తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 నుండి 2017 వరకు V6 న్యూస్ ఢిల్లీ మరియు హైద్రాబాద్ రిపోర్టర్ గా పని చేసాను.. ప్రతిష్టాత్మక తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే క్రమం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఢిల్లీ నుండి రిపోర్టింగ్ చేశాను.. 2017లో టివి9 లో అడుగుపెట్టాను.. రెండేళ్ల పాటు హైద్రాబాద్ రిపోర్టర్ గా పనిచేసి అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధిగా బదిలీ అయి ఐదేళ్ల పాటు గ్రౌండ్ రూరల్ నుండి రిపోర్టింగ్ చేశాను ..కామారెడ్డి జిల్లా లో గుహ లో ఇరుక్కుపోయిన రాజు అనే వ్యక్తి ని రెస్క్యూ చేయడానికి 12 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ ను కళ్లకు కడుతూ రిపోర్టింగ్ చేశాను , అందుకు గాను టీవీ9 నెట్వర్క్ నుండి బెస్ట్ పర్ఫామెన్స్ సర్టిఫికెట్ అందుకున్నాను ..2018, 2023 జనరల్ ఎన్నికల తర్వాతా ఇప్పుడు హైదరాబాద్ కు బదిలీ అయి టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారాలు రిపోర్ట్ చేస్తున్నాను
Telangana: హైదరాబాద్లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ.. ఈవీ రంగంలో బిగ్ బూస్ట్..
ప్రపంచ ఈవీ దిగ్గజం టెస్లా కన్ను ఇప్పుడు హైదరాబాద్పై పడిందా? ఎలోన్ మాస్క్ కంపెనీ తెలంగాణ వైపు అడుగులు వేస్తోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో టెస్లా ఇండియా ప్రతినిధులు సమావేశమై కీలక విషయాలపై చర్చించారు. దీనికి సంబంధించిన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందా..
- Prabhakar M
- Updated on: May 22, 2026
- 9:11 pm
Hyderabad: ఎలక్ట్రిక్ వెహికల్ కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్
హైదరాబాద్కు చెందిన టెక్ సంస్థ ఉతమ ఉద్యోగులకు సూపర్ గుడ్న్యూస్ చెప్పింది. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో అజా కన్సల్టింగ్ సర్వీసెస్ ఉద్యోగుల కోసం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈవీలు కొనుగోలు చేసే తమ ఉద్యోగులకు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది.
- Prabhakar M
- Updated on: May 20, 2026
- 2:54 pm
Bullet Train: జస్ట్ 3 గంటలే.. హైదరాబాద్ టూ ముంబయి.. ఇక బుల్లెట్ స్పీడ్తో దూసుకెళ్లడమే!
దేశంలో హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల విస్తరణలో భాగంగా హైదరాబాద్–పుణె–ముంబయి బుల్లెట్ రైలు కారిడార్ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే సర్వే పూర్తవగా, తాజాగా డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) కూడా సిద్ధమైంది. ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుంచి ముంబయికి కేవలం 3 గంటల్లో ప్రయాణం చేసే అవకాశం లభించనుంది.
- Prabhakar M
- Updated on: May 18, 2026
- 7:04 am
ఆందోళనలో రెండు కోట్ల మంది విద్యార్థులు.. అండగా ఉంటామన్న సీఎం రేవంత్ రెడ్డి!
నీట్-యూజీ 2026 పరీక్షను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష, నిరంకుశ నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం దేశవ్యాప్తంగా రెండు కోట్ల మంది విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టేసిందని ఆయన మండిపడ్డారు.
- Prabhakar M
- Updated on: May 14, 2026
- 9:19 pm
Telangana: పేదలకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్న్యూస్.. ఇకపై ప్రైవేట్ వెంచర్లలోనూ..
రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. అఫర్డబుల్ హౌసింగ్ పాలసీ’ పేరుతో కొత్త విధానాన్ని రూపొందిస్తున్న ప్రభుత్వం.. ప్రైవేట్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో పేదలకు ప్రత్యేక వాటా కేటాయింపును తప్పనిసరి చేయాలని భావిస్తోంది. ప్రభుత్వం తీసుకురానున్న ఈ విధానం అమల్లోకి వస్తే పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల మరింత చేరువ కానుంది.
- Prabhakar M
- Updated on: May 11, 2026
- 9:17 am
పులులకు కొత్త టెన్షన్.. మనుషులు చేసే పనితో వాటి మనుగడకే ముప్పు.. పరిశోధనలో షాకింగ్ విషయాలు..
పులిని చూడాలనే మీ సరదా.. వాటికి శాపంగా మారుతోంది.. అడవిలో ప్రశాంతత కరువై, మనుషుల రాకతో పులులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నాయి. ముఖ్యంగా ఆడ పులుల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, అవి గర్భధారణకు దూరమవుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దేశంలోని ప్రధాన టైగర్ రిజర్వుల్లో రెండేళ్ల పాటు సాగిన ఈ పరిశోధన, వన్యప్రాణుల సంరక్షణపై ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది.
- Prabhakar M
- Updated on: May 9, 2026
- 10:29 am
Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు.. ఇంటి నుంచే అన్నీ..
ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగలేక, గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడలేక విసిగిపోయారా? అయితే మీకోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ అయినా, చిరునామా మార్పు అయినా.. ఒక్క రూపాయి అదనంగా ఖర్చు లేకుండా ఆఫీసు మెట్లు ఎక్కకుండానే మీ పనులు పూర్తవుతాయి. రవాణా శాఖ ప్రవేశపెట్టిన ఫేస్లెస్ సేవలతో ఆర్టీఏ కార్యాలయాలు ఇక మీ అరచేతిలోకి వచ్చేశాయి.
- Prabhakar M
- Updated on: May 9, 2026
- 8:47 am
వారికి సీఎం రేవంత్ అదిరిపోయే గుడ్న్యూస్.. మంచి ప్రతిభ కనబరిస్తే ప్రత్యేక ప్రోత్సాహకాలు!
మైనార్టీలకు సీఎం రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. మైనార్టీ విద్యార్థులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక డిగ్రీ కాలేజీలు, ఏఐ ట్రైనింగ్, భారీ ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్లో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ శాఖ సమీక్షలో ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మైనార్టీ విద్యార్థుల విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
- Prabhakar M
- Updated on: May 8, 2026
- 7:11 pm
హైదరాబాద్ మూసీ నదికి కొత్త రూపు.. రూ.7,055 కోట్ల భారీ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్లో మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోంది. కేవలం నది క్లీన్ చేసే కార్యక్రమంగా కాకుండా, నగర భవిష్యత్తును మార్చే సామాజిక బాధ్యతగా ప్రభుత్వం దీన్ని చూస్తోంది. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ ప్రాజెక్టు విజయవంతం అవుతుందని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది.
- Prabhakar M
- Updated on: May 8, 2026
- 6:38 pm
భూముల రేట్లు భారీగా పెరగనున్నాయా..? హైదరాబాద్లో గజం ధరలు ఎలా ఉంటాయంటే..
తెలంగాణలో భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ శాఖ అమలు చేస్తున్న ధరలు, ప్రస్తుత మార్కెట్ ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉన్న ప్రాంతాల్లో భారీ పెంపు ఉండే అవకాశం కనిపిస్తోంది. జిల్లాల వారీగా వివరాలు సేకరించిన అధికారులు ప్రాంతాలవారీగా కొత్త ధరలపై అధ్యయనం చేస్తున్నారు.
- Prabhakar M
- Updated on: May 7, 2026
- 9:47 pm
Telangana: తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై రేషన్ షాపుల్లో తక్కువ ధరకే అవి పంపిణీ..
మొక్కజొన్న, జొన్న పండించే రైతులకు మద్దతు ధర దక్కక పోవడాన్ని సీరియస్గా తీసుకున్న తెలంగాణ సర్కార్.. మార్కెట్ సమీకరణాలను మార్చేలా కీలక అడుగు వేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం తాజాగా జరిపిన భేటీలో పంట కొనుగోళ్లు, పంపిణీపై కొత్త విధానాన్ని ప్రతిపాదించింది. ఇకపై రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు జొన్నలు, మొక్కజొన్నలను కూడా తక్కువ ధరకే పంపిణీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
- Prabhakar M
- Updated on: May 7, 2026
- 1:30 pm
భాగ్యనగరానికి మరో గ్లోబల్ మణిహారం.. మైక్రోసాఫ్ట్, గూగుల్ సరసన BASF.. భారీ కొలువుల జాతర!
హైదరాబాద్ మహానగరం ఐటీ, పారిశ్రామిక రంగంలో మరో మైలురాయి సాధించింది. ప్రపంచ ప్రఖ్యాత రసాయన తయారీ దిగ్గజం బాస్ఎఫ్ (BASF) తన కార్యకలాపాలను విస్తరిస్తూ భాగ్యనగరంలో రెండు భారీ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లను (GCC) ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఆ సంస్థ తన ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ (LOI)ను అందజేసింది.
- Prabhakar M
- Updated on: May 5, 2026
- 4:58 pm