Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fairoz Baig

Fairoz Baig

Senior Staff Reporter - TV9 Telugu

fairoz.baig@tv9.com

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. వార్తలో రిపోర్టర్ గా 1999లో కెరీర్ ప్రారంభం అయింది. 1999 నుంచి 2003 అక్టోబర్‌ వరకు వార్తలో రిపోర్టర్‌గా పనిచేశాను… ఆ తరువాత వెంటనే అదే నెలలో వార్తకు రిజైన్‌ చేసి 2003 అక్టోబర్‌లో tv9 ఛానల్‌ ఎయిర్‌లోకి రాకముందు ఐవిజన్‌ పేరుతో ప్రకాశంజిల్లా రిపోర్టర్‌గా జాయిన్‌ అయ్యాను… tv9 ఎయిర్‌లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రకాశంజిల్లా tv9 రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు… ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Prakasam District: రోజూలానే అడవిలో తనిఖీకి వెళ్లిన సిబ్బంది.. కనిపించింది చూసి షాక్..

Prakasam District: రోజూలానే అడవిలో తనిఖీకి వెళ్లిన సిబ్బంది.. కనిపించింది చూసి షాక్..

వేటగాళ్లు ఏర్పాటుచేసిన ఉచ్చులో పడి వన్యప్రాణులు మృతి చెందుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అటవీ రేంజ్‌ పరిధిలోని కొలుకుల బీట్‌లో ఉచ్చులో చిక్కి ఓ చిరుత మృత్యువాతపడింది. ఆదివారం మధ్యాహ్నం విధులు నిర్వహిస్తున్న సిబ్బంది చిరుత కళేబరాన్ని గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

వావివరసలు మరిస్తే అంతే.. దారితప్పిన కొడుకును కన్నతల్లి ఏం చేసిందంటే.. వామ్మో వణకాల్సిందే..

వావివరసలు మరిస్తే అంతే.. దారితప్పిన కొడుకును కన్నతల్లి ఏం చేసిందంటే.. వామ్మో వణకాల్సిందే..

హైదరాబాద్‌లోని మీర్ పేట్‌లో భార్యను ముక్కలుగా నరికి హత్య చేసిన దారుణ ఘటన మరువక ముందే ప్రకాశం జిల్లాలో అలాంటి దారుణమే మరొకటి వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని తెలుగు వీధిలో 35 ఏళ్ళ కన్న కొడుకు శ్యామ్ ను కన్నతల్లి సాలమ్మ ఓ ఆటో డ్రైవర్ మోహన్ తో కలిసి హత్య చేయించింది.

Andhra News: విదేశీ అతిథులు వచ్చాయండోయ్‌.. ఆ గ్రామంలో పక్షుల సందడి మామూలుగా లేదుగా..

Andhra News: విదేశీ అతిథులు వచ్చాయండోయ్‌.. ఆ గ్రామంలో పక్షుల సందడి మామూలుగా లేదుగా..

ఈ అరుదైన పక్షులు దాదాపు 7వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇవి దక్షిణ భారతదేశానికి చేరుకుంటాయి. ప్రస్తుతం స్వల్ప మొత్తంలో తురిమెళ్ళ గ్రామ చెరువులో ఈ పక్షులు సేద తీరుతున్నాయి. పగలంతా చెరువులో చేపలు వేటాడి ఆకలి తీర్చుకుంటాయి. రాత్రి వేళల్లో సమీప ప్రాంతాలలో చెట్లపై సేద తీరుతున్నాయి. వాటి ప్రాణాలకు ముప్పు రాకుండా గ్రామస్థులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Andhra News: మద్యం మానేయాలనుకున్నాడు.. చివరకు ప్రాణాలు కోల్పోయాడు.. అసలేం జరిగిందంటే..

Andhra News: మద్యం మానేయాలనుకున్నాడు.. చివరకు ప్రాణాలు కోల్పోయాడు.. అసలేం జరిగిందంటే..

మద్యానికి బానిసయ్యాడు.. చివరకు మానేయాలని నిర్ణయించుకున్నాడు.. అయితే.. మద్యం అలవాటు మానేందుకు ఓ నాటు వైద్యుడిని సంప్రదించి ప్రాణాలు కోల్పోయాడు... ఈ విషాదకరఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.. ప్రకాశం జిల్లా కంభంలో మద్యం మానుకునేందుకు ప్రయత్నించి ఓ యువకుడు విగతా జీవిగా మారాడు.

RGV : ఆర్జీవిని విచారించనున్న ఒంగోలు పోలీసులు.. ఈసారి వస్తానన్న వర్మ.. ఏం విచారిస్తారో అన్న ఉత్కంఠ.

RGV : ఆర్జీవిని విచారించనున్న ఒంగోలు పోలీసులు.. ఈసారి వస్తానన్న వర్మ.. ఏం విచారిస్తారో అన్న ఉత్కంఠ.

సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మను ఒంగోలు రూరల్‌ పోలీస్ స్టేషన్‌లో రేపు పోలీసులు విచారించనున్నారు... 2024 నవంబర్‌ 10వ తేదిన మద్దిపాడు పియస్‌లో టిడీపీ నేత ఫిర్యాదుతో వర్మపై నమోదైన కేసు... గతంలో విచారణకు రాకుండా కోర్టు ద్వారా అరెస్ట్‌ నుంచి తప్పించుకున్న వర్మ... తాజాగా ఈనెల 7న విచారణకు రావాలని వాట్సప్‌ ద్వారా నోటీసులిచ్చిన పోలీసులు... రేపు 11 గంటలకు వస్తానని సమాచారం ఇచ్చిన వర్మ.

Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్‌ కాల్‌తో రిటైర్డ్‌ టీచర్‌ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు

Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్‌ కాల్‌తో రిటైర్డ్‌ టీచర్‌ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. ఎవ్వరినీ వదలకుండా అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా.. ఏపీలో మరో రిటైర్డ్ ఉపాధ్యాయుడి నుంచి సైబర్ నేరగాళ్లు లక్షలకు లక్షలు దోచుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కనిగిరిలో చోటుచేసుకుంది.. గత కొంత కాలం నుంచి రిటైర్డ్‌ ఉపాధ్యాయులను టార్గెట్‌ చేస్తూ ఫోన్లు చేసి మీ మీద కేసులు ఉన్నాయంటూ భయభ్రాంతులను చేసి లక్షల రూపాయల డబ్బులు దోచుకుంటున్నారు సైబర్ మోసగాళ్లు...

Andhra Pradesh: ఏవండోయ్‌ ఇది విన్నారా..? ఈ బియ్యం పురుషులకు వరం లాంటివట..

Andhra Pradesh: ఏవండోయ్‌ ఇది విన్నారా..? ఈ బియ్యం పురుషులకు వరం లాంటివట..

Andhra Pradesh: ప్రకృతి వ్యవసాయానికి, జీవ వైవిధ్యానికి భారతదేశం పెట్టింది పేరు. ఇక్కడి నేలల్లో ఒకప్పుడు వేలాది రకాల వరి విత్తనాలు సాగులో ఉండేవి. నేల స్వభావం, భౌగోళిక స్వరూపం, నీటివసతి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వివిధరకాల వరి వంగడాలను పండించేవారు. అయితే దేశవాళీ వరి విత్తనాల దిగుబడి తక్కువగా ఉంటుండటం, భారీగా పెరుగుతున్న జనాభా ఆహార..

మూడు గంటలు లిఫ్ట్‌లో నరకయాతన.. ఏం జరిగిందంటే!

మూడు గంటలు లిఫ్ట్‌లో నరకయాతన.. ఏం జరిగిందంటే!

రైల్వే స్టేషన్లు, మెట్రో రైల్వే స్టేషన్లలో వృద్ధులు, లగేజ్‌తో మెట్టు ఎక్కలేని వారి కోసం లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తుంటారు. అయితే వృద్ధులే కాకుండా ఈ లిఫ్ట్‌లను అందరూ ఉపయోగిస్తుంటారు. అంతవరకూ ఓకే. కానీ పరిమితికి మించి లిఫ్ట్‌ ఎక్కేస్తుంటారు ఒక్కోసారి. దాంతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఒంగోలు జిల్లాలో చోటుచేసుకుంది.

AP News: జాలర్లు వేసిన వల బరువెక్కింది.. చిక్కింది చూడగా మైండ్ బ్లాంక్

AP News: జాలర్లు వేసిన వల బరువెక్కింది.. చిక్కింది చూడగా మైండ్ బ్లాంక్

బాపట్ల జిల్లాలోని మత్స్యకారులు చేపల కోసం వల వేస్తే.. ఆ వల బరువెక్కింది. ఇంతకీ అందులో ఏం చిక్కాయో తెలిస్తే.. దెబ్బకు అవాక్ అవుతారు. వారికి ఒక్కసారిగా పండుగే పండుగ.. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ లుక్కేయండి.

Andhra News: కంటైనర్ నుంచి జీపీఎస్ సిస్టం సిగ్నల్స్.. ఛేజ్ చేసి తనిఖీ చేయగా దిమ్మతిరిగే షాక్

Andhra News: కంటైనర్ నుంచి జీపీఎస్ సిస్టం సిగ్నల్స్.. ఛేజ్ చేసి తనిఖీ చేయగా దిమ్మతిరిగే షాక్

ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలో ఓ కంటైనర్‌ లారీ రయ్యిరయ్యిమని దూసుకెళుతోంది. జాతీయ రహదారిపై ఏదో లోడుతో వెళుతున్న లారీ అనుకున్నారు అంతా.. అయితే హైదరాబాద్‌ నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు కంటైనర్‌ లారీనీ ఛేజ్‌ చేస్తున్నారు... దూసుకెళుతున్న లారీని హైవేపై సింగరాయకొండ దగ్గర ఆపారు.

Andhra Pradesh: ఎంతకు తెగించావ్‌రా..! భర్తకు దూరంగా ఉంటున్న సొంత చెల్లిని..

Andhra Pradesh: ఎంతకు తెగించావ్‌రా..! భర్తకు దూరంగా ఉంటున్న సొంత చెల్లిని..

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడుకు చెందిన మాలపాటి అశోక్‌రెడ్డి, సంధ్య అన్నాచెల్లెళ్లు.. సంధ్య (25) కుటుంబ కలహాల కారణంగా భర్తకు దూరంగా ఉంటోంది.. పునుగోడులోని తన అన్న అశోక్‌రెడ్డితో కలిసి ఉంటోంది. అశోక్‌రెడ్డి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరుతో అప్పులు చేసి పీకల్లోతు ఆర్దిక కష్టాల్లో ఉన్నాడు..ఈ క్రమంలోనే.. దారుణానికి పాల్పడ్డాడు..

Ram Gopal Varma: ఆర్జీవీకి ఒంగోలు పోలీసుల నోటీసులు.. వర్మ రియాక్షన్ ఏంటంటే

Ram Gopal Varma: ఆర్జీవీకి ఒంగోలు పోలీసుల నోటీసులు.. వర్మ రియాక్షన్ ఏంటంటే

వర్మ నువ్వు రావాలయ్యా.... ఆర్జీవీకి ఒంగోలు పోలీసుల నోటీసులు... ఫిబ్రవరి 7న విచారణకు రావాలని వాట్సప్‌ సందేశం... వస్తానన్న వర్మ... సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కు నోటీసులు జారీ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు.. ఫిబ్రవరి 7వ తేదీన విచారణకు హాజరు కావలసిందిగా వాట్సప్ ద్వారా నోటీసులు పంపిన ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు.