తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 నుండి 2017 వరకు V6 న్యూస్ ఢిల్లీ మరియు హైద్రాబాద్ రిపోర్టర్ గా పని చేసాను.. ప్రతిష్టాత్మక తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే క్రమం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఢిల్లీ నుండి రిపోర్టింగ్ చేశాను.. 2017లో టివి9 లో అడుగుపెట్టాను.. రెండేళ్ల పాటు హైద్రాబాద్ రిపోర్టర్ గా పనిచేసి అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధిగా బదిలీ అయి ఐదేళ్ల పాటు గ్రౌండ్ రూరల్ నుండి రిపోర్టింగ్ చేశాను ..కామారెడ్డి జిల్లా లో గుహ లో ఇరుక్కుపోయిన రాజు అనే వ్యక్తి ని రెస్క్యూ చేయడానికి 12 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ ను కళ్లకు కడుతూ రిపోర్టింగ్ చేశాను , అందుకు గాను టీవీ9 నెట్వర్క్ నుండి బెస్ట్ పర్ఫామెన్స్ సర్టిఫికెట్ అందుకున్నాను ..2018, 2023 జనరల్ ఎన్నికల తర్వాతా ఇప్పుడు హైదరాబాద్ కు బదిలీ అయి టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారాలు రిపోర్ట్ చేస్తున్నాను
Telangana: గుడ్న్యూస్.. హైదరాబాద్లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. త్వరలోనే భారీగా ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అంతర్జాతీయ టెక్నాలజీ భాగస్వామ్యాన్ని సాధించింది. కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ ఏఐ హార్డ్వేర్ సంస్థ బ్లైజ్ (Blaize)తో అవగాహన ఒప్పందం కుదిరింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం–2026 సదస్సు వేదికగా ఈ ఎంవోయూ జరిగింది. ఈ ఒప్పందంతో తెలంగాణలో ఏఐ, డేటా సెంటర్లు, సెమీకండక్టర్ రంగాల అభివృద్ధికి మరింత వేగం అందనుంది.
- Prabhakar M
- Updated on: Jan 21, 2026
- 12:30 pm
దావోస్ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన.. ప్రతి జులైలో హైదరాబాద్ అడ్డాగా..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనతో ప్రతి ఏడాది జులైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించనున్నారు. ఇది పెట్టుబడుల ఒప్పందాలను వేగవంతం చేస్తుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది. హైదరాబాద్ను గ్లోబల్ హబ్గా, ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దే విజన్ను సీఎం వివరించారు. AI, లైఫ్ సైన్సెస్ పాలసీలను ప్రారంభించారు.
- Prabhakar M
- Updated on: Jan 21, 2026
- 8:54 am
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి.. స్టార్టప్ ఎకోసిస్టమ్కు మరో ముందడుగు!
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్, వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారం, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్ల ప్రోత్సాహం వంటి కీలక అంశాల్లో కలిసి పని చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక–2026 సమావేశాల సందర్భంగా దావోస్లో, ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి గూగుల్..
- Prabhakar M
- Updated on: Jan 20, 2026
- 7:19 pm
Telangana: తెలంగాణ “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశానికే రోల్ మోడల్!
Davos: తెలంగాణ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యతగా మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గత రెండేళ్లలో దావోస్ వేదికగా సుమారు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణ ప్రభుత్వం సమీకరించిందని తెలిపారు. అలాగే..
- Prabhakar M
- Updated on: Jan 20, 2026
- 5:13 pm
Davos 2026: దావోస్ టూర్లో చంద్రబాబు, రేవంత్ సైలెంట్ వ్యూహం.. తెరవెనుక ఊహించని ప్లాన్..
దావోస్ 2026 భారత్కు ఒక టర్నింగ్ పాయింట్గా నిలవనుంది. ఇక్కడ కేవలం ఒప్పందాలే కాకుండా వాటి అమలే అసలైన విజయంగా మారింది. ఇందులో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ముందువరుసలో నిలుస్తున్నాయి. దావోస్ ముగిసిన తర్వాత వాటి గ్రౌండింగ్ లో అసలైన పరీక్ష మొదలవుతుందన్న మాట ఇప్పుడు గ్లోబల్ కారిడార్లలో స్పష్టంగా వినిపిస్తోంది.
- Prabhakar M
- Updated on: Jan 20, 2026
- 12:18 pm
ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి అపర కుబేరుల వరకు అందరి దారులూ దావోస్ వైపే..
Davos WEF 2026: మంచు కురిసే ఆల్ప్స్ పర్వతాల ఒడిలో.. ప్రపంచ గమనాన్ని మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. గ్లోబల్ పవర్ సెంటర్గా పేరొందిన దావోస్ పట్టణం నేటి నుంచి ప్రపంచ నేతల చర్చా వేదికగా మారింది. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి అపర కుబేరుల వరకు, మేధావుల నుంచి ఆర్థిక నిపుణుల వరకు.. అంతా ఒకే చోట చేరి భవిష్యత్తుపై దిశానిర్దేశం చేయనున్నారు.
- Prabhakar M
- Updated on: Jan 19, 2026
- 11:26 am
కొత్త అజెండాతో విదేశీ పెట్టుబడులే లక్ష్యం.. దావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణకు భారీ విదేశీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. జనవరి 19వ తేదీన స్విట్జర్లాండ్లోని దావోస్కు సీఎం బృందం వెళ్లనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) వార్షిక సదస్సులో పాల్గొననుంది. ఈ పర్యటనలో తెలంగాణ భవిష్యత్ పారిశ్రామిక దిశను నిర్దేశించే కీలక అజెండాలతో ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది.
- Prabhakar M
- Updated on: Jan 17, 2026
- 1:58 pm
గుజరాత్, మహారాష్ట్రను వెనక్కు నెట్టి అగ్ర స్థానంలో తెలంగాణ.. వెల్లడించిన కేంద్ర గణాంకాలు..!
తెలంగాణకు ప్రభుత్వ భూములే అతిపెద్ద బలం అని మరోసారి రుజువైంది. పరిశ్రమల ఏర్పాటుకు తక్షణమే వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న 76 వేల ఎకరాల భూముల ఉన్నాయి. దీంతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) విడుదల చేసిన ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ రిపోర్టులో ఈ విషయం స్పష్టమైంది.
- Prabhakar M
- Updated on: Jan 19, 2026
- 7:05 pm
ఇది కదా కావాల్సింది.. పంచాయతీలకు సంక్రాంతి గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల
సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గ్రామీణ పరిపాలనను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రూ.277 కోట్ల నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నిర్ణయం తీసుకున్నారు.
- Prabhakar M
- Updated on: Jan 13, 2026
- 7:25 pm
Medaram Maha Jatara: దారులన్నీ మేడారం వైపే.. మహాజాతరకు సర్వం సిద్ధం.. ఒక్క క్లిక్తో ఫుల్ అప్డేట్స్..
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. సుమారు రెండు కోట్ల మంది భక్తుల కోసం రూ.260 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు మంత్రి సీతక్క తెలిపారు. ఫిబ్రవరి 18న సీఎం రేవంత్ రెడ్డి ఆలయాన్ని ప్రారంభించి క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తారన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు, అప్డేట్స్ మొబైల్ యాప్, వెబ్సైట్, చాట్బాట్ అందుబాటులో ఉన్నాయన్నారు.
- Prabhakar M
- Updated on: Jan 13, 2026
- 6:04 pm
Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. పాలిటెక్నిక్లో 9 కొత్త కోర్సులు.. ఇక ఉద్యోగాలకు డోకాలేనట్టే!
పాలిటెక్నిక్ విద్య పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. పరిశ్రమల్లో ప్రస్తుతం ఉన్న డిమాండ్కు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టడమే కాకుండా, ఇప్పటికే ఉన్న కొన్ని కోర్సులకు ఆధునిక అవసరాలకు తగ్గట్టు పేర్లు, సిలబస్ మార్పులు చేపట్టింది.
- Prabhakar M
- Updated on: Jan 13, 2026
- 5:36 pm
Telangana: గుడ్న్యూస్.. జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్.. ఆ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన!
Telangana CM Revanth Reddy District Tour: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాల పర్యటనలకు రోడ్మ్యాప్ ఖరారు చేశారు. త్రిముఖ వ్యూహంతో సీఎం ఈ పర్యటన కొనసాగించనున్నారు. ఎన్నికల ప్రచారం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కేంద్రంపై ఉపాధి హామీ నిరసన సభల్లో పాల్గొననున్నారు. జనవరి 16 నుంచి తొలి విడత, ఫిబ్రవరి 3 నుంచి మలి విడత పర్యటనలు చేపట్టి, రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ కదలిక తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
- Prabhakar M
- Updated on: Jan 13, 2026
- 2:27 pm