అమెరికాలోని కాలిఫోర్నియాలో 30 మంది ముసుగు దొంగలు కేవలం 70 సెకన్లలో రూ.14 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఐదారైదు కార్లలో వచ్చి, సుత్తెలు, గన్నులతో బంగారు షాపు అద్దాలు పగలగొట్టి, దుకాణాన్ని పూర్తిగా లూటీ చేశారు. షాపు సిబ్బంది భయంతో చూస్తుండగానే దొంగలు అదృశ్యమయ్యారు.