బీజేపీ

బీజేపీ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారత దేశంలో ఒక జాతీయ రాజకీయ పార్టీ. ప్రస్తుతం బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉంది. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పార్టీ అధికారంలో ఉంది. హిందూ జాతీయవాద సిద్ధాంతంతో ఆ పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించింది.

1980లో బీజేపీ ఏర్పడింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత రామమందిరం విషయంలో జరిగిన ఉద్యమంతో ఆ పార్టీ చాలా ఊపందుకుంది. 1996లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే పూర్తి మెజార్టీ లేకపోవడంతో 13 రోజులకే ప్రధాని పదవికి అటల్ బిహారీ వాజ్‌పేయి రాజీనామా చేశారు. 1998 ఎన్నికల తర్వాత 13 మాసాల పాటు మాత్రమే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి 2004 వరకు పూర్తి ఐదేళ్లు పదవీకాలం కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత పదేళ్లపాటు కేంద్రంలో బీజేపీ అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది.

2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. దీని తర్వాత 2019లో అంతకంటే పెద్ద విజయం సాధించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, యూనిఫాం సివిల్ కోడ్ మొదలైనవి బిజెపి ప్రధాన ఎజెండా. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మాణం, జమ్మూ కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగింపును పూర్తి చేసింది. బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు.

ఇంకా చదవండి

Budget 2025: తెలంగాణకు అన్యాయం.. బడ్జెట్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫైర్.. బీజేపీ కౌంటర్..

బడ్జెట్‌పై తెలంగాణలో మిశ్రమ స్పందన వచ్చింది. తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు బీజేపీని కార్నర్ చేస్తూ విమర్శలు చేస్తుంటే.. వాటిని తిప్పి కొడుతున్నారు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు.. కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ స్పందన ఏంటి..? కేంద్రమంత్రులు ఏమని కౌంటర్ ఇచ్చారు..? ఈ కథనంలో చూడండి..

Budget 2025: ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్ మార్పు.. మీ జీతంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..?

పన్ను సంస్కరణల్లో కీలక ముందడుగు వేస్తున్నట్లు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వచ్చేవారం కొత్త ఇన్‌కమ్‌ట్యాక్స్‌ బిల్లు ప్రవేశపెడతామని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్‌, రిటర్న్‌ల ప్రాసెసింగ్‌ను వేగవంతం చేస్తామన్నారు నిర్మల. అయితే కొత్త స్లామ్ ప్రకారం ఆదాయ పన్ను ఎలా లెక్కిస్తారో తెలుసా?

Budget 2025: అసెంబ్లీ ఎన్నికల వేళ బిహార్‌కు వరాల జల్లు.. భారీగా కేటాయింపులు..

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌కు కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు ప్రకటించింది. కేంద్ర బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేశారు. బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు నిర్మలా సీతారామన్.. దీనిద్వారా.. బీహార్ రైతులకు భారీగా లబ్ది చేకూరనుంది.

Economic Survey: ఫుడ్ రేట్లు తగ్గుతాయా.. ద్రవ్యోల్బణం నుంచి రిలీఫ్ ఉంటుందా..? ఆర్థిక సర్వే రిపోర్ట్

అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ, ఆర్థికవ్యవస్థ ధృడంగా ఉందని ఆర్థికసర్వే భరోసా ఇచ్చింది. అదే సమయంలో ఆహారధరల భారం సామాన్యుడిపై రెట్టింపు అయిందని ఆర్థికసర్వే తెలిపింది. ఫిబ్రవరి 1న వచ్చే బడ్జెట్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టింది. పదేళ్లపాటు 8శాతం జీడీపీ వృద్ధిరేటు ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.

Budget 2025: తాయిలాల తీపి కబురు కోసం సామాన్యుడి నిరీక్షణ.. నిర్మలమ్మ మ్యాజిక్ చేసేనా..?

ఫిబ్రవరి 1నే మన కేంద్ర బడ్జెట్. ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలు.. ఇంకెన్నో సంకేతాలతో బడ్జెట్ 2025 రాబోతోంది. ఏరంగానికి ఎంత కేటాయిస్తారో ఇప్పటికే నిపుణులు ఓ అంచనాకొస్తున్నారు. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం.. ఆమెప్రకటించే తాయిలాల కోసం సగటి భారతీయుడు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు..!

Budget 2025: జాతీయ అభివృద్ధికి బ్లూప్రింట్‌ రెఢి.. కొత్తబడ్జెట్ ఊపునిస్తుందా.. ఉసూరుమనిపిస్తుందా..?

ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. కేంద్ర బడ్జెట్ అనేది భారత ప్రభుత్వం ఆర్థిక నివేదిక. కేంద్ర బడ్జెట్ కేవలం ఆర్థిక పత్రం మాత్రమే కాదు, ఇది జాతీయ అభివృద్ధి కోసం ఒక బ్లూప్రింట్‌ను అందిస్తుంది. దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలతో తక్షణ అవసరాలను సమతుల్యం చేస్తుంది. ఇది స్థిరమైన అభివృద్ధి, సామాజిక సంక్షేమం, వ్యూహాత్మక జాతీయ అభివృద్ధికి ప్రభుత్వ నిబద్ధత గురించి కూడా తెలియజేస్తుంది.

BJP vs Congress: తెలంగాణలో పద్మ అవార్డుల పంచాయితీ..! కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం

తెలంగాణలో పద్మ అవార్డుల పంచాయితీ తెగడం లేదు. ఈ వ్యవహారంపై ఇటు కాంగ్రెస్‌..అటు బీజేపీ నేతలు తగ్గేదే లేదంటూ కౌంటర్లు విసురుతున్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానిది..ముమ్మాటికి వివక్షే అని మండిపడుతోంది కాంగ్రెస్‌ పార్టీ. అటు బీజేపీ మాత్రం..లిస్ట్‌ పంపించినంత మాత్రాన అనర్హులకు అవార్డులు ఇవ్వాలా అంటూ ప్రశ్నిస్తోంది..?

Delhi Election-2025: ఉత్కంఠ రేపుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఏ పార్టీ ఏమేమి హామీలు ఇచ్చాయి?

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న ఓటింగ్ నిర్వహించి, ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల హామీలతో ఓటర్లను తెగ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా కేంద్రంగా పథకాలను ప్రవేశపెట్టేందుకు ఉచితాలు అందించే పోటీ పడుతున్నాయి. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రధాన ప్రత్యర్థి బీజేపీ, కాంగ్రెస్ ఓటర్లలో పట్టు సాధించేందుకు ఒకే తరహాలో అనేక ఉచితాలను ప్రకటించాయి.

Liquor Ban: మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఇకపై ఆ ప్రాంతాల్లో లిక్కర్ బంద్..!

మధ్యప్రదేశ్‌లోని ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 17 ముఖ్య నగరాల్లో మద్య నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో మద్య నిషేధం దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో కొన్ని నగరాల్లో నిషేధాజ్ఞలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

బీజేపీకి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన మణిపూర్ జేడీయూ నేత.. ఇంతలోనే..!

మణిపూర్‌లో భారతీయ జనతా పార్టీ పాలిత ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే ఇది జరిగిన వెంటనే, బీజేపీ ప్రభుత్వానికి జేడీయూ మద్దతు కొనసాగుతుందని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే మణిపూర్‌లో జేడీయూ పార్టీ నేతకు ఉద్వాసన పలికారు.