Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fairoz Baig

Fairoz Baig

Senior Staff Reporter - TV9 Telugu

fairoz.baig@tv9.com

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. వార్తలో రిపోర్టర్ గా 1999లో కెరీర్ ప్రారంభం అయింది. 1999 నుంచి 2003 అక్టోబర్‌ వరకు వార్తలో రిపోర్టర్‌గా పనిచేశాను… ఆ తరువాత వెంటనే అదే నెలలో వార్తకు రిజైన్‌ చేసి 2003 అక్టోబర్‌లో tv9 ఛానల్‌ ఎయిర్‌లోకి రాకముందు ఐవిజన్‌ పేరుతో ప్రకాశంజిల్లా రిపోర్టర్‌గా జాయిన్‌ అయ్యాను… tv9 ఎయిర్‌లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రకాశంజిల్లా tv9 రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు… ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Andhra: భద్రాద్రి రామయ్య కల్యాణం కోసం.. చీరాల నుంచి 10 టన్నుల గోటి తలంబ్రాలు

Andhra: భద్రాద్రి రామయ్య కల్యాణం కోసం.. చీరాల నుంచి 10 టన్నుల గోటి తలంబ్రాలు

భద్రాచలంలోని సీతారాముల వారి కల్యాణాన్ని జగత్ కల్యాణంగా అభివర్ణిస్తుంటారు. అటువంటి జగత్ కల్యాణానికి ఎంతైయితే ప్రత్యేకత ఉందో... ఆ కల్యాణ వేడుకలకు వినియోగించే కోటి గొటి తలంబ్రాలకు కూడా అంతే ప్రత్యేకత ఉంది. అటువంటి కోటి గోటి తలంబ్రాలను సిద్ధం చేస్తూ పునీతులవుతున్నారు బాపట్ల జిల్లాలోని చీరాల ప్రాంత భక్తులు. ఇంతకీ ఆ తలంబ్రాల విశిష్టత ఏంటి...? ఎలా సిద్ధం చేస్తున్నారు...? ఆ విశేషాలేంటో ఓసారి తెలుసుకుందాం..

Andhra Pradesh: జిల్లా కలెక్టర్ చొరవతో తెంచుకున్న బానిస సంకెళ్లు.. 33 మందికి విముక్తి..!

Andhra Pradesh: జిల్లా కలెక్టర్ చొరవతో తెంచుకున్న బానిస సంకెళ్లు.. 33 మందికి విముక్తి..!

వారంతా రోజువారీ కూలీలు. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఉపాధి కల్పిస్తామని ఆశ చూపి వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. వారి అమాయకత్వాన్ని అదునుగా చేసుకొని బానిసత్వంలో బంధించారు. అయినవారికి, ఉన్న ఊరికి దూరంగా దీనస్థితిలో కాలం వెళ్లదీస్తున్న ఏడు కుటుంబాలకు ప్రకాశం జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా చొరవతో విముక్తి లభించింది.

Andhra Pradesh: ఛీ ఛీ వీడు అసలు మనిషేనా.. పాఠాలు చెప్పాల్సింది పోయి పాడు పనులు..!

Andhra Pradesh: ఛీ ఛీ వీడు అసలు మనిషేనా.. పాఠాలు చెప్పాల్సింది పోయి పాడు పనులు..!

కనిగిరి జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై పోలీసులు బాధిత విద్యార్ధిని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు రంగారెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో జరిగిన లైంగిక వేధింపుల వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని కనిగిరి ఇన్‌చార్జి సిఐ భీమా నాయక్‌ తెలిపారు.

Weather: ఇదేం వాతావరణం బాబోయ్..! ఉదయం మంచు తెర… ఆ తరువాత భానుడి సెగ..!

Weather: ఇదేం వాతావరణం బాబోయ్..! ఉదయం మంచు తెర… ఆ తరువాత భానుడి సెగ..!

ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటలకు ఉక్కపోత మొదలవుతోంది. వేకువ జామున పొగమంచు కమ్మేస్తుంది. ఉదయం ఎనిమిది గంటల కల్లా ఎండ తీవ్రత మొదలవుతుంది. ఒక్కసారిగా వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకోవడం.. ఉదయం దుప్పటి మంచు, ఆ తరువాత భానుడు తన ప్రతాపం చూపించటంతో మద్యాహ్నం12 గంటలకు ఎండ తీవ్రత పెరిగి రహదారులు నిర్మానుషంగా మారుతున్నాయి.

Prakasam District: సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!

Prakasam District: సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!

Andhra Pradesh: వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి వస్తున్న అర్జీదారులకు సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇస్తున్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలోకి ప్రవేశించిన వారికి “ మీ సమస్య చెప్పండి . . అర్జీ రాస్తాం” అంటూ వారిని కూర్చోబెట్టి మాట్లాడటం దగ్గర నుంచి సంబంధిత శాఖ ఉన్నతాధికారుల దగ్గరకు, తరువాత కలెక్టరు..

టెన్త్‌ క్లాస్‌ ఎగ్జామ్స్‌..! విద్యార్థులకు మంచి టిప్స్ ఇచ్చిన ఐఏఎస్‌ ఆఫీసర్‌

టెన్త్‌ క్లాస్‌ ఎగ్జామ్స్‌..! విద్యార్థులకు మంచి టిప్స్ ఇచ్చిన ఐఏఎస్‌ ఆఫీసర్‌

ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారి, పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థినులతో మాట్లాడి, వారిలో ధైర్యాన్ని నింపారు. పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సలహాలు ఇచ్చారు. ఉన్నత విద్యకు పదో తరగతి పరీక్షలు ఎంతో ముఖ్యమని వివరించారు. ప్రతి బాలిక కనీసం డిగ్రీ పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

AP News: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా

AP News: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా

దంపతులిద్దరూ ఓ ప్రాంతం నుంచి మరో చోటకు బైక్‌ పై వెళ్తున్నారు. వారి బైక్ కు ఉన్న హ్యాండిల్‌కు ఓ బ్యాగ్ ను తగిలించారు. అయితే కొద్ది దూరం వెళ్ళాక ఆ బైక్ కనిపించలేదు. అయ్యో.! అని కంగారుపడిపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే

AP News: 45 లక్షల ప్యాకేజితో ఉద్యోగం.. కట్ చేస్తే.. అంతలోనే గూడ్స్ రైలు పైకెక్కి..

AP News: 45 లక్షల ప్యాకేజితో ఉద్యోగం.. కట్ చేస్తే.. అంతలోనే గూడ్స్ రైలు పైకెక్కి..

ఆ వ్యక్తికి ఏమైందో.. ఏంటో..? తెలియదు.. కాచిగూడలో ట్రైన్ ఎక్కి గిద్దలూరు వెళ్లాడు. అక్కడ ఓ గూడ్స్ రైలు పైకి ఎక్కి.. ఏకంగా హై టెన్షన్ వైర్లు పట్టుకున్నాడు. వెంటనే అధికారులు ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన అతడు.. అసలు ఇలా ఎందుకు చేశాడు..

Andhra Pradesh: చరిత్ర సృష్టించబోతున్న ఏపీ మహిళా సంఘాలు.. గిన్నిస్‌ రికార్డు దిశగా..

Andhra Pradesh: చరిత్ర సృష్టించబోతున్న ఏపీ మహిళా సంఘాలు.. గిన్నిస్‌ రికార్డు దిశగా..

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓఎన్‌డీసీ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలు వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు.. ఆన్‌లైన్‌ ద్వారా చేసే ఈ డిజిటల్‌ మార్కెటింగ్‌ కోసం ఎలాంటి సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

రఘురామ కస్టడీ టార్చర్‌ కేసులో కీలక మలుపు! బీహార్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారికి ఏపీ పోలీసుల నోటీసులు

రఘురామ కస్టడీ టార్చర్‌ కేసులో కీలక మలుపు! బీహార్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారికి ఏపీ పోలీసుల నోటీసులు

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై సీఐడీ అధికారులు చేసిన హింస కేసులో మరో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌కు నోటీసులు జారీ అయ్యాయి. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇప్పటికే రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ మరియు ప్రైవేటు వ్యక్తి కామేపల్లి తులసిబాబును అరెస్ట్ చేశారు. ఈ కేసులో సునీల్ నాయక్ పాత్రను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

AP News: వామ్మో.! వీళ్లు మహాఘనులే.. ఈజీ మనీ కోసం ఏం చేశారో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

AP News: వామ్మో.! వీళ్లు మహాఘనులే.. ఈజీ మనీ కోసం ఏం చేశారో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

ప్రకాశంజిల్లా బేస్తవారిపేటలో అటవీశాఖ అధికారులు బెదిరింపులకు పాల్పడి తమ దగ్గర నుంచి 3.28 లక్షలు కాజేశారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. మార్కాపురం మండలం వేములకోటకు చెందిన సాయికుమార్‌ను అదే గ్రామానికి చెందిన కిషోర్, రాజేష్‌ రైస్ పుల్లింగ్ సంబంధించిన రాగి వస్తువు..

Janasena: వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. జనసేనలోకి 20 మంది కార్పోరేటర్లు

Janasena: వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. జనసేనలోకి 20 మంది కార్పోరేటర్లు

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒంగోలులో వైసీపీకి మరో షాక్‌ తగిలింది. ఒంగోలు కార్పొరేషన్‌లో 20 మంది కార్పొరేటర్లు, ఇద్దరు కో ఆప్షన్‌ మెంబర్లు వైసీపీ కండువాను మార్చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులుగా ముద్రపడిన వారంతా జనసేన చేరారు. బాలినేని ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు కార్పొరేటర్లు.