AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ

బీజేపీ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారత దేశంలో ఒక జాతీయ రాజకీయ పార్టీ. ప్రస్తుతం బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉంది. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పార్టీ అధికారంలో ఉంది. హిందూ జాతీయవాద సిద్ధాంతంతో ఆ పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించింది.

1980లో బీజేపీ ఏర్పడింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత రామమందిరం విషయంలో జరిగిన ఉద్యమంతో ఆ పార్టీ చాలా ఊపందుకుంది. 1996లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే పూర్తి మెజార్టీ లేకపోవడంతో 13 రోజులకే ప్రధాని పదవికి అటల్ బిహారీ వాజ్‌పేయి రాజీనామా చేశారు. 1998 ఎన్నికల తర్వాత 13 మాసాల పాటు మాత్రమే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి 2004 వరకు పూర్తి ఐదేళ్లు పదవీకాలం కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత పదేళ్లపాటు కేంద్రంలో బీజేపీ అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది.

2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. దీని తర్వాత 2019లో అంతకంటే పెద్ద విజయం సాధించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, యూనిఫాం సివిల్ కోడ్ మొదలైనవి బిజెపి ప్రధాన ఎజెండా. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మాణం, జమ్మూ కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగింపును పూర్తి చేసింది. బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు.

ఇంకా చదవండి

యువతరానికి బీజేపీ బాధ్యతలు.. కొత్త అధ్యక్షుడిగా అతి పిన్న వయస్కుడైన నితిన్ నబిన్..!

భారతీయ జనతా పార్టీ (BJP) సీనియర్ నాయకుడు నితిన్ నబిన్ ఆ పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుత అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా స్థానంలో ఆయన ఈ ఉన్నత పదవిని చేపట్టారు. అత్యల్ప స్థాయి నుంచి ప్రారంభమై, జాతీయ స్థాయికి చేరుకున్న విస్తృతమైన అంతర్గత ఎంపిక ప్రక్రియ ఫలితంగా ఈ నియామకం జరిగింది. 45 సంవత్సరాల వయసులో ఆ పదవిని నిర్వహించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచారు.

27 ఏళ్ల థాకరే కుటుంబం కోట బద్దలైంది… BMCలో బీజేపీ-శివసేన అజేయమైన విక్టరీ

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. దీంతో ఆసియాలోనే అత్యంత సంపన్నమైన మున్సిపల్ సంస్థపై థాకరే కుటుంబం దీర్ఘకాలంగా కొనసాగిన ఆధిపత్యానికి ముగింపు పలికింది. ఇప్పుడు, చాలా కాలం తర్వాత, ముంబైకి బీజేపీ-శివసేన (షిండే వర్గం) నుండి మేయర్ రానున్నారు.

హైదరాబాద్ మెట్రోను L&T నుంచి టేకోవర్ చేసుకోని పేర్లను పంపండి.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణం.. ప్రతిపాదనలు, కమిటీ పేర్ల విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి .. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. L&T నుంచి 'మెట్రో నెట్వర్క్' ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ఆ తర్వాత మెట్రో రెండో దశ నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు పంపాలని కోరారు.

Kishan Reddy: ఉర్దూ యూనివర్సిటీ భూములను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు చూస్తున్నారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ భూముల అంశం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ఈ భూములను సొంతం చేసుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తోందంటూ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించడంతోపాటు.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

వంశపారంపర్య రాజకీయాలను అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది: అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడు డీఎంకే పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు పర్యటనలో భాగంగా అమిత్ షా ఆదివారం పుదుక్కోట్టైలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై దాడి చేసిన ఆయన, ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 ఏప్రిల్‌లో తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

మూడు రోజుల విరామం తర్వాత అసెంబ్లీ షురూ.. స్వయంగా 4బిల్లులు ప్రవేశ పెట్టబోతున్న సీఎం రేవంత్

మూడు రోజుల విరామం తర్వాత ఇవాళ (జనవరి 02) శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఇవాళ సభ వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఐదు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. మోటార్ వెహికల్స్ టాక్సేషన్ గెజిట్ నోటిఫికేషన్లు కూడా సభ ముందు ఉంచుతారని సమాచారం.

PM Modi: ముఖర్జీ స్వప్నాన్ని సాకారం చేశాం.. రాష్ట్రీయ ప్రేరణా స్థల్‌ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ..

లక్నోలో రాష్ట్రీయ ప్రేరణాస్థల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వాజ్‌పేయి, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయా, శ్యామాప్రసాద్‌ ముఖర్జీల 65 అడుగుల విగ్రహాలను ఆవిష్కరించారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ స్వప్నాన్ని సాకారం చేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

స్పీకర్ సమక్షంలో చాయ్‌ పే చర్చ.. హాజరైన ప్రధాని మోదీ, ప్రియాంకా గాంధీ

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. సమావేశాల నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా తేనీటి విందు ఇచ్చారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, రామ్మోహన్‌ నాయుడు, పలువురు అఖిలపక్ష ఎంపీలు పాల్గొన్నారు.

రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు.. చిన్న చిన్న ఉద్రిక్తతల మధ్య ప్రశాంతం!

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఆధిక్యంతో దూసుకుపోతోంది. తొలి దశ ఎన్నికల తరహాలోనే రెండో విడతలో బీఆర్ఎస్, బీజేపీ మూడో స్ధానంలో కొనసాగుతున్నాయి. ఆదివారం (డిసెంబర్ 14) జరిగిన రెండో దశ సర్పంచ్ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి.ఎన్నికల్లో ఓ సర్పంచ్‌ అభ్యర్థి భర్త మిస్సింగ్ మిగతా అభ్యర్థులను టెన్షన్ పెట్టింది.

Nitin Nabin: బీజేపీ కొత్త జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి ఏం చదువుకున్నారు.. ఆస్తి ఎంతో తెలుసా..?

నితీష్ కుమార్ ప్రభుత్వంలో పిడబ్ల్యుడి మంత్రిగా ఉన్న నితిన్ నబిన్‌ సిన్హాను తన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. ఆయన ఐదవసారి బంకిపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మొదటిసారి 2021లో నితీష్ కుమార్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు.

బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబిన్.. అభినందించిన ప్రధాని మోదీ

భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిని ప్రకటించింది. బీహార్ మంత్రి నితిన్ నబిన్ పార్టీ కొత్త తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన జెపి నడ్డా స్థానంలో పార్టీ కొత్త నాయకుడిగా నియమితులవుతారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నితిన్ నవీన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా అభినందించారు.

Kishan Reddy: భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితి.. ఏకపక్షంగా జీవో తీసుకొచ్చారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భూములు అమ్మకపోతే తెలంగాణ ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.. HILT పాలసీ పేరుతో మరో భూదందాకు తెరలేపారని, 9వేల ఎకరాలు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏకపక్షంగా జీవో తీసుకొచ్చి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని.. కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.