ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. వార్తలో రిపోర్టర్ గా 1999లో కెరీర్ ప్రారంభం అయింది. 1999 నుంచి 2003 అక్టోబర్ వరకు వార్తలో రిపోర్టర్గా పనిచేశాను… ఆ తరువాత వెంటనే అదే నెలలో వార్తకు రిజైన్ చేసి 2003 అక్టోబర్లో tv9 ఛానల్ ఎయిర్లోకి రాకముందు ఐవిజన్ పేరుతో ప్రకాశంజిల్లా రిపోర్టర్గా జాయిన్ అయ్యాను… tv9 ఎయిర్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రకాశంజిల్లా tv9 రిపోర్టర్గా పనిచేస్తున్నారు… ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
బాలినేని శ్రీనివాసులురెడ్డి అవినీతి వ్యవహారాలపై విచారణ జరిపిస్తాంః ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్
మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసులురెడ్డి అవినీతి వ్యవహారాలపై విచారణ జరిపిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ప్రకటించారు. తనపై అవాకులు, చవాకులు పేలితే కొవ్వు దించుతామని హెచ్చరించారు దామచర్ల.
- Fairoz Baig
- Updated on: Jul 16, 2024
- 8:49 am
Watch Video: సర్టిఫికేట్ల కోసం వచ్చిన విద్యార్థి.. స్పృహ కోల్పోవడంతో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ఒంగోలులో డ్రగ్స్ కల్చర్ రాజ్యమేలుతుందా.. ముఖ్యంగా విద్యార్దులే ఈ డ్రగ్స్ ఉచ్చులో పడి విలవిల్లాడుతున్నారా.. ఒంగోలులో ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఓ నీట్ అకాడమీ సెంటర్లో కోచింగ్ తీసుకున్న హర్షవర్డన్ అనే విద్యార్ది తన సర్టిఫికెట్ల కోసం వచ్చి స్పృహతప్పి పడిపోయాడు. తల్లిదండ్రులకు సమాచారం అందడంతో అతడిని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు.
- Fairoz Baig
- Updated on: Jul 14, 2024
- 8:35 am
ఒక్క మాటకే ఇంత దారుణమా..! క్లాస్రూంలో ప్రిన్సిపల్ను కత్తితో పొడిచి చంపిన విద్యార్థి
ఆయనో అధ్యాపకుడు.. పిల్లలకు చదువు చెప్పి దారి చూపే నిర్దేశకుడు. ఒంగోలు నుంచి అస్సాంకు వెళ్ళి అక్కడి విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అయితే విధి వక్రీకరించింది. తాను విద్యాబుద్ధులు నేర్పిన ఓ సైకో విద్యార్ది చేతిలో ఆ అధ్యాపకుడు హత్యకు గురయ్యాడు.
- Fairoz Baig
- Updated on: Jul 9, 2024
- 3:37 pm
Andhra Pradesh: ఆడపిల్లలు పుట్టడమే శాపమా?.. గుండెల్ని పిండేస్తున్న ఘటన.. భర్త చనిపోయిన నెలకే..
ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిందన్న కారణంగా ఓ వివాహితను అత్తింటివారు ఇంట్లోకి రానివ్వలేదు. ఇప్పటికే మొదటి కాన్పులో ఓ ఆడపిల్ల ఉండగా ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త ఇటీవల ప్రమాదంలో చినిపోయాడు. భర్త చనిపోయి పుట్టెడు దుఖంలో ఉంటే మరోవైపు రెండో కాన్పులో ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారన్న సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారంటూ ఆ బాలింతను అత్తమామలు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో తన ముగ్గురు ఆడపిల్లలతో ఆ తల్లి అత్తింటి ముందు మౌనపోరాటానికి దిగింది.
- Fairoz Baig
- Updated on: Jul 8, 2024
- 10:29 am
అలా చేయోద్దని మందలించిన తల్లి.. మనస్థాపంతో ఆ అమ్మాయి ఏం చేసిందంటే..
తల్లి మందలించిందన్న మనస్థాపంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. నిండా 15 ఏళ్ళు కూడా నిండని ఆ బాలిక ఓ యువకుడితో సన్నిహితంగా ఉండటాన్ని చూసిన తల్లి మందలించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ బాలిక ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలతో బాలిక మృతి చెందడంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు మందలించడం పరిపాటే అయినా దాన్ని ఇంత సీరియస్గా తీసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది.
- Fairoz Baig
- Updated on: Jul 4, 2024
- 12:55 pm
హృదయవిదారక ఘటన.. ఛీ..ఛీ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా..
ఒంగోలు కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు డబ్బా పట్టుకుని తమకు ఆత్మహత్యే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈ వృద్ద దంపతుల కష్టం ఏ తల్లిదండ్రులకు రాకూడదు. కనిపెంచిన కొడుకే ఇంటి నుంచి గెంటేయడంతో దిక్కుతోచని స్థితిలో ఒంగోలు కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమంలో కొడుకు, కోడలిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. తమకు న్యాయం జరగకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాల్సిందేనంటూ కన్నీళ్ళ పర్యంతమయ్యారు. ప్రకాశంజిల్లా అర్ధవీడు మండలం రంగాపురం గ్రామానికి చెందిన కిల్లే పెద్ద ఫకీరయ్య, సుబ్బమ్మ దంపతులు.
- Fairoz Baig
- Updated on: Jul 1, 2024
- 1:51 pm
వామ్మో మింగేస్తున్న సముద్రం.. ఆ బీచ్కు వెళితే.. అంతే సంగతులు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాముఖ్యం సంతరించుకున్న బాపట్లజిల్లాలోని రామాపురం బీచ్లో విహారయాత్రలు విషాదయాత్రలుగా మారుతున్నాయి. రెండు వారాల వ్యవధిలో ఇక్కడ బీచ్లో విహారయాత్రలకు వచ్చిన ఆరుగురు విద్యార్దులు సముద్రపు అలల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. తాజాగా ఈరోజు శుక్రవారం నలుగురు విద్యార్ధులు సముద్రంలో ఈతకు వెళ్ళి గల్లంతైతే వీరిలో ముగ్గురు విద్యార్ధుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో విద్యార్ది మృతదేహం లభ్యం కాలేదు. దీంతో రామాపురం బీచ్.. విహారయాత్రలకు వచ్చే విద్యార్ధులకు మృత్యుసముద్రంగా మారిపోయింది.
- Fairoz Baig
- Updated on: Jun 21, 2024
- 8:50 pm
యువతిపై దారుణం.. అత్యాచారం, హత్య కేసులో సీఎం సీరియస్.. రంగంలోకి హోం మంత్రి..
బాపట్ల జిల్లా చీరాల మండలం ఇపురుపాలెం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. రైలు పట్టాల సమీపంలో బహిర్ భూమికి వెళ్లిన 21 ఏళ్ల యువతిపై గుర్తుతెలియని యువకులు అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. యువతి మృతి దేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చీరాల డీఎస్పీ, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈపురుపాలెం సీతారాంపేటకు చెందిన పముజుల సుచరిత (21) అనే యువతిగా గుర్తించి వారి బంధువుల నుంచి వివరాలు సేకరించారు.
- Fairoz Baig
- Updated on: Jun 21, 2024
- 6:05 pm
నడిరోడ్డుపై ఓ పెద్ద గుంత.. ఏముందో తెలుసుకునేందుకు అలా చేసిన స్థానికులు..
ప్రకాశంజిల్లాలో నడిరోడ్డుపై ఏర్పడిన ఓ పెద్ద గుంత ఆసక్తిగా మారింది. సాధారణంగా పూర్వ కాలంలో నిధి నిక్షేపాలను భూమిలోపల దాచుకుంటారని విన్నాం. కొన్ని చోట్ల చూశాం. అటువంటి మన పరిసర ప్రాంతాలలో భూమి లోపల నిక్షేపాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునేందుకు ఆసక్తి, ఉత్సాహం చూపిస్తూ ఉంటారు కొందరు. కొన్ని ప్రాంతాలలో అలాంటివి అరుదుగా కనిపిస్తుంటాయి. మరికొన్ని ప్రాంతాలలో మన పూర్వీకులు విలువైన వస్తువులు, ధాన్యం, ఆహార పదార్ధాలు భద్రపరుచుకునేందుకు కొన్ని గుంతలను తీస్తూ ఉంటారు.
- Fairoz Baig
- Updated on: Jun 19, 2024
- 8:38 pm
Andhra Pradesh: వైసీపీ కంచుకోటలో చరిత్ర తిరగరాసిన మాగుంట.. ఎట్టకేలకు ఎగిరిన టీడీపీ జెండా
తెలుగుదేశం పార్టీకి ఒంగోలు పార్లమెంట్ స్థానం కొరకరాని కొయ్యగా ఉంటూ వచ్చింది. ఎంపిగా పోటీ చేయడానికి ఇక్కడ టిడిపి నుంచి అభ్యర్దులు ముందుకు రారట... ఇది ఈ ఒక్కసారికాదట... ప్రతిఎన్నికల్లో ఇదేతంతు నడుస్తుందట.. టీడీపీ ఆవిర్భావం నుంచి 2019 వరకు ఇక్కడ పదిసార్లు ఎన్నికలు జరిగితే కేవలం రెండుసార్లు మాత్రమే టీడీపీ గెలవడంతో ఇక్కడ టిడిపి...
- Fairoz Baig
- Updated on: Jun 8, 2024
- 9:44 pm
తీరని బాలుడి కోరిక.. తల్లిదండ్రులకు మిగిలిన కడుపు కోత..
చిన్న చిన్న విషయాలకే చిన్నారులు ప్రాణాలు తీసుకుంటున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. మారిన కాలనుగుణంగా తల్లితండ్రులు తమ పిల్లల కోసం ఏదో చేద్దామని, ఎంతో సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ పిల్లల కోసమే జీవిస్తున్నారు. వారికి కోరింది అందించేందుకు తల్లితండ్రులు పడని కష్టమే లేదు. కానీ కొంతమంది చిన్నారులు తల్లిదండ్రులు తాము కోరింది ఇవ్వకపోతే ప్రాణాలు తీసుకునేందుకు వెనుకాడడం లేదు. ఫలితంగా తల్లితండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు.
- Fairoz Baig
- Updated on: May 31, 2024
- 11:43 am
ఆ జిల్లాలో జోరుగా సాగుతున్న పొలిటికల్ పందేలు.. తెరవెనుక ఉన్నది వీళ్లే..
ఒంగోలు అసెంబ్లీ సెగ్మెంట్లో గెలుపుపై పందెం రాయుళ్లు రోజుకో కొత్త ఆఫర్లతో రెచ్చిపోతున్నారు. పోలింగ్ జరిగిన మే 13 సాయంత్రం నుంచి మొదలైన ఈ పందెం గోల రోజురోజుకు కొత్త కొత్త ఆఫర్లతో ఆకట్టుకునేందుకు పలు రకాల పందేలను కాస్తున్నారట. పోలింగ్ రోజు సాయత్రం ఒకటికి ఒకటి అన్నట్టుగా మొదలైన పందేలు రానురాను ఒకటికి రెండు అన్నట్టుగా మారిపోయాయి.
- Fairoz Baig
- Updated on: May 26, 2024
- 5:28 pm