ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. వార్తలో రిపోర్టర్ గా 1999లో కెరీర్ ప్రారంభం అయింది. 1999 నుంచి 2003 అక్టోబర్ వరకు వార్తలో రిపోర్టర్గా పనిచేశాను… ఆ తరువాత వెంటనే అదే నెలలో వార్తకు రిజైన్ చేసి 2003 అక్టోబర్లో tv9 ఛానల్ ఎయిర్లోకి రాకముందు ఐవిజన్ పేరుతో ప్రకాశంజిల్లా రిపోర్టర్గా జాయిన్ అయ్యాను… tv9 ఎయిర్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రకాశంజిల్లా tv9 రిపోర్టర్గా పనిచేస్తున్నారు… ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Andhra Pradesh: బుల్లెట్ బండి కోసం ఆటో నిండా పైసలతో షోరూమ్కు.. అసలు ట్విస్ట్ మామూలుగా ఉండదు..
బుల్లెట్ బైక్ కొనాలన్నది అతని చిన్ననాటి కల. కానీ జేబులో చూస్తే రూపాయి లేదు. అయినా సరే పట్టుదల వీడకుండా ఏకంగా మూడేళ్ల పాటు చేపల వ్యాపారంలో వచ్చిన పది రూపాయల నాణేలన్నింటినీ దాచి పెట్టాడు. చివరికి ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 220 కేజీల బరువున్న 3 లక్షల కాయిన్స్ను ఆటోలో షోరూమ్కు తీసుకెళ్లి, అందరూ నోరెళ్లబెట్టేలా దర్జాగా బుల్లెట్ బండిని ఇంటికి తెచ్చుకున్నాడు
- Fairoz Baig
- Updated on: May 23, 2026
- 8:16 pm
Andhra: అడవిలో తవ్వుతుండగా బయటపడ్డ లంకెబిందెలు… వాటి లోపల..
మార్కాపురం జిల్లా గిద్దలూరు టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల వ్యవహారం కలకలం రేపుతోంది. అటవీశాఖ అధికారులు, ట్రైబల్ వాచర్ల సహాయంతో తవ్వకాలు జరిపి లంకెబిందెలను వెలికితీశారన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పూర్తి వివరాలు కథనంలో ..
- Fairoz Baig
- Updated on: May 20, 2026
- 1:30 pm
అదే పనిగా అరుస్తున్న కోళ్లు.. ఏంటా అని చూడగా.. వామ్మో 5 అడుగులు.. గుండె ఆగేంతపనైంది..
మార్కాపురం జిల్లా కంభం మండలం నల్లకాలువ గ్రామంలో ఓ కోళ్ల ఫారంలో 5 అడుగుల నాగుపాము కలకలం రేపింది. కోళ్లకు దాణా వేయడానికి వెళ్లిన యజమానికి కోళ్లు అసాధారణంగా అరుస్తుండటంతో అనుమానం వచ్చి పరిశీలించగా, ఓ మూలన బుసలు కొడుతూ నాగుపాము కనిపించింది. భయంతో వెంటనే గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
- Fairoz Baig
- Updated on: May 17, 2026
- 6:45 pm
Andhra Pradesh: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలి బూడిదైన కావేరి ట్రావెల్స్ బస్సు..!
Andhra Pradesh: తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బస్సు ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం భీమవరం అడ్డరోడ్డు వద్దకు చేరుకుంది. ఆ సమయంలో బస్సు వెనుక టైరు నుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ సుభాష్ గమనించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన బస్సును రోడ్డు పక్కన..
- Fairoz Baig
- Updated on: May 15, 2026
- 9:24 am
అంధురాలు.. పైగా వివాహిత.. ఆమెను ట్రాప్ చేసి లాడ్జ్కు.. ఆపై..
ఒంగోలులో అంధురాలైన వివాహిత మహిళను సమీప బంధువు లాడ్జికి రప్పించి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. జల వనరుల శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఆదిలక్ష్మి హత్య కేసులో వెంకటరమణ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా గుర్తించిన పోలీసులు అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. సహచరురాలి దారుణ హత్యపై ప్రత్యేక ప్రతిభావంతుల సంఘాల సభ్యులు ఆందోళన చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
- Fairoz Baig
- Updated on: May 14, 2026
- 12:32 pm
Watch: పొట్టేళ్ల పోటీలతో దద్దరిల్లిన మైదానం.. ఇలాంటి సీన్ మీరెప్పుడూ చూసుండరు!
ప్రకాశం జిల్లాలో పొట్టేళ్ల పందాలు హోరాహోరీగా సాగాయి. బల్లికురవ మండలం కొణిదన గ్రామంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పొట్టేళ్ల పోటీలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. నువ్వా-నేనా అన్నట్లు తలపడిన ఈ పొట్టేళ్ల పోరును చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. పందెం గెలిచిన పొట్టేళ్లకు, వాటి యజమానులకు నిర్వాహకులు భారీ నగదు బహుమతులతో సత్కరించారు.
- Fairoz Baig
- Updated on: May 12, 2026
- 2:29 pm
Andhra Pradesh: పెళ్లిలో పొట్టు పొట్టు కొట్టుకున్న బంధువులు.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారు..
పెళ్లి అంటే నూరేళ్ల పంట.. పచ్చని పందిట్లో వేదమంత్రాల సాక్షిగా జరగాల్సిన శుభకార్యం అది. కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ అయింది. వధువు, వరుడు ఒక్కటవుతున్న వేళ.. విందు భోజనంలో సాంబారులో ఉప్పు తక్కువైందన్న చిన్న కారణం చిలికి చిలికి గాలివానలా మారింది. మాట మాట పెరిగి రాళ్ల దాడుల వరకు వెళ్లింది. అసలు ఓ స్పూన్ ఉప్పు కోసం ఇంతటి ఘర్షణ ఎందుకు జరిగింది? అనేది తెలుసుకుందాం..
- Fairoz Baig
- Updated on: May 10, 2026
- 12:54 pm
Andhra Pradesh: బ్రహ్మం గారి మహిమేనా.. నరికినా లేచి నిలబడ్డ రావిచెట్టు.. ఎక్కడో తెలుసా..?
ప్రకృతి వింతా? లేక దైవ మహిమా? నరికేసి, వేళ్లతో సహా పెకిలించిన రావిచెట్టు రాత్రికి రాత్రే తిరిగి నిలబడటం ఇప్పుడు ప్రకాశం జిల్లాలో సంచలనంగా మారింది. బ్రహ్మంగారి ఆలయ ప్రతిష్ఠా వేళ మారెళ్ల గ్రామంలో జరిగిన ఈ అద్భుత దృశ్యం భక్తులను పరవశింపజేస్తోంది. 101 బిందెల జలాభిషేకం.. మహిళల జలహారతులతో ఆ ప్రాంతమంతా భక్తిమయంగా మారింది.
- Fairoz Baig
- Updated on: May 8, 2026
- 12:17 pm
సింగరకొండ ఆంజనేయుడు.. గుమ్మం దగ్గరే 99 అడుగుల మహావిగ్రహం! వాహన పూజలకు ఫేమస్ స్పాట్
Singarakonda Anjaneya Swamy: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ క్షేత్రం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద సుమారు 99 అడుగుల ఎత్తుతో ఉన్న అభయ ఆంజనేయ స్వామి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. హైవేపై వెళ్లే వాహనాలు ఇక్కడ ఆగి పూజలు చేయడం ఆనవాయితీగా ఉంది. సుదూరం నుంచే కనిపించే ఈ విగ్రహం ప్రయాణికుల్లో భక్తిభావాన్ని కలిగిస్తుంది.
- Fairoz Baig
- Updated on: May 7, 2026
- 3:40 pm
మరణంలోనూ వీడని బంధం.. ఏడు పదుల వయసులో ఓకే రాత్రి వృద్ద దంపతుల మృతి!
ఏడు పదుల వయసులోనూ ఆ వృద్ధ దంపతులు ఒకరికి ఒకరుగా నిలిచారు. ఇద్దరు కూతుళ్లు అత్తారింటికి వెళ్లిపోతే.. కడుపున పుట్టిన కొడుకు కానరాకుండాపోయాడు. ఎవరూ తోడులేక.. అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న ఆ దంపతులకు మరణం ఓ వరంలా ఒకే రోజు పలకరించింది. తెల్లారేసరికి తమ ఇంట్లోనే విగతజీవులుగా పడి ఉన్నారు..
- Fairoz Baig
- Updated on: May 7, 2026
- 3:27 pm
డబ్బులు ఎక్కువ ఉంటే బంగారం కొనుక్కోండి.. పిల్లల్ని మాత్రం ఈ గవర్నమెంట్ స్కూల్లో చేర్చండి
బాపట్ల జిల్లా ప్రైడ్.. మక్కెనవారిపాలెం జెడ్పీ హైస్కూల్.. చదలవాడ సాయిరామ్ ధీరజ్ ఏకంగా 586 మార్కులు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచాడు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 18 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించి మండలంలోనే రికార్డు సృష్టించారు. 100కు 100 మార్కులు సాధించిన విద్యార్థులతో ఈ బడి ఇప్పుడు సరస్వతీ నిలయంగా మారింది.
- Fairoz Baig
- Updated on: May 5, 2026
- 2:09 pm
హైవేపై వేగంగా వెళ్తున్న లారీ.. ఒక్కసారిగా టైర్ బ్లాస్ట్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ప్రకాశం జిల్లాలోని జాతీయ రహదారి 16పై కోరిశెపాడు వద్ద వేగంగా వెళ్తున్న లారీ టైర్ బ్లాస్ట్తో అదుపుతప్పి కాలవలోకి దూసుకెళ్లింది. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన గంటపాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. అధికారులు, స్థానికులు సకాలంలో స్పందించడంతో.. ఈ ఘటనలో డ్రైవర్కు పెను ప్రమాదం తప్పింది.
- Fairoz Baig
- Updated on: May 2, 2026
- 1:09 pm