AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐసీసీ టీ20 ప్రపంచకప్

ఐసీసీ టీ20 ప్రపంచకప్

మొదటి సారి, ICC వరల్డ్ ట్వంటీ 20 టోర్నమెంట్‌ని ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించాలని నిర్ణయించారు. అదే సంవత్సరం క్రికెట్ ప్రపంచ కప్ జరిగితే మాత్రం మార్పు ఉంటుంది. ఆ సందర్భంలో వన్డే ప్రపంచకప్ ముందు సంవత్సరం నిర్వహిస్తుంటారు. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టోర్నమెంట్‌లో భారత్ ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించింది. అనంతరం 21 జూన్ 2009న ఇంగ్లాండ్‌లో శ్రీలంకను 8 వికెట్ల తేడాతో ఓడించిన పాకిస్థాన్ రెండో టోర్నమెంట్‌ను గెలుచుకుంది. 2010 ICC వరల్డ్ ట్వంటీ 20 టోర్నమెంట్‌ను వెస్టిండీస్‌లో మే 2010లో నిర్వహించారు. ఇందులో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. 2012 ICC వరల్డ్ ట్వంటీ20 ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి వెస్టిండీస్ గెలుచుకుంది. ICC వరల్డ్ ట్వంటీ 20 ఫైనల్‌లో తొలిసారిగా ఆతిథ్య దేశం పాల్గొంది. 2012 ICC వరల్డ్ ట్వంటీ20 క్వాలిఫైయర్‌లో భాగంగా ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్‌లతో సహా టైటిల్ కోసం 12 జట్లు పోటీ పడ్డాయి. టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆసియా దేశంలో జరగడం ఇదే తొలిసారి. జులై 2020లో, కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021 ఎడిషన్‌లను ఒక సంవత్సరం చొప్పున వాయిదా వేస్తున్నట్లు ICC ప్రకటించింది. అందువల్ల, 2020 టోర్నమెంట్ (వాస్తవానికి ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది) నవంబర్ 2021 కి మార్చారు. అలాగే, 2021 టోర్నమెంట్ (వాస్తవానికి భారతదేశం ఆతిథ్యమిస్తుంది) అక్టోబర్ 2022 కి మార్చారు. అయితే రివర్స్ ఆర్డర్‌లో, భారతదేశం 2021లో, ఆస్ట్రేలియా 2022లో ఆతిథ్యం ఇచ్చింది. జూన్ 2021లో, ICC 2024, 2026, 2028, 2030లో జరగాల్సిన T20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌ను 20 జట్లను చేర్చడానికి విస్తరించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఈ ఫార్మాట్‌లో 20 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు సూపర్ 8కు చేరుకుంటాయి. ఆ తర్వాత రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్‌లోని మొదటి రెండు జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి.

2024 టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ICC టోర్నమెంట్‌కు US ఆతిథ్యమివ్వడం ఇదే మొదటిసారి. 2026 టోర్నమెంట్‌ను భారతదేశం, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తాయి. 2028 ఎడిషన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో అలాగే 2030 టోర్నమెంట్ ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్‌లలో జరుగుతుంది.

ఇంకా చదవండి

IND vs PAK: పాకిస్తాన్ ప్లేయర్లకు గ్రీన్ సిగ్నల్.. భారత్‌లో ఆడేందుకు అనుమతి..!

భారత్ వర్సెస్ పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్రీడా సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత్ ఆతిథ్యం ఇచ్చే బహుళ దేశాల టోర్నీలలో పాల్గొనేందుకు పాక్ ఆటగాళ్లకు అనుమతి లభించింది. ద్వైపాక్షిక సిరీస్‌లు కాకుండా కేవలం అంతర్జాతీయ ఈవెంట్ల కోసం మాత్రమే ఈ వెసులుబాటు కల్పించారు.

Team India: టీమిండియా హవా తగ్గేదేలే.. నంబర్-1 స్థానంలో సూర్య సేన.. టాప్-10 జట్లు ఇవే!

ICC T20 Rankings 2026: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియా, తాజా జాబితాలోనూ అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. పొట్టి ఫార్మాట్‌లో భారత్ ప్రదర్శిస్తున్న నిలకడైన ఆటతీరుకు ఈ ర్యాంకింగ్స్ నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. పూర్తి వివరాలు ఓసారి చూద్దాం..

టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు.. ఆర్‌సీబీ, ఢిల్లీ ప్లేయర్లదే హవా.. ముంబై నుంచి ఇద్దరే..!

India's T20 World Cup Squad: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత మహిళా జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ప్రదర్శన ఆధారంగా ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు పెద్దపీట వేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Team India: భారత టీ20 ప్రపంచ కప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగు ప్లేయర్లకు చోటు.. ఎవరో తెలుసా?

Women's T20 World Cup 2026 India Squad: 2026 మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన అరుంధతి రెడ్డి, శ్రీ చరణి చోటు దక్కించుకున్నారు. పూర్తి స్క్వాడ్, షెడ్యూల్ ఓసారి చూద్దాం..

Team India: మహిళల టీ20 ప్రపంచకప్‌ జట్టులో తుఫాన్ ప్లేయర్.. అసలెవరీ నందినీ శర్మ..?

India Women Squad T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. స్టార్ ప్లేయర్ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో ఎంపిక చేసిన ఈ జట్టులో ఒక సరికొత్త పేరు అందరినీ ఆకర్షిస్తోంది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అద్భుత ప్రదర్శన చేసిన యువ పేసర్ నందినీ శర్మకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కడం విశేషం. ఈ మెగా టోర్నీకి ఎంపికైన భారత వనితల వివరాలు ఇక్కడ చూడవచ్చు.

T20 World Cup Squad: మహిళల టీ20 ప్రపంచకప్‌ జట్టు ప్రకటన.. హర్మన్‌ప్రీత్ సారథ్యంలో బరిలోకి భారత్..!

India Women's T20 World Cup Squad: మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం పటిష్టమైన జట్టును బీసీసీఐ ప్రకటించింది. స్టార్ ఆల్ రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా కనిపించనున్నారు. ఈ మెగా టోర్నీలో సత్తా చాటి తొలిసారి ప్రపంచకప్ ముద్దాడాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఈ జట్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

హ్యాట్రిక్‌‌పై కన్నేసిన టీమిండియా.. టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌ చూస్తే ప్రత్యర్థులు డకౌట్.. కెప్టెన్‌గా ఎవరంటే?

T20 World Cup 2028 Team India Squad: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన టీమ్ ఇండియా, ఇప్పుడు 2028లో జరగబోయే పొట్టి ప్రపంచకప్‌పై కన్నేసింది. వరుసగా మూడవసారి విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందుకోసం ఐపీఎల్ 2026 ప్రదర్శన ఆధారంగా కుర్రాళ్లతో కూడిన ఒక పటిష్టమైన జట్టును సిద్ధం చేస్తోంది. ఈ మెగా టోర్నీకి ఎంపికయ్యే ఆ అద్భుత ఆటగాళ్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

T20 World Cup 2026 : క్రికెట్‌లో బిష్ణోయ్ గ్యాంగ్ కలకలం.. పాయింట్ బ్లాక్‎లో గన్ పెట్టి మరీ కెప్టెన్‎గా నియమించాలని బెదిరింపులు

T20 World Cup 2026 : కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ కథనం ప్రకారం.. జూలై 2025లో బ్రిటిష్ కొలంబియాలోని ఒక రెస్టారెంట్‌లో జరిగిన సంఘటన ఈ కుంభకోణానికి పునాది వేసింది. అక్కడ భోజనం చేస్తున్న కెనడా జాతీయ జట్టు స్టార్ ప్లేయర్ దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చి, తాము బిష్ణోయ్ గ్యాంగ్ ప్రతినిధులమని పరిచయం చేసుకున్నారట.

  • Rakesh
  • Updated on: Apr 21, 2026
  • 2:11 pm

Team India: సూర్యకుమార్ పోస్ట్ పీకేశారుగా.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఆ తోపుగాడు..?

భారత టీ20 జట్టు సారథ్య బాధ్యతల్లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయా..? ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ పగ్గాలు చేపట్టబోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి తాజా నివేదికలు. ఐపీఎల్‌లో తిరుగులేని రికార్డు ఉన్న అయ్యర్ వైపు సెలెక్టర్లు మొగ్గు చూపుతుండటంతో ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు దమ్కీ ఇచ్చిన సంజూ శాంసన్.. ఎవరామే, అసలు మ్యాటర్ ఏంటంటే?

Sanju Samson: కేరళకు చెందిన ఇద్దరు దిగ్గజ సెలబ్రిటీల మధ్య సాగిన ఆసక్తికర పోరులో టీమిండియా స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ విజేతగా నిలిచాడు. మలయాళీ సెలబ్రిటీగా ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న స్టార్ హీరోయిన్ ను వెనక్కి నెట్టి, సంజు మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రపంచకప్ విజయంతో పెరిగిన క్రేజ్ సంజును నంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది. ఇంతకీ ఆమె ఎవరు, వీళ్లద్దరి మధ్య అసలేం జరిగిదో ఓసారి చూద్దాం..

టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. రంగంలోకి ఐసీసీ.. చెన్నైలో జరిగిన ఆ మ్యాచ్‌పైనే ఫోకస్.?

T20 World Cup fixing investigation: అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచాన్ని ఫిక్సింగ్ భూతం మరోసారి వణికిస్తోంది. 2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్ వర్సెస్ కెనడా మధ్య జరిగిన మ్యాచ్‌లో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించడం క్రీడా వర్గాల్లో పెను సంచలనంగా మారింది.

టీ20 ప్రపంచకప్ విజేతలకు ‘నాడా’ షాక్? డోపింగ్ టెస్ట్ జాబితాలోకి ఇద్దరు టీమిండియా ప్లేయర్లు..!

Anti-Doping Testing Pool: 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను విశ్వవిజేతగా నిలబెట్టిన ఇద్దరు కీలక ఆటగాళ్లకు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) కీలక ఆదేశాలు జారీ చేసింది. క్రీడల్లో పారదర్శకతను పెంచేందుకు ఈ స్టార్ క్రికెటర్లను రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్‌లో చేర్చినట్లు ప్రకటించింది. ఇప్పుడు ఈ నిర్ణయం క్రీడా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.