తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 నుండి 2017 వరకు V6 న్యూస్ ఢిల్లీ మరియు హైద్రాబాద్ రిపోర్టర్ గా పని చేసాను.. ప్రతిష్టాత్మక తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే క్రమం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఢిల్లీ నుండి రిపోర్టింగ్ చేశాను.. 2017లో టివి9 లో అడుగుపెట్టాను.. రెండేళ్ల పాటు హైద్రాబాద్ రిపోర్టర్ గా పనిచేసి అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధిగా బదిలీ అయి ఐదేళ్ల పాటు గ్రౌండ్ రూరల్ నుండి రిపోర్టింగ్ చేశాను ..కామారెడ్డి జిల్లా లో గుహ లో ఇరుక్కుపోయిన రాజు అనే వ్యక్తి ని రెస్క్యూ చేయడానికి 12 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ ను కళ్లకు కడుతూ రిపోర్టింగ్ చేశాను , అందుకు గాను టీవీ9 నెట్వర్క్ నుండి బెస్ట్ పర్ఫామెన్స్ సర్టిఫికెట్ అందుకున్నాను ..2018, 2023 జనరల్ ఎన్నికల తర్వాతా ఇప్పుడు హైదరాబాద్ కు బదిలీ అయి టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారాలు రిపోర్ట్ చేస్తున్నాను
కొత్త అజెండాతో విదేశీ పెట్టుబడులే లక్ష్యం.. దావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణకు భారీ విదేశీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. జనవరి 19వ తేదీన స్విట్జర్లాండ్లోని దావోస్కు సీఎం బృందం వెళ్లనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) వార్షిక సదస్సులో పాల్గొననుంది. ఈ పర్యటనలో తెలంగాణ భవిష్యత్ పారిశ్రామిక దిశను నిర్దేశించే కీలక అజెండాలతో ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది.
- Prabhakar M
- Updated on: Jan 17, 2026
- 1:58 pm
గుజరాత్, మహారాష్ట్రను వెనక్కు నెట్టి అగ్ర స్థానంలో తెలంగాణ.. వెల్లడించిన కేంద్ర గణాంకాలు..!
తెలంగాణకు ప్రభుత్వ భూములే అతిపెద్ద బలం అని మరోసారి రుజువైంది. పరిశ్రమల ఏర్పాటుకు తక్షణమే వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న 76 వేల ఎకరాల భూముల ఉన్నాయి. దీంతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) విడుదల చేసిన ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ రిపోర్టులో ఈ విషయం స్పష్టమైంది.
- Prabhakar M
- Updated on: Jan 17, 2026
- 1:18 pm
ఇది కదా కావాల్సింది.. పంచాయతీలకు సంక్రాంతి గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల
సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గ్రామీణ పరిపాలనను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రూ.277 కోట్ల నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నిర్ణయం తీసుకున్నారు.
- Prabhakar M
- Updated on: Jan 13, 2026
- 7:25 pm
Medaram Maha Jatara: దారులన్నీ మేడారం వైపే.. మహాజాతరకు సర్వం సిద్ధం.. ఒక్క క్లిక్తో ఫుల్ అప్డేట్స్..
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. సుమారు రెండు కోట్ల మంది భక్తుల కోసం రూ.260 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు మంత్రి సీతక్క తెలిపారు. ఫిబ్రవరి 18న సీఎం రేవంత్ రెడ్డి ఆలయాన్ని ప్రారంభించి క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తారన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు, అప్డేట్స్ మొబైల్ యాప్, వెబ్సైట్, చాట్బాట్ అందుబాటులో ఉన్నాయన్నారు.
- Prabhakar M
- Updated on: Jan 13, 2026
- 6:04 pm
Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. పాలిటెక్నిక్లో 9 కొత్త కోర్సులు.. ఇక ఉద్యోగాలకు డోకాలేనట్టే!
పాలిటెక్నిక్ విద్య పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. పరిశ్రమల్లో ప్రస్తుతం ఉన్న డిమాండ్కు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టడమే కాకుండా, ఇప్పటికే ఉన్న కొన్ని కోర్సులకు ఆధునిక అవసరాలకు తగ్గట్టు పేర్లు, సిలబస్ మార్పులు చేపట్టింది.
- Prabhakar M
- Updated on: Jan 13, 2026
- 5:36 pm
Telangana: గుడ్న్యూస్.. జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్.. ఆ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన!
Telangana CM Revanth Reddy District Tour: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాల పర్యటనలకు రోడ్మ్యాప్ ఖరారు చేశారు. త్రిముఖ వ్యూహంతో సీఎం ఈ పర్యటన కొనసాగించనున్నారు. ఎన్నికల ప్రచారం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కేంద్రంపై ఉపాధి హామీ నిరసన సభల్లో పాల్గొననున్నారు. జనవరి 16 నుంచి తొలి విడత, ఫిబ్రవరి 3 నుంచి మలి విడత పర్యటనలు చేపట్టి, రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ కదలిక తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
- Prabhakar M
- Updated on: Jan 13, 2026
- 2:27 pm
BC Reservations: మున్సిపల్ పోరుకు లైన్ క్లియర్.. ఖరారైన బీసీ రిజర్వేషన్లు.. ఎంతంటే?
తెలంగాణలో మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ బీసీ డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వంకు కీలక నివేదికను సమర్పించింది. మున్సిపాలిటీల్లో వార్డులు, ఛైర్పర్సన్ స్థానాల రిజర్వేషన్లపై ఈ నివేదిక ఆధారంగా తుది నిర్ణయాలు తీసుకునే దశకు ప్రభుత్వం చేరింది.
- Prabhakar M
- Updated on: Jan 13, 2026
- 10:32 am
Hyderabad: సూపర్ గుడ్ న్యూస్.. ఆ ప్రాంతవాసులకు ఇది కదా కావాల్సింది.. ఏకంగా రూ. 488 కోట్లతో
హైదరాబాదీలకు గుడ్ న్యూస్ అందించింది రాష్ట్ర సర్కార్. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు అన్ని దిశలకూ కనెక్టివిటీ పెంచే లక్ష్యంతో భారీ ప్రణాళికలు సిద్దం చేసింది. బుద్వేల్ లేఅవుట్ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో మరో ట్రంపెట్ జంక్షన్ను నిర్మించేందుకు సిద్ధమైంది.
- Prabhakar M
- Updated on: Jan 13, 2026
- 9:48 am
Telangana: వనదేవతల చెంత కేబినెట్ భేటీ.. మేడారంలోనే చారిత్రక సమావేశం..!
రాష్ట్ర పాలనలో అరుదైన అధ్యాయానికి తెరలేవనుంది. ఇప్పటివరకు సచివాలయానికే పరిమితమైన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈసారి అడవీ బాట పట్టనుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మల క్షేత్రంలోనే జనవరి 18వ తేదీన కేబినెట్ భేటీ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం.
- Prabhakar M
- Updated on: Jan 13, 2026
- 9:28 am
Telangana: స్కూళ్ల విద్యార్ధులకు పండుగ అద్దిరిందిగా.. ఒక్కొక్కరికి 22 రకాల వస్తువులతో కిట్..
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పండుగ గిఫ్ట్గా 22 రకాల వస్తువులతో కూడిన కిట్ సమ్మర్ లోపు ఇవ్వనుంది. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా. ఓ సారి లుక్కేయండి మరి.
- Prabhakar M
- Updated on: Jan 13, 2026
- 7:54 am
The Raja Saab : రాజా సాబ్ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి.. తెలంగాణలో ఎంతంటే..
ప్రభాస్ హీరోగా నటించిన లేటేస్ట్ సినిమా 'ది రాజాసాబ్'. ఈ మూవీ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటిలకే ప్రీమియర్ షోలు చూసిన అడియన్స్ డైరెక్టర్ మారుతిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సరికొత్త హారర్ థ్రిల్లర్ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
- Prabhakar M
- Updated on: Jan 9, 2026
- 7:06 am
Telangana Assembly: హిల్ట్ పాలసీ చర్చ.. నేడు రసవత్తరంగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ!
నేడు తెలంగాణ అసెంబ్లీ రసవత్తరంగా సాగనుంది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీపై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరగనుంది. అయితే హీల్ట్ పాలసీపై ఇప్పటికే అధికార-విపక్షాల మధ్య సవాళ్లు-ప్రతి సవాళ్లు జరగగా.. ఇవాళ మరోసారి చర్చ నేపథ్యంలో అసెంబ్లీ మరింత హీటెక్కనుంది.
- Prabhakar M
- Updated on: Jan 5, 2026
- 7:48 am