ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. వార్తలో రిపోర్టర్ గా 1999లో కెరీర్ ప్రారంభం అయింది. 1999 నుంచి 2003 అక్టోబర్ వరకు వార్తలో రిపోర్టర్గా పనిచేశాను… ఆ తరువాత వెంటనే అదే నెలలో వార్తకు రిజైన్ చేసి 2003 అక్టోబర్లో tv9 ఛానల్ ఎయిర్లోకి రాకముందు ఐవిజన్ పేరుతో ప్రకాశంజిల్లా రిపోర్టర్గా జాయిన్ అయ్యాను… tv9 ఎయిర్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రకాశంజిల్లా tv9 రిపోర్టర్గా పనిచేస్తున్నారు… ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Andhra: మీరు సార్ మనిషంటే..? రోడ్డుపై గుంత కనిపిస్తే చాలు… ఆయన వాలిపోతాడు
ఆయన పేరు పాపసాని కిచ్చారెడ్డి. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన కిచ్చారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రిటైర్డ్ అయ్యారు. రిటైర్ అయిన తరువాత ఆయన ఖాళీగా కూర్చోకుండా తనకు తెలిసిన బేల్దారి పని చేయడం ప్రారంభించాడు. అంటే ఇళ్లు కట్టి రోజువారి కూలి తీసుకోవడం కాదు. తానే ఎదురు డబ్బులు పెట్టి పనులు చేయడం... ఇదే ఇక్కడ విశేషం...
- Fairoz Baig
- Updated on: Dec 4, 2025
- 8:51 pm
Andhra: మరీ పిన్నీసుతో ఎలా రా బాబు..! యూట్యూబ్లో పాఠాలు చూసి ఇద్దరు యువకులు ఏం చేశారంటే..
యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫాంలను ఉపయోగించుకుని కొంతమంది విద్యార్ధులు పాఠాలు నేర్చుకుంటుంటే.. మరికొంతమంది చోరకళను అభ్యసించడంలో ఆరితేరుతున్నారు.. జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం యూట్యూబ్లో బైక్లు చోరీ చేయడం ఎలా అన్న విద్యను అభ్యసించాడో చోరకళా శిఖామణి.. కేవలం ఒక్క పిన్నీసుతో బైక్లను స్టార్ట్ చేసి ఎత్తుకెళుతున్నారు అన్నదమ్ములు..
- Fairoz Baig
- Updated on: Dec 3, 2025
- 7:18 pm
Viral News: మీ గొడవ గోదాట్లో కొట్టుకెళ్ళ.. మనిషితో పాటు బస్సు తగలెట్టారేంట్రా.. ఎక్కడంటే?
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి గ్రామంలో స్కూలు బస్సు డ్రైవర్, క్లీనర్ మధ్య చోటు చేసుకున్న వివాదం బస్సును తగలబెట్టే వరకు వెళ్ళింది.ఈ ఘటనలో బస్సు డ్రైవర్ నబి కి తీవ్ర గాయాలుకావడంతో స్థానికులు అతన్ని హాస్పిటల్కు తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Fairoz Baig
- Updated on: Dec 2, 2025
- 3:05 pm
Andhra News: ముగ్గురు ప్రాణాలు రక్షించిన ఒకే ఒక్కడు.. మరో ఇద్దరిని కాపాడేలోపే..
సీపీఆర్ ప్రిక్రియ తెలియడం ఎంత ముఖ్యలో ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక సంఘటన మనకు కళ్లకు కట్టినట్టు చూపించింది. క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఐదుగురు వ్యక్తులు కరెంట్ షాక్కు గురయ్యారు. అయితే అక్కడే ఉన్న వ్యక్తి సీపీఆర్ చేసి ముగ్గురు ప్రాణాలు కాపాడగా.. సరైన సమయంలో చికిత్స అందక మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రక్రియ తెలిసిన మరో వ్యక్తి ఉండి ఉంటే ఆ ఇద్దరు కూడా బ్రితికేవారని స్థానికులు చెబుతున్నారు.
- Fairoz Baig
- Updated on: Dec 2, 2025
- 12:33 pm
Andhra: అర్ధరాత్రి అలికిడి.. ఏముందో అని చూడగా గుండె గుభేల్
బాపట్ల జిల్లా అద్దంకి పట్టణం సమీపంలోని గుండ్లకమ్మ నది నుంచి బయటకు వచ్చిన ఓ కొండ చిలువ కలకలం రేపింది. అద్దంకి - దర్శి రోడ్డులో జనావాసాల్లోకి అర్ధరాత్రి కొండచిలువ రావడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ, పోలీసులకు సమాచారం అందించారు.
- Fairoz Baig
- Updated on: Dec 1, 2025
- 2:07 pm
Prakasam: ఏపుగా పెరిగిన మిర్చి పంట నుంచి ఎన్నడూ రాని ఘాటు వాసన.. పోలీసులు వెళ్లి చూడగా..
ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో మళ్లీ అంతరపంటగా గంజాయి సాగు బయటపడింది. మిర్చి పొలాల్లో దాగుడుమూతలు ఆడిన గంజాయి మొక్కలను ఎక్సైజ్ అధికారులు పట్టుకుని ధ్వంసం చేశారు. . దోర్నాల మండలం జమ్మి దోర్నాలలో రాజబాబు అనే రైతు మిర్చి పంట మధ్య గంజాయిని పెంచుతున్నట్టు గుర్తించడంతో అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
- Fairoz Baig
- Updated on: Nov 30, 2025
- 7:33 pm
పెళ్లిలో వధువు రూమ్ దగ్గర తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. ఒక్కసారిగా అలజడి..
పెళ్ళి మండపాల్లో చోరీలు కామనే.. అయినా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున నగదు, నగలు అపహరించుకుని వెళ్ళే ముఠాల ఆగడాలు ఎక్కువయ్యాయి.. పెళ్ళిళ్ళలో ఎవరి హడావిడిలో వారుంటే దొంగలు మాత్రం అందినకాడికి దోచుకుని తట్టాబుట్టా సర్దేస్తున్నారు.. ఇలాంటిదే ఓ ఘటన ఒంగోలులో చోటు చేసుకుంది.
- Fairoz Baig
- Updated on: Nov 30, 2025
- 1:22 pm
ఎంత కరువు పట్టి ఉన్నార్రా.. రైల్లో ఏసి బోగీలు కూడా వదలరా.. పట్టించిన ర్యాపిడో సవారీ..!
నవంబర్ 13వ తేదీ.. అర్ధరాత్రి.. చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలపై వేగంగా దూసుకెళుతోంది. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు తన కుటుంబంతో వెళుతున్న బెంగుళూరుకు చెందిన కోదండరామిరెడ్డి గాఢ నిద్రమత్తులో ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత చీరాల - ఒంగోలు మధ్య కోదండరామిరెడ్డికి చెందిన బ్యాగును గుర్తు తెలియని వ్యక్తి తీసుకుని పరారయ్యాడు.
- Fairoz Baig
- Updated on: Nov 28, 2025
- 8:49 pm
Andhra: అమ్మాయి వరుడిగా, అబ్బాయి వధువుగా… వింత ఆచారం… ఎక్కడంటే.
ప్రకాశం జిల్లాలో శతాబ్దాల నాటి విశేష ఆచారాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక్కడ కొన్ని గ్రామాల్లో పూజల సమయంలో పురుషులు ఆడవారి వేషాల్లోకి, మహిళలు మగవారి వేషాల్లోకి మారడం ప్రత్యేక సంప్రదాయంగా ఉంది. యర్రగొండపాలెం మండలంలోని కొలుకుల గ్రామంలో అయితే వధూవరులు కూడా పెళ్లికి ముందే ఒకరోజు పాటు పాత్రలు మార్చుకుని తమ ఇష్టదైవానికి పూజలు చేస్తారు. వధువు వరుడిలా, వరుడు వధువులా అలంకరించుకుని ఊరేగింపు జరిపే ఈ ఆచారం తరతరాలుగా కొనసాగుతోంది.
- Fairoz Baig
- Updated on: Nov 28, 2025
- 7:42 pm
Prakasam District: మోసగాళ్లకు మోసగాళ్లు… బంగారం వ్యాపారులకే బొమ్మ చూపించారు కదరా..
తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు మరొకడు ఉంటాడట... అచ్చం అలాగే ఉంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరిగిన ఘటనలు చూస్తుంటే... చీరాలలో ఓ బంగారు నగల వ్యాపారి తూకం ఎక్కువ, బంగారం తక్కువ ఇచ్చి వినియోగదారుల్ని మోసం చేస్తే... త్రిపురాంతకం, దొనకొండ ప్రాంతాల్లో నకిలీ బంగారం కుదువ పెట్టి లక్షల్లో మోసం చేసి పారిపోయారు ఇద్దరు ఘరానా మోసగాళ్లు. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు బంగారం వ్యాపారులు.. దీన్నే చెడపకురా, చెడేవు అంటారు మరి.
- Fairoz Baig
- Updated on: Nov 27, 2025
- 8:02 pm
Andhra: కూతురు వయసు విద్యార్ధినిపై, ఛ… గురువుల పరువు తీశావు కదరా…
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో ప్రభుత్వ కళాశాలలో క్లాసులు చెప్పే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థినిపై అసభ్య ప్రవర్తనకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. విషయం తెలియడంతో గ్రామస్తులు ఆ గురువుకు దేహశుద్ధి చేసి పాఠశాల నుంచి పంపేశారు. బాధిత బాలిక తండ్రి లేకపోవడం, తల్లి మూగ కావడంతో గ్రామం మొత్తం ఆమెకు అండగా నిలిచింది.
- Fairoz Baig
- Updated on: Nov 26, 2025
- 9:00 pm
Andhra: ఆరు గ్రాముల చైన్.. ఆరున్నర గ్రాములు తూగింది.. ఆరా తీయగా దెబ్బకు కంగుతిన్నారు
బంగారం ధరలకు రెక్కలు రావడంతో వ్యాపారులకు దురాశ ఎక్కువైనట్టుంది. తూకంలో మోసాలకు పాల్పడుతూ వినియోగదారులను అండినకాడికి దోచుకుంటున్నారు. అందరూ కాకపోయినా కొందరు మాత్రం దర్జాగా కొనుగోలుదారుల కళ్ళెదుటే వేయింగ్ మిషన్ కనికట్టుతో మోసాలకు పాల్పడుతున్నారు. బాపట్లజిల్లా చీరాలలో ఓ నగల దుకాణంలో ఇలాంటి ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.
- Fairoz Baig
- Updated on: Nov 26, 2025
- 12:17 pm