PM Modi: పోలాండ్‎లో ప్రధాని మోదీ.. తెలుగుదేశం జెండాలతో ఘన స్వాగతం..

భారత ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ పర్యటన కొనసాగుతోంది. ఆయన తొలిసారి పోలాండ్ చేరుకున్న నేపథ్యంలో అక్కడ నివాసముంటున్న తెలుగువారు పీఎం మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ముందుకు వచ్చారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు భారత ప్రధాని మోదీ రాకతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టీడీపీ జెండాలతో ఘన స్వాగతం పలికారు.

PM Modi: పోలాండ్‎లో ప్రధాని మోదీ.. తెలుగుదేశం జెండాలతో ఘన స్వాగతం..
Pm Modi
Follow us

|

Updated on: Aug 21, 2024 | 10:13 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ పర్యటన కొనసాగుతోంది. ఆయన తొలిసారి పోలాండ్ చేరుకున్న నేపథ్యంలో అక్కడ నివాసముంటున్న తెలుగువారు పీఎం మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ముందుకు వచ్చారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు భారత ప్రధాని మోదీ రాకతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టీడీపీ జెండాలతో ఘన స్వాగతం పలికారు. దీంతో ఆ ప్రాంతమంతా మోదీ నామ స్మరణతో మార్మోగిపోయింది. పెద్ద ఎత్తున చేరుకున్న తెలుగు తమ్ముళ్లు మోదీతో మాట్లాడేందుకు, ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఇదిలా ఉంటే భారత్‌, పోలెండ్‌ ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలో స్వయంగా పర్యటించి వివిధ అంశాలపై ఆ దేశాధినేతలతో చర్చించనున్నారు. గత 45 ఏళ్లలో పోలాండ్ వెళ్లిన మొదటి భారత ప్రధానిగా సరికొత్త రికార్డు నెలకొల్పారు పీఎం మోదీ. పోలాండ్ పర్యటనలో భాగంగా జామ్ సాహెబ్‌ ఆఫ్ నవనగర్‌ మెమోరియల్‌ను సందర్శించనున్నారు ప్రధాని మోదీ.

పోలాండ్, ఉక్రెయిన్‌లలో రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ బుధవారం వార్సా చేరుకున్నారు. పోలాండ్ వాసులకు ఆశ్రయమిచ్చిన ఈ మొమోరియల్‎ను పోలాండ్ రాజధాని వార్సాలో ఏర్పాటు చేశారు. పర్యటనలో భాగంగా జామ్ సాహెబ్‌ ఆఫ్ నవనగర్‌ మెమోరియల్‌ను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆగస్టు 23న స్పెషల్‌ ట్రైన్‌లో కీవ్‌ చేరుకోనున్నారు. ఇండియా నుంచి పోలాండ్ బయలుదేరే ముందు, పీఎం మోదీ కొన్ని విషయాలు వెల్లడించారు. భారత్ మిత్ర దేశంగా ఉన్న పోలాండ్ శాంతి భద్రతలు స్థిరంగా ఉండాలని, పలు అంశాలపై ఆ దేశాధినేతలతో చర్చించి త్వరగా తిరిగి రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. తన ఈ పోలాండ్ పర్యటనలో భాగంగా రాబోయే రోజుల్లో ఇరుదేశాల మధ్య దౌత్యం మరింత బలంగా, శక్తివంతమైనదిగా మారుతుందని.. అందుకు ఈ పర్యటన పునాది అని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పోలాండ్‌లో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా పీఎం మోదీ”వైబ్రెంట్” ఇండియన్ కమ్యూనిటీ సభ్యులతో కూడా చర్చిస్తారు. ఆ తరవాత ఉక్రెయిన్ బయలుదేరి వెళ్లనున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పోలాండ్‎లో ప్రధాని మోదీ.. తెలుగుదేశం జెండాలతో ఘన స్వాగతం..
పోలాండ్‎లో ప్రధాని మోదీ.. తెలుగుదేశం జెండాలతో ఘన స్వాగతం..
ఓరి నాయనో ఐస్‌క్రీమ్ పకోడీ అట.. ఏందిరయ్యా ఈ వంటకాలు..!
ఓరి నాయనో ఐస్‌క్రీమ్ పకోడీ అట.. ఏందిరయ్యా ఈ వంటకాలు..!
ఈ సారి మెగాబాస్‌ పుట్టినరోజు మామూలుగా ఉండదు అంట.!
ఈ సారి మెగాబాస్‌ పుట్టినరోజు మామూలుగా ఉండదు అంట.!
చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు జోగి రమేష్..
చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు జోగి రమేష్..
వాళ్లందరి బాధ్యత బాలయ్య - వపన్‌ కల్యాణ్‌ మీదే ఉందా.?
వాళ్లందరి బాధ్యత బాలయ్య - వపన్‌ కల్యాణ్‌ మీదే ఉందా.?
ఉత్తరాఖండ్‌లో షాకింగ్ ఘటన.. నదిలో కొట్టుకుపోయిన వ్యక్తి.. వీడియో
ఉత్తరాఖండ్‌లో షాకింగ్ ఘటన.. నదిలో కొట్టుకుపోయిన వ్యక్తి.. వీడియో
జీతాల్లో కోత.. గుడ్ గవర్నెన్స్‌లో భాగంగా పేటీఏం కీలక నిర్ణయం
జీతాల్లో కోత.. గుడ్ గవర్నెన్స్‌లో భాగంగా పేటీఏం కీలక నిర్ణయం
ఇక నుండి మన హీరోల టార్గెట్ వెయ్యి కోట్లు.! తారక్, చెర్రీ ఫిక్స్..
ఇక నుండి మన హీరోల టార్గెట్ వెయ్యి కోట్లు.! తారక్, చెర్రీ ఫిక్స్..
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగాగిన్నిస్ రికార్డు..వయస్సుఎంతంటే
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగాగిన్నిస్ రికార్డు..వయస్సుఎంతంటే
ఇదేం చెత్త నిర్ణయం.. థర్డ్ అంపైర్‌పై పాక్ బ్యాటర్ ఆగ్రహం
ఇదేం చెత్త నిర్ణయం.. థర్డ్ అంపైర్‌పై పాక్ బ్యాటర్ ఆగ్రహం
ఉత్తరాఖండ్‌లో షాకింగ్ ఘటన.. నదిలో కొట్టుకుపోయిన వ్యక్తి.. వీడియో
ఉత్తరాఖండ్‌లో షాకింగ్ ఘటన.. నదిలో కొట్టుకుపోయిన వ్యక్తి.. వీడియో
ఈ వారం చికెన్‌ ధరలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు.! మరీ ఇంత తక్కువ.?
ఈ వారం చికెన్‌ ధరలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు.! మరీ ఇంత తక్కువ.?
బ్యాడ్ న్యూస్.. ఆసుపత్రిలో హీరో మోహన్ లాల్‌.! ఎందుకంటే.?
బ్యాడ్ న్యూస్.. ఆసుపత్రిలో హీరో మోహన్ లాల్‌.! ఎందుకంటే.?
యువరైతు వినూత్న ఆవిష్కరణ! పంటలకు కాపలా కాసేందుకు సెన్సార్‌ యంత్రం
యువరైతు వినూత్న ఆవిష్కరణ! పంటలకు కాపలా కాసేందుకు సెన్సార్‌ యంత్రం
ప్రయాణికులతో వెళ్తుండగా.. రన్నింగ్‌లో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు.!
ప్రయాణికులతో వెళ్తుండగా.. రన్నింగ్‌లో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు.!
వైద్యుల నిరసనల వేళ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు.!
వైద్యుల నిరసనల వేళ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు.!
వాట్సాప్‌ కాల్స్‌తో వణికిపోతున్న జనం.. ఎందుకో తెలుసా.?
వాట్సాప్‌ కాల్స్‌తో వణికిపోతున్న జనం.. ఎందుకో తెలుసా.?
నీతా అంబానీ తాగే వాటర్‌ ధర రూ.27 వేలా.? అసలు స్టోరీ ఏంటి.?
నీతా అంబానీ తాగే వాటర్‌ ధర రూ.27 వేలా.? అసలు స్టోరీ ఏంటి.?
మాదాపూర్‌లో బోర్డ్‌ తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ.!
మాదాపూర్‌లో బోర్డ్‌ తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ.!
కేరళలో పక్షి జెండా ఎగరేసిందా.? ఆ వీడియోలో నిజమెంత.?
కేరళలో పక్షి జెండా ఎగరేసిందా.? ఆ వీడియోలో నిజమెంత.?