AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhakar M

Prabhakar M

Sr correspondent - TV9 Telugu

prabhakar.marripalli@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 నుండి 2017 వరకు V6 న్యూస్ ఢిల్లీ మరియు హైద్రాబాద్ రిపోర్టర్ గా పని చేసాను.. ప్రతిష్టాత్మక తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే క్రమం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఢిల్లీ నుండి రిపోర్టింగ్ చేశాను.. 2017లో టివి9 లో అడుగుపెట్టాను.. రెండేళ్ల పాటు హైద్రాబాద్ రిపోర్టర్ గా పనిచేసి అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధిగా బదిలీ అయి ఐదేళ్ల పాటు గ్రౌండ్ రూరల్ నుండి రిపోర్టింగ్ చేశాను ..కామారెడ్డి జిల్లా లో గుహ లో ఇరుక్కుపోయిన రాజు అనే వ్యక్తి ని రెస్క్యూ చేయడానికి 12 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ ను కళ్లకు కడుతూ రిపోర్టింగ్ చేశాను , అందుకు గాను టీవీ9 నెట్వర్క్ నుండి బెస్ట్ పర్ఫామెన్స్ సర్టిఫికెట్ అందుకున్నాను ..2018, 2023 జనరల్ ఎన్నికల తర్వాతా ఇప్పుడు హైదరాబాద్ కు బదిలీ అయి టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారాలు రిపోర్ట్ చేస్తున్నాను

Read More
Follow On:
Telangana: టీచర్లకు బ్యాడ్‌ న్యూస్.. ప‌దోన్నతులు విషయంలో సర్కార్ సంచలన నిర్ణయం!

Telangana: టీచర్లకు బ్యాడ్‌ న్యూస్.. ప‌దోన్నతులు విషయంలో సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ విద్యాకమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల‌కు ఆటోమేటిక్ ప‌దోన్నతులు ఉండ‌కూడ‌ద‌ని ప్రభుత్వానికి సూచన చేసింది. వారి ప‌ని తీరు ఆధారంగానే ప్రమోష‌న్లు ఉండాల‌ని సూచించింది. తెలంగాణ విద్యా క‌మిష‌న్ త‌న నివేదిక‌ను సీఎం రేవంత్ రెడ్డికి గురువారం స‌మ‌ర్పించింది.విద్యా విధానం పూర్తిగా విద్యార్థి కేంద్రంగా ఉండాల‌ని క‌మిష‌న్ సిఫార్సు చేసింది.

2047 టార్గెట్: అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్‌గా తెలంగాణ, వేలాది ఉద్యోగాలకు బంగారు బాట

2047 టార్గెట్: అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్‌గా తెలంగాణ, వేలాది ఉద్యోగాలకు బంగారు బాట

తెలంగాణను 2047 నాటికి దేశంలో అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముంబైలో ఈ విజన్‌ను ఆవిష్కరించారు. మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ ఇంటిగ్రేషన్, నైపుణ్యాభివృద్ధి ద్వారా 'ఫ్యూచర్ రెడీ ఎకోసిస్టమ్'ను నిర్మిస్తూ, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ రంగాలలో పెట్టుబడులకు రాష్ట్రం ఆహ్వానం పలుకుతోంది.

వేతన జీవులకు సర్కార్ శుభవార్త.. ఉద్యోగులు, పెన్షనర్స్‌‌కు తీరిన కష్టాలు.. నెరవేరిన దశాబ్దాల కల..!

వేతన జీవులకు సర్కార్ శుభవార్త.. ఉద్యోగులు, పెన్షనర్స్‌‌కు తీరిన కష్టాలు.. నెరవేరిన దశాబ్దాల కల..!

ద‌శాబ్దాల త‌మ వాంఛ‌ను నెర‌వేర్చారంటూ ఉద్యోగ, పెన్షనర్స్‌ సంఘాల నేత‌లు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞత‌లు తెలిపారు. ఉద్యోగులు, పెన్షన‌ర్లకూ రూ.1.20 కోట్ల ప్రమాద బీమా వ‌ర్తింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం రూ.1,056 కోట్ల మూల‌నిధితో ఉద్యోగుల, పెన్షన‌ర్ల ఆరోగ్య ప‌థ‌కానికి రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.

Flight Passenger Rules: విమాన ప్రయాణికులకు కఠిన రూల్స్..  అలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు.. 2 ఏళ్లు బ్యాన్

Flight Passenger Rules: విమాన ప్రయాణికులకు కఠిన రూల్స్.. అలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు.. 2 ఏళ్లు బ్యాన్

డీజీసీఏ విమాన ప్రయాణికులకు భద్రత కల్పించేందుకు కఠిన రూల్స్ తీసుకురాబోతుంది. ఇకపై విమానంలో దురసుగా ప్రవర్తించడం లేదా దాడికి పాల్పడటం లాంటివి చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. దీంతో విమానాల్లో ప్రయాణించే సమయంలో ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే. త్వరలోనే వీటిని అమలు చేయనుంది.

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. HYDకి మరో గ్లోబల్ సంస్థ.. త్వరలోనే భారీగా ఉద్యోగాలు!

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. HYDకి మరో గ్లోబల్ సంస్థ.. త్వరలోనే భారీగా ఉద్యోగాలు!

The Hartford Launches Global Technology Centre in Hyderabad: ఐటీతో పాటు పలు కీలక రంగాల్లో హైదరాబాద్‌ను గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటు చేసిన ‘ది హార్ట్ ఫోర్డ్ ఇండియా టెక్నాలజీ సెంటర్’ను ఆయన ప్రారంభించారు.

CM Revanth Reddy : దేశం నుంచి ఒకే ఒక్కరు.. సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం!

CM Revanth Reddy : దేశం నుంచి ఒకే ఒక్కరు.. సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో మరొక గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థ హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించేందుకు అధికారిక ఆహ్వానం అందింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక సదస్సుకు భారత్ నుంచి ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రమే ఆహ్వానం అందుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Telangana: ఇకపై ఫాంహౌస్ నిర్మాణాలకు అనుమతి తప్పనిసరి.. కొత్త పాలసీకి సర్కార్ సిద్ధం..!

Telangana: ఇకపై ఫాంహౌస్ నిర్మాణాలకు అనుమతి తప్పనిసరి.. కొత్త పాలసీకి సర్కార్ సిద్ధం..!

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఫాంహౌస్ నిర్మాణాలకు ప్రత్యేక విధానం తీసుకురావడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటివరకు స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో అనియంత్రిత నిర్మాణాలు పెరుగుతున్న నేపథ్యంలో, సమగ్ర ఫాంహౌస్ పాలసీ ద్వారా నియంత్రణతో పాటు ప్రణాళికాబద్ధ అభివృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Hyderabad Metro: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే మెట్రో నిర్వహణలో కొత్త మార్పులు!

Hyderabad Metro: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే మెట్రో నిర్వహణలో కొత్త మార్పులు!

హైదరాబాద్ మెట్రో రైలు టేకోవర్ ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి ముందే ప్రాజెక్టును ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని సర్కార్ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఫైనాన్స్, టెక్నికల్ అంశాలపై సమగ్ర అధ్యయనాలు పూర్తయ్యాయి. సంబంధిత నివేదికలు సిద్ధంగా ఉండగా, ఈ నెల 23న జరిగే కేబినెట్ సమావేశంలో వాటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Telangana: గవర్నమెంట్ టీచర్లకు గుడ్ న్యూస్.. అమెరికాలో ఉచితంగా..! అప్లై చేసుకోండిలా

Telangana: గవర్నమెంట్ టీచర్లకు గుడ్ న్యూస్.. అమెరికాలో ఉచితంగా..! అప్లై చేసుకోండిలా

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అమెరికాలో శిక్షణ పొందే అరుదైన అవకాశం లభించింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన Fulbright Teaching Excellence and Achievement ప్రోగ్రామ్ కింద దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన ఉపాధ్యాయులు అమెరికాలో ఆరు వారాల పాటు అకడమిక్ శిక్షణ పొందే అవకాశం కల్పించనున్నారు.

Telangana: అన్నదాతకు కష్టం అనేది దరిచేరదిక.. అన్నీ అరచేతుల్లోనే..

Telangana: అన్నదాతకు కష్టం అనేది దరిచేరదిక.. అన్నీ అరచేతుల్లోనే..

వ్యవసాయం ఇప్పుడు స్మార్ట్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. రైతులకు అవసరమైన సమాచారం తక్షణమే అందేలా కేంద్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పలు డిజిటల్ సాధనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. పంటల నిర్వహణ నుంచి వాతావరణ హెచ్చరికల వరకు సమగ్ర సమాచారం ఇప్పుడు మొబైల్‌లోనే అందుతోంది.

Hyderabad: ఆధార్ కార్డు కాదు.. ఇకపై ఇది ఉంటేనే మహిళలకు ఫ్రీ బస్సు..! పూర్తి వివరాలు

Hyderabad: ఆధార్ కార్డు కాదు.. ఇకపై ఇది ఉంటేనే మహిళలకు ఫ్రీ బస్సు..! పూర్తి వివరాలు

ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం మహిళలకు 'మహాలక్ష్మీ' స్మార్ట్ కార్డులు త్వరలో జారీ కానున్నాయి. దీనికి పౌర సరఫరాల శాఖ డేటాను ప్రామాణికంగా తీసుకుని తొలి దశలో తెల్ల రేషన్ కార్డులున్న 5 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆ వివరాలు ఇలా..

Telangana: గురుకులాలకు మహర్దశ ప్రారంభం అవ్వబోతుంది..

Telangana: గురుకులాలకు మహర్దశ ప్రారంభం అవ్వబోతుంది..

రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం, భద్రతపై తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన పర్యవేక్షణకు ఆదేశాలు జారీ చేసింది. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించేందుకు నోడల్ అధికారుల నియామకం, డిటైల్డ్ ఎంక్వైరీ క్యాలెండర్ తయారీ, ఆకస్మిక సందర్శనలు తప్పనిసరి చేస్తూ జిల్లా అధికారులకు లిఖితపూర్వక సూచనలు పంపింది.