AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ

బీజేపీ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారత దేశంలో ఒక జాతీయ రాజకీయ పార్టీ. ప్రస్తుతం బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉంది. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పార్టీ అధికారంలో ఉంది. హిందూ జాతీయవాద సిద్ధాంతంతో ఆ పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించింది.

1980లో బీజేపీ ఏర్పడింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత రామమందిరం విషయంలో జరిగిన ఉద్యమంతో ఆ పార్టీ చాలా ఊపందుకుంది. 1996లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే పూర్తి మెజార్టీ లేకపోవడంతో 13 రోజులకే ప్రధాని పదవికి అటల్ బిహారీ వాజ్‌పేయి రాజీనామా చేశారు. 1998 ఎన్నికల తర్వాత 13 మాసాల పాటు మాత్రమే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి 2004 వరకు పూర్తి ఐదేళ్లు పదవీకాలం కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత పదేళ్లపాటు కేంద్రంలో బీజేపీ అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది.

2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. దీని తర్వాత 2019లో అంతకంటే పెద్ద విజయం సాధించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, యూనిఫాం సివిల్ కోడ్ మొదలైనవి బిజెపి ప్రధాన ఎజెండా. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మాణం, జమ్మూ కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగింపును పూర్తి చేసింది. బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు.

ఇంకా చదవండి

Andhra: స్వర్ణాంధ్ర దిశగా పన్నెండో అడుగు.. పడుతూ లేస్తూనే ప్రగతి వైపు..!

రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంపై విస్తృత చర్చ జరుగుతోంది. రాజధాని లేకుండా ప్రారంభమైన రాష్ట్ర ప్రయాణం రాజకీయ మార్పులు, పాలనా విధానాల ప్రభావంతో ఎన్నో మలుపులు తిరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అమరావతి పునర్నిర్మాణం, భారీ పెట్టుబడుల ఆకర్షణ, పోలవరం ప్రాజెక్టు పురోగతి, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను ప్రభుత్వం విజయాలుగా చెబుతోంది.

తిరుపతిలో కూటమి గర్జన.. రెండేళ్ల పాలనపై ప్రజల ముందుకు ప్రోగ్రెస్ కార్డ్!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తిరుపతి వేదికగా శుక్రవారం (జూన్ 12) భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. "2 ఏళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం" పేరుతో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. గత రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రజలకు సమగ్ర నివేదిక అందించేందుకు ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది.

Tamil Nadu: బీజేపీతో డీఎంకే చేతులు కలుపుతుందా..? క్లారిటీ ఇచ్చిన మాజీ కేంద్ర మంత్రి!

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన డీఎంకే ఇప్పుడు రాజకీయంగా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూటమిలోని ప్రధాన మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరమవుతుండటంతో డీఎంకే భవిష్యత్ వ్యూహంపై చర్చలు జోరందుకున్నాయి. ఇదే సమయంలో డీఎంకే బీజేపీతో చేతులు కలపబోతోందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

మీనాక్షి నటరాజన్‌కు షాక్.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎన్నిక ఏకగ్రీవం..!

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థులు రజనీష్ అగర్వాల్, తరుణ్ చుగ్, మహేష్ కేవత్ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఎన్నిక అనివార్యం కాకుండా పోయింది. దీంతో ఓటింగ్ నిర్వహించాల్సిన అవసరం లేకుండానే ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజేతలుగా ప్రకటించబడ్డారు.

మమతా బెనర్జీకి భారీ షాక్.. రాజ్యసభకు మరో ఎంపీ సుష్మితా దేవ్ రాజీనామా..!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. 15 ఏళ్ల అధికారానికి బ్రేక్ పడటమే కాకుండా, అధినేత్రి మమతా బెనర్జీ సైతం ఓడిపోవడంతో పార్టీపై ఆమె పట్టు సడలుతోంది. తాజాగా టీఎంసీ కీలక నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్ తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

తేల్చుకుందాం రా..! రెండేళ్లు Vs పదేళ్లు.. ఇష్యూ ఏదైనా బస్తీ మే సవాల్

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తన రెండున్నరేళ్ల పాలనను బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనతో పోల్చుతూ బహిరంగ సవాల్ విసిరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం, ధాన్యం కొనుగోళ్లు, నీటి పంపకాల వంటి కీలక అంశాలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఆరోపణలు-ప్రత్యారోపణలు ముదురుతున్నాయి. 2028 ఎన్నికల లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు ప్రజా సమస్యలనే అస్త్రంగా చేసుకుని రాజకీయ సమరానికి సిద్ధమవుతున్నాయి.

‘కేటీఆర్‌తో లోకేష్ సరితూగలేరు.. నాయకుడిగా మరింత ఎదగాల్సి ఉంది’: కడియం

టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌ నిర్వహించిన ‘క్రాస్‌ఫైర్’ ఇంటర్వ్యూలో మాజీమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏపీ రాజకీయాలు, తెలుగు దేశం పార్టీ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, నేతలపై స్పందిస్తూ.. నారా లోకేష్ ఇంకా తండ్రి చాటు కుమారుడిగానే ప్రొజెక్ట్ అవుతున్నారని, నాయకుడిగా ఆయన మరింత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.

“రేవంత్‌ను తక్కువ అంచనా వేయొద్దు.. మళ్లీ గెలిచే సత్తా ఉంది”: క్రాస్‌ఫైర్‌లో కడియం కీలక వ్యాఖ్యలు!

టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌ నిర్వహించిన ‘క్రాస్‌ఫైర్’ ఇంటర్వ్యూలో మాజీమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలంగాణ రాజకీయాలు, పార్టీల భవిష్యత్తుపై ఆసక్తికర విశ్లేషణలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర ఆర్థిక సవాళ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

కాలం మారింది.. రికార్డు మారింది! నాడు రేడియో కాలపు రాజకీయం.. నేడు రీల్స్ కాలపు పోరాటం..!

భారత ప్రజాస్వామ్య చరిత్రలో జూన్ 10 ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ప్రస్తుత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజున ఒక అరుదైన, చారిత్రాత్మక రికార్డును తన పేరిట లిఖించుకోనున్నారు. స్వతంత్ర భారతదేశంలో ఎన్నికల ద్వారా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన నిలవనున్నారు. దీంతో, దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నెలకొల్పిన సుదీర్ఘ కాలపు రికార్డును నరేంద్ర మోదీ అధిగమించనున్నారు.

కీలక పదవులు ఇచ్చిన పార్టీలను మోసం చేశారా? రాజకీయ చరమాంకంలో కడియం ఇబ్బందులు పడుతున్నారా ?

టీవీ9 'క్రాస్ ఫైర్' ఇంటర్వ్యూలో మాజీ మంత్రి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయ భవిష్యత్తుపై కీలక విశ్లేషణ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్థిక సవాళ్లు ఉన్నాయని, గత ప్రభుత్వ అప్పుల భారంతో పాటు కేంద్రం నుంచి ఆశించిన సాయం అందడం లేదని పేర్కొన్నారు. తానూ సాంకేతికంగా తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నప్పటికీ, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

అనుకున్న చోట ఆత్మగౌరవం తగ్గితే.. కటీఫ్ కొట్టి బైటికొస్తేనే.. కింగ్‌సైజ్ లైఫ్..!

నాక్కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది.. ఇది తెలుగునాట పవర్‌స్టార్ సినిమా డైలాగైతే కావొచ్చు. సేమ్‌టైమ్ తమిళనాట అన్నామలై మేనరిజమ్ కూడా అదే. శాలువాలు కప్పించుకోడానికో, ఏదో ఒక కుర్చీ కోసం కుస్తీ పట్టడానికో, ఎమ్మెల్యే ఎంపీ అని కారుకి స్టిక్కర్ అతికించుకోడానికో నేను రాజకీయాల్లోకి రాలేదు.. యంగ్ తమిళనాడును ఆవిష్కరించడానికి, ద్రవిడ బిడ్డలకు బెటర్ లైఫ్ ఇవ్వడానికే వచ్చా..! తనకు టిక్కెట్ నిరాకరించడంపై తన మీదొస్తున్న ఊహాగానాలకు జవాబిస్తూ ఆరునెలల కిందట అన్నామలై ఇచ్చిన ప్రకటన ఇది. పొలిటికల్‌గా ఎదగాలంటే ఏం చేయాలో ఎలా ఉండాలో నాకు తెలుసు, ఎలా మాట్లాడితే జనానికి దగ్గరౌతామన్న క్లారిటీ కూడా ఉంది. ఏ ఒక్క శక్తీ నన్ను, నా పొలిటికల్ మేనరిజాన్నీ మార్చలేరు అన్నప్పుడు అన్నామలై తెగింపును చూసి టోటల్ తమిళనాడుకే ముచ్చటేసింది. ఇప్పటికే గ్రౌండ్‌వర్క్ ప్రిపేర్ చేసుకున్నా.. కొత్త పార్టీ పెట్టుడు పక్కా, పోటీ చేయుడూ పక్కా.. పవర్‌లోకి వచ్చుడూ పక్కా అనే రేంజ్‌లో ఉంది అన్నామలై కటీఫ్ స్టేట్‌మెంట్. తన పొలిటికల్ ఫ్యూచర్‌పై దేశమంతా జరుగుతున్న డిబేట్లకు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు అభినవ ఫైర్‌బ్రాండ్ అన్నామలై. కమలం పార్టీకి రామ్‌రామ్‌ చెప్పి, ఎర్రజెండా ఎగరేసిన ఈ చిచ్చరపిడుక్కి ఇన్‌స్పిరేషన్ ఎవరు? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కూడా ధిక్కరించి ఏం చెయ్యదల్చుకున్నాడు? కొత్త కుంపటిని దిగ్విజయంగా వెలిగించుకునే సత్తా అన్నామలైకు ఉందా?

తమిళనాడు బీజేపీలో రాజుకున్న కుంపటి.. అన్నామలై తర్వాత ఉపాధ్యక్షుడు, కార్యదర్శితో పాటు మరో 14 మంది అవుట్!

తమిళనాడు రాజకీయాల్లో శుక్రవారం (జూన్ 5, 2026) ఒక పెను సంచలనం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ (BJP) తమిళనాడు విభాగం తీవ్ర రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది. పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై బీజేపీకి రాజీనామా చేయడంతో మొదలైన ఈ ప్రకంపనలు.. పార్టీని నిలువునా ముంచేసే స్థాయికి చేరాయి.

మెల్లకన్ను ఉన్నవారు ఈ పల్లెటూరి ఆకుల సూప్ తాగితే.. చూపు మరింత
మెల్లకన్ను ఉన్నవారు ఈ పల్లెటూరి ఆకుల సూప్ తాగితే.. చూపు మరింత
‘వర్క్ ఫ్రమ్ బైక్’ యువకుడికి సీపీ స్ట్రాంగ్ వార్నింగ్
‘వర్క్ ఫ్రమ్ బైక్’ యువకుడికి సీపీ స్ట్రాంగ్ వార్నింగ్
ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం..
ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం..
అప్పుడు తోపు నటుడు.. ఇప్పుడు వాచ్‌మెన్‌గా..
అప్పుడు తోపు నటుడు.. ఇప్పుడు వాచ్‌మెన్‌గా..
పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పండుగల సమయంలో రైతులకు ఇదే పరమాన్నం
పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పండుగల సమయంలో రైతులకు ఇదే పరమాన్నం
వారెవ్వా.. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారిని గాల్లోనే..
వారెవ్వా.. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారిని గాల్లోనే..
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..