ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. వార్తలో రిపోర్టర్ గా 1999లో కెరీర్ ప్రారంభం అయింది. 1999 నుంచి 2003 అక్టోబర్ వరకు వార్తలో రిపోర్టర్గా పనిచేశాను… ఆ తరువాత వెంటనే అదే నెలలో వార్తకు రిజైన్ చేసి 2003 అక్టోబర్లో tv9 ఛానల్ ఎయిర్లోకి రాకముందు ఐవిజన్ పేరుతో ప్రకాశంజిల్లా రిపోర్టర్గా జాయిన్ అయ్యాను… tv9 ఎయిర్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రకాశంజిల్లా tv9 రిపోర్టర్గా పనిచేస్తున్నారు… ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Viral News: గాల్లో పార్క్ చేసిన టాటా సుమో.. ఆకాశంలో ఈదుతున్న చేప.. దగ్గరకు వెళ్లి చూడగా
సాధారణంగా ఎవరైనా ఇల్లు కట్టుకుంటే, పైన వాటర్ ట్యాంక్ కట్టుకోవడం సహాజం. అయితే ఇందుకోసం ప్లాస్టిక్ సిన్టెక్స్లు లేదా సిమెంట్ దిమ్మెలను కట్టాలనుకుంటారు. కానీ ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని కొందరు యజమానులు మాత్రం అలా రొటీన్గా కాకుండా కొత్తగా వాటర్ ట్యాంక్లను నిర్మించుకుంటున్నారు. తమ ఇంటిపై ట్యాంకులను చూడగానే అరే.. భలే ఉందే అనిపించేలా వెరైటీగా నిర్మించారు.
- Fairoz Baig
- Updated on: Apr 14, 2026
- 7:29 pm
Andhra Crime: ఇలాంటి పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి..తల్లి మంటల్లో కాలిపోతుంటే..?
సాధారణంగా తల్లి ఆపదలో ఉందంటే కొడుకులు ఏం చేస్తారు.. ప్రాణాలుకు తెగించైనా ఆమెను కాపాడాలని ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడో యువకుడి ప్రమాదవశాత్తు ఇంట్లో మంటలు చెలరేగి అందులో తల్లి సజీవదహనం అయిపోతున్నా.. ఏం పట్టనున్నటూ చూస్తూ ఉండిపోయాడు. కానీ మంటలు ఆర్పే ప్రయత్నం కూడా చేయలేదు. కళ్ల ముందే కన్నతల్లి కాలిపోతున్న కొడుకు పట్టించుకోవడంతో ఈ ఘటనపై అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నారు.
- Fairoz Baig
- Updated on: Apr 14, 2026
- 5:10 pm
అయ్యో దేవుడా.. బడికి సెలవు కావడంతో అరటి తోటకు వెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెలవు రోజున సరదాగా నీటి కుంటలో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు, 12 ఏళ్ల శశి, 10 ఏళ్ల దీపన్ మృతి చెందారు. లోతు తెలియక నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన ఆ రెండు కుటుంబాల్లోనూ, గ్రామంలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Fairoz Baig
- Updated on: Apr 14, 2026
- 3:06 pm
వైద్యం కావాలని వచ్చి.. ఆర్ఎంపి డాక్టర్, అతని భార్య కాళ్లు, చేతులు కట్టేశారు.. ఆ తర్వాత..
ప్రకాశంజిల్లా అద్దంకి మండలం ధర్మవరంలో దారుణ హత్య జరిగింది. గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్న కోటిరెడ్డిని ముసుగులు ధరించి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, కర్రలతో భార్య ఎదుటే దారుణంగా నరికి చంపేశారు. అర్ధరాత్రి జరిగిన ఈ దారుణ హత్యకు ముందు తమ ఆరోగ్యం బాగా లేదని, వైద్యం చేయాలని వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఈ హత్య చేసినట్టు భావిస్తున్నారు. హత్యకు వివాహేతర సంబంధాలే కారణంగా అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
- Fairoz Baig
- Updated on: Apr 13, 2026
- 10:56 am
Video: బుసలు కొడుతూ హడలెత్తించిన త్రాచుపాము.. తెలివిగా ఎలా బంధించాడో చూడండి..
భానుడి భగభగలు మనుషులనే కాదు, విష సర్పాలను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వేడి తట్టుకోలేక చల్లని ప్రదేశాల కోసం వెతుకుతూ పాములు ఇళ్లలోకి, పశువుల కొట్టాల్లోకి చేరుతున్నాయి. మార్కాపురం జిల్లాలో తాజాగా జరిగిన రెండు వేర్వేరు ఘటనలు స్థానికులను వణికించాయి. ఐదడుగుల త్రాచుపాము పడగ విప్పి బుసలు కొడుతుంటే.. మరోవైపు ఆసుపత్రిలోకి జెర్రిపోతు చొరబడింది.
- Fairoz Baig
- Updated on: Apr 10, 2026
- 1:13 pm
పోట్లగిత్తల బరిలో ట్రాన్స్జెండర్… ఎద్దుల పోటీల్లో ప్రత్యేక ఆకర్షణ
మార్కాపురం జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో సీనియర్, కొత్త, పాలపళ్ళ విభాగాల్లో ఎడ్లను పోటీకి దింపుతున్నారు. అయితే ఈ పోటీల్లో ...
- Fairoz Baig
- Updated on: Apr 9, 2026
- 1:27 pm
Andhra: “నాన్న జాగ్రత్త” అంటూ చేతిపై రాసుకున్న యువతి.. ఆపై..
పామూరులో విషాదం చోటుచేసుకుంది. సన్నిహితంగా ఉన్న వ్యక్తి బెదిరింపులకు భయపడి యువతి మాధవి ప్రాణాలు తీసుకుంది. అభ్యంతరకర ఫోటోలు బయటపెడతానని వేధింపులు చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె, “నాన్న జాగ్రత్త” అంటూ అరచేతిపై రాసుకుని ఉరి వేసుకోవడం హృదయాలను కలిచివేస్తోంది.
- Fairoz Baig
- Updated on: Apr 6, 2026
- 6:51 am
Andhra News: వీడేం దొంగరా బాబు.. పీఎస్ ఎదుట రూ.5లక్షల చోరీ.. సీసీ ఫుటేజ్ చూసి..
అది ఎప్పుడూ రద్దీగా ఉండే ఏరియా.. అక్కడో పోలీస్ స్టేషన్ చూట్టూ ఎప్పుడూ పోలీసుల నిఘా అలాంటి చోటే కొందరు దొంగలు తమ ప్రతాపాన్ని చూపించారు. ఏకంగా పోలీస్ స్టేషన్ ముందున్న బట్టల షోరూంను టార్గెట్ చేశారు. రేకుల షెడ్డును కట్ చేసి లోపలికి చొరబడి, లక్షల రూపాయల నగదుతో ఉడాయించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఈ సంచలన చోరీ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
- Fairoz Baig
- Updated on: Apr 5, 2026
- 2:59 pm
Andhra: గాడిద మాంసం పేరుతో ఏం అమ్ముతున్నారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
ఒంగోలు శివారులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గాడిద మాంసం పేరుతో గుర్రాలను కోసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. మంగమూరు రోడ్డులో అర్ధరాత్రి దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. బాపట్ల జిల్లా నుంచి గుర్రాలను తెచ్చి గాడిద మాంసంగా అమ్ముతూ భారీగా డబ్బులు దండుకుంటున్నట్టు విచారణలో తేలింది.
- Fairoz Baig
- Updated on: Apr 5, 2026
- 2:37 pm
పేరుకు ఫ్యాన్సీ వ్యాపారం.. కానీ లోపల బంగారం తాకట్టు దందా!
ప్రకాశం జిల్లా అద్దంకిలో అక్రమ బంగారం తాకట్టు దందా వెలుగు చూసింది... పేదల బంగారం తాకట్టుకని వడ్డీకి డబ్బులు ఇచ్చిన కిరాణా వ్యాపారి తమ నగలు మాయం చేసి బెదిరిస్తున్నాడంటూ ఆగ్రహంతో ఆందోళనకు దిగారు.. అక్రమంగా బంగారం తాకట్టు పెట్టుకుని వడ్డీవ్యాపారం చేస్తున్న కిరాణా షాపు యజమాని దుకాణం ముందు పేద మహిళలు ఆందోళనకు దిగడంతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.
- Fairoz Baig
- Updated on: Mar 31, 2026
- 5:09 pm
గ్యాస్ కొరత.. బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు.. జనం గగ్గోలు.. ఎక్కడంటే
Gas shortage News in telugu: ఒంగోలులో వంట గ్యాస్ కొరత తీవ్రంగా మారింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం గ్యాస్ సరఫరాపై పడింది. ఎక్కడా వంట గ్యాస్కు కొరత లేదని ప్రభుత్వాలు ప్రకటిస్తుండగా, సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- Fairoz Baig
- Updated on: Mar 30, 2026
- 3:47 pm
Andhra: వానరం అయితేనేం.. అచ్చం మనిషిలానే ఆలోచిస్తుంది.. వీడియో చూస్తే మైండ్ బ్లోయింగ్..
భక్తులు దేవుడికి నైవేథ్యం పెడతారు.. అయితే, కొన్ని సందర్భాల్లో వానరాలకు ఆహారం పెట్టకపోయినా.. ఏమైనా తినే పదార్థాలు చూసినా.. కొన్ని చోట్ల భక్తుల చేతుల్లోనుంచి లాగేసుకుంటాయి. కానీ ప్రకాశం జిల్లా సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ఓ వానరం వింత ప్రవర్తన భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ వానరం భక్తుల చేతుల్లో నుంచి తినుబండారాలు లాక్కోదట.. ప్రేమగా ఇస్తే మొహమాటపడుతూ తీసుకుంటుందట.. ఆ తరువాత ఎంతో ఇష్టంగా దేవుని ప్రసాదంలా నిదానంగా తినేస్తుందట.. ప్రస్తుతం ఈ వానరం వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- Fairoz Baig
- Updated on: Mar 30, 2026
- 2:04 pm