ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. వార్తలో రిపోర్టర్ గా 1999లో కెరీర్ ప్రారంభం అయింది. 1999 నుంచి 2003 అక్టోబర్ వరకు వార్తలో రిపోర్టర్గా పనిచేశాను… ఆ తరువాత వెంటనే అదే నెలలో వార్తకు రిజైన్ చేసి 2003 అక్టోబర్లో tv9 ఛానల్ ఎయిర్లోకి రాకముందు ఐవిజన్ పేరుతో ప్రకాశంజిల్లా రిపోర్టర్గా జాయిన్ అయ్యాను… tv9 ఎయిర్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రకాశంజిల్లా tv9 రిపోర్టర్గా పనిచేస్తున్నారు… ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
ఇదేం దోపిడీ రా నాయనా…ఫోన్ పే చేస్తారు…సక్సెస్ వస్తుంది.. కానీ డబ్బులు జమ కావు..! అదే ట్విస్ట్..
ఫోన్ పే ద్వారా ఘారానా మోసం... దుకాణాల్లో వస్తువులు కొని ఫోన్ పే చేస్తారు... సక్సెస్ మెసేజ్ చూపిస్తారు... అయితే డబ్బులు జమకావు... తీరా ఎకౌంట్ చెక్ చేసుకుంటే కానీ జరిగిన మోసం తెలియదు... ప్రకాశంజిల్లాలో ఫోన్ పే మోసాలతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటేనే భయపడిపోతున్నారు వ్యాపారులు... డిజిటల్ పేమెంట్ల లావాదేవీల్లో రోజుకో కొత్త మోసం వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు ఆన్లైన్ మనీ ట్రాన్సఫరింగ్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
- Fairoz Baig
- Updated on: Feb 11, 2026
- 9:01 pm
Srisailam: శ్రీశైలం నడకదారి పక్కన పొదల్లో పెద్దపులి… నిశ్శబ్దంగా భక్తులను చూసిన తర్వాత..
నల్లమల అడవిలో శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న మల్లన్న భక్తులకు ఊహించని అనుభవం ఎదురైంది. మార్కాపురం జిల్లా డోర్నాల మండలం సరిహద్దు సమీపంలోని పెద్దచెరువు వద్ద దారి పక్కన పొదల్లో పెద్దపులి కనిపించడంతో భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే .. ..
- Fairoz Baig
- Updated on: Feb 11, 2026
- 1:12 pm
అమ్మ బాబోయ్..! చైనా మాంజాలే కాదు.. ప్రాణాలు తీస్తున్న కేబుల్ వైర్లు.. తస్మాత్ జాగ్రత్త..!
కాలం కలిసి రాకపోతే కర్రే పామై కాటేస్తుందంట.. అలా ఉంది ఆ పెద్దాయనకు జరిగిన ఘటన చూస్తే..! హెడ్మాస్టర్గా పనిచేస్తున్న ఆయన స్కూలుకు బయలుదేరిన కొద్దిసేపటికే విచిత్రంగా మృత్యువాత పడటం ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. విధి కాకపోతే ఏంటి..? ఎప్పుడూ వెళ్ళే దారిలో బైక్పై వెళుతుంటే కేబుల్ వైర్ మెడకు చుట్టుకుని అదుపుతప్పి కింద పడిపోవడం ఏంటి... అక్కడికక్కడే తీవ్ర గాయాలై చనిపోవడం ఏంటి..?
- Fairoz Baig
- Updated on: Feb 11, 2026
- 12:24 pm
Andhra Pradesh: ఇదేం బాధరా భగవంతుడా.. కడసారి వీడ్కోలుకు కన్నీటి కష్టాలు.. ఈ కథ తెలిస్తే అయ్యో అనాల్సిందే..
ఆ గ్రామంలో చనిపోయాక కూడా కష్టాలు తప్పడం లేదు. కడసారి వీడ్కోలు పలికే అంతిమ యాత్ర ఒక సాహసయాత్రలా మారుతోంది. భుజంపై శవం.. నడుము లోతు నీరు.. ఎప్పుడు వాగు ఉధృతి పెరుగుతుందో తెలియని భయం.. ప్రకాశం జిల్లాలో పసుపుగల్లు గ్రామం దుస్థితి ఇది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత మధ్య ఆ గ్రామస్థులు నరకయాతన పడుతున్నారు.
- Fairoz Baig
- Updated on: Feb 9, 2026
- 9:11 pm
Andhra Pradesh: ఇదేం పంచాయతీ రా నాయనా.. మొగుడు కొట్టినందుకు కాదు.. తోటికోడలు నవ్వినందుకు అన్నట్లుంది కథ..
ప్రేమ గెలిచింది.. పెద్దలు ఒప్పుకున్నారు.. పెళ్లి కూడా అయిపోయింది.. కానీ ఆ ఇంటి తోటికోడలు మాత్రం ససేమిరా అంది.. వినడానికి వింతగా ఉన్నా.. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కులాలు వేరైనా భర్తకు, అత్తమామలకు లేని ఇబ్బంది.. ఆ తోటికోడలికి ఎందుకు వచ్చిందో ఏమో కానీ, ఏకంగా కుటుంబాన్నే కులం నుంచి వెలివేయాలని పంచాయతీ పెట్టింది.
- Fairoz Baig
- Updated on: Feb 9, 2026
- 6:13 pm
Andhra: ఆదివారం సెలవు కావడంతో ఫొటోలు దిగుదామని బయటకు వెళ్లారు.. అంతలోనే..
సెల్ఫీ ఫోటో సరదా ఓ నిండు ప్రాణం పోయేలా చేసింది. సెల్పీ కోసం ప్రయత్నిస్తూ.. ఓ విద్యార్థి చనిపోయిన ఘటన మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని పలకల క్వారీలో చోటుచేసుకుంది. మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీకి చెందిన ఏసుబాబు, జాన్ వెస్లీ, అభిరామ్ అనే ముగ్గురు చిన్నారులు.. సాయంత్రం సమయంలో సరదాగా ఫోటోలు దిగేందుకు బయటకు వెళ్లారు.
- Fairoz Baig
- Updated on: Feb 9, 2026
- 1:37 pm
సీఎం చంద్రబాబు చొరవతో స్వాతంత్రం వచ్చిన 78 ఏళ్ళకు ‘వెలుగు’లోకి వచ్చిన గ్రామం..!
స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటిన తరువాత నల్లమల అటవీ ప్రాంతం మారుమూల పల్లె పాలుట్ల గిరిజన తండాలో సోలార్ విద్యుత్ కాంతులు విరజిమ్మాయి... దశాబ్దాలుగా చీకట్లోనే మగ్గుతున్న అడవిపుత్రుల కోసం 3 కోట్లతో ప్రతి ఇంటికీ సోలార్ ప్యానెల్స్ అమర్చడంతో గ్రామంలో విద్యుత్ సౌకర్యం ఏర్పడింది..
- Fairoz Baig
- Updated on: Feb 7, 2026
- 8:36 pm
Andhra Pradesh: ఒంగోల్ గనులశాఖలో అవినీతి జలగలు.. కోట్లలో కూడబెట్టిన సర్వేయర్!
భూగర్భ గనుల శాఖ కార్యాలయంలో సర్వేయర్ గా పనిచేస్తున్న అబ్దుల్ ఆసిఫ్ అక్రమ ఆస్తుల పై నెల్లూరు ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. విజయవాడలో నివాసం ఉంటున్న సర్వేయర్ అబ్దుల్ ఆసిఫ్.. ఒంగోలు మైన్స్ అండ్ జియాలజీ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్నారు. ఆయన గతంలో..
- Fairoz Baig
- Updated on: Feb 6, 2026
- 8:05 pm
Apple Farming: వారెవ్వా క్యా సీన్ హై.. ఏపీలోని బీడు భూముల్లో కాశ్మీర్ ఆపిల్.. పండిన రైతు పంట..
Apple Farming in Andhra Pradesh: రోజూ ఒక్క యాపిల్ తింటే చాలు.. డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు.. ఈ క్యాప్షన్ అందరికీ సుపరిచితమే.. అయితే అలాంటి నాణ్యమైన యాపిల్ ఎక్కువగా ఎముకలు కొరికే చలిప్రాంతాల్లో మాత్రమే పండుతాయి. కాశ్మీర్, హిమాచల్ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో యాపిల్ సాగు ఎక్కువగా ఉంటుంది.
- Fairoz Baig
- Updated on: Feb 4, 2026
- 7:50 pm
Andhra: వయస్సు ఒక నంబర్ మాత్రమే.. 75 ఏళ్లు వచ్చినా పతకాల పంట పండిస్తున్నాడు..
ఏడు పదుల వయసు దాటినా, నాగయ్యలో పటుత్వం తగ్గలేదు. మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో కూడా ఆటల్లో సత్తా చాటిన ఆయన, పరుగు పందెంలలో చిరుతలా పరిగెత్తి పతకాల పంట పండిస్తున్నారు. బాపట్ల జిల్లా పంభా నాగయ్య, 75 ఏళ్ల వయసులో కూడా మాస్టర్ అథ్లెటిక్స్లో రోజూ ప్రాక్టీస్ చేసి, గత 25 ఏళ్లుగా పలు విభాగాల్లో పోటీల్లో పాల్గొని 25 బంగారు, 15 వెండి, 5 కాంస్య పతకాలు సాధించారు.
- Fairoz Baig
- Updated on: Feb 2, 2026
- 6:50 pm
నడిరోడ్డుపై స్ట్రీట్ ఫైట్.. పట్టపగలు రెచ్చిపోయిన యువకులు.. పిడిగుద్దులతో బాహాబాహీ..!
మద్యం మత్తు మనిషిని ఏ స్థాయికి దిగజారుస్తుందో చెప్పడానికి ఈ దృశ్యాలే నిదర్శనం. ప్రకాశం జిల్లా కోరిశెపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని యువకులు నడిరోడ్డుపైనే వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఉన్న యువకులు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగారు.
- Fairoz Baig
- Updated on: Feb 1, 2026
- 9:10 pm
Andhra: పొలంలో ఇదేం పనిరా.. పొద్దున్నే చేనుకు వెళ్లి కంగుతిన్న రైతు
గుళ్లు, గోపురాలకే కాదు… ఇప్పుడు పంట పొలాలకూ గుప్తనిధుల వేటగాళ్ల కన్నుపడుతోంది. మార్కాపురం జిల్లా కంభం పట్టణ పరిధిలోని ఓ పొలంలో పురాతన నంది విగ్రహం కింద గుప్తనిధుల కోసం రాత్రికి రాత్రే తవ్వకాలు జరగడం కలకలం రేపింది. .. ..
- Fairoz Baig
- Updated on: Feb 1, 2026
- 7:45 pm