AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fairoz Baig

Fairoz Baig

Senior Staff Reporter - TV9 Telugu

fairoz.baig@tv9.com

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. వార్తలో రిపోర్టర్ గా 1999లో కెరీర్ ప్రారంభం అయింది. 1999 నుంచి 2003 అక్టోబర్‌ వరకు వార్తలో రిపోర్టర్‌గా పనిచేశాను… ఆ తరువాత వెంటనే అదే నెలలో వార్తకు రిజైన్‌ చేసి 2003 అక్టోబర్‌లో tv9 ఛానల్‌ ఎయిర్‌లోకి రాకముందు ఐవిజన్‌ పేరుతో ప్రకాశంజిల్లా రిపోర్టర్‌గా జాయిన్‌ అయ్యాను… tv9 ఎయిర్‌లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రకాశంజిల్లా tv9 రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు… ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Andhra Pradesh: ఇంటిపక్కన జెర్రిపోతుల సయ్యాట.. పట్టుకోవడానికి వెళ్లిన స్నేక్ క్యాచర్‌ను చుట్టుకొని.. మీరే వీడియో చూడండి..

Andhra Pradesh: ఇంటిపక్కన జెర్రిపోతుల సయ్యాట.. పట్టుకోవడానికి వెళ్లిన స్నేక్ క్యాచర్‌ను చుట్టుకొని.. మీరే వీడియో చూడండి..

జనావాసాల మధ్య ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. ప్రకాశం జిల్లాలో ఓ ఇంటి ఆవరణ పక్కన రెండు పాములు పెనవేసుకుని కలకలం సృష్టించాయి. వాటి సయ్యాటలను చూసి గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పట్టపగలు వరుస చోరీలు.. గంటల వ్యవధిలో రెండు ఇళ్లలో 50 సవర్ల బంగారం, రూ.5 లక్షల నగదు మాయం!

పట్టపగలు వరుస చోరీలు.. గంటల వ్యవధిలో రెండు ఇళ్లలో 50 సవర్ల బంగారం, రూ.5 లక్షల నగదు మాయం!

Ongole theft: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒకేరోజు గంటల వ్యవధిలో రెండు ఇళ్లలో భారీ చోరీలు జరిగాయి. మొత్తం 50 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు అపహరణకు గురయ్యాయి. సీసీ కెమెరాల్లో టోపీ ధరించిన అనుమానితుడు కనిపించగా, రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Viral Video: క్లాస్‌రూమ్‌లోకి దూరిన భారీ జెర్రిపోతు.. విద్యార్థులు తెలివిగా ఏం చేశారో తెలిస్తే..

Viral Video: క్లాస్‌రూమ్‌లోకి దూరిన భారీ జెర్రిపోతు.. విద్యార్థులు తెలివిగా ఏం చేశారో తెలిస్తే..

ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు మీరే వింటారా? నేను కూడా వింటాను అనుకుందేమో.. ఓ భారీ జెర్రిపోతు పిల్లలతో పాటు ఎంచక్కా క్లాస్‌రూమ్‌లోకి వచ్చి తిష్టవేసింది. అప్పటివరకు పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థులు ఒక్కసారిగా ఆ పామును చూసి హడలిపోయారు. క్లాస్‌రూమ్ నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యార్థుల హడావిడికి భయపడిపోయిన ఆ పాము సైతం ఓ బెంచ్ కిందకు దూరి నక్కింది. సమాచారంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పామును పట్టేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఛీ..ఛీ.. ఇదెక్కడి పైశాచికం! స్కూల్‌లో పిల్లాడిపై దారుణం.. టీచర్‌పై పోక్సో కేసు నమోదు

ఛీ..ఛీ.. ఇదెక్కడి పైశాచికం! స్కూల్‌లో పిల్లాడిపై దారుణం.. టీచర్‌పై పోక్సో కేసు నమోదు

ఒంగోలులో ఎనిమిదేళ్ల బాలుడిపై పీఈటీ టీచర్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు కలకలం రేపాయి. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు, విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టగా, బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

తెలుగు పద్యానికి తొలి పునాది.. అద్ధంకిలో 1200 ఏళ్ల నాటి ఈ శాసనం గురించి మీకు తెలుసా?

తెలుగు పద్యానికి తొలి పునాది.. అద్ధంకిలో 1200 ఏళ్ల నాటి ఈ శాసనం గురించి మీకు తెలుసా?

తెలుగు భాషా చరిత్రలోనే అత్యంత విలక్షణమైన ఘట్టానికి ప్రకాశం జిల్లాలోని అద్దంకి వేదికగా నిలిచింది. మనకు లభించిన ఆధారాల ప్రకారం తెలుగులో మొట్టమొదటి పద్య రూపాన్ని సంతరించుకున్న చారిత్రాత్మక 'పండరంగని పద్యశాసనం' దాదాపు 1200 సంవత్సరాల క్రితం ఇక్కడే ఆవిర్భవించింది. వేంగి చాళుక్యుల విజయోత్సాహానికి, మన దేశీయ ఛందస్సు వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ శాసనం తెలుగు సాహిత్య ప్రయాణంలో ఒక మైలురాయిగా భాసిల్లుతోంది.

Andhra News: ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..

Andhra News: ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..

చెడు వ్యసనాలకు బానిసలుగా మారి ఈజీ మనీ కోసం చోరీలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను ప్రకాశంజిల్లా మద్దిపాడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 18 లక్షల విలువైన బంగారు నగలు, 51 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరంతా గతంలో చేసిన నేరాల కారణంగా జైలుకు వెళ్ళి అక్కడ పరిచయమైన మరి కొందరితో కలిసి కలుపుకుని ఓ ముఠా ఏర్పడి బయటకు వచ్చాక చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

Andhra: తల్లి కల నెరవేరింది.. కానీ బిడ్డను చూడకుండానే తుది శ్వాస

Andhra: తల్లి కల నెరవేరింది.. కానీ బిడ్డను చూడకుండానే తుది శ్వాస

మార్కాపురం జిల్లా కాకర్లకు చెందిన ఆశ కార్యకర్త గుంటు లీలమ్మ మాతృత్వం కోసం ప్రాణాలనే పణంగా పెట్టింది. ప్రసవం చేస్తే ప్రాణాపాయం ఉంటుందని వైద్యులు హెచ్చరించినప్పటికీ, బిడ్డను కాపాడాలని పట్టుదలతో సిజేరియన్ చేయించుకుంది. మగబిడ్డకు జన్మనిచ్చిన అనంతరం ఆమె కన్నుమూయడంతో కుటుంబంతో పాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Andhra: నోటి దురుసు ఎంతపనిచేసింది.. భార్య వెళ్లిందని అలా మాట్లాడితేనే కొట్టి చంపేస్తారా..?

Andhra: నోటి దురుసు ఎంతపనిచేసింది.. భార్య వెళ్లిందని అలా మాట్లాడితేనే కొట్టి చంపేస్తారా..?

బాపట్ల జిల్లా చినగంజాం మండలం సంతరావూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో తరచూ దుర్భాషలాడుతున్నాడన్న కక్షతో గొర్రెల కాపరి శ్రీనివాసరావును ముగ్గురు వ్యక్తులు కర్రలు, కాళ్లతో విచక్షణారహితంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఉప్పాల వెంకటనారాయణతో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చీరాల డీఎస్పీ మహ్మద్ మొయిన్ తెలిపారు.

కంభం చెరువు కట్టపై 400 ఏళ్ల ‘తేరాతేజీ’ పండుగ.. గరిక తొక్కితే పెళ్లి జరుగుతుందనే నమ్మకం

కంభం చెరువు కట్టపై 400 ఏళ్ల ‘తేరాతేజీ’ పండుగ.. గరిక తొక్కితే పెళ్లి జరుగుతుందనే నమ్మకం

Garika Thokkudu Festival: మార్కాపురం జిల్లా కంభం చెరువు వద్ద 400 ఏళ్లుగా నిర్వహిస్తున్న 'తేరాతేజీ' గరిక తొక్కుడు పండుగ విశేష భక్తిశ్రద్ధలతో సాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వేలాది మంది భక్తులు దీనాషా వలి దర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. పెళ్లి కానివారికి త్వరగా వివాహం జరుగుతుందనే విశ్వాసంతో గరిక తొక్కించే ప్రత్యేక ఆచారం ఈ పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..

ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..

వెలిగొండ ప్రాజెక్టు సుంకేసుల పునరావాస కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా 17 విద్యుత్‌ స్థంభాలపై ఉన్న విద్యుత్‌ తీగలను కట్‌ చేసి ఎత్తుకెళ్లారు. కాలనీలో పర్యవేక్షణ లేకపోవడంతో వరుస దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

Andhra News: డబ్బుపై ఉన్న ప్రేమ భార్యపై లేదా?.. వరకట్న దాహానికి మరో వివాహిత బలి!

Andhra News: డబ్బుపై ఉన్న ప్రేమ భార్యపై లేదా?.. వరకట్న దాహానికి మరో వివాహిత బలి!

ప్రకాశం జిల్లా కనిగిరిలో దారుణ ఘటన వెలుగు చూసింది. అదనపు కట్నం కోసం ఓ ఫ్యామిలీ.. వివాహితను అతి దారుణంగా కర్రలతో కొట్టి హత్య చేసింది. అంతటితో ఆగకుండా హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా, పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పిల్లల్ని చూసి ఒక్కసారిగా ఆగిన మంత్రి కారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..?

పిల్లల్ని చూసి ఒక్కసారిగా ఆగిన మంత్రి కారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..?

ప్రకాశం జిల్లాలో పర్యటన సందర్భంగా మంత్రి బాలవీరాంజనేయస్వామి తన కాన్వాయ్‌ను ఆపి రోడ్డుపై ఉన్న చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. తల్లికి వందనం పథకం కింద డబ్బులు వచ్చాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఒక విద్యార్థికి డబ్బులు రాలేదని తెలుసుకున్న వెంటనే అధికారులతో విచారణ చేయాలని ఆదేశించారు. ఈ ఆప్యాయ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.