బీజేపీ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారత దేశంలో ఒక జాతీయ రాజకీయ పార్టీ. ప్రస్తుతం బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉంది. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పార్టీ అధికారంలో ఉంది. హిందూ జాతీయవాద సిద్ధాంతంతో ఆ పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించింది.
1980లో బీజేపీ ఏర్పడింది. 1984 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత రామమందిరం విషయంలో జరిగిన ఉద్యమంతో ఆ పార్టీ చాలా ఊపందుకుంది. 1996లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే పూర్తి మెజార్టీ లేకపోవడంతో 13 రోజులకే ప్రధాని పదవికి అటల్ బిహారీ వాజ్పేయి రాజీనామా చేశారు. 1998 ఎన్నికల తర్వాత 13 మాసాల పాటు మాత్రమే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి 2004 వరకు పూర్తి ఐదేళ్లు పదవీకాలం కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత పదేళ్లపాటు కేంద్రంలో బీజేపీ అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది.
2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. దీని తర్వాత 2019లో అంతకంటే పెద్ద విజయం సాధించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, యూనిఫాం సివిల్ కోడ్ మొదలైనవి బిజెపి ప్రధాన ఎజెండా. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మాణం, జమ్మూ కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగింపును పూర్తి చేసింది. బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు.
“చొరబాటుదారులు సామాను సర్దుకోండి.. అక్రమార్కులను వదిలిపెట్టబోము” : ప్రధాని మోదీ
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ సందడి పెరుగుతోంది. శనివారం (ఏప్రిల్ 11) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కట్వా నుండి బెంగాల్ ప్రజల మనోభావాలను వివరిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. తన వెనుక ఉన్న జనసమూహాన్ని చూపిస్తూ, "దేశవాసులారా, మీరు బెంగాల్ ప్రజల మనోభావాలను చూడవచ్చు" అని ఆయన అన్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 11, 2026
- 9:48 pm
రైతుల జీవనాధారంపై టీఎంసీ ప్రభుత్వం దెబ్బ కొట్టింది.. మమతాపై మండిపడ్డ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
రైతుల జీవనాధారంపై టీఎంసీ ప్రభుత్వం క్రూరమైన దాడి చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు. మమతా బెనర్జీ ప్రభుత్వం అహంకారంతో అన్నదాతలకు అన్యాయం చేస్తన్నారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర మార్కెట్ల తలుపులను బెంగాల్ రైతులకు మూసివేశారని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు.
- Balaraju Goud
- Updated on: Apr 11, 2026
- 5:39 pm
అందరికీ సమాన అవకాశాలు, ఒకే చట్టం.. బెంగాల్లో యూసీసీని అమలు చేసి తీరుతామన్న అమిత్ షా
బెంగాల్లోని చట్టానా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఒక ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ అవినీతి కారణంగా అవకాశాలు కోల్పోయిన యువతకు బీజేపీ వయో సడలింపు కల్పిస్తుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామన్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 11, 2026
- 4:21 pm
నిరంకుశ ప్రభుత్వం కూలబోతోంది.. అభివృద్ధి చెందిన బెంగాల్ను నిర్మిస్తాంః ప్రధాని మోదీ
బెంగాల్లో బీజేపీ ప్రభంజనం వీస్తోందని, భవానీపూర్లో పరిస్థితి నందిగ్రామ్ మాదిరిగానే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నిరంకుశ ప్రభుత్వం కూలబోతోందని, బెంగాల్ మార్పు బాటలో పయనిస్తోందని, ఈ ఎన్నికలు అభివృద్ధి చెందిన బెంగాల్ను నిర్మించబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు. బెంగాల్ వ్యాప్తంగా మార్పుల తుఫాను వీస్తోందని ప్రధానమంత్రి అన్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 9, 2026
- 3:27 pm
Kerala Assembly Election: ఎన్నికల బరిలో ఎంతమంది నేరస్థులు, ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారో తెలుసా?
కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో నిమగ్నమై ఉన్నాయి. ఈ క్రమంలోనే, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులలో సుమారు 38% మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించగా, 39% మంది కోటీశ్వరులు ఉన్నట్లు పేర్కొంది.
- Balaraju Goud
- Updated on: Apr 5, 2026
- 12:12 pm
లోక్సభ ముందుకు ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లు.. మద్దతు పలికిన కాంగ్రెస్, వైసీపీ వాకౌంట్!
అమరావతి చట్టబద్ధతకు మరో కీలక అడుగు పడింది. ఇవాళ బుధవారం (ఏప్రిల్ 01, 2026 ) ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత లోక్సభ ముందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు తీసుకువచ్చారు. అయితే లోక్సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.
- Balaraju Goud
- Updated on: Apr 1, 2026
- 1:07 pm
Telangana: హాట్ హాట్గా సాగిన బడ్జెట్ సమావేశాల్లో ఏయే అంశాలకు ఆమోదం లభించిందంటే..?
పేరుకు బడ్జెట్ సెషన్ కాని.. జరిగిందంతా వేరే! గవర్నర్ ప్రసంగం నుంచే మొదలైన రభస స్టోన్ క్రషింగ్ వరకు పొలిటికల్ టెంపరేచర్ రోజు రోజుకు పెరిగింది. గాంధీ-గాడ్సేల నుంచి ఇందిరాగాంధీ వరకు.. ఎథిక్స్ కమిటీ నుంచి సీబీసీఐడీ వరకు.. సారీల నుంచి సవాళ్ల వరకు అధికార, విపక్షాలు ఢీ అంటే ఢీ అనేలా సాగాయి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.
- Balaraju Goud
- Updated on: Mar 31, 2026
- 7:42 am
మతాన్ని అవమానిస్తున్నారు.. వైన్స్ షాపులకు దేవుళ్ల పేర్లు తీసేయాలిః బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు అధికార విపక్షాల మధ్య వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే సరికొత్త డిమాండ్ను తెరపైకి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కొత్త ప్రతిపాదనలు తీసుకువచ్చారు.
- Balaraju Goud
- Updated on: Mar 26, 2026
- 1:27 pm
ఆర్జీ కార్ బాధితురాలి తల్లికి బీజేపీ టికెట్.. రత్న దేబ్నాథ్ ఆడబిడ్డల గొంతుక అవుతారుః కేంద్ర మంత్రి
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (BJP) బుధవారం (మార్చి 25) తన మూడవ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఆర్.జి. కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో లైంగికదాడి బాధితురాలు ట్రైనీ డాక్టర్ తల్లి రత్న దేబ్నాథ్తో సహా ఈ జాబితాలో 19 మంది అభ్యర్థులు ఉన్నారు.
- Balaraju Goud
- Updated on: Mar 26, 2026
- 8:22 am
మూడు ముక్కలాట! మూడు రాష్ట్రాల్లో ఉత్కంఠ భరితం.. బ్రేకప్ ఎవరికి.. విక్టరీ ఎవరిది..?
మూడు ప్రధాన రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ మరింత హీట్ పెంచాయి.. 2028లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగవు అంటున్నారు సీఎం రేవంత్. అంటే అర్థం.. జమిలి రాబోతోందనేగా..! అలా జమిలి జరగాలంటే ఓ ఈక్వేషన్ పాస్ అవ్వాలి. వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజారిటీ గెలిస్తే జమిలి ఎన్నికలు ఇక ఎంతో దూరం ఉండవు. సో, తమిళనాడులో పాగా వేయడం, బెంగాల్లో విజయం సాధించడం, అసోంలో మళ్లీ అధికారం, కేరళంలో బలమైన అడుగులు వేయడం, పుదుచ్చేరిలో సునాయాస విజయం సాధించడం.. ఈ ఈక్వేషన్ వర్కౌట్ అయితేనే బీజేపీ అనుకున్నది సాధ్యం. సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్కు ఓ అర్ధం. మరి అలా జరుగుతుందా? సాధ్యమేనా? తమిళనాట DMK వర్సెస్ అన్నా DMK.. మధ్యలో TVK. కేరళంలో NDF వర్సెస్ LDF.. మధ్యలో బీజేపీ. బెంగాల్లో దీదీ వర్సెస్ మోదీ.. మధ్యలో కాంగ్రెస్. ఇప్పుడిప్పుడే సీట్ల సర్దుబాటు, అభ్యర్ధుల ప్రకటన జరుగుతున్న వేళ.. ఆ మూడు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది?
- Balaraju Goud
- Updated on: Mar 18, 2026
- 9:50 pm
దేవేంద్ర ప్రధాన్ కృషి వల్లనే ఒడిశాలో బీజేపీ బలంగా ఎదిగింది: కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్
డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ ఒడిశా బీజేపీకి భీష్మ పితామహుడు.. అని ఆయన కృషి వలనే నేడు ఒడిశాలో బీజేపీ బలంగా, సుసంపన్నంగా ఎదిగిందని.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. డాక్టర్ ప్రధాన్ మొదటి వర్ధంతి సందర్భంగా భువనేశ్వర్లోని ఓయూఏటీ క్యాంపస్లో జరిగిన సంతాప సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు.
- Shaik Madar Saheb
- Updated on: Mar 18, 2026
- 1:18 pm
Telangana Assembly: మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. సభా సమరం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు నడిచింది. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.. మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ పలు పశ్నలు సంధించారు.
- Shaik Madar Saheb
- Updated on: Mar 18, 2026
- 10:39 am