తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 నుండి 2017 వరకు V6 న్యూస్ ఢిల్లీ మరియు హైద్రాబాద్ రిపోర్టర్ గా పని చేసాను.. ప్రతిష్టాత్మక తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే క్రమం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఢిల్లీ నుండి రిపోర్టింగ్ చేశాను.. 2017లో టివి9 లో అడుగుపెట్టాను.. రెండేళ్ల పాటు హైద్రాబాద్ రిపోర్టర్ గా పనిచేసి అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధిగా బదిలీ అయి ఐదేళ్ల పాటు గ్రౌండ్ రూరల్ నుండి రిపోర్టింగ్ చేశాను ..కామారెడ్డి జిల్లా లో గుహ లో ఇరుక్కుపోయిన రాజు అనే వ్యక్తి ని రెస్క్యూ చేయడానికి 12 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ ను కళ్లకు కడుతూ రిపోర్టింగ్ చేశాను , అందుకు గాను టీవీ9 నెట్వర్క్ నుండి బెస్ట్ పర్ఫామెన్స్ సర్టిఫికెట్ అందుకున్నాను ..2018, 2023 జనరల్ ఎన్నికల తర్వాతా ఇప్పుడు హైదరాబాద్ కు బదిలీ అయి టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారాలు రిపోర్ట్ చేస్తున్నాను
CM Revanth Reddy: హడ్కో చైర్మన్కు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ రిక్వెస్ట్.. ఏంటో తెలుసా?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హడ్కో చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠ సమావేశం అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న కీలక అభివృద్ధి కార్యక్రమాలకు తక్కువ వడ్డీ రేటుతో దీర్ఘకాలిక రుణాలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ను కోరారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రగతికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి.
- Prabhakar M
- Updated on: Dec 1, 2025
- 2:26 pm
Hyderabad: ప్రపంచ ఉత్తమ నగరాల జాబితాలో హైదరాబాద్.. మన ర్యాంక్ ఎంతంటే?
ప్రపంచంలోని ఉత్తమ 100 నగరాల జాబితాలో భారత్కు చెందిన నాలుగు ప్రధాన నగరాలు స్థానం దక్కించుకున్నాయి. రెసోనెన్స్ కన్సల్టెన్సీ, ఇప్సోస్ మార్కెట్ రీసెర్చ్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ‘వరల్డ్ బెస్ట్ సిటీస్ 2025’ ర్యాంకింగ్స్లో బెంగళూరు, ముంబై, ఢిల్లీతో పాటు హైదరాబాద్ కూడా గ్లోబల్ టాప్-100లో నిలిచింది. జీవన నాణ్యత నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్ గ్రోత్ నుంచి సాంస్కృతిక వైవిధ్యం వరకు మొత్తం 34 జిల్లాల్లో విశ్లేషణ జరిపి ఈ ర్యాంకులు ప్రకటించారు.
- Prabhakar M
- Updated on: Nov 27, 2025
- 3:13 pm
Telangana Rising 2047: ఇది కదా కావాల్సింది.. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్న్యూస్!
తెలంగాణను సమగ్రంగా, ప్రతి వర్గానికీ సమాన అవకాశాలు నమోదయ్యే రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047’ను రూపుదిద్దుతోంది. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తూ, ప్రజల అవసరాలు, ఆకాంక్షలను కేంద్రీకరించిన దీర్ఘకాలిక విజన్ డాక్యుమెంట్పై ప్రభుత్వం ముమ్మరంగా పనిచేస్తోంది.
- Prabhakar M
- Updated on: Nov 25, 2025
- 1:01 pm
Telangana: తెలంగాణలోని ఆ రూ. 2,200 కోట్లు ఎవరివి.! అందులో మీ డబ్బు కూడా ఉందా.?
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోనూ క్లెయిమ్ కానీ మొత్తం కుబేరుడి అప్పు మాదిరిగా పెరిగిపోతోంది. పట్టణ ప్రాంతాల్లో వలసలు, ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు, చిరునామా మార్పులు.. ఇలా వివిధ కారణాల వల్ల ఈ మొత్తం అంతా ఎక్కువైపోయింది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
- Prabhakar M
- Updated on: Nov 24, 2025
- 11:50 am
మహిళా ఉత్పత్తుల మార్కెటింగ్కు అమెజాన్తో ఒప్పందం..! తెలంగాణ సర్కార్ కీలక ముందడుగు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారతకు పలు కార్యక్రమాలు ప్రారంభించారు. కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ, మహిళా సంఘాల (SHG) ఉత్పత్తులను అమెజాన్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్లడం ఇందులో ప్రధానమైనవి. వడ్డీలేని రుణాలు, ఉచిత బస్ ప్రయాణం, యూనిఫాం కుట్టే బాధ్యత వంటివి మహిళల ఆర్థిక స్వయం సమృద్ధిని పెంచుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా పెద్ద మార్కెట్ను అందించే ప్రయత్నంలో, రాష్ట్ర ప్రభుత్వం అమెజాన్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి బుధవారం తెలిపారు.
- Prabhakar M
- Updated on: Nov 19, 2025
- 10:10 pm
Sridhar Babu: వాట్సాప్లో మీ సేవ.. పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్కి తెలంగాణే బెంచ్మార్క్
తెలంగాణను డిజిటల్ పాలనలో రోల్ మోడల్గా నిలబెట్టాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వాట్సాప్లో మీసేవ సేవలను ప్రారంభించి, ప్రజల భాగస్వామ్యంతో టెక్నాలజీ ఆధారిత గుడ్ గవర్నెన్స్ను అమలు చేస్తున్నామని తెలిపారు. ఏఐ శిక్షణ, ఏఐ సిటీ వంటి లక్ష్యాలతో టెక్నాలజీని సమానత్వ సాధనంగా చూస్తున్నామన్నారు. త్వరలో వాయిస్ కమాండ్తో సేవలు అందుబాటులోకి వస్తాయి.
- Prabhakar M
- Updated on: Nov 18, 2025
- 9:51 pm
Telangana: 10 రోజుల్లో పంచాయతీ నోటిఫికేషన్..! రేవంత్ సర్కార్ ప్లాన్ సక్సెస్ అయ్యేనా..
తెలంగాణ కేబినెట్ పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించింది కేబినెట్. ఈ క్రమంలోనే స్థానిక సమరానికి ముహుర్తం ఖరారు చేసింది. అంతా సవ్యంగా జరిగితే.. వచ్చే పది రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్ 15లోపు మొత్తం ప్రక్రియ పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధేశించింది.
- Prabhakar M
- Updated on: Nov 18, 2025
- 1:51 pm
Telangana: గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ..
తెలంగాణ ప్రభుత్వం గిగ్, ప్లాట్ఫామ్ కార్మికుల రక్షణకు 2025 చట్టాన్ని ఆమోదించింది. ఇది మూడు లక్షల మంది కార్మికులకు ఉద్యోగ భద్రత, పారదర్శక వేతనాలు, బీమా కల్పిస్తుంది. ప్లాట్ఫామ్ అల్గోరిథమ్లలో పారదర్శకతను చట్టబద్ధం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రత్యేక బోర్డు, సంక్షేమ నిధి ఏర్పాటు కానున్నాయి.
- Prabhakar M
- Updated on: Nov 17, 2025
- 8:48 pm
Cv Anand: తెలియక పొరపాటు జరిగింది.. బాలయ్యకు సారీ చెప్పిన సీవీ ఆనంద్..
నందమూరి బాలకృష్ణపై సోషల్ మీడియాలో వచ్చిన ఎమోజీ రిప్లైకి సంబంధించిన వివాదంపై హోం స్పెషల్ సెక్రటరీ సీవీ అనంద్ స్పష్టత ఇచ్చారు. ఆ పోస్టును తాను చేయలేదని, సోషల్ మీడియాను చూసే హ్యాండ్లర్ రెండు నెలల క్రితం తనకు తెలియకుండా పెట్టాడని చెప్పారు.
- Prabhakar M
- Updated on: Nov 17, 2025
- 3:08 pm
Telangana local body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఎలక్షన్స్ ఎప్పుడంటే?
రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల అనిశ్చితికి త్వరలో తెరపడేలా కనిపిస్తోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను త్వరితగతిన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 17న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశంపైనే తుది నిర్ణయం వెలువడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
- Prabhakar M
- Updated on: Nov 16, 2025
- 11:28 am
CM Revanth Reddy: అందరిచూపు సీఎం రేవంత్ రెడ్డి వైపే.. జూబ్లీ గెలుపుతో కాంగ్రెస్ థింక్ ట్యాంక్ టీమ్లోకి..
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్కు అనూహ్య విజయాన్ని అందించిన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠ ఢిల్లీలో బాగా పెరిగింది. బిహార్లో కాంగ్రెస్ అనుకున్న ఫలితాలు రాకపోవడం, మరోవైపు తెలంగాణలో రేవంత్ చూపిన నాయకత్వం ఈ రెండూ కలిసి ఆయనపై హైకమాండ్ విశ్వాసాన్ని మరింత పెంచినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, రాబోయే ఎన్నికలకు వ్యూహాల రూపకల్పనలో కీలకంగా పనిచేసే కేంద్ర స్థాయి మేధోబృందంలో రేవంత్కు చోటు కల్పించాలన్న ఆలోచన అధిష్ఠానంలో నెలకొన్నట్లు సమాచారం.
- Prabhakar M
- Updated on: Nov 16, 2025
- 8:48 am
Telangana: ఆ రంగాలపై తెలంగాణ సర్కార్ ఫోకస్.. రాబోయే రోజుల్లో వేలల్లో ఉద్యోగాలు!
తెలంగాణను 2030 నాటికి దేశ ‘ఏరో ఇంజిన్ రాజధాని’గా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ స్పష్టమైన దిశ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గచ్చిబౌలి ఐఎస్బీ లో జరిగిన ‘ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సమ్మిట్’లో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వేగవంతమైన మార్పులను తెలంగాణ తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా పనిచేస్తుందన్నారు.
- Prabhakar M
- Updated on: Nov 15, 2025
- 4:13 pm