![బీజేపీ](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/02/bjp-logo.jpg)
బీజేపీ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారత దేశంలో ఒక జాతీయ రాజకీయ పార్టీ. ప్రస్తుతం బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉంది. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పార్టీ అధికారంలో ఉంది. హిందూ జాతీయవాద సిద్ధాంతంతో ఆ పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించింది.
1980లో బీజేపీ ఏర్పడింది. 1984 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత రామమందిరం విషయంలో జరిగిన ఉద్యమంతో ఆ పార్టీ చాలా ఊపందుకుంది. 1996లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే పూర్తి మెజార్టీ లేకపోవడంతో 13 రోజులకే ప్రధాని పదవికి అటల్ బిహారీ వాజ్పేయి రాజీనామా చేశారు. 1998 ఎన్నికల తర్వాత 13 మాసాల పాటు మాత్రమే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి 2004 వరకు పూర్తి ఐదేళ్లు పదవీకాలం కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత పదేళ్లపాటు కేంద్రంలో బీజేపీ అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది.
2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. దీని తర్వాత 2019లో అంతకంటే పెద్ద విజయం సాధించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, యూనిఫాం సివిల్ కోడ్ మొదలైనవి బిజెపి ప్రధాన ఎజెండా. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మాణం, జమ్మూ కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగింపును పూర్తి చేసింది. బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు.
Prahlad Joshi: కొత్త వివాదంలో కాంగ్రెస్.. ఆ ప్రాంతం పేరు మార్పును ఖండించిన కేంద్ర మంత్రి..
రామ్ నగర్ జిల్లా పేరును బెంగళూరు సౌత్ జిల్లాగా మార్చేందుకు కర్ణాటక మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు. బెంగళూరులోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలోని కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో రాం నగర్ అనే పేరు కలిగిన ప్రాంతాన్ని బెంగళూరు సౌత్ జిల్లాగా మారుస్తూ కేబినెట్ ఆమోదించింది.
- Srikar T
- Updated on: Jul 26, 2024
- 7:08 pm
Kishan Reddy: బడ్జెట్లో ఏం లేదు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు దొందు దొందే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
అభూతకల్పన, అంకెల గారడి, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప బడ్జెట్ లో ఏమి లేదని.. బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప.. ఏమీ కనిపించలేదని.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ తుంగలో తొక్కిందంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ పై విమర్శలు గుప్పించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 25, 2024
- 9:36 pm
Union Budget 2024: ఉపాధి కల్పనే లక్ష్యం.. నైపుణ్య శిక్షణే మార్గం.. కేంద్రం ఏకంగా రూ. 2 లక్షల కోట్లతో కొత్త పథకం
యువ రక్తంతో నిండిన భారతదేశం మాత్రమే కాదు, నిరుద్యోగ సమస్య ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను వేధిస్తోంది. విద్యావకాశాలు పెరగడంతో యూనివర్సిటీల నుంచి పట్టభద్రులు కుప్పలుతెప్పలుగా బయటికొస్తున్నారు. అయితే చాలామంది చేతిలో డిగ్రీ పట్టాలు ఉంటున్నాయి కానీ ఏదైనా ఉద్యోగం చేయడానికి అవసరమైన నైపుణ్యాలు కొరవడుతున్నాయి. నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేయడంలో ఇది కూడా ఒక కీలకాంశంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొన్ని కొత్త పథకాలను ప్రతిపాదించింది.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Jul 25, 2024
- 8:20 pm
Budget 2024: ‘రెండు రాష్ట్రాలకే వడ్డించారు’.. బడ్జెట్పై అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం..
కేంద్ర బడ్జెట్పై అధికార , విపక్షాల మధ్య మాటలయుద్దం మరింత ముదిరింది. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్లో తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్, తృణమూల్, సమాజ్వాదీ పార్టీలు ఆరోపించాయి. రాజ్యభలో కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే. రెండు రాష్ట్రాలకు మాత్రమే వడ్డించి మిగతా రాష్ట్రాలను విస్మరించారని అన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 24, 2024
- 11:41 pm
Pawan Kalyan: కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధుల వరద.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన ఇదే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల వరద.. కేంద్ర బడ్జెట్లో వరాల జల్లు.. ఏపీ విభజన సమస్యల క్లియరెన్స్ దిశగా కేంద్ర అడుగులు వేస్తోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్.. బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేసింది.
- Balaraju Goud
- Updated on: Jul 24, 2024
- 8:53 am
Telangana: ‘అసెంబ్లీలో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తాం’.. కేంద్ర బడ్జెట్పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
కాంగ్రెస్, బీజేపీలకు చెరో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిపిస్తే.. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేపు పార్లమెంటులో కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని కోరారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంతో మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రాహుల్ గాంధీ తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడరా? అని ప్రశ్నించారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై సీఎం రేవంత్.. రాహుల్ గాంధీతో పార్లమెంటులో మాట్లాడించాలన్నారు. అలాగే ప్రధాని కార్యాలయం ముందు కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేయాలన్నారు.
- Srikar T
- Updated on: Jul 23, 2024
- 6:52 pm
CM Revanth: తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది.. బడ్జెట్పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల కక్ష పూరితంగా వ్యవహరించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 18సార్లు తాము మంత్రుల బృందంతో కలిసి రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి సమస్యలు తీర్చాలని కేంద్ర మంత్రులను కోరినట్లు తెలిపారు. చాలా సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర సమస్యలపై వివరించామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై స్పందించారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ది కోసం కేంద్రం ఆలోచన చేయడం లేదన్నారు.
- Srikar T
- Updated on: Jul 23, 2024
- 6:02 pm
CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్, మంత్రుల బృందం బిజీబిజీ.. ఈ అంశాలే అజెండాగా పర్యటన..
అటు పాలనాపరమైన భేటీలు.. ఇటు పార్టీపరమైన భేటీలు.. మొత్తంగా ఢిల్లీ టూర్లో తెలంగాణ సీఎం రేవంత్ బిజీబిజీగా గడిపారు. హస్తినలో ముఖ్యమంత్రి సహా మంత్రుల బృందం చాలామందితే కలిసింది. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. వరుసగా కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారు. కేంద్రమంత్రులను కలిసిన సీఎం రేవంత్ బృందం.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు. జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కలిసిన సీఎం రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని వివరించారు.
- Srikar T
- Updated on: Jul 22, 2024
- 8:57 pm
Anurag Thakur: ‘రాజ్యాంగాన్ని అవమానించింది రాహుల్ గాంధీ కుటుంబమే’.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..
బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ రాహుల్ గాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంపై ఎక్కువ ప్రేమ చూపిస్తోందని, రాహుల్ కూడా ప్రతిసారీ రాజ్యాంగ గ్రంధాన్ని చేతిలో పెట్టుకుని తిరుగుతూ ఉంటారని ఎద్దేవాచేశారు. రాజ్యాంగాన్ని పూర్తిగా అపహాస్యం చేసింది రాహుల్ గాంధీ అని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని చూపించి దానిపై తప్పుడు ప్రమాణాలు చేయడం వల్ల నిజం అబద్దంగా మారిపోదన్నారు.
- Srikar T
- Updated on: Jul 21, 2024
- 7:03 pm
All Party Meeting: ఏపీ, బీహార్కు ప్రత్యేక హోదాపై పార్లమెంటు అఖిలపక్ష భేటీలో హాట్హాట్ చర్చ
జాతీయ రాజకీయాల్లో రేపు సూపర్ మండే. జూలై 22న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాలకు ఒకరోజు ముందు, అంటే, జూలై 21 అదివారం, ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
- Balaraju Goud
- Updated on: Jul 21, 2024
- 1:49 pm
Telangana BJP: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది.. మహాధర్నాలో కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ ఫైర్
నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ సర్కారు బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏరు దాటాక బోడిమల్లన చందాన వ్యవహరించారని ఆరోపించారు. తక్కువ సమయంలో ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వాల్లో మొదటికి కర్నాటకలోని సిద్దరామయ్యది అయితే..
- Shaik Madar Saheb
- Updated on: Jul 20, 2024
- 4:25 pm
Telangana: కాంగ్రెస్ సంబరాలు.. కమలం వ్యూహాలు.. ఆ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై పోరుకు భారతీయ జనతా పార్టీ సన్నద్దమవుతోంది. వందరోజుల హామీలు 8 నెలలైన అమలు చేయకపోగా.. డిక్లరేషన్ల పేరుతో ఆయా వర్గాలను వంచించారంటూ టీబీజేపీ నిరసన సభలకు సన్నాహకాలు చేస్తోంది.
- Vidyasagar Gunti
- Updated on: Jul 19, 2024
- 4:49 pm
Jyothiradhitya Scindia: డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటూ టెలికాం కమ్యూనికేషన్ విభాగానికి చెందిన ముఖ్యకార్యదర్శులు, పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరు అయ్యారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ థీమ్ ను లాంచ్ చేశారు కేంద్ర మంత్రి సింధియా. ఆ తరువాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
- Srikar T
- Updated on: Jul 18, 2024
- 11:57 pm
BJP: ఆ 10 కారణాలే యూపీలో బీజేపీ కొంప ముంచాయా..
లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) కేవలం 240 స్థానాలకే పరిమితం కావడంలో ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లో తగిలిన ఎదురుదెబ్బలే కారణం. మహారాష్ట్ర సంగతెలా ఉన్నా.. కమలదళానికి కంచుకోటలా మారిందని భావించిన ఉత్తర్ప్రదేశ్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం ఆ పార్టీ అధినేతలను తీవ్రంగా కలచివేసింది. ఢిల్లీ పీఠంపై కూర్చోవాలంటే ముందు యూపీ గడ్డపై గెలవాలి అన్నది దేశ రాజకీయాల్లో ఉన్న నానుడి.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Jul 18, 2024
- 9:36 pm
మరోసారి హస్తినకు సీఎం చంద్రబాబు.. ఈ అంశాలపై ప్రధానితో చర్చ..
ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. మరికాసేపట్లో ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు పలువురు కేంద్రమంత్రులను మరోసారి కలవనున్నారు.
- Srikar T
- Updated on: Jul 16, 2024
- 6:55 pm