తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వందలాది చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన శ్యామల మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.