బీజేపీ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారత దేశంలో ఒక జాతీయ రాజకీయ పార్టీ. ప్రస్తుతం బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉంది. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పార్టీ అధికారంలో ఉంది. హిందూ జాతీయవాద సిద్ధాంతంతో ఆ పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించింది.
1980లో బీజేపీ ఏర్పడింది. 1984 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత రామమందిరం విషయంలో జరిగిన ఉద్యమంతో ఆ పార్టీ చాలా ఊపందుకుంది. 1996లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే పూర్తి మెజార్టీ లేకపోవడంతో 13 రోజులకే ప్రధాని పదవికి అటల్ బిహారీ వాజ్పేయి రాజీనామా చేశారు. 1998 ఎన్నికల తర్వాత 13 మాసాల పాటు మాత్రమే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి 2004 వరకు పూర్తి ఐదేళ్లు పదవీకాలం కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత పదేళ్లపాటు కేంద్రంలో బీజేపీ అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది.
2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. దీని తర్వాత 2019లో అంతకంటే పెద్ద విజయం సాధించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, యూనిఫాం సివిల్ కోడ్ మొదలైనవి బిజెపి ప్రధాన ఎజెండా. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మాణం, జమ్మూ కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగింపును పూర్తి చేసింది. బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు.
Kishan Reddy: భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితి.. ఏకపక్షంగా జీవో తీసుకొచ్చారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భూములు అమ్మకపోతే తెలంగాణ ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.. HILT పాలసీ పేరుతో మరో భూదందాకు తెరలేపారని, 9వేల ఎకరాలు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏకపక్షంగా జీవో తీసుకొచ్చి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని.. కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: Dec 4, 2025
- 8:49 am
ఢిల్లీలో మరోసారి రెపరెపలాడిన కాషాయ జెండా.. ఒకే స్థానానికే పరిమితమైన కాంగ్రెస్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హవా చూపించింది. 12 డివిజన్లకు జరిగిన ఉపఎన్నికల్లో 7 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. మిగతా ఐదు స్థానాల్లో మూడింటిని ఆమ్ ఆద్మీ పార్టీ.. ఒకటి కాంగ్రెస్ గెలుచుకోగా.. మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. నవంబర్ 30న జరిగిన ఎన్నికల ఫలితాలను ఈరోజు (డిసెంబర్ 3న) ప్రకటించారు.
- Balaraju Goud
- Updated on: Dec 3, 2025
- 12:51 pm
దేవుళ్లపై రేవంత్రెడ్డి హాట్ కామెంట్స్.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై భగ్గుమంటున్న బీజేపీ నేతలు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు బీజేపీ నేతలు. మూడు కోట్ల హిందు దేవతలున్నారని ఒక్కొక్కరు ఒక్కో ఓదేవుడిని నమ్ముతారని, అన్ని రకాల దేవుళ్లు ఉన్నట్టే కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల వ్యక్తులు ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. దేవుళ్లపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
- Balaraju Goud
- Updated on: Dec 3, 2025
- 10:34 am
Parliament Winter Session: రేపట్నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లులు ఇవే!
ఢిల్లీ వాయు కాలుష్యం ఈసారి పార్లమెంట్ను కమ్మేయనుంది.. అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రజలు శ్వాసించాలంటే భయపడేలా ఉన్న వాయు నాణ్యత గురించి దేశ అత్యున్నత చట్ట సభ అయిన పార్లమెంట్లో చర్చ పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తనున్నాయి. సోమవారం మొదలై డిసెంబర్ 19 వరకు 15 సిట్టింగుల్లో జరిగే సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి.
- Gopikrishna Meka
- Updated on: Nov 30, 2025
- 12:59 pm
పల్లెల్లో ‘పంచాయతీ’ సందళ్లు.. ఊరుఊరంతా ఒకటే గుసగుస..! ఇంతకీ ఊరికి మొనగాడు ఎవరు?
సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు చోటు లేదు. తమ గ్రామాన్ని పాలించేందుకు.. తమలో ఒకరిని 'ప్రెసిడెంట్'ను చేసుకునేందుకు ప్రజలు ఎన్నుకునే ఎన్నిక ఇది. స్వపరిపాలనకు అసలైన అర్ధం ఈ సర్పంచ్ ఎన్నికలు. బట్.. ఇప్పుడా పరిస్థితి లేదనుకోండి. గ్రామాల్లో ఎవరు సర్పంచ్ అభ్యర్ధిగా నిలబడాలో శాసించేది ఆఖరికి రాజకీయ పార్టీలే అవుతున్నాయి. పోటీ చేయాలనుకున్న అభ్యర్ధుల కూడా రాజకీయ పార్టీల అండదండలు కోరుకుంటున్నారు. పార్టీల జోక్యం ఉంటోంది కాబట్టే ఎన్నికలు మరింత రంజుగా సాగుతున్నాయి. సో, ఊళ్లల్లో పైచేయి 'చేతి' గుర్తుదా, కారుదా, కమలమా, సుత్తికొడవలా, కంకి కొడవలా, పతంగినా.. ఎవరు బలపరిచిన అభ్యర్ధి గెలుస్తాడనే దానిపైనే ఇప్పుడు చర్చంతా జరుగుతోంది. ఇంతకీ.. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది?
- Balaraju Goud
- Updated on: Nov 26, 2025
- 9:53 pm
కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం.. బీజేపీ ఏమన్నదంటే..?
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా హాట్ టాపిక్ మాత్రం హైదరాబాదే..! తెలంగాణ ఏర్పాటు సందర్భం నుంచి రెగ్యూలర్గా వినిపించే ప్రచారం.. యూనియన్ టెర్రిటరీ అంటే కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్. ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం జరగుతోంది. దీనిపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండించింది.
- Vidyasagar Gunti
- Updated on: Nov 25, 2025
- 8:00 pm
కాషాయ దళం కీలక నిర్ణయం.. కేంద్ర కేబినెట్తోపాటు పార్టీలో భారీ ప్రక్షాళన..!
బీహార్ ఫలితాలతో ఫుల్ జోష్లో ఉంది ఎన్డీయే సర్కార్. రెండు అంశాలపై కీలకంగా దృష్టిపెట్టబోతోంది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం. జాతీయ అధ్యక్షుడి ఎంపికని ఫైనల్ చేయటంతో పాటు.. కేంద్రమంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేపట్టబోతోంది. అదే సమయంలో పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికలపై వ్యూహాలకు పదునుపెట్టబోతోంది.
- Balaraju Goud
- Updated on: Nov 18, 2025
- 8:06 am
బీహారీలు మత విషాన్ని తిరస్కరించారు.. అభివృద్ధి ఎజెండాను ఆమోదించారుః ప్రధాని మోదీ
బీహార్ ప్రజలకు రాజకీయాలు నేర్పించాల్సిన అవసరం లేదని, వారo ప్రపంచానికి రాజకీయాలను వివరిస్తారని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ సూరత్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ, బీహార్ కుల ఆధారిత రాజకీయాలను తిరస్కరించిందని అన్నారు. బీహార్ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని ఆయన అన్నారు.
- Balaraju Goud
- Updated on: Nov 15, 2025
- 7:00 pm
కులం లేదు.. కూటమి లేదు.. ఓటర్ నాడి పట్టిన నేత.. వన్ అండ్ ఓన్లీ వన్మేన్ షో!
ప్రతి ఎన్నికలోనూ మోదీ స్ట్రాటజీ మారుతుంది. ప్రతి రాష్ట్రంలోనూ ఆయన ప్రసంగం తీరు చేంజ్ అవుతుంది. రొడ్డకొట్టుడు ఉపన్యాసాలు, పసలేని విమర్శలు ఆయన నోటి నుంచి రావు. ప్రజలకేం కావాలో, ప్రజలు తన పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారో అర్థం చేసుకున్నాకే ఆయన వ్యూహాలుంటాయి. ఎత్తులుంటాయి. అందుకే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నమో జైత్రయాత్ర కొనసాగుతున్నది.
- Balaraju Goud
- Updated on: Nov 14, 2025
- 9:57 pm
దూసుకెళ్లిన ఎన్డీయే.. చతికిలపడ్డ మహాఘట్ బంధన్.. ఓటమికి అసలు కారణం ఆ ఒక్క మాట..!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్ బంధన్.. మహా ఓటమి పాలైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి అధికార కూటమి హవా చూపించింది. RJD, కాంగ్రెస్ల అడ్రస్ గల్లంతయింది. దీనికి కారణం ఒకే ఒక మాట. ఆ మాట వింటే బీహారీల వెన్నులో వణుకు పుడుతుంది. అదే ఈసారి కూడా మహాఘట్ బంధన్ని అధికారానికి దూరంగా ఉంచిందా?
- Balaraju Goud
- Updated on: Nov 14, 2025
- 9:13 pm