బీజేపీ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారత దేశంలో ఒక జాతీయ రాజకీయ పార్టీ. ప్రస్తుతం బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉంది. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పార్టీ అధికారంలో ఉంది. హిందూ జాతీయవాద సిద్ధాంతంతో ఆ పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించింది.
1980లో బీజేపీ ఏర్పడింది. 1984 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత రామమందిరం విషయంలో జరిగిన ఉద్యమంతో ఆ పార్టీ చాలా ఊపందుకుంది. 1996లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే పూర్తి మెజార్టీ లేకపోవడంతో 13 రోజులకే ప్రధాని పదవికి అటల్ బిహారీ వాజ్పేయి రాజీనామా చేశారు. 1998 ఎన్నికల తర్వాత 13 మాసాల పాటు మాత్రమే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి 2004 వరకు పూర్తి ఐదేళ్లు పదవీకాలం కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత పదేళ్లపాటు కేంద్రంలో బీజేపీ అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది.
2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. దీని తర్వాత 2019లో అంతకంటే పెద్ద విజయం సాధించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, యూనిఫాం సివిల్ కోడ్ మొదలైనవి బిజెపి ప్రధాన ఎజెండా. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మాణం, జమ్మూ కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగింపును పూర్తి చేసింది. బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు.
మూడు ముక్కలాట! మూడు రాష్ట్రాల్లో ఉత్కంఠ భరితం.. బ్రేకప్ ఎవరికి.. విక్టరీ ఎవరిది..?
మూడు ప్రధాన రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ మరింత హీట్ పెంచాయి.. 2028లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగవు అంటున్నారు సీఎం రేవంత్. అంటే అర్థం.. జమిలి రాబోతోందనేగా..! అలా జమిలి జరగాలంటే ఓ ఈక్వేషన్ పాస్ అవ్వాలి. వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజారిటీ గెలిస్తే జమిలి ఎన్నికలు ఇక ఎంతో దూరం ఉండవు. సో, తమిళనాడులో పాగా వేయడం, బెంగాల్లో విజయం సాధించడం, అసోంలో మళ్లీ అధికారం, కేరళంలో బలమైన అడుగులు వేయడం, పుదుచ్చేరిలో సునాయాస విజయం సాధించడం.. ఈ ఈక్వేషన్ వర్కౌట్ అయితేనే బీజేపీ అనుకున్నది సాధ్యం. సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్కు ఓ అర్ధం. మరి అలా జరుగుతుందా? సాధ్యమేనా? తమిళనాట DMK వర్సెస్ అన్నా DMK.. మధ్యలో TVK. కేరళంలో NDF వర్సెస్ LDF.. మధ్యలో బీజేపీ. బెంగాల్లో దీదీ వర్సెస్ మోదీ.. మధ్యలో కాంగ్రెస్. ఇప్పుడిప్పుడే సీట్ల సర్దుబాటు, అభ్యర్ధుల ప్రకటన జరుగుతున్న వేళ.. ఆ మూడు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది?
- Balaraju Goud
- Updated on: Mar 18, 2026
- 9:50 pm
దేవేంద్ర ప్రధాన్ కృషి వల్లనే ఒడిశాలో బీజేపీ బలంగా ఎదిగింది: కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్
డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ ఒడిశా బీజేపీకి భీష్మ పితామహుడు.. అని ఆయన కృషి వలనే నేడు ఒడిశాలో బీజేపీ బలంగా, సుసంపన్నంగా ఎదిగిందని.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. డాక్టర్ ప్రధాన్ మొదటి వర్ధంతి సందర్భంగా భువనేశ్వర్లోని ఓయూఏటీ క్యాంపస్లో జరిగిన సంతాప సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు.
- Shaik Madar Saheb
- Updated on: Mar 18, 2026
- 1:18 pm
Telangana Assembly: మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. సభా సమరం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు నడిచింది. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.. మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ పలు పశ్నలు సంధించారు.
- Shaik Madar Saheb
- Updated on: Mar 18, 2026
- 10:39 am
భారతదేశాన్ని అంతర్గతంగా బలహీనపరచడమే కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యంః కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భారతదేశాన్ని రక్షిస్తున్న 'రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్' (RAW), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వంటి సంస్థలను విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తన స్థాయిని దిగజార్చుకుని, దేశ వ్యతిరేక పార్టీగా మారిపోవడానికి ఈ ట్వీట్ ఒక నిదర్శనమని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.
- Balaraju Goud
- Updated on: Mar 17, 2026
- 4:31 pm
Telangana Assembly LIVE: ప్రపంచానికి దిక్సూచిగా తెలంగాణ.. గవర్నర్ ప్రసంగం.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ముందుగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందుగా.. అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
- Shaik Madar Saheb
- Updated on: Mar 16, 2026
- 12:23 pm
పాలిటిక్స్లోకి నితీష్ తనయుడి గ్రాండ్ ఎంట్రీ .. బీహార్ నెక్ట్స్ సీఎం ఎవరు..? రేసులో ఉన్నదెవరు..?
20 ఏళ్లు ఆయనే సీఎం.. ఇప్పుడు ఆయన సైడైపోతుండటంతో ఆ సీట్లోకి వచ్చేది ఎవరనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈసారి ఛాన్స్ కమలం పార్టీకి దక్కనుండటంతో.. బీజేపీ నాయకత్వం ఎవరినీ బిహార్ సీఎం కుర్చీపై కూర్చొబెడుతుందనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేసులో ఉన్న పేర్లకే బీజేపీ పెద్దలు టిక్ పెడతారా? లేక ఎవరూ ఊహించని కొత్త ముఖాలకు అవకాశం ఇస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది.
- Balaraju Goud
- Updated on: Mar 8, 2026
- 5:38 pm
బీహార్ రాజకీయాల్లో పెను సంచలనం.. రాజీనామా దిశగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్..?
బీహార్ రాజకీయాల్లో పెను మార్పు వస్తుందని చర్చ జరుగుతోంది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగి రాజ్యసభలోకి ప్రవేశించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంలో, భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు బీహార్ ముఖ్యమంత్రి కావచ్చని తెలుస్తోంది.
- Balaraju Goud
- Updated on: Mar 4, 2026
- 4:10 pm
రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల.. బరిలోకి జాతీయ అధ్యక్షులు నితిన్..!
భారతీయ జనతా పార్టీ తరుపున పోటీ చేసే రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ను కూడా నిలబెట్టింది. బీహార్ నుండి రాజ్యసభకు నితిన్ నబిన్, శివేష్ రామ్లను నామినేట్ చేసింది. నామినేషన్లు దాఖలు చేయడానికి మార్చి 5 చివరి తేదీ. మార్చి 15న ఓటింగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాన్ని ప్రకటిస్తారు.
- Balaraju Goud
- Updated on: Mar 3, 2026
- 4:43 pm
Telangana: ఇక ఉప్పు నిప్పుల్లేవ్..! మేయర్, ఛైర్మన్గిరి కోసం.. బద్ధ శత్రువుల మధ్య చిగురించిన ప్రేమలు!
ఇట్స్ మిరాకిల్. పొలిటికల్ సైన్స్లో ఇవో విచిత్రమైన సన్నివేశాలు. గతంలో చూసుంటారు.. బట్ అడపాదడపా. కాని, ఒకేసారి, ఒకేపూటలో ఇన్ని రాజకీయ వైచిత్రిలు చూడ్డం బహుశా మొదటిసారి అయి ఉంటుంది. ఉప్పు నిప్పులా ఉండే పార్టీలు.. వాళ్లని ఓడించండి, మాకే ఓటేయండని ప్రచారాల్లో సెగలు కక్కుకున్న పార్టీలు.. ఇలా కలిసిపోయి అధికారం పంచుకుంటాయని ఎవ్వరూ ఊహించరు.
- Shaik Madar Saheb
- Updated on: Feb 16, 2026
- 9:49 pm
Nizamabad Municipal Election Result: రెండోసారి కమలం చేజారిన ఇందూరు పీఠం.. మజ్లిస్తో కలిసి మేజిక్ ఫిగర్..!
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం భారతీయ జనతా పార్టీకి అందని ద్రాక్షలా మారింది. వరుసగా రెండుసార్లు సింగల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ పీఠం మాత్రం దక్కకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో చివరికి ఇందూరు మేయర్ పీఠం హస్తగతం అయింది. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.
- Diwakar P
- Updated on: Feb 15, 2026
- 4:16 pm
Telangana Municipal Election Results: ఒక్క ఓటు మ్యాజిక్.. అభ్యర్థుల జీవితాలనే మార్చేసింది..!
పంచాయతీ ఎన్నికల్లో పల్లె ఓటరు ఇచ్చిన తీర్పు చాలా క్లియర్కట్గా ఉంది. రూలింగ్ పార్టీకే జైకొట్టింది. నంబర్ల విషయంలో నో కన్ఫ్యూజన్. కానీ, పట్టణ ఓటరు మాత్రం పెద్ద పజిలే పెట్టేశాడు. ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం లేదు, అలాగని ఏ పార్టీనీ నిరుత్సాహపర్చలేదు మున్సిపల్ ఫలితం. ఓవరాల్గా పురపోరు ప్రశాంతంగా ముగిసింది. కొన్నిచోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. మరికొన్నిచోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్.. ముక్కోణపు పోటీ నడిచింది.
- Balaraju Goud
- Updated on: Feb 14, 2026
- 8:16 am
Nizamabad Municipal Election Result: మేయర్ పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠ.. మరోసారి 2020 రిపీట్ అవుతుందా?
అక్కడే ఆగిపోయిన కమలం పార్టీ.. మళ్లీ అలాగే జరుగుతుందా ? అధికారానికి దాదాపుగా దగ్గరికి వచ్చినట్టే వచ్చి ఆగిపోయిన భారతీయ జనతా పార్టీ.. ఈసారి ఏం చేయబోతోంది. కరీంనగర్తో పాటు నిజామాబాద్ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని భావించిన బీజేపీ ఆశలు నెరవేరే అవకాశాలు ఉన్నాయా? కాషాయ పార్టీకి మరో కార్పొరేషన్ దక్కకుండా కాంగ్రెస్ ఏం చేయబోతోంది ?
- Balaraju Goud
- Updated on: Feb 14, 2026
- 7:35 am