AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛాంపియన్‌కే కాదు ఓడిన జట్లపైనా కోట్ల వర్షం.. టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీ చూస్తే కళ్లు తిరిగాల్సిందే..!

T20 World Cup 2026 Prize Money: టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో ఐసీసీ ఛాంపియన్‌తోపాటు ఓడిపోయిన జట్లకు బహుమతిని ప్రకటించింది. గత ఏడాదితో పోల్చితే ప్రైజ్ మనీ భారీగా పెరిగింది. ఆవివరాలు ఏంటో ఓసారి చూద్దాం..

ఛాంపియన్‌కే కాదు ఓడిన జట్లపైనా కోట్ల వర్షం.. టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీ చూస్తే కళ్లు తిరిగాల్సిందే..!
Icc World Cup
Venkata Chari
|

Updated on: Mar 04, 2026 | 4:26 PM

Share

T20 World Cup 2026 Prize Money: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు ఈ మెగా టోర్నీలో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. రెండు సెమీఫైనల్స్, ఒక గ్రాండ్ ఫైనల్. ఇదే సమయంలో ఐసీసీ ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన భారీ ప్రైజ్ మనీ వివరాలను ప్రకటించింది.

ఈసారి ఛాంపియన్ జట్టుతో పాటు రన్నరప్, సెమీఫైనల్ వరకు చేరిన జట్లకు కూడా భారీ మొత్తంలో నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు సమాచారం.

టోర్నమెంట్ కీలక దశలో..

టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభంలో మొత్తం 20 జట్లు పోటీలో పాల్గొన్నాయి. గ్రూప్ స్టేజ్, సూపర్-8 దశలు ముగిసిన తర్వాత ఇప్పుడు కేవలం నాలుగు జట్లు మాత్రమే మిగిలాయి.

మొదటి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా న్యూజిలాండ్‌తో తలపడుతుంది. రెండో సెమీఫైనల్‌లో భారత్ ఇంగ్లాండ్‌తో పోటీ పడనుంది. ఈ మ్యాచ్‌లలో గెలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి.

రికార్డు స్థాయి ప్రైజ్ పూల్..

ఈసారి ఐసీసీ టోర్నమెంట్‌కు మొత్తం ప్రైజ్ పూల్‌ను భారీగా పెంచింది. నివేదికల ప్రకారం మొత్తం ప్రైజ్ ఫండ్ సుమారు రూ. 120.37 కోట్లుగా ఉంది. ఇది గత ఎడిషన్‌తో పోలిస్తే భారీగా పెరిగింది.

2024 టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ టైటిల్ గెలిచినప్పుడు సుమారు రూ. 20.4 కోట్లు బహుమతిగా లభించాయి. కానీ, ఈసారి చాంపియన్ జట్టుకు అందే మొత్తం మరింత పెరిగింది.

ఛాంపియన్ జట్టుకు భారీ బహుమతి..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచే జట్టుకు రూ. 27 కోట్లకు పైగా ప్రైజ్ మనీ లభించే అవకాశం ఉంది.

ఐసీసీ సాధారణంగా బహుమతులను అమెరికన్ డాలర్లలో ప్రకటించినప్పటికీ, భారత రూపాయల్లో లెక్కిస్తే ఈ మొత్తం గత టోర్నమెంట్ కంటే ఎక్కువగా ఉంటుంది.

రన్నరప్, సెమీఫైనలిస్టులకు కూడా రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ..

రన్నరప్ జట్టుకు సుమారు రూ. 14.65 కోట్లు

సెమీఫైనల్‌లో ఓడిన రెండు జట్లకు ఒక్కో జట్టుకు రూ. 7.24 కోట్లు

అదే విధంగా 5వ స్థానం నుంచి 12వ స్థానం మధ్య నిలిచిన జట్లకు కూడా ఒక్కో జట్టుకు సుమారు రూ. 3.48 కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం.

అయితే, ఈ మొత్తాలు రూపాయి మారకం విలువపై ఆధారపడి కొంత మారవచ్చు.

ఈ భారీ ప్రైజ్ మనీ కారణంగా టీ20 వరల్డ్ కప్ 2026 పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. టైటిల్ కోసం జట్లు గట్టి పోటీ ఇవ్వనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us