AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ

బీజేపీ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారత దేశంలో ఒక జాతీయ రాజకీయ పార్టీ. ప్రస్తుతం బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉంది. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పార్టీ అధికారంలో ఉంది. హిందూ జాతీయవాద సిద్ధాంతంతో ఆ పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించింది.

1980లో బీజేపీ ఏర్పడింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత రామమందిరం విషయంలో జరిగిన ఉద్యమంతో ఆ పార్టీ చాలా ఊపందుకుంది. 1996లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే పూర్తి మెజార్టీ లేకపోవడంతో 13 రోజులకే ప్రధాని పదవికి అటల్ బిహారీ వాజ్‌పేయి రాజీనామా చేశారు. 1998 ఎన్నికల తర్వాత 13 మాసాల పాటు మాత్రమే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి 2004 వరకు పూర్తి ఐదేళ్లు పదవీకాలం కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత పదేళ్లపాటు కేంద్రంలో బీజేపీ అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది.

2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. దీని తర్వాత 2019లో అంతకంటే పెద్ద విజయం సాధించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, యూనిఫాం సివిల్ కోడ్ మొదలైనవి బిజెపి ప్రధాన ఎజెండా. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మాణం, జమ్మూ కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగింపును పూర్తి చేసింది. బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు.

ఇంకా చదవండి

Telangana Municipal Elections 2026 Live: తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

Telangana Municipal Corporation Elections 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఓటింగ్ ప్రక్రియ మొత్తం ప్రశాంతంగానే జరుగింది. ఉదయం నుంచి కొనసాగుతున్న పోలింగ్ సరళిని 100 శాతం వెబ్ కాస్టింగ్‌తో ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు 62.5 శాతం పోలింగ్ నమోదు అయింది. మున్సిపల్ కార్పొరేషన్లతో పోలిస్తే మున్సిపాలిటీలలో ఎక్కువ పోలింగ్ శాతం నమోదవుతుంది. కాగా సాయంత్రం 5గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాగా శుక్రవారం ఉదయం 8గంటల నుంచి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ రోజు సాయంత్రంలోపు ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.

‘మనం ఆపకపోతే ఘోరం జరిగేదీ..!’ మహిళా ప్రతిపక్ష ఎంపీల వీడియో విడుదల చేసిన కేంద్రమంత్రి

ఫిబ్రవరి 4న పార్లమెంటరీ చర్చ సందర్భంగా జరిగిన గందరగోళంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధానమంత్రి సీటు వద్దకు వచ్చి గందరగోళం సృష్టించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మత ప్రాతిపదిక రిజర్వేషన్లు.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్

తెలంగాణను రక్షించుకోవాలంటే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకే ఓటు వేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మెదక్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన... కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల తీరుపై ఫైర్ అయ్యారు. ముఖ్యంగా మత ఆధారిత రిజర్వేషన్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.

Pralhad Joshi: హైస్పీడ్ రైల్ కారిడార్లలో 3 హైదరాబాద్‌కే.. తెలంగాణకు ఎంతో చేశాం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

ప్రపంచంలోనే భారత్ మూడోవ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని.. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల అభ్యున్నతికి.. దోహదపడుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్.. 2047వరకు వికసిత్ భారత్ నిర్మాణ లక్ష్యంగా ఉందని.. ఇది ఆర్థిక శక్తిని మరింత బలోపేతం చేస్తుందని ప్రహ్లాద్ జోషి వివరించారు.

తెలంగాణలో పవన్‌ కల్యాణ్ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం రద్దు.. కారణం అదేనా..?

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన పార్టీ హాట్‌ టాపిక్‌గా మారింది. ఓవైపు అధికారపక్షం.. మరోవైపు ప్రతిపక్షాలు.. పోటాపోటీగా సిద్ధమవుతున్న వేళ.. జనసేన సైతం పుర పోరులోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిరేపింది. ప్రచారానికి పవన్‌ వస్తున్నారనే ముచ్చట.. మరింత హీటు పుట్టించింది. అయితే జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి.

Municipal Election: బీజేపీ మేనిఫెస్టో విడుదల.. కోతులు, కుక్కల బెడద నివారణతోపాటు కీలక హామీలు!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. పురపోరులో కమలనాథులు కదనరంగంలోకి దూకారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిచేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. ఢిల్లీ నేతలను మోహరించి.. గల్లీల్లో జెండా పాతేందుకు వ్యూహాన్ని రచిస్తున్నారు. 60 శాతానికి పైగా మున్సిపాలిటీలు తమవే అంటోంది కమలం పార్టీ.

తెలంగాణ పురపోరులోకి జనసేన! పవన్‌ ప్రచారం ఎవరికి ప్లస్..? ఎవరికి మైనస్?

తెలంగాణ రాజకీయాల్లోకి పవన్‌ ఎంట్రీ కొత్తకాదు. ఆయన ప్రచారమూ కొత్తకాదు. ఇటీవల కొండగట్టు అంజన్న సన్నిధిలో.. టీటీడీ నిధులతో భారీ అభివృద్ధి కార్యక్రమాలకూ శ్రీకారం చుట్టారు. కానీ ఇప్పుడు వస్తున్న ఎంట్రీ ప్రత్యేకమైంది కాబట్టే.. పవన్‌పై తమదైన స్టయిల్‌లో ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నట్టు తెలుస్తోంది.

భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోంది: ప్రధాని మోదీ

ప్రపంచం కొత్త ఆధునిక యుగం వైపు పయనిస్తోందని ప్రధానమంత్ర నరేంద్ర మోదీ అన్నారు. కొత్త శిఖరాలను అధిరోహిస్తున్న మార్గంలో మనం చాలా ముఖ్యమైన దశకు చేరుకున్నాము. ప్రపంచం మన ప్రతిభ, ప్రాముఖ్యతను గుర్తిస్తోంది. భారతదేశం తొమ్మిది ప్రధాన దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసింది. భారత్ అనేక దేశాలకు విశ్వసనీయ భాగస్వామి. మనం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉన్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Andhra Politics: ఘాటెక్కిన గుంటూరు..! ఉమెన్ సెంటిమెంట్స్.. ఫ్యామిలీ ఎమోషన్స్..

'వాళ్లు చేసిన నేరమేంటి'? సింగిల్ పాయింట్ క్వశ్చన్‌తో గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రశ్నించారు వైఎస్ జగన్. అసలు ఇదంతా జరిగింది.. తిరుమల నెయ్యి వ్యవహారం నుంచే అంటూ మొదలుపెట్టారు జగన్. నెయ్యిలో జంతువుల కొవ్వే కలవలేదని సీబీఐ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి.. చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారానికి దిగి.. పరిస్థితిని దాడులు, కేసులు, అరెస్టుల దాకా తెచ్చారని ఫైర్ అయ్యారు.

లోక్‌సభలో నిలిచిపోయిన ప్రధాని మోదీ ప్రసంగం.. సభా కార్యక్రమాలు రేపటికి వాయిదా..!

పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చైనా చొరబాట్లు, ఎం.ఎం. నరవాణే పుస్తకంపై రాహుల్ గాంధీ ప్రభుత్వంపై దాడి చేస్తుండగా, బీజేపీ ప్రతీదాడికి దిగింది. ఈ గందరగోళం కారణంగా, సాయంత్రం 5 గంటలకు జరగాల్సిన ప్రధాని మోదీ ప్రసంగం వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.

లోక్‌సభలో దుమారం రేపిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. రాహుల్‌ ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ సభ్యులు

చైనాతో సరిహద్దు వివాదంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకుంది. బీజేపీ సభ్యుల నినాదాల మధ్య రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రిటైర్డ్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ నరవణే రాసిన పుస్తకంలోని వ్యాఖ్యలను రాహుల్‌ప ప్రస్తావించడాన్ని కేంద్రం తప్పుపట్టింది. దేశాన్ని , సైన్యాన్ని రాహుల్‌ పదేపదే అవమానిస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్‌ కూడా రాహుల్‌ తీరును తప్పుపట్టారు.

దేశ ఆర్థిక గమనాన్ని డిసైడ్‌ చేసేందుకు రంగం సిద్ధం.. నేటి నుంచి కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు!

నేడు బుధవారం (జనవరి 28, 2026) నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలో అఖిలపక్ష భేటీ నిర్వహించిన కేంద్రం.. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరింది. అటు.. అధికార, ప్రతిపక్షాలు వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. పార్లమెంట్‌ సమావేశాల్లో ఏఏ అంశాలపై గళమెత్తాలనేదానిపై అన్ని పార్టీలూ అజెండా ఫిక్స్‌ చేసుకోవడం ఆసక్తి రేపుతోంది.