
ఐసీసీ టీ20 ప్రపంచకప్
మొదటి సారి, ICC వరల్డ్ ట్వంటీ 20 టోర్నమెంట్ని ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించాలని నిర్ణయించారు. అదే సంవత్సరం క్రికెట్ ప్రపంచ కప్ జరిగితే మాత్రం మార్పు ఉంటుంది. ఆ సందర్భంలో వన్డే ప్రపంచకప్ ముందు సంవత్సరం నిర్వహిస్తుంటారు. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టోర్నమెంట్లో భారత్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్థాన్ను ఓడించింది. అనంతరం 21 జూన్ 2009న ఇంగ్లాండ్లో శ్రీలంకను 8 వికెట్ల తేడాతో ఓడించిన పాకిస్థాన్ రెండో టోర్నమెంట్ను గెలుచుకుంది. 2010 ICC వరల్డ్ ట్వంటీ 20 టోర్నమెంట్ను వెస్టిండీస్లో మే 2010లో నిర్వహించారు. ఇందులో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. 2012 ICC వరల్డ్ ట్వంటీ20 ఫైనల్లో శ్రీలంకను ఓడించి వెస్టిండీస్ గెలుచుకుంది. ICC వరల్డ్ ట్వంటీ 20 ఫైనల్లో తొలిసారిగా ఆతిథ్య దేశం పాల్గొంది. 2012 ICC వరల్డ్ ట్వంటీ20 క్వాలిఫైయర్లో భాగంగా ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్లతో సహా టైటిల్ కోసం 12 జట్లు పోటీ పడ్డాయి. టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆసియా దేశంలో జరగడం ఇదే తొలిసారి. జులై 2020లో, కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021 ఎడిషన్లను ఒక సంవత్సరం చొప్పున వాయిదా వేస్తున్నట్లు ICC ప్రకటించింది. అందువల్ల, 2020 టోర్నమెంట్ (వాస్తవానికి ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది) నవంబర్ 2021 కి మార్చారు. అలాగే, 2021 టోర్నమెంట్ (వాస్తవానికి భారతదేశం ఆతిథ్యమిస్తుంది) అక్టోబర్ 2022 కి మార్చారు. అయితే రివర్స్ ఆర్డర్లో, భారతదేశం 2021లో, ఆస్ట్రేలియా 2022లో ఆతిథ్యం ఇచ్చింది. జూన్ 2021లో, ICC 2024, 2026, 2028, 2030లో జరగాల్సిన T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ను 20 జట్లను చేర్చడానికి విస్తరించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఈ ఫార్మాట్లో 20 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు సూపర్ 8కు చేరుకుంటాయి. ఆ తర్వాత రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్లోని మొదటి రెండు జట్లు సెమీ-ఫైనల్కు చేరుకుంటాయి.
2024 టీ20 ప్రపంచకప్కు వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ICC టోర్నమెంట్కు US ఆతిథ్యమివ్వడం ఇదే మొదటిసారి. 2026 టోర్నమెంట్ను భారతదేశం, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తాయి. 2028 ఎడిషన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో అలాగే 2030 టోర్నమెంట్ ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్లలో జరుగుతుంది.
జీరోకే సగం జట్టు పెవిలియన్కు.. 10 బంతుల్లోనే ముగిసిన ఛేజింగ్.. 24 గంటల్లోనే చెత్త రికార్డ్ బ్రేక్
ICC U19 Womens T20 World Cup: దక్షిణాఫ్రికా ముందు సమోవా జట్టు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. జట్టు మొత్తం 16 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా కేవలం 10 బంతుల్లోనే విజయాన్ని నమోదు చేసింది. దక్షిణాఫ్రికాకు ఇది వరుసగా రెండో విజయం. ఈ క్రమంలో సమోవా 24 గంటల్లోనే ఓ చెత్త రికార్డ్ నమోదు చేసింది.
- Venkata Chari
- Updated on: Jan 20, 2025
- 5:03 pm
T20 World Cup: భారత్, పాక్ మ్యాచ్ లేకుండానే ప్రపంచకప్.. ఇదెక్కడి షెడ్యూల్ అంటోన్న ఫ్యాన్స్
2025 సంవత్సరపు తొలి ఐసీసీ ఈవెంట్ జనవరి 18 నుంచి ప్రారంభం కానుంది. ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ రూపంలో ఈ టోర్నీ మలేషియాలో జరగనుంది. అయితే, చాలా కాలం తర్వాత ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ల మధ్య మ్యాచ్ లేకుండా ముందకు సాగనుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
- Venkata Chari
- Updated on: Jan 14, 2025
- 8:29 pm
Rohit Sharma: 25 ఏళ్ల సచిన్ చెత్త రికార్డ్ను బీట్ చేసిన రోహిత్.. భారత క్రికెట్ చరిత్రలోనే దారుణం
Team India Year Ender 2024: టీమిండియా ఈ ఏడాది 15 టెస్టు మ్యాచ్లు ఆడింది. రోహిత్ శర్మ 14 మ్యాచ్ల్లో టీమిండియాకు నాయకత్వం వహించాడు. మరో మ్యాచ్లో కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా కనిపించాడు. రోహిత్ శర్మ సారథ్యంలో 14 మ్యాచ్లు ఆడిన టీమిండియా కేవలం 7 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించడం గమనార్హం.
- Venkata Chari
- Updated on: Dec 31, 2024
- 1:10 pm
2024లో అత్యధికంగా సెర్చ్ చేసిన టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా? ధోని, కోహ్లీ కూడా వెనుకే
Year in Search 2024: ఈ ఏడాది గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెటర్గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఈ విషయంలో విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోనీ వంటి దిగ్గజాలను సైతం ఓడించాడు. గూగుల్లో హార్దిక్ ట్రెండింగ్లో ఉండటానికి నాలుగు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
- Venkata Chari
- Updated on: Dec 11, 2024
- 1:47 pm
Champions Trophy: కేవలం డబ్బు సంపాదించడమేనా?.. ఐసిసిని ప్రశ్నించిన పాక్ మాజీ ఆల్ రౌండర్
మాజీ పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది, ఐసిసి, పిసిబి నిర్ణయాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పాకిస్తాన్, తన క్రికెట్ స్వతంత్రతను చాటుకోవాలని, సమాన హక్కులను పొందాలని సూచించారు. యువ ఆటగాళ్ల అభివృద్ధి లోపాలు, చైర్మన్ల మార్పుల వల్ల విధాన పరమైన అస్థిరత పాక్ క్రికెట్పై ప్రభావం చూపుతోందని విమర్శించారు.
- Narsimha
- Updated on: Dec 8, 2024
- 7:17 pm
Team India: టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత ఆటగాళ్లకు రూ.259 కోట్లు.. కనక వర్షం కురిపించిన ఫ్రాంచైజీలు?
IPL 2025: ఐపీఎల్ వేలంలో చాలా మంది ఆటగాళ్లు కోటీశ్వరులు అయ్యారు. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్లపై రికార్డ్ బద్దలు కొట్టారు. అయితే, టీమిండియాకు టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఆటగాళ్లకు ఐపీఎల్లో ఎంత డబ్బు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
- Venkata Chari
- Updated on: Nov 29, 2024
- 12:52 pm
ICC Men’s T20 World Cup Sub-Regional Africa: అయ్యబాబోయ్ ఇదెక్కడి చెత్త రికార్డు.. కేవలం 7 పరుగులకే ఆలౌట్
పురుషుల T20I చరిత్రలో ఐవరీ కోస్ట్ 7 పరుగులకు ఆలౌటై అత్యల్ప స్కోరు నమోదు చేసింది. నైజీరియా 271 పరుగులు సాధించి 264 పరుగుల తేడాతో ఐవరీ కోస్ట్ను ఓడించింది. ఈ విజయంతో నైజీరియా పురుషుల T20Iలో అతిపెద్ద విజయాల జాబితాలో మూడవ స్థానానికి చేరుకుంది.
- Narsimha
- Updated on: Nov 27, 2024
- 11:19 am
Team India: తండ్రి చేసిన తప్పు.. కట్చేస్తే.. టీమిండియా ప్లేయర్కు బిగ్ షాకిచ్చిన అధికారులు..
Jemimah Rodrigues Controversy: భారత స్టార్ మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్కు మంచి జరగడం లేదు. మహిళల టీ20 ప్రపంచకప్లో ఆమె పేలవ ప్రదర్శన తర్వాత విమర్శకుల టార్గెట్గా మారింది. రోడ్రిగ్స్ 4 ఇన్నింగ్స్ల్లో ఒక్కసారి కూడా 30 పరుగులు చేయలేకపోయింది. దీంతో టీమిండియా సెమీఫైనల్కు చేరుకోలేకపోయింది. ఇప్పుడు జెమీమాకు మరో బ్యాడ్ న్యూస్ వచ్చింది.
- Venkata Chari
- Updated on: Oct 22, 2024
- 11:19 am
T20 WC 2024: 8 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. తొలి ట్రోఫీతోపాటు కివీస్కు భారీగా ప్రైజ్మనీ.. భారత్కు దక్కింది ఎంతంటే?
ICC Women's T20 World Cup 2024: తొలిసారి ట్రోఫీ అందుకున్న న్యూజిలాండ్ మహిళల జట్టు.. 8 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ చరిత్రలో కొత్త ఛాంపియన్గా వెలుగు చూసింది. దీంతో న్యూజిలాండ్ జట్టుకు భారీగా ప్రైజ్ మనీ దక్కింది. అలాగే, లీగ్ దశలో నిష్క్రమించిన భారత జట్టుకు కూడా ప్రైజ్ మనీ అందింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
- Venkata Chari
- Updated on: Oct 21, 2024
- 9:58 am
T20 World Cup: టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరుకు రంగం సిద్ధం.. ఎవరు గెలిచినా సరికొత్త చరిత్రే..
ICC Women's T20 World Cup 2024 Live telecast and Streaming: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు తుది పోరుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఇరుజట్ల హెడ్ టూ హెడ్ రికార్డులను పరిశీలిద్దాం.. ఇప్పటి వరకు ఇరుజట్ల మధ్య జరిగిన 16 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ జట్టుదే ఆధిపత్యంగా కనిపిస్తోంది. ఆ జట్టు 11 మ్యాచ్ల్లో విజయం సాధించింది.
- Venkata Chari
- Updated on: Oct 20, 2024
- 11:15 am