ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. వార్తలో రిపోర్టర్ గా 1999లో కెరీర్ ప్రారంభం అయింది. 1999 నుంచి 2003 అక్టోబర్ వరకు వార్తలో రిపోర్టర్గా పనిచేశాను… ఆ తరువాత వెంటనే అదే నెలలో వార్తకు రిజైన్ చేసి 2003 అక్టోబర్లో tv9 ఛానల్ ఎయిర్లోకి రాకముందు ఐవిజన్ పేరుతో ప్రకాశంజిల్లా రిపోర్టర్గా జాయిన్ అయ్యాను… tv9 ఎయిర్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రకాశంజిల్లా tv9 రిపోర్టర్గా పనిచేస్తున్నారు… ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Crime News: జైల్లో ఉన్న భర్తను బెయిల్పై బయటకు తెచ్చిమరీ చంపిన భార్య.. అసలు కారణం తెలిస్తే
వైవాహిక సంభంధాలు నానాటికి దిగజారిపోతున్నాయి. నాతిచరామీ అంటూ తాళికట్టిన భర్తను భార్యలే దారుణంగా చంపేస్తున్న ఉదంతాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ప్రకాశంజిల్లాలో ఓ భార్య తన భర్తను తమ్ముడు, మరికొందరితో కలిసి కళ్ళల్లో కారం చల్లి, కత్తులు, కర్రలతో కొట్టి చంపేశారు. అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారంటూ నమ్మించేందుకు ప్రయత్నించారు.
- Fairoz Baig
- Updated on: Jan 22, 2026
- 1:57 pm
గుండెపోటుతో అంబులెన్స్లో అమ్మ.. కాపాడుకనే ప్రయత్నింలో కొడుకు.. కాసేపటికే ఊహించని విషాదం!
గుండెపోటుకు గురైన కన్నతల్లిని కాపాడుకునేందుకు తపన పడ్డ ఆ కొడుకును రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. చివరకు ఇటు గుండెపోటుతో తల్లి, అటు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై కొడుకు మృత్యువాతపడ్డ హృదయవిదారకరమైన ఘటన ప్రకాశంజిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాలు తెలుసుకుంటే ఎవరికైనా హృదయం ద్రవించకమానదు.
- Fairoz Baig
- Updated on: Jan 21, 2026
- 5:00 pm
Andhra Pradesh: సినిమా స్టైల్లో వ్యక్తి కిడ్నాప్.. అంతే ఫాస్ట్గా పోలీసుల రియాక్ట్.. కట్ చేస్తే..!
ఒక్కసారిగా సినిమా స్టైల్లో మహీంద్రా థార్ వాహనం రోడ్డుపైకి దూసుకొచ్చింది.. అందులో నుంచి బిలబిలమంటూ నలుగురు వ్యక్తులు దిగారు.. అక్కడే రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యక్తిని పట్టుకుని ఈడ్చుకెళ్ళి వాహనంలోకి బలవంతంగా ఎక్కించారు. ఈ వ్యవహారాన్ని గమనించిన స్థానికులు ఎవరో కారులో వ్యక్తిని కిడ్నాప్ చేసినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
- Fairoz Baig
- Updated on: Jan 20, 2026
- 9:08 pm
Andhra: చిన్న ముంబాయిలో ఎంత ఘోరం.. తల్లీకొడుకుల ప్రాణాలు బలి తీసుకున్న మైక్రో వ్యాపారులు..
బాపట్ల జిల్లా చీరాలలో ఘోరం జరిగింది.. మైక్రో ఫైనాన్షియర్ల వేధింపులు భరించలేక చిరు వ్యాపారం చేసుకుంటున్న తల్లీకొడుకులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఈనెల 13వ తేదిన జరిగింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని తల్లీకొడుకులు నిప్పంటించుకున్న ఘటనలో అదేరోజు తల్లి మృతి చెందగా, తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొడుకు కూడా చనిపోయాడు.
- Fairoz Baig
- Updated on: Jan 20, 2026
- 3:43 pm
కనకాంబరం.. కోయాలంటే నిచ్చెన వేయాల్సిందే.. అంత ఎత్తు ఎలా పెరిగిందబ్బా..!
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే పూల మొక్క కనకాంబరం. వాసన లేకపోయినా కంటికింపైన రంగుల్లో తెగ ఆకట్టుకుంటుంది. తేలిగ్గా ఉండే ఈ పూలు మిగతా పూల కంటే భిన్నం. మూడు నాలుగు రోజుల పాటు తాజాగా కనిపిస్తాయి. తెలంగాణలో బతుకమ్మ పండగకు ఈ పూలు దండల్లా మారి.. పడచుల మనసులను దోచేస్తాయి.
- Fairoz Baig
- Updated on: Jan 20, 2026
- 3:18 pm
Andhra: అల్లాటప్ప రాయి కాదు ఇది.! పొలాన్ని నాగలితో దున్నుతుండగా బయటపడ్డ అద్భుతం
అద్దంకిలో అద్భుతం జరిగింది. గజాననుడి గర్భాలయ రహస్యం బయటపడింది. పండుగ రోజు పొలంలో కుడి తొండం గణపతి వెలిసింది. 600 ఏళ్ల నాటి చారిత్రకు సాక్ష్యంగా నిలిచింది. రైతు నాగలికి తగిలింది రాయి కాదని, అది సాక్షాత్తూ విజయనగరరాజుల కాలంనాటి విఘ్నేశ్వరుడేనని తేలింది.
- Fairoz Baig
- Updated on: Jan 17, 2026
- 6:26 pm
Watch Video: ఇది కదా రేసంటే.. లైన్ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన.. విన్నరెవరంటే?
సంక్రాంతి సందర్భంగా బాపట్ల జిల్లా యర్రంవారిపాలెంలో జరిగిన వినూత్న రివర్స్ ట్రాక్టర్ డ్రైవింగ్ పోటీలు ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ పందాలకు భిన్నంగా జరిగిన ఈ పోటీల్లో డ్రైవర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కీర్తిశేషులు యర్రం వెంకటరెడ్డి జ్ఞాపకార్థం నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందించారు. గ్రామస్తులు ఉత్సాహంగా తిలకించిన ఈ పందెం, డ్రైవింగ్ మెలకువలకు కొత్త నిర్వచనం ఇచ్చింది.
- Fairoz Baig
- Updated on: Jan 14, 2026
- 9:56 pm
Andhra: వారెవ్వా.. భలే పోటీలు భయ్యా.. అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.. అమేజింగ్ వీడియో
ప్రకాశం జిల్లాలో సంక్రాంతి సందర్భంగా ఎడ్లపోటీలు, పొట్టేళ్ళ పోటీలకు దీటుగా సముద్రతీరంలో పడవ పోటీలు, ఈత పోటీలు నిర్వహించారు. కొత్తపట్నం మండలం మన్నూరు పెద్దపాలెం గ్రామంలో మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా సముద్రంలో మత్స్యకారుల పడవల పోటీలు, ఈతల పోటీల్లో పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.
- Fairoz Baig
- Updated on: Jan 14, 2026
- 1:56 pm
Sankranti Traditional Snacks: ఎల్లలు దాటిన సంక్రాంతి వంటకాలు.. దేశ, విదేశాల్లో తెలుగింటి గుమగుమలు
సంక్రాంతి అనగా గుర్తేది భోగి మంటలు, గాలిపటాలు, కొత్త అల్లుళ్లు, నోరూరించే పిండి వంటలు. కానీ ప్రస్తుత బిజీ జీవితంలో సంక్రాంతి సాంప్రదాయ పిండివంటలు తయారు చేసుకోవడం కష్టమైంది. ఈ నేపథ్యంలో ఇంటి తరహా వంటకాలకు, ముఖ్యంగా క్షీరపురి చీరాల పిండివంటలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. నాణ్యత, శుచి, శుభ్రత పాటిస్తూ తయారు చేసే అరిసెలు, కజ్జికాయలు వంటివి దేశ విదేశాల్లో ప్రఖ్యాతి పొంది, సంక్రాంతి పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
- Fairoz Baig
- Updated on: Jan 13, 2026
- 6:28 pm
గాల్లో ఉండగానే నేలరాలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత.. అసలు మ్యాటరేంటంటే?
పక్కదేశాల నుంచి వలస వచ్చే అందమైన విదేశీ పక్షుల పాలిట యములవుతున్నారు కొందరు వేటగాళ్లు. చెరువుల దగ్గర కనిపించే స్వదేశీ, విదేశీపై పక్షులను తాపాకీలతో వేటాడుతున్నారు. నిబంధనలు బేఖాతరు చేసి ఇష్టారీతిన నాటు తుపాకులతో చేపల చెరువుల దగ్గర హల్ చల్ చేస్తున్నారు. వేటగాళ్ల వికృత చేష్టలతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు స్థానికులు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
- Fairoz Baig
- Updated on: Jan 12, 2026
- 1:24 pm
Andhra News: పిల్లలతో కలిసి భర్త ఇంటి ముందు భార్య మౌనపోరాటం.. అసలు మ్యాటరేంటంటే?
చీరాలలో ఓ న్యాయవాది తన భార్య, ఇద్దరు కూతుర్లను వదిలేసి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో అతని భార్య దీప తన పిల్లలతో కలిసి భర్త ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. న్యాయం కోసం ఆందోళన చేస్తున్న ఆమెకు పోలీసులు మద్దతుగా నిలిచారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
- Fairoz Baig
- Updated on: Jan 11, 2026
- 2:49 pm
రాత్రి, పగలనే తేడానే లేదు.. ఆ గ్రామంలో క్షణక్షణం భయం భయం.. ఇంతకు అక్కడ ఏం జరుగుతోంది!
మార్కాపురం జిల్లా బొమ్మలాపురం సమీపంలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా ఆవుల మందపై దాడి చేసి ఒకదానికి గాయాలు చేసింది. గతంలోనూ పలు పశువులు పులి బారిన పడి ప్రాణాలు కోల్పోయాయి. నల్లమల అటవీ ప్రాంతం నుండి పొలాల్లోకి వస్తున్న పులితో రైతులు, పశువుల కాపరులు రాత్రివేళల్లో బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అటవీ శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- Fairoz Baig
- Updated on: Jan 9, 2026
- 10:23 am