ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. వార్తలో రిపోర్టర్ గా 1999లో కెరీర్ ప్రారంభం అయింది. 1999 నుంచి 2003 అక్టోబర్ వరకు వార్తలో రిపోర్టర్గా పనిచేశాను… ఆ తరువాత వెంటనే అదే నెలలో వార్తకు రిజైన్ చేసి 2003 అక్టోబర్లో tv9 ఛానల్ ఎయిర్లోకి రాకముందు ఐవిజన్ పేరుతో ప్రకాశంజిల్లా రిపోర్టర్గా జాయిన్ అయ్యాను… tv9 ఎయిర్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రకాశంజిల్లా tv9 రిపోర్టర్గా పనిచేస్తున్నారు… ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
హైవేపై వేగంగా వెళ్తున్న లారీ.. ఒక్కసారిగా టైర్ బ్లాస్ట్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ప్రకాశం జిల్లాలోని జాతీయ రహదారి 16పై కోరిశెపాడు వద్ద వేగంగా వెళ్తున్న లారీ టైర్ బ్లాస్ట్తో అదుపుతప్పి కాలవలోకి దూసుకెళ్లింది. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన గంటపాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. అధికారులు, స్థానికులు సకాలంలో స్పందించడంతో.. ఈ ఘటనలో డ్రైవర్కు పెను ప్రమాదం తప్పింది.
- Fairoz Baig
- Updated on: May 2, 2026
- 1:09 pm
బెడ్రూమ్లో భార్య.. బాత్రూమ్లో భర్త ఆత్మహత్య.. ఆ దంపతులకు వచ్చిన కష్టమేంటంటే?
బాపట్లజిల్లా వేటపాలెం మండలం రావురిపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి వివాదాల నేపథ్యంలో భార్యాభర్తలు ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం హస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Fairoz Baig
- Updated on: Apr 29, 2026
- 9:48 pm
ప్రకృతి ప్రకోపం..అకాల వర్షం బీభత్సం.. పిడుగుపాటుకు ముగ్గురు మృతి! ఎక్కడో కాదు..
ఒకవైపు భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు అకాల వర్షం ఊరటనిస్తుందని భావిస్తే, అది కాస్తా మృత్యుపాశమై మారింది. మార్కాపురం జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం, పిడుగులు ముగ్గురి ప్రాణాలను బలితీసుకోగా, అన్నదాతకు అపార పంట నష్టాన్ని మిగిల్చింది. మార్కాపురం జిల్లాలో అకాల వర్షం సృష్టించిన బీభత్సం, పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు మృతి చెందిన విషాదకర ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
- Fairoz Baig
- Updated on: Apr 29, 2026
- 9:21 pm
మాయదారి వాన.. ముగ్గుర్ని బలి తీసుకుంది.. అంతేకాదు ఆ ప్రాంతమంతా..
ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. కొంత మంది సూర్యుడి భగ భగలకు ఇంటి నుంచి బయట కాలు పెట్టడానికి వణికిపోతున్నారు. కానీ ఇటు ఎండలు కొడుతుంటే ఒక జిల్లాలో మాత్రం అకాల వర్షం రైతులను ఆగం చేసింది. భారీ వర్షానికి చేతి కొచ్చిన పంట నీటి పాలైంది. మార్కాపురం జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగులు పడి ముగ్గురు మహిళలు మృతి చెందారు. అరటి, బొప్పాయి పంటలకు అపార నష్టం వాటిల్లింది.
- Fairoz Baig
- Updated on: Apr 29, 2026
- 8:18 pm
Prakasam: ఈ ఒంగోలు వృషభరాజం ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టకమానరు..
కోట్ల రూపాయల విలువైన కార్ల గురించి విన్నాం… కానీ కోటి రూపాయల ధర పలికే ఒంగోలు జాతి గిత్త అరుదైన విశేషంగా నిలిచింది. సూర్యాపేటకు చెందిన రైతు సురేందర్ రెడ్డి పెంచుతున్న ఈ వృషభరాజం తన బలం, అందం, పనితీరుతో ప్రత్యేక గుర్తింపు పొందింది.
- Fairoz Baig
- Updated on: Apr 27, 2026
- 7:59 pm
Prakasam: దట్టమైన ముళ్ల పొదల నుంచి చప్పుళ్లు.. అటుగా వెళ్లేవారు ఆగి చూడగా..
ప్రాణాపాయ స్థితిలో ముళ్ల పొదల్లో చిక్కుకున్న జింక పిల్లను ప్రకాశం జిల్లా పోలీసులు చాకచక్యంగా రక్షించారు. గాయపడిన ఆ జింకకు ప్రాథమిక చికిత్స అందించి అటవీ శాఖ అధికారులకు అప్పగించగా, ఎస్ఐ నాగరాజు సేవలను గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. పూర్తి వివరాలు కథనంలో ..
- Fairoz Baig
- Updated on: Apr 27, 2026
- 7:35 pm
తిరగబడ్డ వెండితెర బొమ్మ.. మూతపడుతున్న థియేటర్లు!
ఒకప్పుడు జన సందడితో కళకళలాడిన సినిమా థియేటర్లు నేడు బోసిపోతున్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్లు, పైరసీ వెబ్సైట్లు, విపరీతంగా పెరిగిన టికెట్ ధరలు, ఆహారపు ఖర్చులు థియేటర్ల మనుగడను ప్రశ్నార్థకం చేశాయి. కరోనా ప్రభావంతో వందల థియేటర్లు మూతపడగా, సామాన్యుడి వినోదానికి దూరం అయ్యే పరిస్థితి నెలకొంది.
- Fairoz Baig
- Updated on: Apr 25, 2026
- 9:40 pm
ఒంగోలులో భారీ ఫైవ్ స్టార్ హోటల్.. 100 కోట్ల ప్రాజెక్ట్తో పర్యాటక రంగానికి ఊతం
ఒంగోలులో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం రాడిసన్ సంస్థతో కలిసి నిర్మించేందుకు ముందుకు వచ్చిన రవిప్రియ హాస్పిటాలిటీస్ సంస్థ. గతనెల మార్చి 28న నిర్వహించిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఒంగోలులో అన్ని హంగులతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించేందుకు అనుమతి లభించింది.
- Fairoz Baig
- Updated on: Apr 24, 2026
- 8:52 pm
అద్దంకిలో టీ కొట్లకు వెరైటీ పేర్లు.. బోర్డులు చూసి లోపలికి వెళ్లేలా చేస్తున్న క్రియేటివిటీ!
బయట బోర్డులు చూడగానే ఏదో కొత్తగా అనిపించి లోపలికి వచ్చాం.. పేర్లు వినడానికి సరదాగా ఉన్నాయి.. రుచి కూడా చాలా బాగుంది అని స్థానిక కస్టమర్లు చెబుతున్నారు. మొత్తానికి వ్యాపారంలో రాణించాలంటే కేవలం క్వాలిటీ ఉంటే సరిపోదు, కాస్తంత క్రియేటివిటీ కూడా ఉండాలని అద్దంకి టీ స్టాల్ యజమానులు నిరూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వెరైటీ టీ కొట్ల ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
- Fairoz Baig
- Updated on: Apr 23, 2026
- 4:58 pm
Srisailam: రాత్రి పూట ఆలయానికి వచ్చిన అనుకోని అతిథి..
అడవుల్లో ఆహారం, నీరు దొరక్క ఇబ్బంది పడుతున్న వన్యమృగాలు గ్రామాల్లోకి వస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ఉన్న అభయ ఆంజనేయస్వామి ఆలయంలోకి ఎలుగుబంటి ప్రవేశించడం భక్తుల్లో ఆందోళన కలిగించింది. కొద్దిసేపటికి ఎలాంటి హాని చేయకుండా తిరిగి అడవిలోకి వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
- Fairoz Baig
- Updated on: Apr 21, 2026
- 1:40 pm
ఆర్ఎంపీ డాక్డర్ మర్డర్ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. చంపింది ఎవరో తెల్సి అవాక్కయిన ఊరి జనం
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ వెంకట కోటిరెడ్డి హత్య కేసు సంచలనం రేపింది. మొదట గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని చెప్పిన భార్య ఆదిలక్ష్మి… తన కుమార్తెతో కలిసి పథకం ప్రకారం భర్తను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. భర్త వేధింపులు, ప్రాణభయంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
- Fairoz Baig
- Updated on: Apr 19, 2026
- 11:03 am
Addanki: ప్రిన్సిపాల్ సార్ జోరు చూసి బిత్తరపోయిన స్టూడెంట్స్..
గురువు–విద్యార్థుల మధ్య సరదా క్షణాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ప్రకాశం జిల్లా అద్దంకిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ రావు స్టేజ్పై డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మాస్ బీట్స్కు ఆయన వేసిన స్టెప్పులకు విద్యార్థులు కేరింతలు కొట్టారు.
- Fairoz Baig
- Updated on: Apr 19, 2026
- 10:25 am