ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. వార్తలో రిపోర్టర్ గా 1999లో కెరీర్ ప్రారంభం అయింది. 1999 నుంచి 2003 అక్టోబర్ వరకు వార్తలో రిపోర్టర్గా పనిచేశాను… ఆ తరువాత వెంటనే అదే నెలలో వార్తకు రిజైన్ చేసి 2003 అక్టోబర్లో tv9 ఛానల్ ఎయిర్లోకి రాకముందు ఐవిజన్ పేరుతో ప్రకాశంజిల్లా రిపోర్టర్గా జాయిన్ అయ్యాను… tv9 ఎయిర్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రకాశంజిల్లా tv9 రిపోర్టర్గా పనిచేస్తున్నారు… ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
చరిత్ర గర్భం నుంచి మరో ఆధారం.. వెలిగొండ ఆలయంలో బయటపడిన మరో అరుదైన శాసనం!
విజయనగర సామ్రాజ్య వైభవాన్ని, సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయల పాలనా దక్షతను కళ్లకు కట్టే మరో అపురూప శిలాశాసనం తాజాగా వెలుగుచూసింది. నాటి భక్తి ప్రపత్తులు, పాలనా విశేషాలను చాటిచెప్పే ఈ చారిత్రక ఆధారం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇంతకూ ఈ శాసనం ఎక్కడ దొరికింది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- Fairoz Baig
- Updated on: Sep 4, 2026
- 8:43 pm
Andhra News: అర్థరాత్రి అటవీలో తవ్వకాలు.. బయటపడిన 2 లంకెబిందెలు.. ఓపెన్ చేయగా
ప్రకాశం జిల్లా పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గుప్తనిధుల వేటగాళ్లు, వన్యప్రాణుల వేటగాళ్లు రెచ్చిపోతుండటంతో పలువురు అటవీశాఖ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గిద్దలూరు డివిజనల్ ఫారెస్ట్ పరిధిలోని తురిమెళ్ల రేంజ్ ఆరవీటికోట సెక్షన్లో చోటుచేసుకున్న గుప్తనిధుల అక్రమ తవ్వకాలు, పులిని వేటాడి చంపిన కేసుకు సంబంధించి లోతైన విచారణ జరిపిన అధికారులు మొత్తం ముగ్గురు ఫారెస్ట్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు.
- Fairoz Baig
- Updated on: Sep 3, 2026
- 7:41 pm
కృష్ణా జలాలు చేరడంతో నీట మునిగిన గ్రామాలు.. తట్టాబుట్ట సర్దుకుని తరలిన ప్రజలు
కొండ, కోనలతో అలరారే అందమైన ఊళ్ళు, చుట్టూ పంట పొలాలు, ఉన్నంతలో కళకళలాడే లోగిళ్ళు, శ్రమైక సౌందర్యం ఉట్టిపడే చిరునవ్వు మోములు.. స్వయం సంవృద్దితో అభివృద్ది బాటలో పయనిస్తున్న గ్రామాలు.. పల్లె జీవనంలో ఇంతకన్నా ఇంకేం కావాలి. అనుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్న ఆ నల్లమల అడవి పుత్రుల జీవితాల్లోకి వెలిగొండ కోసం త్యాగాలు చేయాల్సిన తరుణం వచ్చింది. జనం కోసం, అభివృద్ది కోసం పుట్టిన ఊరిని, కట్టుకున్న ఇళ్ళను వదిలి ఊరు ఊరంతా తరలివెళ్ళారు. ఎవరికోసమో తమ సర్వస్యం త్యాగం చేశారు.
- Fairoz Baig
- Updated on: Sep 1, 2026
- 8:00 pm
Krishna Water: అరుదైన ఘట్టానికి కౌంట్ డౌన్.. వెలిగొండకు కృష్ణా జలాలు.. ప్రారంభించనున్న చంద్రబాబు
Krishna Water: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లె సమీపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు 31వ తేది వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. వెలిగొండ పీడర్ కాలువ 4. 2 కి.మీ. దగ్గర ఉన్న క్రాస్..
- Fairoz Baig
- Updated on: Aug 30, 2026
- 1:49 pm
కండలు తిరిగిన దేహం.. రాజసం ఉట్టిపడే రూపం.. ఒంగోలులో 12 అడుగుల భారీ గిత్త!
ఒంగోలు పౌరుషానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే ప్రపంచ ప్రసిద్ధ ఒంగోలు జాతి గిత్తకు 12 అడుగుల భారీ విగ్రహాన్ని నగర శివారులో ఏర్పాటు చేశారు. ఒంగోలు మున్సిపాలిటీగా ఏర్పడి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ప్రముఖ శిల్పి లక్కు వర్మ జీవం ఉట్టిపడేలా గిత్త రూపాన్ని అద్భుతంగా మలిచారు. కండలు తిరిగిన దేహం, వాడి కొమ్ములు, దర్పం ఉట్టిపడే ముఖ కవళికలతో..
- Fairoz Baig
- Updated on: Aug 29, 2026
- 8:32 pm
డైరెక్టర్లకు కూడా రావేమో ఈ ఐడియాలు.. ఇచ్చిన డబ్బు తిరిగివ్వమన్నందుకు ఎలా చంపిందో తెలిస్తే..
మార్కాపురం జిల్లాకు చెందిన ఆదిలక్ష్మీ, రాజమ్మ ఇద్దరూ స్నేహితులు.. అయితే రాజమ్మ తన అవసరాల నిమిత్తం ఆదిలక్ష్మి దగ్గర అప్పుగా కొన్ని డబ్బులు తీసుకుంది. కాలక్రమేణా అవి వడ్డీతో సహా రూ.50లక్షలకు చేరాయి. దీంతో ఆదిలక్ష్మి తన డబ్బు తిరిగివ్వాలని కోరింది. కానీ రాజమ్మ మాత్రం కాస్త కంత్రిగా ఆలోచించింది.. ఆదిలక్ష్మిని లేపేస్తే డబ్బులు ఇవ్వాల్సిన పనే ఉండదని ఆలోచించింది.. డబ్బులు ఇస్తానని ఇంటికి రమ్మని పిలిచి గుట్టు చప్పుడు కాకుండా ఆదిలక్ష్మిని లేపేసి.. ప్లాస్టిక్ డబ్బాలో కుక్కి పాతి పెట్టింది.
- Fairoz Baig
- Updated on: Aug 27, 2026
- 9:42 pm
Viral Video: రన్నింగ్లో ఉన్న జాగ్వార్ కారులో భారీ శబ్ధం.. ఆపి ఏంటని చూసేలోపే ఇది పరిస్థితి!
ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఒంగోలు సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం ఓ ఖరీదైన జాగ్వార్ కారులో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో క్షణాల వ్యవధిలోనే కారు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
- Fairoz Baig
- Updated on: Aug 27, 2026
- 9:10 pm
అర్ధరాత్రి బస్సులో మహిళకు మత్తు మందు స్ప్రే చేసి… ఆపై ఏం చేశాడంటే.
అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళకు మత్తు స్ప్రే చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె బ్యాగులోని రూ.40 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. రిజర్వేషన్ లేకుండా బస్సులో ఎక్కిన యువకుడితో పాటు బస్సు సిబ్బంది పాత్రపైనా పోలీసులు విచారణ చేపట్టారు.
- Fairoz Baig
- Updated on: Aug 27, 2026
- 1:14 pm
పేరుకే ఆసుపత్రి.. నర్స్తో అబార్షన్ చేయించగా.. ఐదునెలల గర్భిణికి ఏమైంది?
Prakasam News Telugu: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డాక్టర్ అందుబాటులో లేని ప్రైవేట్ వైద్యశాలలో నర్స్, కాంపౌండర్ ఫోన్లో ఇచ్చిన సూచనలతో ఐదునెలల గర్భిణికి అబార్షన్ చేయగా.. తీవ్ర అనారోగ్యానికి గురై ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. అక్రమ స్కానింగ్, భ్రూణ లింగ నిర్ధారణపై కూడా స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
- Fairoz Baig
- Updated on: Aug 27, 2026
- 11:50 am
ఇంట్లో ఒంటరిగా ఉన్న అత్త.. లవర్తో కలిసి ఎంట్రీ ఇచ్చిన అల్లుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో బంగారు నగల కోసం అత్తను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. జల్సాలకు అలవాటు పడిన చిన్నల్లుడు తన ప్రియురాలితో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉన్న అత్తపై దాడి చేసి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
- Fairoz Baig
- Updated on: Aug 26, 2026
- 8:14 pm
Andhra News: అరటి తోటలో ఏదో అలికిడి.. ఏంటని అడుగు ముందుకేయగా భయానక దృశ్యం!
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం పాములపల్లె గ్రామ సమీపంలోని అరటి పొలాలలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. అరటి తోటలో చిరుత కదలికలను గుర్తించిన స్థానిక రైతులు వెంటనే అప్రమత్తమై అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు పాద ముద్రల ఆధారంగా పులి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
- Fairoz Baig
- Updated on: Aug 26, 2026
- 5:13 pm
రెండ్రోజుల క్రితం సముద్రంలో ఆటుపోట్లు.. సడెన్గా తీరంలో ప్రత్యక్షమైన విగ్రహాలు!
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెం సముద్ర తీరంలో శివలింగ పీఠంతో పాటు గుర్తు తెలియని దేవతా విగ్రహాలు కొట్టుకు రావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తీరంలో వీటిని గుర్తించిన స్థానిక మత్స్యకారులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు.. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు వాటిని స్వాధీనం చేసుకొని.. అవి ఎక్కడి నుంచి వచ్చాయని తేల్చే పనిలో పడ్డారు.
- Fairoz Baig
- Updated on: Aug 25, 2026
- 8:58 pm