ఐసీసీ టీ20 ప్రపంచకప్
మొదటి సారి, ICC వరల్డ్ ట్వంటీ 20 టోర్నమెంట్ని ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించాలని నిర్ణయించారు. అదే సంవత్సరం క్రికెట్ ప్రపంచ కప్ జరిగితే మాత్రం మార్పు ఉంటుంది. ఆ సందర్భంలో వన్డే ప్రపంచకప్ ముందు సంవత్సరం నిర్వహిస్తుంటారు. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టోర్నమెంట్లో భారత్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్థాన్ను ఓడించింది. అనంతరం 21 జూన్ 2009న ఇంగ్లాండ్లో శ్రీలంకను 8 వికెట్ల తేడాతో ఓడించిన పాకిస్థాన్ రెండో టోర్నమెంట్ను గెలుచుకుంది. 2010 ICC వరల్డ్ ట్వంటీ 20 టోర్నమెంట్ను వెస్టిండీస్లో మే 2010లో నిర్వహించారు. ఇందులో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. 2012 ICC వరల్డ్ ట్వంటీ20 ఫైనల్లో శ్రీలంకను ఓడించి వెస్టిండీస్ గెలుచుకుంది. ICC వరల్డ్ ట్వంటీ 20 ఫైనల్లో తొలిసారిగా ఆతిథ్య దేశం పాల్గొంది. 2012 ICC వరల్డ్ ట్వంటీ20 క్వాలిఫైయర్లో భాగంగా ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్లతో సహా టైటిల్ కోసం 12 జట్లు పోటీ పడ్డాయి. టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆసియా దేశంలో జరగడం ఇదే తొలిసారి. జులై 2020లో, కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021 ఎడిషన్లను ఒక సంవత్సరం చొప్పున వాయిదా వేస్తున్నట్లు ICC ప్రకటించింది. అందువల్ల, 2020 టోర్నమెంట్ (వాస్తవానికి ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది) నవంబర్ 2021 కి మార్చారు. అలాగే, 2021 టోర్నమెంట్ (వాస్తవానికి భారతదేశం ఆతిథ్యమిస్తుంది) అక్టోబర్ 2022 కి మార్చారు. అయితే రివర్స్ ఆర్డర్లో, భారతదేశం 2021లో, ఆస్ట్రేలియా 2022లో ఆతిథ్యం ఇచ్చింది. జూన్ 2021లో, ICC 2024, 2026, 2028, 2030లో జరగాల్సిన T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ను 20 జట్లను చేర్చడానికి విస్తరించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఈ ఫార్మాట్లో 20 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు సూపర్ 8కు చేరుకుంటాయి. ఆ తర్వాత రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్లోని మొదటి రెండు జట్లు సెమీ-ఫైనల్కు చేరుకుంటాయి.
2024 టీ20 ప్రపంచకప్కు వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ICC టోర్నమెంట్కు US ఆతిథ్యమివ్వడం ఇదే మొదటిసారి. 2026 టోర్నమెంట్ను భారతదేశం, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తాయి. 2028 ఎడిషన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో అలాగే 2030 టోర్నమెంట్ ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్లలో జరుగుతుంది.
టీ20 ప్రపంచకప్ విజేతలకు ‘నాడా’ షాక్? డోపింగ్ టెస్ట్ జాబితాలోకి ఇద్దరు టీమిండియా ప్లేయర్లు..!
Anti-Doping Testing Pool: 2026 టీ20 ప్రపంచకప్లో భారత్ను విశ్వవిజేతగా నిలబెట్టిన ఇద్దరు కీలక ఆటగాళ్లకు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) కీలక ఆదేశాలు జారీ చేసింది. క్రీడల్లో పారదర్శకతను పెంచేందుకు ఈ స్టార్ క్రికెటర్లను రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్లో చేర్చినట్లు ప్రకటించింది. ఇప్పుడు ఈ నిర్ణయం క్రీడా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
- Venkata Chari
- Updated on: Apr 15, 2026
- 5:03 pm
Team India: సూర్య ఇక బ్యాగ్ సర్దేసుకో.. టీ20 కొత్త కెప్టెన్గా దూసుకొస్తోన్న చిచ్చర పిడుగు..!
India New Captain: టీమ్ ఇండియా టీ20 సారథి, మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కెరీర్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. 2026 ప్రపంచ కప్లో జట్టును విజేతగా నిలిపినప్పటికీ, వ్యక్తిగత బ్యాటింగ్ వైఫల్యాలు ఇప్పుడు అతడి కెప్టెన్సీ పదవికే ఎసరు తెచ్చేలా కనిపిస్తున్నాయి. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం, తదుపరి సిరీస్లే సూర్య భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
- Venkata Chari
- Updated on: Apr 15, 2026
- 4:39 pm
రూ.82 కోట్ల ప్రైజ్ మనీతో సిద్ధమైన టీ20 ప్రపంచకప్.. బరిలో 12 జట్లు.. భారత్, పాక్ పోరు ఎప్పుడంటే?
ICC Announces T20 World Cup 2026 Prize Pool: 2026 మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం ఐసీసీ రికార్డు స్థాయిలో రూ. 82 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించింది. ఇంగ్లాండ్లో జరగనున్న ఈ 12 జట్ల టోర్నమెంట్ యొక్క పూర్తి షెడ్యూల్, ప్రైజ్ మనీ, భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వివరాలను ఓసారి చూద్దాం..
- Venkata Chari
- Updated on: Apr 14, 2026
- 3:58 pm
PM Narendra Modi: సంజు శాంసన్ ఆటతీరుకు ప్రధాని మోదీ ఫిదా.. ఏమన్నారంటే..?
PM Narendra Modi on Sanju Samson: టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ సాధించిన చారిత్రాత్మక విజయంలో కేరళ స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ పోషించిన పాత్ర అద్వితీయం. క్లిష్ట సమయాల్లో జట్టును ఆదుకుంటూ ఆయన ప్రదర్శించిన తెగువను దేశవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సంజు శాంసన్ను కొనియాడటం ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
- Venkata Chari
- Updated on: Apr 3, 2026
- 6:37 pm
Hardik Pandya: ‘ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ ఔట్.. రోహిత్ వారసుడి చేతికి పగ్గాలు..?’
Mumbai Indians Captaincy Issue: ఐపీఎల్ 2026 ముందు ముంబై ఇండియన్స్ లో కెప్టెన్సీపై చర్చలు మరింత వేడెక్కుతున్నాయి. హార్దిక్ పాండ్య స్థానంపై సందేహాలు పెరుగుతుండగా సూర్యకుమార్ యాదవ్ కు నాయకత్వం ఇవ్వాలన్న సూచనలు వస్తున్నాయి. మాజీ క్రికెటర్ శ్రీకాంత్ వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత హాట్ టాపిక్ గా మార్చాయి.
- Venkata Chari
- Updated on: Mar 23, 2026
- 12:18 pm
టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిందనే కుళ్లు.. కట్ చేస్తే.. ఐపీఎల్ ఆడమంటోన్న ఆసీస్ ప్లేయర్లు..!
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియన్ పేసర్లు పాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్, మిచెల్ స్టార్క్ ఆలస్యంగా చేరనున్నారు. గాయం కారణంగా నాథన్ ఎల్లిస్ సీజన్కు దూరమయ్యాడు. క్రికెట్ ఆస్ట్రేలియా బిజీ షెడ్యూల్ కారణంగా వర్క్లోడ్ నిర్వహణను లక్ష్యంగా పెట్టుకుంది. కమిన్స్, హేజిల్వుడ్లకు గాయాలు కారణమవగా, పూర్తి విశ్రాంతిలో ఉన్న స్టార్క్ ఆలస్యానికి గల కారణాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
- Venkata Chari
- Updated on: Mar 20, 2026
- 3:38 pm
Jay Shah : వరల్డ్ కప్ బహిష్కరణ డ్రామాపై జై షా ఆగ్రహం.. ఆ రెండు దేశాలకు చుక్కలు చూపించిన ఐసీసీ బాస్
Jay Shah : టీ20 ప్రపంచకప్ 2026 బహిష్కరణ డ్రామాపై ఐసీసీ ఛైర్మన్ జై షా ఘాటుగా స్పందించారు. ఏ జట్టు కూడా ఐసీసీ కంటే పెద్దది కాదని పాక్, బంగ్లాదేశ్ దేశాలకు చురకలు అంటించారు. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీని అడ్డుకోవాలని చూసిన వారికి జై షా మాటలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
- Rakesh
- Updated on: Mar 15, 2026
- 9:34 am
T20 World Cup 2026 : ఇండియా గెలిచింది.. యాడ్ల మార్కెట్ ఊగిపోయింది.. వరల్డ్ కప్తో రూ.1500 కోట్ల రికార్డు
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 లో టీమ్ ఇండియా విజయం కేవలం క్రీడా పరంగానే కాకుండా, ఆర్థికంగానూ రికార్డులు సృష్టించింది. ప్రకటనల ద్వారా ఏకంగా రూ. 1500 కోట్ల కు పైగా ఆదాయం లభించింది.
- Rakesh
- Updated on: Mar 13, 2026
- 6:30 pm
Shivam Dube: వామ్మో.. రూ.27.5 కోట్లతో ఫ్లాట్లు కొన్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ హీరో.. లగ్జరీ లైఫ్ చూశారా?
Shivam Dube Mumbai Flats: టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ 2026 విజయంలో కీలక పాత్ర పోషించిన శివమ్ దూబే ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచాడు. సెమీఫైనల్, ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఈ ఆల్రౌండర్ ముంబైలో కోట్ల విలువైన రెండు లగ్జరీ ఫ్లాట్లు కొనుగోలు చేయడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
- Venkata Chari
- Updated on: Mar 13, 2026
- 2:15 pm
Sanju Samson: సంజూ ఎక్కడ?.. గిల్ పోస్ట్పై అభిమానుల ఆగ్రహం.. ఇంకా నీ తిక్క తగ్గలేదా బ్రో అంటూ..
Shubman Gill Instagram photo controversy: టీమిండియా టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత సోషల్ మీడియాలో కొత్త వివాదం మొదలైంది. భారత బ్యాటర్ శుభ్మన్ గిల్ పోస్ట్ చేసిన “ఛాంపియన్స్” ఫొటోలో సంజూ శాంసన్ కనిపించకపోవడం అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. కీలక పాత్ర పోషించిన ఆటగాడిని ఎందుకు చూపలేదంటూ గిల్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- Venkata Chari
- Updated on: Mar 13, 2026
- 12:54 pm
Team India: టీమిండియా ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. ట్రోఫీ ఎఫెక్ట్తో ఏకంగా ఐదుగురు రిటైర్మెంట్?
Team India Players Retirement News: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ చారిత్రక విజయం సాధించిన తర్వాత టీమిండియాలో కీలక మార్పులు రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. యువ ఆటగాళ్లకు అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో కొంతమంది సీనియర్ క్రికెటర్లు త్వరలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
- Venkata Chari
- Updated on: Mar 13, 2026
- 11:43 am
నేను రెడీ.. ప్రపంచ ఛాంపియన్ సంజూకి బీసీసీఐకి అదిరిపోయే న్యూస్.. ఇకపై కొత్త పాత్రలో బ్యాడ్ లక్కోడు..?
Sanju Samson Captaincy: 2026 టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన టీమ్ ఇండియాలో కేరళ స్టార్ సంజు శాంసన్ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. రిజర్వ్ బెంచ్ నుంచి వచ్చి వరుస హాఫ్ సెంచరీలతో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన సంజుపై బీసీసీఐ (BCCI) ఇప్పుడు ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. భారత క్రికెట్ భవిష్యత్తులో అతను అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
- Venkata Chari
- Updated on: Mar 13, 2026
- 9:56 am