ఐసీసీ టీ20 ప్రపంచకప్

ఐసీసీ టీ20 ప్రపంచకప్

మొదటి సారి, ICC వరల్డ్ ట్వంటీ 20 టోర్నమెంట్‌ని ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించాలని నిర్ణయించారు. అదే సంవత్సరం క్రికెట్ ప్రపంచ కప్ జరిగితే మాత్రం మార్పు ఉంటుంది. ఆ సందర్భంలో వన్డే ప్రపంచకప్ ముందు సంవత్సరం నిర్వహిస్తుంటారు. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టోర్నమెంట్‌లో భారత్ ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించింది. అనంతరం 21 జూన్ 2009న ఇంగ్లాండ్‌లో శ్రీలంకను 8 వికెట్ల తేడాతో ఓడించిన పాకిస్థాన్ రెండో టోర్నమెంట్‌ను గెలుచుకుంది. 2010 ICC వరల్డ్ ట్వంటీ 20 టోర్నమెంట్‌ను వెస్టిండీస్‌లో మే 2010లో నిర్వహించారు. ఇందులో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. 2012 ICC వరల్డ్ ట్వంటీ20 ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి వెస్టిండీస్ గెలుచుకుంది. ICC వరల్డ్ ట్వంటీ 20 ఫైనల్‌లో తొలిసారిగా ఆతిథ్య దేశం పాల్గొంది. 2012 ICC వరల్డ్ ట్వంటీ20 క్వాలిఫైయర్‌లో భాగంగా ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్‌లతో సహా టైటిల్ కోసం 12 జట్లు పోటీ పడ్డాయి. టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆసియా దేశంలో జరగడం ఇదే తొలిసారి. జులై 2020లో, కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021 ఎడిషన్‌లను ఒక సంవత్సరం చొప్పున వాయిదా వేస్తున్నట్లు ICC ప్రకటించింది. అందువల్ల, 2020 టోర్నమెంట్ (వాస్తవానికి ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది) నవంబర్ 2021 కి మార్చారు. అలాగే, 2021 టోర్నమెంట్ (వాస్తవానికి భారతదేశం ఆతిథ్యమిస్తుంది) అక్టోబర్ 2022 కి మార్చారు. అయితే రివర్స్ ఆర్డర్‌లో, భారతదేశం 2021లో, ఆస్ట్రేలియా 2022లో ఆతిథ్యం ఇచ్చింది. జూన్ 2021లో, ICC 2024, 2026, 2028, 2030లో జరగాల్సిన T20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌ను 20 జట్లను చేర్చడానికి విస్తరించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఈ ఫార్మాట్‌లో 20 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు సూపర్ 8కు చేరుకుంటాయి. ఆ తర్వాత రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్‌లోని మొదటి రెండు జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి.

2024 టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ICC టోర్నమెంట్‌కు US ఆతిథ్యమివ్వడం ఇదే మొదటిసారి. 2026 టోర్నమెంట్‌ను భారతదేశం, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తాయి. 2028 ఎడిషన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో అలాగే 2030 టోర్నమెంట్ ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్‌లలో జరుగుతుంది.

ఇంకా చదవండి

Team India: ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే రూ. 5 కోట్లు.. లిస్టులో ముగ్గురు భారత ఆటగాళ్లు.. ఎవరంటే?

T20 World Cup 2024: ఇతర సిబ్బందికి ఒక్కొక్కరికి 2 కోట్లు దక్కనున్నాయి. అదేవిధంగా భారత జట్టుకు ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.1 కోటి పొందుతారు. ఇలా రూ. 125 కోట్లను టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుతో కలిసి కనిపించిన ప్రతి ఒక్కరికీ పంచనున్నారు.

IND vs ZIM: హరారే పిచ్ ఎవరికి అనుకూలం? ఈ మైదానంలో టీ20 రికార్డులు చూస్తే బౌలర్లకు పరేషానే?

IND vs ZIM, Harare Pitch Report: హరారే స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లోని పిచ్ ఎల్లప్పుడూ బ్యాట్స్‌మెన్స్‌కు అనుకూలంగా ఉంటుంది. పిచ్‌పై మంచి బౌన్స్‌తో బంతి సులభంగా బ్యాట్‌పైకి వస్తుంది. ఈ మైదానంలో భారీగా బౌండరీలు, సిక్సర్లు రావడానికి ఇదే కారణం. అయితే, ఆట సాగుతున్న కొద్దీ పిచ్ పరిస్థితి కూడా మారిపోతుంది.

Video: హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌కు ఘన స్వాగతం.. ‘ఇండియా.. ఇండియా.. వీ లవ్‌ యూ సిరాజ్‌ భాయ్‌’ అంటూ..

Mohammed Siraj was Welcomed by huge fans in Hyderabad: టీమిండియా టీ20 ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఆటగాళ్లతోపాటు ఫ్యాన్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. జులై 4న, T20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీతో బార్బడోస్ నుంచి భారత జట్టు తిరిగి స్వదేశానికి చేరుకుంది . ఆ తర్వాత, ఆటగాళ్లు ఎక్కడికి వెళ్లినా, వారికి స్వాగతం పలికేందుకు అభిమానులు క్యూలు కడుతున్నారు.

Team India: తొలుత టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్, ఆ తర్వాత జింబాబ్వే సిరీస్.. ఇకపై టీ20ల్లో కనిపించని ఐదుగురు..

5 Indian Players Ignored by BCCI: టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీతో భారత జట్టు ఈ రోజు భారతదేశానికి చేరుకుంది. భారత జట్టు విజయం కోసం దేశంలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. మరోవైపు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడేందుకు భారత జట్టు యువ బ్రిగేడ్‌ జట్టు జింబాబ్వే వెళ్లింది. జింబాబ్వే పర్యటనలో పలువురు యువ ఆటగాళ్లకు బీసీసీఐ అవకాశం కల్పించింది.

Video: ఇదేందయ్యా జైషా.. కోహ్లీ ఎఫెక్ట్‌తో బుమ్రాకు షాక్ ఇచ్చావ్.. వైరల్ వీడియో చూస్తే పరేషానే..

Virat Kohli - Jay Shah: ప్రపంచ వ్యాప్తంగా విరాట్ కోహ్లీకి అభిమానులున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు 27 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కోహ్లీని అభిమానించని వారు ఉండరు. బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా విరాట్ కోహ్లీకి అభిమాని. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో ఇందుకు నిదర్శనంగా మారింది.

Team India: రిటైర్మెంట్ బాటలో మరో ముగ్గురు భారత ఆటగాళ్లు.. లిస్టులో యంగ్ ప్లేయర్ కూడా.. ఎందుకంటే?

3 Indian Cricketers T20I Career Almost Over: 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టు టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను రెండవసారి గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్‌ విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అయితే వరల్డ్ కప్ గెలిచిన 24 గంటల్లోనే అభిమానులకు మూడు భారీ షాక్ లు తగిలాయి. నిజానికి, భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ , వెటరన్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ T20ల నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నారు.

IND vs ZIM 1st T20I: తొలి టీ20ఐ ఆడనున్న ఐపీఎల్ పెను సంచలనం.. జైస్వాల్‌కు చెక్ పడినట్లే?

Abhishek Sharma vs Yashasvi Jaiswal: భారత్ వర్సెస్ జింబాబ్వే మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జులై 6 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పర్యటనకు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ టూర్‌కి యువ ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేశారు. ఈ పర్యటనకు అభిషేక్ శర్మకు కూడా అవకాశం లభించింది. అతను మొదటి మ్యాచ్‌లోనే ఆడుతున్నాడు. యశస్వి జైస్వాల్ కూడా జట్టులో భాగమే. అయితే అతను మొదటి రెండు మ్యాచ్‌ల తర్వాత జింబాబ్వే చేరుకుంటాడు.

Team India: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో మనోళ్లే ముగ్గురు.. గట్టిపోటీ ఇస్తోన్న ఆఫ్ఘాన్ డేంజరస్ ప్లేయర్..

ICC Men's and Women's Player Of The Month Nominees: గత నెలలో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లు జూన్ నెలలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకునే రేసులో ఉన్నారు. ఈ క్రమంలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామీలను గురువారం ప్రకటించింది. పురుషుల విభాగంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా పేర్లు ఇందులో ఉన్నాయి. అదే సమయంలో, ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రహ్మానుల్లా గుర్బాజ్ కూడా ఈ అవార్డును గెలుచుకునే రేసులో ఉన్నాడు.

Video: రోహిత్‌, మట్టి రుచి ఎలా ఉంది.. సూర్య, ఆ 7 సెకన్ల సీక్రెట్ ఏంటి? ప్రధాని మోడీ ఎవరితో ఏం మాట్లాడారంటే?

టీ20 ప్రపంచకప్ 2024 విజేత భారత క్రికెట్ జట్టు న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెలిసిందే. బార్బడోస్ నుంచి 16 గంటల ప్రయాణం తర్వాత భారత్ చేరుకున్న టీమ్ ఇండియా ప్రధాని నివాసానికి వెళ్లింది. ఈ సమావేశానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, టీ20 ప్రపంచకప్‌తో ఫొటో కూడా దిగారు.

Video: డోలు బీట్‌కు స్టెప్పులేసిన రోహిత్.. జత కలిసిన కోహ్లీ, హార్దిక్.. వీడియో చూస్తే మీరూ చిందేస్తారంతే..

T20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీతోపాటు విజేత భారత జట్టు ఆటగాళ్లు అద్భుతమైన విజయ పరేడ్ తర్వాత ముంబైలోని వాంఖడే స్టేడియం చేరుకున్నారు. ఇక్కడ ఆటగాళ్లు బస్సు దిగి స్టేడియంలోకి రాగానే డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. కెప్టెన్ రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ , సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ ఎంతో బాగా డ్యాన్స్ చేశారు.

Team India: ప్రపంచ క్రికెట్‌ని శాసిస్తున్న ఇండియన్ క్రికెట్

మన సౌత్ సినిమా ప్రపంచ సెల్యులాయిడ్ చరిత్రను తిరగరాస్తోంది. గ్లోబల్ బాక్సాఫీసుల్ని బద్దలు కొడుతోంది. హాలీవుడ్‌ పెద్దల్ని కూడా ఆలోచింపజేస్తోంది. ఇదే గ్యాప్‌లో ఇంకో వండర్ ఏంటంటే.. మన ఇండియన్ క్రికెట్ కూడా ప్రపంచాన్ని ఒంటిచేత్తో శాసించే స్థాయికి చేరింది. ఒకప్పుడు అండర్‌ డాగ్స్ అనిపించుకున్న టీమిండియా ఇప్పుడు ఎవరస్టంత ఎత్తులో నిలబడింది. రోహిత్ సేన కొట్టిన బ్లాక్‌బస్టర్ తర్వాత.. ప్రపంచమంతా ఇప్పుడు ఇండియన్ క్రికెట్ గురించే మాట్లాడుకుంటోంది.

Video: తొలుత జాతీయ గీతం.. ఆ తర్వాత మా తుజే సలాం.. గూస్ బమ్స్ తెప్పిస్తోన్న వీడియోలు చూశారా?

National Anthem in Victory Parade: ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియాకు సన్మాన కార్యక్రమం కొనసాగుతోంది. ఆటగాళ్లందరూ డబుల్ డెక్కర్ బస్సు పైకప్పుపై ప్రయాణించి నారిమన్ పాయింట్ మీదుగా వాంఖడే స్టేడియానికి చేరుకున్నారు. ఈ సమయంలో, క్రీడాకారులను చూసేందుకు వేలాది మంది అభిమానులు వచ్చారు. కాగా, రాత్రి 9 గంటలకు ముందే టీమిండియా స్టేడియానికి చేరుకుంది. అనంతరం రాత్రి 9.05 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించారు.

Video: సూర్య కుమార్ క్యాచ్ వివాదంలో కొత్త ట్విస్ట్.. కీలక వ్యాఖ్యలు చేసిన సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్

Suryakumar Yadav Catch Viral: టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆఖరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్‌ను సూర్యకుమార్ యాదవ్ పట్టుకోవడం పెను వివాదానికి కారణమైంది. భారత్‌ ఛాంపియన్‌గా నిలిచిన మరుసటి రోజే సూర్యకుమార్‌ ఎడమ పాదం బౌండరీకి ​​తాకినట్లు వీడియో వెలుగులోకి వచ్చింది.

Team India: అతను 8వ వింత.. అలాంటోడు దొరకడం చాలా అరుదు: విరాట్ కోహ్లీ భావోద్వేగ ప్రసంగం

Team India Victory Parade: గురువారం సాయంత్రం ముంబైలో టీమిండియాకు ఘనస్వాగతం లభించింది. అక్కడి నుంచి బస్‌ ఎక్కి మెరైన్‌డ్రైవ్‌కు చేరుకోగా, ప్రపంచ విజేతగా నిలిచిన భారత జట్టుకు స్వాగతం పలికేందుకు అప్పటికే వేలాది మంది జనం తరలివచ్చారు. నారిమన్ పాయింట్ నుంచి, భారత ఆటగాళ్లందరూ ఓపెన్ బస్సులో ఎక్కి విజయోత్సవ పరేడ్‌ను ప్రారంభించారు.

Video: విజయోత్సవేళ టీమిండియా ఆటగాళ్లకు గుడ్‌న్యూస్.. రూ. 125 కోట్ల చెక్ అందించిన బీసీసీఐ..

T20I World Cup Trophy Parade: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన భారత క్రికెట్‌ జట్టు అభినందన సభ ఘనంగా జరిగింది. నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు జరిగిన బహిరంగ ఓపెనర్ బస్ పరేడ్‌లో వేలాది మంది అభిమానులు భారత ఆటగాళ్లతో వీధుల్లోకి వచ్చారు. వాంఖడే స్టేడియంలో భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల బహుమతిని కూడా అందజేసింది.

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!