ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. వార్తలో రిపోర్టర్ గా 1999లో కెరీర్ ప్రారంభం అయింది. 1999 నుంచి 2003 అక్టోబర్ వరకు వార్తలో రిపోర్టర్గా పనిచేశాను… ఆ తరువాత వెంటనే అదే నెలలో వార్తకు రిజైన్ చేసి 2003 అక్టోబర్లో tv9 ఛానల్ ఎయిర్లోకి రాకముందు ఐవిజన్ పేరుతో ప్రకాశంజిల్లా రిపోర్టర్గా జాయిన్ అయ్యాను… tv9 ఎయిర్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రకాశంజిల్లా tv9 రిపోర్టర్గా పనిచేస్తున్నారు… ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
AP News: కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..!
AP News: ఈ రోజు ఉదయం పెళ్లి జరగాల్సి ఉండగా, పెళ్లి కూతురుతో సహా కుటుంబ సభ్యులు ఆటోలో బయలుదేరారు. వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో నలుగురు మృతి చెందారు. మృతులు ఆవుల అలకనంద, అంకాలు, నగేష్, నాగేశ్వరిగా..
- Fairoz Baig
- Updated on: Jul 3, 2026
- 6:32 am
Andhra News: కాలేజీ లేదు.. క్లాసుల్లేవ్.. కానీ విద్యార్థులు మాత్రం ఫుల్.. ఆ జిల్లాలో వెలుగులోకి మాయా కాలేజ్!
కాలేజీ లేదు.. క్లాస్ రూములు లేవు.. కనీసం కాలేజీ బోర్డు కూడా లేదు.. కానీ ఏటా అడ్మిషన్లు మాత్రం ఫుల్ అవుతున్నాయి! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ప్రకాశం జిల్లా అద్దంకి వేదికగా సాగుతోన్న ఓ బీఈడీ కాలేజీ బాగోతం ఇప్పుడు బయటపడింది. పొరుగు రాష్ట్రాల విద్యార్థులే టార్గెట్గా, లక్షల రూపాయలు వసూలు చేస్తూ నడుపుతున్న ఈ బోగస్ డిగ్రీల దందా గురించి తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- Fairoz Baig
- Updated on: Jun 30, 2026
- 8:22 pm
Andhra Pradesh: వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు కాటు.. చివరకు ఏమైందంటే..?
సినిమాల్లోనో, చందమామ కథల్లోనో పాములు పగ పడతాయని వినుంటాం. కానీ ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక ఊహించని నిజ జీవిత ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే వ్యక్తిని ఆరు నెలల వ్యవధిలో మూడుసార్లు పాము కాటు వేయడం, చివరికి ఆయన ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని, విస్మయాన్ని నింపింది. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..
- Fairoz Baig
- Updated on: Jun 30, 2026
- 12:59 pm
Andhra News: అమెరికాలో ఆంధ్ర కుర్రాడు మిస్సింగ్.. అసలు ఏం జరిగిందంటే?
ఉన్నత చదువుల కోసమని, ఉద్యోగాల కోసమని విదేశాలకు వెళ్తున్న భారతీయులు ఏదో ఒక ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు ఇటీవల చాలానే వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఏపీలోని పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన ఓ యువకుడు అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వరదల్లో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు యువకుడి ఆచూకీ కనిపెట్టాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులకు లేఖలు రాశారు.
- Fairoz Baig
- Updated on: Jun 28, 2026
- 8:40 pm
Andhra News: సింగరకొండ ఆలయంలో రూ. 1.51 కోట్ల కుంభకోణం..! ఈఓకు చార్జ్ షీట్!
ప్రకాశం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. కుంభాభిషేకం పేరిట భారీ మొత్తంలో నిధుల దారిమళ్లింపు కలకలం రేపుతోంది! భక్తుల కానుకలు, స్వామివారి నిధులు ఏకంగా ఒక కోటి 51 లక్షల రూపాయల మేర దుర్వినియోగమైనట్లు దేవాదాయ శాఖ ప్రాథమిక విచారణలో తేలింది.
- Fairoz Baig
- Updated on: Jun 23, 2026
- 3:49 pm
AP News: చీరాల గ్యాంగ్ రేప్, హత్య కేసులో కీలక తీర్పు.. కామాంధులకు యావజ్జీవ జైలు శిక్ష
బాపట్ల జిల్లా చీరాల సమీపంలో యువతిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితులైన ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష, జరిమానా విధించగా, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు సహకరించిన మరో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందించాలని న్యాయస్థానం ఆదేశించింది..
- Fairoz Baig
- Updated on: Jun 23, 2026
- 1:18 pm
దారుణ హత్య..! మీ వాడ్ని చంపేశాం, వచ్చి బాడీ తీసుకెళ్లండి.. చావు కబురు ఫోన్లో చెప్పిన ఫ్రెండ్స్
ప్రకాశం జిల్లా మంగమూరులో అశోక్ను నలుగురు స్నేహితులే దారుణంగా హత్య చేశారు. యువతి వ్యవహారం, మద్యం, గంజాయి మత్తులో గొడవలే దీనికి కారణమని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని ఒంగోలు జీజీహెచ్కు తరలించగా, నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాధితులు న్యాయం కోసం నిరసన తెలిపారు.
- Fairoz Baig
- Updated on: Jun 22, 2026
- 3:08 pm
Prakasam District: చిన్న కథ కాదురా సామి మీతో.. రొయ్యల చెరువుల్లో చోరీకి వచ్చి రైతులపైనే
ప్రకాశం జిల్లా చింతాయగారిపాలెం వద్ద అర్ధరాత్రి రొయ్యల చెరువుల్లో చోరీకి వచ్చినట్లు అనుమానించిన వ్యక్తిని ఆక్వా రైతులు పట్టుకున్నారు. అయితే నిందితుడిని నిర్బంధించారంటూ రైతులపైనే కౌంటర్ ఫిర్యాదు నమోదు కావడంతో ఘటన ఉద్రిక్తంగా మారింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చోరీల ముఠాను గుర్తించాలని రైతులు పోలీసులను కోరుతున్నారు.
- Fairoz Baig
- Updated on: Jun 21, 2026
- 7:58 pm
‘ఎందుకు చంపావ్ నాన్నా..’ ముగ్గురు కూతుళ్లను చంపి ఆపై తండ్రి ఆత్మహత్య
ప్రకాశం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య దూరంగా వెళ్లిపోయిందన్న మనస్తాపంతో తండ్రి సుధాకర్ తన ముగ్గురు కుమార్తెలను హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..
- Fairoz Baig
- Updated on: Jun 19, 2026
- 12:35 pm
మీకు చేతులెలా వచ్చాయి..? అమ్మ ఒడిలో కాదు.. ముళ్లపొదల్లో కనిపించిన పసి ప్రాణం!
అమ్మ ఒడిలో వెచ్చగా పెరగాల్సిన ఏడు రోజుల పసివాడు ఒంగోలు నగరంలోని గాంధీనగర్లో ముళ్లపొదల్లో మృతదేహంగా కనిపించడం స్థానికులను కలచివేసింది. శిశువు మరణానంతరం అక్కడ పడేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, పోస్టుమార్టం నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
- Fairoz Baig
- Updated on: Jun 19, 2026
- 10:40 am
దొంగలు బాబోయ్ దొంగలు… దడ పుట్టిస్తున్న థార్ దొంగలు…
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా కదలికలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏలూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానితుల కదలికలు గుర్తించిన నేపథ్యంలో చీరాల, పర్చూరు ప్రాంతాల్లో నిఘా పెంచారు. అనుమానితుల ఫొటోలతో పోస్టర్లు విడుదల చేసిన పోలీసులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలను కోరుతున్నారు.
- Fairoz Baig
- Updated on: Jun 18, 2026
- 8:30 pm
రోడ్డు పక్కన అర్థరాత్రి కారులో ముగ్గురు వ్యక్తులు.. వచ్చి పోయే వాహనాలను ఆపి..
మార్కాపురం జిల్లాలోని పామూరు సమీప నెల్లూరు హైవే జంక్షన్ వద్ద మైనింగ్, పోలీసు, ఆర్మీ అధికారులమంటూ లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. డమ్మీ పిస్టల్, నకిలీ గుర్తింపు కార్డులతో వాహనాలను ఆపి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను స్థానికుల సమాచారంతో ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి అదుపులోకి తీసుకున్నారు.
- Fairoz Baig
- Updated on: Jun 18, 2026
- 1:24 pm