AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fairoz Baig

Fairoz Baig

Senior Staff Reporter - TV9 Telugu

fairoz.baig@tv9.com

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. వార్తలో రిపోర్టర్ గా 1999లో కెరీర్ ప్రారంభం అయింది. 1999 నుంచి 2003 అక్టోబర్‌ వరకు వార్తలో రిపోర్టర్‌గా పనిచేశాను… ఆ తరువాత వెంటనే అదే నెలలో వార్తకు రిజైన్‌ చేసి 2003 అక్టోబర్‌లో tv9 ఛానల్‌ ఎయిర్‌లోకి రాకముందు ఐవిజన్‌ పేరుతో ప్రకాశంజిల్లా రిపోర్టర్‌గా జాయిన్‌ అయ్యాను… tv9 ఎయిర్‌లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రకాశంజిల్లా tv9 రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు… ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Andhra Pradesh: స్కూల్‌ సమీపంలో మద్యం షాపు.. ఆ బడి పిల్లలు ఏం చేశారో చూడండి!

Andhra Pradesh: స్కూల్‌ సమీపంలో మద్యం షాపు.. ఆ బడి పిల్లలు ఏం చేశారో చూడండి!

మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్ల ఏర్పాటుకు ఎక్సైజ్‌ శాఖ నియమనిబంధనలు ఉన్నా కొంతమంది బడి, గుడి, నివాస సముదాయాల సమీపంలోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తుండటం వివాదాలకు దారి తీస్తోంది. మార్కాపురం జిల్లా కేంద్రంలో ఓ బార్‌ అండ్‌ రెస్టారెండ్‌..

Andhra: రేయ్ ఎంత దుర్మార్గంరా.. రూ.2వేల కోసం ప్రాణం తీస్తారా..

Andhra: రేయ్ ఎంత దుర్మార్గంరా.. రూ.2వేల కోసం ప్రాణం తీస్తారా..

రెండు వేల రూపాయల వివాదం నిండు ప్రాణాన్ని బలిగొంది. ఇచ్చిన అప్పును తిరిగి అడిగినందుకు.. ఓ మేస్త్రీ.. తన దగ్గర పనిచేసే కూలీని రాడ్డుతో కొట్టి చంపాడు.. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తిలో చోటుచేసుకుంది. బూదవాడ గ్రామం సమీపంలోని ఓ గ్రానైట్‌ పాలిషింగ్ ఫ్యాక్టరీలో ఈ ఘటన జరగగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Andhra Pradesh: వార్నీ.. ఇదేం విచిత్రంరా నాయనా.. రికార్డుల్లో పేరుంది.. కానీ ఊరే లేదు..

Andhra Pradesh: వార్నీ.. ఇదేం విచిత్రంరా నాయనా.. రికార్డుల్లో పేరుంది.. కానీ ఊరే లేదు..

శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఆలయం.. అప్పాలమ్మ అనే జమీందారు త్యాగం.. ముచికుంద స్వామి ప్రతిష్టించిన విగ్రహం.. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన మిల్లంపల్లి గ్రామం రికార్డుల్లో ఉంది కానీ క్షేత్రస్థాయిలో కనుమరుగైపోయింది. ప్రస్తుతం వేగినాటి కోటయ్య కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సచివాలయ కష్టాలు, సపరేట్ పంచాయతీ కోసం వారు చేస్తున్న పోరాటం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Andhra: ఈ జనం చూశారా.. అవతల మనిషి చావుబ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే..?

Andhra: ఈ జనం చూశారా.. అవతల మనిషి చావుబ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే..?

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందగా, మరోవైపు బోల్తా పడ్డ చేపల లారీ నుంచి చేపలను ఎత్తుకెళ్లిన ఘటన మార్కాపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. త్రిపురాంతకం మండలం దివేపల్లి సమీపంలో చేపల లోడుతో వెళ్తున్న లారీ, ఎదురుగా వచ్చిన బోలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ షౌకత్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Andhra: విదేశీ అతిధులు… పురుడుకోసం పుట్టింటికొచ్చే పక్షులు… తరతరాలుగా వీడని అనుబంధం.

Andhra: విదేశీ అతిధులు… పురుడుకోసం పుట్టింటికొచ్చే పక్షులు… తరతరాలుగా వీడని అనుబంధం.

ఒక చిన్న గ్రామం… కానీ వేల మైళ్ల దూరం నుంచి వచ్చే విదేశీ అతిథులకు అది సురక్షితమైన నిలయం. ప్రకాశం జిల్లా వెలమవారిపాలెంలో జనవరి మొదలైతే చాలు, ఆకాశం నిండా కొంగల కిలకిలరావాలు మార్మోగుతాయి. రెండు మూడు వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ అనుబంధం, కేవలం పక్షులు–మనుషుల మధ్య సంబంధం కాదు… అది విశ్వాసం, భక్తి, ప్రేమల మేళవింపు.

Andhra: ఇంట్లోనే దుకాణం పెట్టాడు… రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కాడు.

Andhra: ఇంట్లోనే దుకాణం పెట్టాడు… రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కాడు.

వ్యవసాయశాఖ అధికారి షేక్ మహమ్మద్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. మార్కాపురం జిల్లా కంభం మండలానికి చెందిన ఎరువుల దుకాణదారుడిని నకిలీ మందుల పేరుతో బెదిరించి రూ.20 వేలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. .. .. ..

Andhra: ఊయలే ఉరితాడైందా.. లేక మరేమైనా జరిగిందా..? చిన్నారి మృతి కేసులో మిస్టరీ..

Andhra: ఊయలే ఉరితాడైందా.. లేక మరేమైనా జరిగిందా..? చిన్నారి మృతి కేసులో మిస్టరీ..

అప్పటివరకు అల్లరిచేస్తూ ఆడుకుంటున్న ఏడేళ్ళ చిన్నారి మెడకు.. ఊయల ఉరితాడుగా మారి ఉసురుతీసింది. తల్లి చీరతో కట్టిన ఊయలలో ఆడుకుంటూ అదేచీర మెడకు చుట్టుకుంది.. చూస్తుండగానే.. అపస్మారక స్థితికి వెళ్లిన చిన్నారి.. క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది.

Podili Rathotsavam: దక్షిణకాశీలో వైభవంగా రథోత్సవం.. కులమతాలకు అతీతంగా పాల్గొన్న భక్తులు!

Podili Rathotsavam: దక్షిణకాశీలో వైభవంగా రథోత్సవం.. కులమతాలకు అతీతంగా పాల్గొన్న భక్తులు!

ప్రకాశం జిల్లా పొదిలిలో శ్రీ నిర్మమహేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో విజయనగర సామ్రాజ్యం నాటి నుండి ఈ వేడుక కొనసాగుతోంది. కులమతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. శతాబ్దాలుగా వస్తున్న ఈ సంప్రదాయంలో వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుని, హరహర మహాదేవ నామస్మరణతో రథాన్ని లాగి ఐక్యతను చాటారు.

ఆ శివయ్యే కాపాడాడు.. శ్రీశైలం ఘాట్ రోడ్‌లో బస్సు బోల్తా.. రెప్పపాటులో తప్పించుకున్న ప్రయాణికులు!

ఆ శివయ్యే కాపాడాడు.. శ్రీశైలం ఘాట్ రోడ్‌లో బస్సు బోల్తా.. రెప్పపాటులో తప్పించుకున్న ప్రయాణికులు!

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు దోర్నాల అదుపుతప్పి బోల్తా పడింది. ఆ పక్కనే భారీ గుంత ఉండడంతో బస్సు అమాంతం ఆ గుంతలోకి ఒరిగిపోయింది. గమనించిన స్థానిక వాహన దారులు అప్రమత్తమై బస్సులోఉన్న ప్రయాణికులందరినీ కిందకు దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది బస్సును తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

Andhra News: అయ్యో ఏం జరిగిందో పాపం.. హాస్టల్‌ వాష్‌రూమ్‌లో విగతజీవిగా కనిపించిన విద్యార్థి!

Andhra News: అయ్యో ఏం జరిగిందో పాపం.. హాస్టల్‌ వాష్‌రూమ్‌లో విగతజీవిగా కనిపించిన విద్యార్థి!

ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. నవోదయలో చేరేందుకు ఎంట్రన్స్‌ పరీక్షలకు కోచింగ్‌ తీసుకుంటున్న 11 ఏళ్ళ విద్యార్ధి బాత్రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. అయితే పేరెంట్స్ మాత్రం హాస్టల్ వార్డెన్ దాడితోనే తన కుమారుడు మరణించాడని ఆరోపిస్తున్నారు. తమ కుమారుడి మృతికి కారణమైన వారిని శిక్షించాలని జిల్లా కలెక్టరేట్‌ ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పాకల బీచ్‌ ఫెస్టివల్‌ అదుర్స్‌…ఆకట్టుకుంటున్న హెలీకాప్టర్ రైడ్, పారా గ్లైడింగ్‌

పాకల బీచ్‌ ఫెస్టివల్‌ అదుర్స్‌…ఆకట్టుకుంటున్న హెలీకాప్టర్ రైడ్, పారా గ్లైడింగ్‌

ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో రెండు రోజుల బీచ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి, కలెక్టర్ రాజాబాబు దీనిని ప్రారంభించారు. హెలికాప్టర్, బోట్ రైడ్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు, జబర్దస్త్ టీం, సుమ, రవి వంటి ప్రముఖుల సందడి, రుచికరమైన ఫుడ్ కోర్ట్‌లు ఈ ఉత్సవానికి ప్రధాన ఆకర్షణలు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇదేం దోపిడీ రా నాయనా…ఫోన్‌ పే చేస్తారు…సక్సెస్‌ వస్తుంది.. కానీ డబ్బులు జమ కావు..! అదే ట్విస్ట్..

ఇదేం దోపిడీ రా నాయనా…ఫోన్‌ పే చేస్తారు…సక్సెస్‌ వస్తుంది.. కానీ డబ్బులు జమ కావు..! అదే ట్విస్ట్..

ఫోన్‌ పే ద్వారా ఘారానా మోసం... దుకాణాల్లో వస్తువులు కొని ఫోన్‌ పే చేస్తారు... సక్సెస్‌ మెసేజ్‌ చూపిస్తారు... అయితే డబ్బులు జమకావు... తీరా ఎకౌంట్‌ చెక్‌ చేసుకుంటే కానీ జరిగిన మోసం తెలియదు... ప్రకాశంజిల్లాలో ఫోన్‌ పే మోసాలతో డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ అంటేనే భయపడిపోతున్నారు వ్యాపారులు... డిజిటల్‌ పేమెంట్ల లావాదేవీల్లో రోజుకో కొత్త మోసం వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు ఆన్‌లైన్‌ మనీ ట్రాన్సఫరింగ్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.