తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 నుండి 2017 వరకు V6 న్యూస్ ఢిల్లీ మరియు హైద్రాబాద్ రిపోర్టర్ గా పని చేసాను.. ప్రతిష్టాత్మక తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే క్రమం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఢిల్లీ నుండి రిపోర్టింగ్ చేశాను.. 2017లో టివి9 లో అడుగుపెట్టాను.. రెండేళ్ల పాటు హైద్రాబాద్ రిపోర్టర్ గా పనిచేసి అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధిగా బదిలీ అయి ఐదేళ్ల పాటు గ్రౌండ్ రూరల్ నుండి రిపోర్టింగ్ చేశాను ..కామారెడ్డి జిల్లా లో గుహ లో ఇరుక్కుపోయిన రాజు అనే వ్యక్తి ని రెస్క్యూ చేయడానికి 12 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ ను కళ్లకు కడుతూ రిపోర్టింగ్ చేశాను , అందుకు గాను టీవీ9 నెట్వర్క్ నుండి బెస్ట్ పర్ఫామెన్స్ సర్టిఫికెట్ అందుకున్నాను ..2018, 2023 జనరల్ ఎన్నికల తర్వాతా ఇప్పుడు హైదరాబాద్ కు బదిలీ అయి టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారాలు రిపోర్ట్ చేస్తున్నాను
Telangana: రైతులకు అదిరిపోయే గుడ్న్యూస్.. ఒక్క క్లిక్తో పొలం వద్దకే యంత్రాలు! ఎలా బుక్చేసుకోవాలంటే?
వ్యవసాయంలో యాంత్రీకరణను వేగవంతం చేయడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ కొత్త డిజిటల్ విధానానికి శ్రీకారం చుడుతోంది. టాక్సీ సేవల మాదిరిగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, డ్రోన్లు వంటి వ్యవసాయ యంత్రాలను మొబైల్లోనే బుక్ చేసుకునేలా ప్రత్యేకంగా “ఫామ్ యాప్”ను అభివృద్ధి చేసే పనులు ప్రారంభమయ్యాయి. యూరియా యాప్ విజయంతో ప్రోత్సాహం పొందిన ప్రభుత్వం, రైతుల పనిభారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
- Prabhakar M
- Updated on: Feb 10, 2026
- 11:25 am
Telangana: రెండో వాహనం కొంటున్నారా..? ఈ గుడ్ న్యూస్ తెలుసుకోండి…
తెలంగాణలో వాహనాలు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రెండో వాహనం కొనుగోలు చేసేవారికి 2శాతం అదనపు ట్యాక్స్ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణలో రెండో వాహనం కొనుగోలు చేసేవారు 2శాతం అదనపు లైఫ్ట్యాక్స్ చెల్లిస్తుండగా.. ఇకపై ఊరట దక్కనుంది.
- Prabhakar M
- Updated on: Feb 6, 2026
- 8:07 am
అధికారంలో ఉండగా ఉద్యమకారులు గుర్తు రాలేదా..? తప్పు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సిందేః సీఎం రేవంత్
బీఆర్ఎస్, కేసీఆర్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొందరు తమకు తామే తెలంగాణ జాతిపిత అనుకుంటున్నారన్నారు. ఉద్యమకారులను అవమానిస్తారా అని గగ్గోలుపెడుతున్నారని ఎద్దేవా చేశారు. వారి హయాంలో ఉద్యమకారులను అవమానించలేదా అని సీఎం ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడితే ఎవరైనా విచారణ ఎదుర్కోవాల్సిందే అన్నారు.
- Prabhakar M
- Updated on: Feb 2, 2026
- 10:36 pm
Watch: బడ్జెట్లో ఈసారైనా తెలంగాణకు న్యాయం చేయాలి: మంత్రి పొన్నం
Union Budget: మోదీ ప్రభుత్వ హయాంలో ప్రతి బడ్జెట్లోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన నిధులు సాధించేందుకు రాష్ట్ర ఎంపీలు కృషి చేయాలని కోరారు. ఆర్ఆర్ఆర్, మెట్రో ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించాలని కోరారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ఆయన కోరారు.
- Prabhakar M
- Updated on: Jan 31, 2026
- 6:43 pm
Union Budget: బడ్జెట్లో తెలంగాణకు ఈ సారైనా ఊరట కలుగుతుందా..? మళ్లీ చుక్కెదురేనా..?
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏమేమీ వస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. గత బడ్జెట్లో తెలంగాణకు చుక్కెదురైంది. దీంతో ఈ సారైనా ఊరట కలుగుతుందా అని రాజకీయ వర్గాలు ఆశిస్తున్నాయి. మెట్రో విస్తరణకు నిధులు కేటాయించాల్సిందిగా ప్రభుత్వం కోరుతుంది. మరి మెట్రోకు నిధులు ఉంటాయా లేదా అనేది చూడాలి.
- Prabhakar M
- Updated on: Jan 31, 2026
- 5:44 pm
Job Mela: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. రూ.25వేల వేతనంతో ఉద్యోగ అవకాశాలు.. ఎక్కడంటే?
నిరుద్యోగ యువతకు ఇదో అదిరిపోయే గుడ్న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే అపోలో ఫార్మసీ, ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో జనవరి 28, 2026న హైదరాబాద్లో జాబ్ మేళా నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టులకు నియామకాలు చేపట్టనుంది. కాబట్టి అర్హులైన విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
- Prabhakar M
- Updated on: Jan 23, 2026
- 1:44 pm
Telangana: దావోస్లో తెలంగాణకు భారీ పెట్టుబడుల వరద.. రూ.7 వేల కోట్లకు పైగా ప్రాజెక్టుల ప్రతిపాదనలు- భారీ ఉద్యోగాలు
Telangana: తెలంగాణకు భారీ పెట్టుబడులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును సీఎం అభినందించారు. తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉండటంతో పాటు, తయారీ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి పేర్కొన్నారు..
- Prabhakar M
- Updated on: Jan 21, 2026
- 6:53 pm
Telangana: గుడ్న్యూస్.. హైదరాబాద్లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. త్వరలోనే భారీగా ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అంతర్జాతీయ టెక్నాలజీ భాగస్వామ్యాన్ని సాధించింది. కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ ఏఐ హార్డ్వేర్ సంస్థ బ్లైజ్ (Blaize)తో అవగాహన ఒప్పందం కుదిరింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం–2026 సదస్సు వేదికగా ఈ ఎంవోయూ జరిగింది. ఈ ఒప్పందంతో తెలంగాణలో ఏఐ, డేటా సెంటర్లు, సెమీకండక్టర్ రంగాల అభివృద్ధికి మరింత వేగం అందనుంది.
- Prabhakar M
- Updated on: Jan 21, 2026
- 12:30 pm
దావోస్ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన.. ప్రతి జులైలో హైదరాబాద్ అడ్డాగా..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనతో ప్రతి ఏడాది జులైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించనున్నారు. ఇది పెట్టుబడుల ఒప్పందాలను వేగవంతం చేస్తుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది. హైదరాబాద్ను గ్లోబల్ హబ్గా, ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దే విజన్ను సీఎం వివరించారు. AI, లైఫ్ సైన్సెస్ పాలసీలను ప్రారంభించారు.
- Prabhakar M
- Updated on: Jan 21, 2026
- 8:54 am
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి.. స్టార్టప్ ఎకోసిస్టమ్కు మరో ముందడుగు!
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్, వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారం, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్ల ప్రోత్సాహం వంటి కీలక అంశాల్లో కలిసి పని చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక–2026 సమావేశాల సందర్భంగా దావోస్లో, ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి గూగుల్..
- Prabhakar M
- Updated on: Jan 20, 2026
- 7:19 pm
Telangana: తెలంగాణ “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశానికే రోల్ మోడల్!
Davos: తెలంగాణ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యతగా మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గత రెండేళ్లలో దావోస్ వేదికగా సుమారు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణ ప్రభుత్వం సమీకరించిందని తెలిపారు. అలాగే..
- Prabhakar M
- Updated on: Jan 20, 2026
- 5:13 pm
Davos 2026: దావోస్ టూర్లో చంద్రబాబు, రేవంత్ సైలెంట్ వ్యూహం.. తెరవెనుక ఊహించని ప్లాన్..
దావోస్ 2026 భారత్కు ఒక టర్నింగ్ పాయింట్గా నిలవనుంది. ఇక్కడ కేవలం ఒప్పందాలే కాకుండా వాటి అమలే అసలైన విజయంగా మారింది. ఇందులో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ముందువరుసలో నిలుస్తున్నాయి. దావోస్ ముగిసిన తర్వాత వాటి గ్రౌండింగ్ లో అసలైన పరీక్ష మొదలవుతుందన్న మాట ఇప్పుడు గ్లోబల్ కారిడార్లలో స్పష్టంగా వినిపిస్తోంది.
- Prabhakar M
- Updated on: Jan 20, 2026
- 12:18 pm