ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. వార్తలో రిపోర్టర్ గా 1999లో కెరీర్ ప్రారంభం అయింది. 1999 నుంచి 2003 అక్టోబర్ వరకు వార్తలో రిపోర్టర్గా పనిచేశాను… ఆ తరువాత వెంటనే అదే నెలలో వార్తకు రిజైన్ చేసి 2003 అక్టోబర్లో tv9 ఛానల్ ఎయిర్లోకి రాకముందు ఐవిజన్ పేరుతో ప్రకాశంజిల్లా రిపోర్టర్గా జాయిన్ అయ్యాను… tv9 ఎయిర్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రకాశంజిల్లా tv9 రిపోర్టర్గా పనిచేస్తున్నారు… ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి జీవిత ఖైదు!
Kancharla Srinu Murder Case: మార్కాపురం జిల్లా పొదిలిలో 2017లో జరిగిన కంచర్ల శ్రీను హత్య కేసులో నేరం రుజువైందని తేల్చిన కోర్టు 13 మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది. రాజకీయ కక్షల నేపథ్యంలో జరిగిన ఈ సంచలన కేసులో తొమ్మిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెలువడింది.
- Fairoz Baig
- Updated on: Jun 10, 2026
- 9:11 pm
దారి కాచిన మృత్యువు.. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా వృద్ద దంపతులు బలి
Lorry Hits Bike in Prakasam District: ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా, వారి మనవడు గాయపడ్డాడు. కందుకూరులో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న బైక్ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధ జంట అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు..
- Fairoz Baig
- Updated on: Jun 5, 2026
- 4:25 pm
అబ్రకదబ్ర.. పేపర్ చదువుతుండగా మాయమైన స్కూటీ.. ఓర్నీ దుంపతెగ..
ప్రకాశం జిల్లా అద్దంకిలో విచిత్రమైన స్కూటీ చోరీ ఘటన చోటుచేసుకుంది. స్కూటీని షాపు ముందు ఆపి పేపర్ చదవడంలో మునిగిపోయిన యజమాని, తాళం తీసేయడం మరిచిపోవడంతో దొంగకు అవకాశం దొరికింది. యజమాని కళ్లెదుటే స్కూటీని స్టార్ట్ చేసి నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
- Fairoz Baig
- Updated on: Jun 4, 2026
- 7:32 pm
Andhra: ఇదేదో సాధారణ బండరాయి అనుకునేరు.. ఆ రామయ్య ఉనికిని చెప్పిన సాక్ష్యం
నల్లమల అటవీ ప్రాంతంలో వెలుగులోకి వస్తున్న ప్రాచీన తెలుగు శాసనాలు దక్షిణ భారత చరిత్రకు కొత్త కోణాలను పరిచయం చేస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా హనుమంతరాయునిపల్లి సమీపంలోని ఆలయంలో బయటపడిన 15వ శతాబ్దం నాటి శాసనాలు, శ్రీరాముడు-సీతాదేవి అరణ్యవాసానికి సంబంధించిన స్థానిక విశ్వాసాలు, చారిత్రక ఆనవాళ్లపై ఆసక్తిని పెంచుతున్నాయి.
- Fairoz Baig
- Updated on: May 30, 2026
- 7:32 pm
Andhra News: బయట నుంచి చూస్తే పశువుల కొటం.. కాస్త లోపలికెళ్లి చూడగా..
గోవులను అక్రమంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న 15 మంది ముఠాను స్థానిక ధార్మిక సంఘాల సాయంతో మర్కాపురం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కళేబరాలుగా మార్చి అక్కడి నుంచి తరలించేందుకు సిద్ధంగా ఉంచి 62 ఆవులతో పాటు కొంత మేర ఆవు మాంసాన్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
- Fairoz Baig
- Updated on: May 30, 2026
- 2:44 pm
Andhra Pradesh: ఏపీలో బీభత్సం సృష్టించిన గాలిదుమారం.. కుప్పకూలిన 120 ఏళ్ల దేవతా వృక్షాలు..
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన ఏపీని వణికించింది. ఈ గాలివాన బీభత్సానికి గిద్దలూరు పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానంలో ఊహించని ఘటన జరిగింది. సాక్షాత్తూ శివపార్వతుల స్వరూపంగా భావిస్తూ.. గత 120 సంవత్సరాలుగా భక్తుల చేత నిత్య పూజలందుకుంటున్న పవిత్ర దేవతా వృక్షాలు ఈదురు గాలుల ధాటికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి.
- Fairoz Baig
- Updated on: May 28, 2026
- 10:20 pm
120 ఏళ్ల దేవతా వృక్షాలు కుప్పకూలి కలకలం.. గాలిదుమారంతో బీభత్సం
మార్కాపురంజిల్లాలో గాలిదుమారంతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. యర్రగొండపాలెం, త్రిపురాంతకం మండలాల్లోని పలు గ్రామాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వడగళ్ళ వాన పడింది. మిట్టపాలెం దగ్గర రోడ్డు పై భారీ చెట్టు విరిగిపడింది. దీంతో త్రిపురాంతకం యర్రగొండపాలెం మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది.
- Fairoz Baig
- Updated on: May 28, 2026
- 9:32 pm
Viral: మందు ముఖ్యం బిగిలు..! బార్లో పొట్టుపొట్టు కొట్టుకున్నారు.. లాస్ట్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది
ఒంగోలులోని కేవీయస్ బార్లో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బీరు సీసాలతో పరస్పరం దాడులు చేసుకుంటూ బార్ను రణరంగంగా మార్చిన యువకులు.. ఒకరికి తీవ్ర గాయాలు చేసిన ఘటన సీసీటీవీలో రికార్డైంది. అయితే చివర్లో జరిగిన ట్విస్ట్ మాత్రం అందరినీ షాక్కు గురిచేస్తోంది. అంత పెద్ద గొడవ జరుగుతున్నా.. ఓ యువకుడు మాత్రం నింపాదిగా తన చివరి పెగ్ తాగి కూల్గా అక్కడి నుంచి వెళ్లిపోవడం ఇప్పుడు నెట్టింట ట్రోల్స్కు కారణమైంది.
- Fairoz Baig
- Updated on: May 27, 2026
- 1:24 pm
అర్ధరాత్రి రైలులో దోపిడీ దొంగల బీభత్సం.. ప్రయాణీకుడిలా వచ్చి.. మెరుపు వేగంతో చోరీ
రైలు ప్రయాణాల్లో ప్రయాణీకుల భద్రతపై మళ్లీ ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అర్ధరాత్రి వేళ రైలు ఆగిన తరుణాన్ని ఆసరాగా చేసుకుని, ఏసి బోగీలోకి చొరబడిన ఒక దొంగ మహిళా ప్రయాణీకురాలి చేతిలోని విలువైన బ్యాగును లాక్కెళ్లిన ఘటన బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్లో కలకలం రేపింది. ఈ ఘటనతో తోటి ప్రయాణీకులు ఒక్కసారిగా హడలిపోయారు.
- Fairoz Baig
- Updated on: May 26, 2026
- 2:53 pm
Andhra: చూశారా మావ.. ఈదురుగాలికి ఏకంగా టోల్గేట్ 100 మీటర్ల దూరం కొట్టుకుపోయింది..
మార్కాపురం జిల్లాలో అకాల వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. త్రిపురాంతకం మండలం మేడపి వద్ద జాతీయ రహదారిపై ఉన్న భారీ టోల్ప్లాజా గాలిదుమారానికి వంద మీటర్ల దూరం ఎగిరిపడి పూర్తిగా ధ్వంసమైంది. ఘటన సమయంలో రోడ్డుపై వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పగా, సిబ్బంది పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు.
- Fairoz Baig
- Updated on: May 25, 2026
- 7:56 pm
Andhra Pradesh: బుల్లెట్ బండి కోసం ఆటో నిండా పైసలతో షోరూమ్కు.. అసలు ట్విస్ట్ మామూలుగా ఉండదు..
బుల్లెట్ బైక్ కొనాలన్నది అతని చిన్ననాటి కల. కానీ జేబులో చూస్తే రూపాయి లేదు. అయినా సరే పట్టుదల వీడకుండా ఏకంగా మూడేళ్ల పాటు చేపల వ్యాపారంలో వచ్చిన పది రూపాయల నాణేలన్నింటినీ దాచి పెట్టాడు. చివరికి ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 220 కేజీల బరువున్న 3 లక్షల కాయిన్స్ను ఆటోలో షోరూమ్కు తీసుకెళ్లి, అందరూ నోరెళ్లబెట్టేలా దర్జాగా బుల్లెట్ బండిని ఇంటికి తెచ్చుకున్నాడు
- Fairoz Baig
- Updated on: May 23, 2026
- 8:16 pm
Andhra: అడవిలో తవ్వుతుండగా బయటపడ్డ లంకెబిందెలు… వాటి లోపల..
మార్కాపురం జిల్లా గిద్దలూరు టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల వ్యవహారం కలకలం రేపుతోంది. అటవీశాఖ అధికారులు, ట్రైబల్ వాచర్ల సహాయంతో తవ్వకాలు జరిపి లంకెబిందెలను వెలికితీశారన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పూర్తి వివరాలు కథనంలో ..
- Fairoz Baig
- Updated on: May 20, 2026
- 1:30 pm