తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 నుండి 2017 వరకు V6 న్యూస్ ఢిల్లీ మరియు హైద్రాబాద్ రిపోర్టర్ గా పని చేసాను.. ప్రతిష్టాత్మక తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే క్రమం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఢిల్లీ నుండి రిపోర్టింగ్ చేశాను.. 2017లో టివి9 లో అడుగుపెట్టాను.. రెండేళ్ల పాటు హైద్రాబాద్ రిపోర్టర్ గా పనిచేసి అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధిగా బదిలీ అయి ఐదేళ్ల పాటు గ్రౌండ్ రూరల్ నుండి రిపోర్టింగ్ చేశాను ..కామారెడ్డి జిల్లా లో గుహ లో ఇరుక్కుపోయిన రాజు అనే వ్యక్తి ని రెస్క్యూ చేయడానికి 12 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ ను కళ్లకు కడుతూ రిపోర్టింగ్ చేశాను , అందుకు గాను టీవీ9 నెట్వర్క్ నుండి బెస్ట్ పర్ఫామెన్స్ సర్టిఫికెట్ అందుకున్నాను ..2018, 2023 జనరల్ ఎన్నికల తర్వాతా ఇప్పుడు హైదరాబాద్ కు బదిలీ అయి టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారాలు రిపోర్ట్ చేస్తున్నాను
Rythu Bharosa: రైతులకు అదిరిపోయే గుడ్న్యూస్.. ఆరోజే అకౌంట్లోకి రైతు భరోసా డబ్బులు
రాష్ట్రంలో రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అన్నదాతలకు అండగా నిలించేందుకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా మొదటి విడత నిధులను విడుదల చేసేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
- Prabhakar M
- Updated on: Mar 15, 2026
- 6:57 pm
Hyderabad: మూసీకి సరికొత్త రూపు.. రూ.7 వేల కోట్లతో మెగా ప్రాజెక్ట్.. భాగ్యనగరానికి మహార్థశ..!
హైదరాబాద్ మహానగరానికి ప్రాణాధారమైన మూసీ నదిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్కు సంబంధించి మొదటి దశ డీపీఆర్ పూర్తవడంతో త్వరలోనే పనులు ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మొదటి దశలో సుమారు 21 కిలోమీటర్ల పరిధిలో రూ.7 వేల కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
- Prabhakar M
- Updated on: Mar 12, 2026
- 1:13 pm
స్మార్ట్ఫోన్ యూజర్లు, ఇంటర్నెట్ వాడకందారులకు షాకింగ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్..!
స్మార్ట్ఫోన్ యూజర్లు, ఇంటర్నెట్ ప్రియులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇంటర్నెట్ డేటా వాడకంపై కొత్తగా ట్యాక్స్ వేసే ఆలోచనలో కేంద్ర సర్కార్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. జనవరి నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన టెలికాం రివ్యూ మీటింగ్లో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
- Prabhakar M
- Updated on: Mar 12, 2026
- 1:30 pm
Telangana: విద్యార్థినులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్..
తెలంగాణలో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థినుల కోసం ప్రభుత్వం భారీ పథకాన్ని సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న అమ్మాయిలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.7 లక్షల మంది విద్యార్థినులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది.
- Prabhakar M
- Updated on: Mar 11, 2026
- 9:45 am
నిరుద్యోగులకు కొత్త అవకాశాలు.. డిజిటల్ కంటెంట్ హబ్గా హైదరాబాద్..12న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభం
నెటిక్స్ స్టూడియోస్ హైదరాబాద్లో భారీ కార్యాలయాన్ని ప్రారంభించడం AVGC రంగానికి నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం, అంతర్జాతీయ ఓటీటీ కంటెంట్, విజువల్ ఎఫెక్ట్స్ పనులకు వేదిక కానుంది. ముఖ్యంగా, సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు కలిగిన యువతకు అపారమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. హైదరాబాద్ను డిజిటల్ కంటెంట్ తయారీ కేంద్రంగా మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఇది కీలక అడుగు.
- Prabhakar M
- Updated on: Mar 7, 2026
- 1:47 pm
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?.. ఇజ్రాయెల్ వాడిన ‘బ్లూ స్పారో’ మిసైల్ రహస్యాలివే!
అమెరికా- ఇజ్రాయెల్ చేపట్టిన ఎయిర్ స్ట్రైక్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలి ఖమేనీ మరణం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది. అయితే ఆయన మరణానికి కారణమైన దాడిలో బ్లూ స్పారో క్షిపణి ఉపయోగించారని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అధునాతన ఆయుధ వ్యవస్థలతో ఇజ్రాయెల్ నిర్వహించిన ఈ ఆపరేషన్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
- Prabhakar M
- Updated on: Mar 7, 2026
- 10:09 am
Telangana: టీచర్లకు బ్యాడ్ న్యూస్.. పదోన్నతులు విషయంలో సర్కార్ సంచలన నిర్ణయం!
తెలంగాణ విద్యాకమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులకు ఆటోమేటిక్ పదోన్నతులు ఉండకూడదని ప్రభుత్వానికి సూచన చేసింది. వారి పని తీరు ఆధారంగానే ప్రమోషన్లు ఉండాలని సూచించింది. తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి గురువారం సమర్పించింది.విద్యా విధానం పూర్తిగా విద్యార్థి కేంద్రంగా ఉండాలని కమిషన్ సిఫార్సు చేసింది.
- Prabhakar M
- Updated on: Feb 26, 2026
- 10:26 pm
2047 టార్గెట్: అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్గా తెలంగాణ, వేలాది ఉద్యోగాలకు బంగారు బాట
తెలంగాణను 2047 నాటికి దేశంలో అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముంబైలో ఈ విజన్ను ఆవిష్కరించారు. మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ ఇంటిగ్రేషన్, నైపుణ్యాభివృద్ధి ద్వారా 'ఫ్యూచర్ రెడీ ఎకోసిస్టమ్'ను నిర్మిస్తూ, లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ రంగాలలో పెట్టుబడులకు రాష్ట్రం ఆహ్వానం పలుకుతోంది.
- Prabhakar M
- Updated on: Feb 26, 2026
- 8:26 pm
వేతన జీవులకు సర్కార్ శుభవార్త.. ఉద్యోగులు, పెన్షనర్స్కు తీరిన కష్టాలు.. నెరవేరిన దశాబ్దాల కల..!
దశాబ్దాల తమ వాంఛను నెరవేర్చారంటూ ఉద్యోగ, పెన్షనర్స్ సంఘాల నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లకూ రూ.1.20 కోట్ల ప్రమాద బీమా వర్తింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం రూ.1,056 కోట్ల మూలనిధితో ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్య పథకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.
- Prabhakar M
- Updated on: Feb 25, 2026
- 7:23 am
Flight Passenger Rules: విమాన ప్రయాణికులకు కఠిన రూల్స్.. అలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు.. 2 ఏళ్లు బ్యాన్
డీజీసీఏ విమాన ప్రయాణికులకు భద్రత కల్పించేందుకు కఠిన రూల్స్ తీసుకురాబోతుంది. ఇకపై విమానంలో దురసుగా ప్రవర్తించడం లేదా దాడికి పాల్పడటం లాంటివి చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. దీంతో విమానాల్లో ప్రయాణించే సమయంలో ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే. త్వరలోనే వీటిని అమలు చేయనుంది.
- Prabhakar M
- Updated on: Feb 24, 2026
- 8:12 pm
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్న్యూస్.. HYDకి మరో గ్లోబల్ సంస్థ.. త్వరలోనే భారీగా ఉద్యోగాలు!
The Hartford Launches Global Technology Centre in Hyderabad: ఐటీతో పాటు పలు కీలక రంగాల్లో హైదరాబాద్ను గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేసిన ‘ది హార్ట్ ఫోర్డ్ ఇండియా టెక్నాలజీ సెంటర్’ను ఆయన ప్రారంభించారు.
- Prabhakar M
- Updated on: Feb 23, 2026
- 5:19 pm
CM Revanth Reddy : దేశం నుంచి ఒకే ఒక్కరు.. సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో మరొక గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థ హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించేందుకు అధికారిక ఆహ్వానం అందింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక సదస్సుకు భారత్ నుంచి ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రమే ఆహ్వానం అందుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
- Prabhakar M
- Updated on: Feb 22, 2026
- 10:04 pm