బీజేపీ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారత దేశంలో ఒక జాతీయ రాజకీయ పార్టీ. ప్రస్తుతం బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉంది. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పార్టీ అధికారంలో ఉంది. హిందూ జాతీయవాద సిద్ధాంతంతో ఆ పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించింది.
1980లో బీజేపీ ఏర్పడింది. 1984 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత రామమందిరం విషయంలో జరిగిన ఉద్యమంతో ఆ పార్టీ చాలా ఊపందుకుంది. 1996లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే పూర్తి మెజార్టీ లేకపోవడంతో 13 రోజులకే ప్రధాని పదవికి అటల్ బిహారీ వాజ్పేయి రాజీనామా చేశారు. 1998 ఎన్నికల తర్వాత 13 మాసాల పాటు మాత్రమే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి 2004 వరకు పూర్తి ఐదేళ్లు పదవీకాలం కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత పదేళ్లపాటు కేంద్రంలో బీజేపీ అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది.
2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. దీని తర్వాత 2019లో అంతకంటే పెద్ద విజయం సాధించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, యూనిఫాం సివిల్ కోడ్ మొదలైనవి బిజెపి ప్రధాన ఎజెండా. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మాణం, జమ్మూ కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగింపును పూర్తి చేసింది. బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు.
PM Modi: ముఖర్జీ స్వప్నాన్ని సాకారం చేశాం.. రాష్ట్రీయ ప్రేరణా స్థల్ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ..
లక్నోలో రాష్ట్రీయ ప్రేరణాస్థల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వాజ్పేయి, దీన్దయాళ్ ఉపాధ్యాయా, శ్యామాప్రసాద్ ముఖర్జీల 65 అడుగుల విగ్రహాలను ఆవిష్కరించారు. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్వప్నాన్ని సాకారం చేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Dec 25, 2025
- 9:17 pm
స్పీకర్ సమక్షంలో చాయ్ పే చర్చ.. హాజరైన ప్రధాని మోదీ, ప్రియాంకా గాంధీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. సమావేశాల నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా తేనీటి విందు ఇచ్చారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ, కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, పలువురు అఖిలపక్ష ఎంపీలు పాల్గొన్నారు.
- Balaraju Goud
- Updated on: Dec 19, 2025
- 8:24 pm
రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు.. చిన్న చిన్న ఉద్రిక్తతల మధ్య ప్రశాంతం!
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఆధిక్యంతో దూసుకుపోతోంది. తొలి దశ ఎన్నికల తరహాలోనే రెండో విడతలో బీఆర్ఎస్, బీజేపీ మూడో స్ధానంలో కొనసాగుతున్నాయి. ఆదివారం (డిసెంబర్ 14) జరిగిన రెండో దశ సర్పంచ్ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి.ఎన్నికల్లో ఓ సర్పంచ్ అభ్యర్థి భర్త మిస్సింగ్ మిగతా అభ్యర్థులను టెన్షన్ పెట్టింది.
- Balaraju Goud
- Updated on: Dec 14, 2025
- 8:59 pm
Nitin Nabin: బీజేపీ కొత్త జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి ఏం చదువుకున్నారు.. ఆస్తి ఎంతో తెలుసా..?
నితీష్ కుమార్ ప్రభుత్వంలో పిడబ్ల్యుడి మంత్రిగా ఉన్న నితిన్ నబిన్ సిన్హాను తన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. ఆయన ఐదవసారి బంకిపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మొదటిసారి 2021లో నితీష్ కుమార్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు.
- Balaraju Goud
- Updated on: Dec 14, 2025
- 7:28 pm
బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబిన్.. అభినందించిన ప్రధాని మోదీ
భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిని ప్రకటించింది. బీహార్ మంత్రి నితిన్ నబిన్ పార్టీ కొత్త తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన జెపి నడ్డా స్థానంలో పార్టీ కొత్త నాయకుడిగా నియమితులవుతారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన నితిన్ నవీన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా అభినందించారు.
- Balaraju Goud
- Updated on: Dec 14, 2025
- 7:00 pm
Kishan Reddy: భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితి.. ఏకపక్షంగా జీవో తీసుకొచ్చారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భూములు అమ్మకపోతే తెలంగాణ ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.. HILT పాలసీ పేరుతో మరో భూదందాకు తెరలేపారని, 9వేల ఎకరాలు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏకపక్షంగా జీవో తీసుకొచ్చి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని.. కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: Dec 4, 2025
- 8:49 am
ఢిల్లీలో మరోసారి రెపరెపలాడిన కాషాయ జెండా.. ఒకే స్థానానికే పరిమితమైన కాంగ్రెస్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హవా చూపించింది. 12 డివిజన్లకు జరిగిన ఉపఎన్నికల్లో 7 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. మిగతా ఐదు స్థానాల్లో మూడింటిని ఆమ్ ఆద్మీ పార్టీ.. ఒకటి కాంగ్రెస్ గెలుచుకోగా.. మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. నవంబర్ 30న జరిగిన ఎన్నికల ఫలితాలను ఈరోజు (డిసెంబర్ 3న) ప్రకటించారు.
- Balaraju Goud
- Updated on: Dec 3, 2025
- 12:51 pm
దేవుళ్లపై రేవంత్రెడ్డి హాట్ కామెంట్స్.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై భగ్గుమంటున్న బీజేపీ నేతలు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు బీజేపీ నేతలు. మూడు కోట్ల హిందు దేవతలున్నారని ఒక్కొక్కరు ఒక్కో ఓదేవుడిని నమ్ముతారని, అన్ని రకాల దేవుళ్లు ఉన్నట్టే కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల వ్యక్తులు ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. దేవుళ్లపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
- Balaraju Goud
- Updated on: Dec 3, 2025
- 10:34 am
Parliament Winter Session: రేపట్నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లులు ఇవే!
ఢిల్లీ వాయు కాలుష్యం ఈసారి పార్లమెంట్ను కమ్మేయనుంది.. అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రజలు శ్వాసించాలంటే భయపడేలా ఉన్న వాయు నాణ్యత గురించి దేశ అత్యున్నత చట్ట సభ అయిన పార్లమెంట్లో చర్చ పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తనున్నాయి. సోమవారం మొదలై డిసెంబర్ 19 వరకు 15 సిట్టింగుల్లో జరిగే సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి.
- Gopikrishna Meka
- Updated on: Nov 30, 2025
- 12:59 pm
పల్లెల్లో ‘పంచాయతీ’ సందళ్లు.. ఊరుఊరంతా ఒకటే గుసగుస..! ఇంతకీ ఊరికి మొనగాడు ఎవరు?
సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు చోటు లేదు. తమ గ్రామాన్ని పాలించేందుకు.. తమలో ఒకరిని 'ప్రెసిడెంట్'ను చేసుకునేందుకు ప్రజలు ఎన్నుకునే ఎన్నిక ఇది. స్వపరిపాలనకు అసలైన అర్ధం ఈ సర్పంచ్ ఎన్నికలు. బట్.. ఇప్పుడా పరిస్థితి లేదనుకోండి. గ్రామాల్లో ఎవరు సర్పంచ్ అభ్యర్ధిగా నిలబడాలో శాసించేది ఆఖరికి రాజకీయ పార్టీలే అవుతున్నాయి. పోటీ చేయాలనుకున్న అభ్యర్ధుల కూడా రాజకీయ పార్టీల అండదండలు కోరుకుంటున్నారు. పార్టీల జోక్యం ఉంటోంది కాబట్టే ఎన్నికలు మరింత రంజుగా సాగుతున్నాయి. సో, ఊళ్లల్లో పైచేయి 'చేతి' గుర్తుదా, కారుదా, కమలమా, సుత్తికొడవలా, కంకి కొడవలా, పతంగినా.. ఎవరు బలపరిచిన అభ్యర్ధి గెలుస్తాడనే దానిపైనే ఇప్పుడు చర్చంతా జరుగుతోంది. ఇంతకీ.. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది?
- Balaraju Goud
- Updated on: Nov 26, 2025
- 9:53 pm
కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం.. బీజేపీ ఏమన్నదంటే..?
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా హాట్ టాపిక్ మాత్రం హైదరాబాదే..! తెలంగాణ ఏర్పాటు సందర్భం నుంచి రెగ్యూలర్గా వినిపించే ప్రచారం.. యూనియన్ టెర్రిటరీ అంటే కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్. ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం జరగుతోంది. దీనిపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండించింది.
- Vidyasagar Gunti
- Updated on: Nov 25, 2025
- 8:00 pm
కాషాయ దళం కీలక నిర్ణయం.. కేంద్ర కేబినెట్తోపాటు పార్టీలో భారీ ప్రక్షాళన..!
బీహార్ ఫలితాలతో ఫుల్ జోష్లో ఉంది ఎన్డీయే సర్కార్. రెండు అంశాలపై కీలకంగా దృష్టిపెట్టబోతోంది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం. జాతీయ అధ్యక్షుడి ఎంపికని ఫైనల్ చేయటంతో పాటు.. కేంద్రమంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేపట్టబోతోంది. అదే సమయంలో పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికలపై వ్యూహాలకు పదునుపెట్టబోతోంది.
- Balaraju Goud
- Updated on: Nov 18, 2025
- 8:06 am