బీజేపీ

బీజేపీ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారత దేశంలో ఒక జాతీయ రాజకీయ పార్టీ. ప్రస్తుతం బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉంది. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పార్టీ అధికారంలో ఉంది. హిందూ జాతీయవాద సిద్ధాంతంతో ఆ పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించింది.

1980లో బీజేపీ ఏర్పడింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత రామమందిరం విషయంలో జరిగిన ఉద్యమంతో ఆ పార్టీ చాలా ఊపందుకుంది. 1996లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే పూర్తి మెజార్టీ లేకపోవడంతో 13 రోజులకే ప్రధాని పదవికి అటల్ బిహారీ వాజ్‌పేయి రాజీనామా చేశారు. 1998 ఎన్నికల తర్వాత 13 మాసాల పాటు మాత్రమే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి 2004 వరకు పూర్తి ఐదేళ్లు పదవీకాలం కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత పదేళ్లపాటు కేంద్రంలో బీజేపీ అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది.

2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. దీని తర్వాత 2019లో అంతకంటే పెద్ద విజయం సాధించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, యూనిఫాం సివిల్ కోడ్ మొదలైనవి బిజెపి ప్రధాన ఎజెండా. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మాణం, జమ్మూ కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగింపును పూర్తి చేసింది. బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు.

ఇంకా చదవండి

PM Modi: దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తే, సహించేదీ లేదు.. కాంగ్రెస్‌పై మోదీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో ప్రచారం ముగియగానే ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. కలికిరి సభలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా ఉంటారని గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి అంటున్నారని విమర్శించారు.

PM Modi Tour: కనుకరించిన ప్రకృతి.. భారీగా తరలివచ్చిన జనం.. సంజయ్‌ను అభినందించిన మోదీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎన్నికల బహిరంగ సభ సక్సెస్‌తో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపినట్టయింది. దూకుడు మీద ఉన్న బీజేపీ నాయకులకు ప్రధాని టూర్ మరింత జోష్ నింపినట్టయింది. కరీంనగర్ లోకసభ పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు.

BJP Fake Videos: మార్ఫింగ్‌ వీడియోలతో ఫేక్‌ క్యాంపెయిన్‌.. కమలదళంలో కలవరం..!

నిజం నోరు దాటే లోపు అబద్ధం ఊరు చుట్టి వస్తోంది. కమలం నేతలు ఒకటి మాట్లాడితే మరో విషయం జనాల్లోకి వెళ్తోంది. మార్ఫింగ్‌ వీడియోలతో ఫేక్‌ క్యాంపెయిన్‌ నడుస్తోంది. లేటెస్ట్‌గా మరో రెండు వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తుండడం భారతీయ జనతా పార్టీ నాయకులకు టెన్షన్‌ మొదలైంది.

PM Modi: వరంగల్ ఎన్నికల ప్రచార ర్యాలీలో అనుహ్య ఘటన.. చంటి పిల్లాడిని చూసి ఆగిపోయిన మోదీ

లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకేరోజు సుడిగాలి పర్యటన చేశారు. వరంగల్ జిల్లాలో భారీ రోడ్‌షో నిర్వహించారు. వికసిత్‌ భారత్‌ బీజేపీతోనే సాధ్యమన్నారు. మూడోసారి బీజేపీ అధికారం లోకి రాగానే మరిన్ని అభివృద్ది కార్యక్రమాలను ప్రకటిస్తామన్నారు.

BJP on PV Family: తెలుగు తేజంతో రాజకీయ బంధుత్వం కలుపుకుంటోందా..? మరో పీవీ చుట్టూ రాజకీయం..

మన ఠీవీ పీవీని బీజేపీ ఓన్‌ చేసుకుంటోందా ? తెలుగు తేజంతో రాజకీయ బంధుత్వం కలుపుకుంటోందా ? ఇటీవలి పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది.. రాజ్‌భవన్‌లో పీవీ కుటుంబసభ్యులకు దేశ ప్రధాని నరేంద్రమోదీ విందు ఇవ్వడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

Telangana: ఈ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అగ్నిపరీక్ష.. మెజార్టీ కోల్పోతే ఇక అంతే సంగతులు..

ఆదివాసీల ఖిల్లా ఆదిలాబాద్‎పై జెండా ఎగరువేయాలని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ విశ్వప్రయత్నాలు‌ చేస్తున్నాయి. బీఆర్ఎస్ సైతం మేము రేసులోనే ఉన్నామంటూ దూసుకొస్తోంది. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు కాషాయ పార్టీ చెమటోడుస్తుంటే.. ఇంచార్జ్ మంత్రి‌ సీతక్క వ్యూహరచనతో కాంగ్రెస్ సైతం సై అంటే సై అంటోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నిలిచిన ఎమ్మెల్యేలకు మాత్రం ఈ పార్లమెంట్ ఎన్నిక సవాల్‎గా మారింది. కార్యకర్తలు కష్టపడుతున్నా.. అక్కడక్కడా వినిపిస్తున్న అసమ్మతి రాగంతో మొదటికే మోసం వచ్చే పరిస్థితి మూడు పార్టీల్లోను‌ కనిపిస్తోంది.

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ గెలిస్తే తొలి ప్రాధాన్యత దేనికో చెప్పేసిన మంత్రి కోమటి రెడ్డి..

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. మోడీ 10ఏళ్లు ఆదాని అంబానీలకు దోచి పెట్టారని ఆరోపించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‎లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మాది డబుల్ RR కాదు.. మీది AA టాక్స్ ఆదాని, అంబానీ టాక్స్ అని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‎కు 14, బిజేపికి 2 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఒక్కటి గెలవదన్నారు. కేసీఆర్ గురించి మాట్లాడటం సుద్దదండగ అన్నారు. అగ్గిపెట్టే రావు హరీష్, కేటీఆర్‎లను ఘాటుగా విమర్శించారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 2:51 pm

PM Modi: ‘ఏడాదికో ప్రధాని’.. వరంగల్ సభలో ఇండియా కూటమిపై మోదీ చురకలు.

ఎన్డీయే విజయం మొదటి మూడు విడతల్లోనే తేలిపోయిందన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ సీట్లు వెతుక్కోవడానికి మైక్రోస్కోప్ కావాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. 40 ఏళ్లక్రితం దేశంలో ఇద్దరు బీజేపీ ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు వరంగల్ ఎంపీ ఉండడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్నారు. ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు భద్రకాళిని, రామప్ప శివుడికి దండం పెట్టుకొని ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 1:52 pm

Watch Video: ‘ పీఎం మోదీ ఆరడుగుల బుల్లెట్’.. వేములవాడ సభలో బండి సంజయ్..

కాంగ్రెస్ పార్టీ గుర్తు 'గాడిద గుడ్డు' అనేలా ఆ పార్టీ ప్రచారం చేస్తోందన్నారు బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. 'కాంగ్రెస్ ప్రభుత్వమే పెద్ద గాడిద గుడ్డు' అని కీలక వ్యాఖ్యలు చేశారు. వేములవాడలో నిర్వహించిన బహిరంగలో బండి సంజయ్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమ్యారని ధ్వజమెత్తారు. మహిళలకు ప్రతినెలా రూ. 2500 ఇస్తామన్న హామీని అటకెక్కించారన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేశారని విమర్శించారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 12:59 pm

PM Modi: తెలంగాణలో RR ట్యాక్స్ RRR సినిమాను మించిపోయింది.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

శివుడి సన్నిధిలో మోదీ నిప్పులు చెరిగారు. బీజేపీ వేములవాడ సభలో కాంగ్రెస్‌, BRSపై ప్రధాని మోదీ చెలరేగిపోయారు. తెలంగాణ గట్టు మీద తమ ప్రత్యర్థులిద్దరూ ఒక్కటేనని చాటడానికి ఉదాహరణలు, పంచ్‌లతో ప్రధాని మోదీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కలెక్షన్లలో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాని డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌ మించిపోయిందని ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు.

PM Modi: అంబానీ, అదానీ నుంచి ఎంత తీసుకున్నారు.. కాంగ్రెస్‌ టార్గెట్‌గా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..

అంబానీ, అదానీని ఇన్నాళ్లూ విమర్శించారు.. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ విమర్శలు ఆగిపోయాయి.. అంబానీ, అదానీ నుంచి కాంగ్రెస్ ఎంత తీసుకుంది..? అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేల్చారు.. అంబానీ, అదానీ నుంచి కాంగ్రెస్‌ ఎంత తీసుకుందని ప్రశ్నించిన ప్రధాని మోదీ.. ఈ గుట్టలకొద్దీ డబ్బు గురించి సమాధానం చెప్పాలంటూ నిలదీశారు.

PM Modi: ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే’.. వేములవాడ సభలో ప్రధాని మోదీ..

తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమన్నారు ప్రధాని మోదీ. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బండి సంజయ్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మే 7న దేశంలో మూడోవిడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిందని అందులో ఇండియా కూటమి ఫ్యూజ్ పోయిందని విమర్శించారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగితే మూడింటిలో ఇండియా కూటమి ఫ్యూజ్ పోయిందని ఎద్దేవా చేశారు. వేములవాడకు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 11:33 am

Telangana: రాజన్న సన్నిధిలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..

వేములవాడ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈరోజు రెండు సభల్లో పాల్గొన్ని ప్రచారం నిర్వహించనున్నారు. అయితే ఇందులో భాగంగా ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు బయలుదేశారు. హైదరాబాద్ రాజ్ భవన్ లో మంగళవారం బస చేసిన ప్రధాని బుధవారం బేగంపేట నుంచి వేములవాడ చేరుకున్నారు. అక్కడ ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 10:30 am

PM Modi: తెలుగు రాష్ట్రాల్లో మోదీ టూర్.. రోడ్ షోలు, సభలతో ప్రధాని బిజీ షెడ్యూల్

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. పలు ఆంక్షలు విధించారు. నిన్న రాత్రి రాజ్‌భవన్‌లోనే బస చేసిన ప్రధాని మోదీ.. కాసేపట్లో వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కి మద్దతుగా వేములవాడ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. అక్కడి నుంచి వరంగల్‌కు చేరుకుంటారు. లక్ష్మీపూర్‌లో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జన సభలో ప్రధాన మంత్రి మోదీ పాల్గొంటారు.

  • Srikar T
  • Updated on: May 8, 2024
  • 8:09 am

Rain Effect: పొలిటికల్ పార్టీలను భయపెట్టిస్తున్న ప్రకృతి.. మూడు సభల పై ప్రభావం..!

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ర్యాలీలు, రోడ్‌షోలతో జనంలోకి వెళ్ళాలనుకున్న పొలిటికల్ పార్టీలకు ప్రక‌ృతి వెంటాడుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు స్టార్ క్యాంపెనర్ల టూర్లతో షెడ్యూల్ తయారు చేసుకుని.. జన సమీకరణలో బిజీబిజీగా గడుపుతున్న ఆయా పార్టీల నాయకులకు ప్రకృతి సహకరించడం లేదు.