ భావోద్వేగ పర్యటన..!
ప్రజాప్రతినిధిగా తన రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టిన మిడ్జిల్ మండలానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి చేరుకోనున్నారు. తొలి విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు జూలై 4న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. జడ్పీటీసీ సభ్యుడిగా ప్రారంభమైన తన ప్రజా ప్రస్థానం 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.
- Prabhakar M
- Updated on: Jul 2, 2026
- 10:36 am
Hyderabad: వెదర్ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. హైదరాబాద్కు సరికొత్త టెక్నాలజీ.. ఇక వెయిటింగ్ లేనట్టే!
నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే అనలాగ్ వ్యవస్థాపకుడు అలెక్స్ కిప్మాన్, MEIL ఎండీ పి. కృష్ణారెడ్డిలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు.
- Prabhakar M
- Updated on: Jul 1, 2026
- 6:35 pm
Rythu Bharosa: అన్నదాతలకు గుడ్న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల.. ఎన్ని ఎకరాల వరకంటే?
తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ సర్కార్ మరో గుడ్న్యూస్ చెప్పింది. మంగళవారం తొలి విడతలో భాగంగా రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసిన ప్రభుత్వం.. బుధవారం మూడు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో కూడా నిధులు జమ చేసినట్టు తెలిపింది. ఈ విడతలో మొత్తం 10.68లక్షల మంది రైతుకు అకౌంట్లో డబ్బులు వేసినట్టు పేర్కొంది.
- Prabhakar M
- Updated on: Jul 1, 2026
- 5:56 pm
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి! వీటిపై కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ తొలి కాగిత రహిత (ఈ-క్యాబినెట్) సమావేశం జులై 2న జరిగింది. డిజిటల్ పాలన దిశగా ఈ సమావేశం ఒక ముఖ్య అడుగు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, వీబీ-గ్రామ్ పథకం అమలు, వానాకాలం సాగు ప్రణాళికలు, ఉద్యోగుల బదిలీలు, సిగ్ హౌసింగ్ ప్రాజెక్టుపై క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
- Prabhakar M
- Updated on: Jul 1, 2026
- 3:23 pm
గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పీపీపీ మోడల్.. ఉచిత టెస్టులకు సరికొత్త ప్రణాళిక
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్య పరికరాల నిర్వహణ సమస్యలకు పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) మోడల్ను పరిశీలిస్తోంది. ఈ విధానంలో సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్స్రే, రక్తపరీక్షల వంటి డయాగ్నస్టిక్ సేవలను ప్రైవేట్ సంస్థలు నిర్వహించగా, రోగులకు పరీక్షలు ఉచితంగా అందించి ఖర్చును ప్రభుత్వం భరించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నాణ్యమైన నిర్ధారణ సేవలు నిరంతరాయంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
- Prabhakar M
- Updated on: Jul 1, 2026
- 8:07 am
AI యుగంలో సరికొత్త విప్లవం.. హైదరాబాద్లో దేశంలోనే తొలి ‘డేటా సెంటర్ సిటీ’!
సాంకేతిక రంగంలో ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హైదరాబాద్ మహానగరం, ఇప్పుడు మరో సంచలన ప్రాజెక్టుకు వేదిక కాబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ను తట్టుకునేందుకు భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా, కేవలం డేటా సెంటర్ల కోసమే ఒక పూర్తి 'డేటా సెంటర్ నగరాన్ని' (Data Center City) అభివృద్ధి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో ఈ ప్రాజెక్ట్ దేశంలోనే ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.
- Prabhakar M
- Updated on: Jun 26, 2026
- 11:59 am
Telangana: పథకానికి పేరు చెబితే రూ.లక్ష మీదే.. తెలంగాణ హౌసింగ్ బోర్డు క్రేజీ కాంటెస్ట్
తెలంగాణలో సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఎదురుచూస్తున్న అల్పాదాయ వర్గాల (LIG) ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త శుభవార్త అందించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా క్యూర్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా లక్ష ఫ్లాట్ల నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టింది.అయితే ఈ పథకానికి అత్యంత మంచి పేరును చెప్పిన వారికి ప్రభుత్వం రూ. లక్ష నగదు బహుమతిని అందించనున్నట్లు పేర్కొంది.
- Prabhakar M
- Updated on: Jun 23, 2026
- 5:49 pm
మూసీ పునరుజ్జీవనకు కీలక అడుగు.. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్..!
హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ నుంచి అనుమతులు లభించాయి. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో పనుల అమలుకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు, భారత సైన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
- Prabhakar M
- Updated on: Jun 19, 2026
- 4:53 pm
Telangana: హైదరాబాద్-బెంగళూరు.. బుల్లెట్ ట్రైన్ వెళ్లేది ఈ రూట్లోనే.. స్టేషన్లు ఎక్కడెక్కడ రాబోతున్నాయంటే?
తెలంగాణలో హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు, వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులకు వేగవంతం చేయాలని తాజాగా జరిగిన సమావేశంతో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బుల్లెట్ ట్రైన్ కారిడార్లను రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పర్యాటక రంగానికి దోహదపడేలా రూపొందించాలని ఆదేశించారు. శంషాబాద్ను బుల్లెట్ ట్రైన్ హబ్గా, వరంగల్ ఎయిర్పోర్టును కాకతీయ శిల్పకళతో అలంకరించాలని సూచించారు. ఈ ప్రాజెక్టులు రవాణా వ్యవస్థను ఆధునీకరించి, తెలంగాణా సమగ్రాభివృద్ధికి తోడ్పడతాయి సీఎం రేవంత్ అన్నారు.
- Prabhakar M
- Updated on: Jun 17, 2026
- 10:01 am
Trump Road: హైదరాబాద్లోని ఆ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు.. ఎక్కడో తెలుసా?
గ్లోబల్ సిటీగా పేరొందచిన హైదరాబాద్- అమెరికా మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా హైదరాబాద్లోని ఓ ప్రత్యేక రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామాకరణం చేయాలని నిర్ణయించింది. గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లేలా ప్లాన్ చేసిన ఈ సరికొత్త రోడ్డును ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇంతకూ ఆ రోడ్డు ఏదో తెలుసుకోవాలి అంటే ఈస్టోరీ చదవాల్సిందే.
- Prabhakar M
- Updated on: Jun 16, 2026
- 12:32 pm