ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. వార్తలో రిపోర్టర్ గా 1999లో కెరీర్ ప్రారంభం అయింది. 1999 నుంచి 2003 అక్టోబర్ వరకు వార్తలో రిపోర్టర్గా పనిచేశాను… ఆ తరువాత వెంటనే అదే నెలలో వార్తకు రిజైన్ చేసి 2003 అక్టోబర్లో tv9 ఛానల్ ఎయిర్లోకి రాకముందు ఐవిజన్ పేరుతో ప్రకాశంజిల్లా రిపోర్టర్గా జాయిన్ అయ్యాను… tv9 ఎయిర్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రకాశంజిల్లా tv9 రిపోర్టర్గా పనిచేస్తున్నారు… ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Watch Video: ఇది కదా రేసంటే.. లైన్ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన.. విన్నరెవరంటే?
సంక్రాంతి సందర్భంగా బాపట్ల జిల్లా యర్రంవారిపాలెంలో జరిగిన వినూత్న రివర్స్ ట్రాక్టర్ డ్రైవింగ్ పోటీలు ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ పందాలకు భిన్నంగా జరిగిన ఈ పోటీల్లో డ్రైవర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కీర్తిశేషులు యర్రం వెంకటరెడ్డి జ్ఞాపకార్థం నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందించారు. గ్రామస్తులు ఉత్సాహంగా తిలకించిన ఈ పందెం, డ్రైవింగ్ మెలకువలకు కొత్త నిర్వచనం ఇచ్చింది.
- Fairoz Baig
- Updated on: Jan 14, 2026
- 9:56 pm
Andhra: వారెవ్వా.. భలే పోటీలు భయ్యా.. అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.. అమేజింగ్ వీడియో
ప్రకాశం జిల్లాలో సంక్రాంతి సందర్భంగా ఎడ్లపోటీలు, పొట్టేళ్ళ పోటీలకు దీటుగా సముద్రతీరంలో పడవ పోటీలు, ఈత పోటీలు నిర్వహించారు. కొత్తపట్నం మండలం మన్నూరు పెద్దపాలెం గ్రామంలో మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా సముద్రంలో మత్స్యకారుల పడవల పోటీలు, ఈతల పోటీల్లో పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.
- Fairoz Baig
- Updated on: Jan 14, 2026
- 1:56 pm
Sankranti Traditional Snacks: ఎల్లలు దాటిన సంక్రాంతి వంటకాలు.. దేశ, విదేశాల్లో తెలుగింటి గుమగుమలు
సంక్రాంతి అనగా గుర్తేది భోగి మంటలు, గాలిపటాలు, కొత్త అల్లుళ్లు, నోరూరించే పిండి వంటలు. కానీ ప్రస్తుత బిజీ జీవితంలో సంక్రాంతి సాంప్రదాయ పిండివంటలు తయారు చేసుకోవడం కష్టమైంది. ఈ నేపథ్యంలో ఇంటి తరహా వంటకాలకు, ముఖ్యంగా క్షీరపురి చీరాల పిండివంటలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. నాణ్యత, శుచి, శుభ్రత పాటిస్తూ తయారు చేసే అరిసెలు, కజ్జికాయలు వంటివి దేశ విదేశాల్లో ప్రఖ్యాతి పొంది, సంక్రాంతి పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
- Fairoz Baig
- Updated on: Jan 13, 2026
- 6:28 pm
గాల్లో ఉండగానే నేలరాలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత.. అసలు మ్యాటరేంటంటే?
పక్కదేశాల నుంచి వలస వచ్చే అందమైన విదేశీ పక్షుల పాలిట యములవుతున్నారు కొందరు వేటగాళ్లు. చెరువుల దగ్గర కనిపించే స్వదేశీ, విదేశీపై పక్షులను తాపాకీలతో వేటాడుతున్నారు. నిబంధనలు బేఖాతరు చేసి ఇష్టారీతిన నాటు తుపాకులతో చేపల చెరువుల దగ్గర హల్ చల్ చేస్తున్నారు. వేటగాళ్ల వికృత చేష్టలతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు స్థానికులు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
- Fairoz Baig
- Updated on: Jan 12, 2026
- 1:24 pm
Andhra News: పిల్లలతో కలిసి భర్త ఇంటి ముందు భార్య మౌనపోరాటం.. అసలు మ్యాటరేంటంటే?
చీరాలలో ఓ న్యాయవాది తన భార్య, ఇద్దరు కూతుర్లను వదిలేసి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో అతని భార్య దీప తన పిల్లలతో కలిసి భర్త ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. న్యాయం కోసం ఆందోళన చేస్తున్న ఆమెకు పోలీసులు మద్దతుగా నిలిచారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
- Fairoz Baig
- Updated on: Jan 11, 2026
- 2:49 pm
రాత్రి, పగలనే తేడానే లేదు.. ఆ గ్రామంలో క్షణక్షణం భయం భయం.. ఇంతకు అక్కడ ఏం జరుగుతోంది!
మార్కాపురం జిల్లా బొమ్మలాపురం సమీపంలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా ఆవుల మందపై దాడి చేసి ఒకదానికి గాయాలు చేసింది. గతంలోనూ పలు పశువులు పులి బారిన పడి ప్రాణాలు కోల్పోయాయి. నల్లమల అటవీ ప్రాంతం నుండి పొలాల్లోకి వస్తున్న పులితో రైతులు, పశువుల కాపరులు రాత్రివేళల్లో బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అటవీ శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- Fairoz Baig
- Updated on: Jan 9, 2026
- 10:23 am
Prakasam district: గుడి శిధిలం… ధ్వజస్థంభం పదిలం…
ఆలయం శిథిలమైనా పూజలందుకుంటున్న ఓ ధ్వజస్తంభం ప్రకాశం జిల్లాలో భక్తులను ఆకట్టుకుంటోంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మితమైన జనార్ధనస్వామి ఆలయానికి చెందిన ఈ ధ్వజస్తంభాన్ని వందల ఏళ్లుగా ఓ మర్రిచెట్టు తన శాఖలతో పెనవేసుకుని కాపాడుతోంది. ఆలయం లేకపోయినా ఈ ధ్వజస్తంభానికి నేటికీ భక్తులు పూజలు చేయడం విశేషం.
- Fairoz Baig
- Updated on: Jan 7, 2026
- 9:54 pm
Andhra: ఎంత మూర్ఖుడివిరా.. వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి అమాంతం దూకాడు.. ఆ తర్వాత
ఆంధ్రప్రదేశ్ పల్నాడుకు చెందిన ఆర్టీసీ బస్సు ఒంగోలు సమీపంలో జాతీయ రహదారిపై రయ్యిమని దూసుకుపోతోంది. ఇంతలో ఓ యువకుడు రన్నింగ్ బస్సులో నుంచి బయటకు దూకేశాడు. బిత్తరపోయిన ప్రయాణీకులు, బస్సు డ్రైవర్ వెంటనే బస్సును ఆపి యువకుడ్ని పరిశీలించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
- Fairoz Baig
- Updated on: Jan 7, 2026
- 5:31 pm
మద్యం మత్తు ఎంత పని చేసిందయ్యా.. మొత్తం కుటుంబాన్ని చిదిమేసింది..!
మద్యం మహమ్మారి ఓ నిండు కుటుంబాన్ని ఛిద్రం చేసింది. తాగి వచ్చి చిత్రహింసలు పెడుతున్న భర్తను భార్య హత్యచేసేలా పురిగొల్పింది. తల్లి పడుతున్న హింసలను చూసి తట్టుకోలేక తండ్రి హత్యలో కూతురు కూడా పాలుపంచుకోవడం అత్యంత విషాదకర సన్నివేశం. మార్కాపురం జిల్లా దంతరపల్లెలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
- Fairoz Baig
- Updated on: Jan 6, 2026
- 7:57 pm
Festival Offer: వారెవ్వా.. భలే పండుగ బంపర్ ఆఫర్.. ఇక మందుబాబులకు పండగే పండగ
Festival Offer: పండగలు వచ్చాయంటే చాలా మందుబాబులకు ఎంజయే. ఇప్పుడు సంక్రాంతి పంగడల వస్తోంది. ఈ నేపథ్యంలో బార్అండ్ రెస్టారెంట్ యజమానులు మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్తో వారికి పండగే.. పండగ. ఈ అద్భుతమైన ఆఫర్లతోనే చీరాలలో ఓ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు..
- Fairoz Baig
- Updated on: Jan 6, 2026
- 7:32 pm
Andhra: చిన్నమ్మి, సీనావలి.. పెళ్ళై పిల్లలున్న లవర్స్..! ఉదయాన్నే ఏకాంతంగా కలుసుకున్నారు.. కట్ చేస్తే
వివాహేతర సంబంధం రెండు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఒకరు హత్యకు గురికాగా మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.. మార్కాపురంజిల్లా కట్టకిండపల్లిలో జరిగిన ఈ ఘటనలో వివాహిత మహిళ చిన్నమ్మి హత్యకు గురికాగా, ఏఆర్ కానిస్టేబుల్ సీనావలి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Fairoz Baig
- Updated on: Jan 6, 2026
- 3:31 pm
Andhra News: ఛీ.. ఛీ.. ఏం మనిషివిరా.. కూతురి వయసున్న బాలికను ఎత్తుకెళ్లి..
పొలం పనులకు వెళ్ళిన 16 ఏళ్ళ బాలికను మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్ళి ఐదురోజులు లాడ్జిలో ఉంచి ఓ కామాంధుడు తన పశువాంఛను తీర్చుకున్నాడు. ఇంటికి వెళ్ళాలని బాలిక ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా నిర్బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది.
- Fairoz Baig
- Updated on: Jan 1, 2026
- 9:21 pm