బీజేపీ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారత దేశంలో ఒక జాతీయ రాజకీయ పార్టీ. ప్రస్తుతం బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉంది. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పార్టీ అధికారంలో ఉంది. హిందూ జాతీయవాద సిద్ధాంతంతో ఆ పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించింది.
1980లో బీజేపీ ఏర్పడింది. 1984 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత రామమందిరం విషయంలో జరిగిన ఉద్యమంతో ఆ పార్టీ చాలా ఊపందుకుంది. 1996లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే పూర్తి మెజార్టీ లేకపోవడంతో 13 రోజులకే ప్రధాని పదవికి అటల్ బిహారీ వాజ్పేయి రాజీనామా చేశారు. 1998 ఎన్నికల తర్వాత 13 మాసాల పాటు మాత్రమే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి 2004 వరకు పూర్తి ఐదేళ్లు పదవీకాలం కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత పదేళ్లపాటు కేంద్రంలో బీజేపీ అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది.
2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. దీని తర్వాత 2019లో అంతకంటే పెద్ద విజయం సాధించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, యూనిఫాం సివిల్ కోడ్ మొదలైనవి బిజెపి ప్రధాన ఎజెండా. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మాణం, జమ్మూ కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగింపును పూర్తి చేసింది. బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు.
బండి సంజయ్ అంటే ధర్మపురి అర్వింద్కు పడదా..? అసలేం జరుగుతోంది.. సంచలన ఇంటర్వ్యూ
తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలపై ఆసక్తికర చర్చ మొదలైంది. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ మధ్య నిజంగా గ్యాప్ ఉందా? ఒకే పార్టీలో ఉన్న కీలక నేతల మధ్య అసలేం జరుగుతోంది? టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్కు ఇచ్చిన క్రాస్ఫైర్ ఇంటర్వ్యూలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: May 23, 2026
- 7:25 pm
BJP Telangana: నెక్ట్స్ టార్గెట్ తెలంగాణే.. మోదీ సభతో బీజేపీ నేతల్లో కొత్త జోష్
మోదీ నేతృత్వంలో దేశమంతా కాషాయంగా మారుతుంది..ఇక తెలంగాణనే మన నెక్ట్స్ టార్గెట్. పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయంటున్నారు తెలంగాణ బీజేపీ నేతలలు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం బీజేపీపై ఉందన్నారు ఆ పార్టీ నేతలు. మోదీ ఇచ్చిన స్పూర్తితో మరింత దూకుడుగా ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
- Anand T
- Updated on: May 11, 2026
- 7:13 am
ప్రోటోకాల్ పక్కనబెట్టి.. ముఖ్యమంత్రి ఇంటికి ప్రధాని మోదీ.. సీఎం చంద్రబాబు భావోద్వేగం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అరుదైన, మధురమైన ఘట్టం ఆవిష్కృతమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి విచ్చేసి, వారి కుటుంబ సభ్యులతో కలిసి గడిపారు. ఈ ప్రత్యేక సందర్భంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఎంతో భావోద్వేగంగా స్పందించారు.
- Balaraju Goud
- Updated on: May 10, 2026
- 10:14 pm
యుద్ధం ఏదైనా.. భారం పడనివ్వను.. రైతులకు, దేశ ప్రజలకు ప్రధాని మోదీ గ్యారెంటీ..!
హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధ మేఘాలు దేశంపై చూపుతున్న ప్రభావాన్ని వివరిస్తూనే, సామాన్యుడిపై భారం పడకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచం ఎన్నో సవాళ్లను, సంక్షోభాలను ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
- Balaraju Goud
- Updated on: May 10, 2026
- 8:37 pm
హైదరాబాద్ వేదికగా ఏపీ రాజకీయం.. ప్రోటోకాల్ దాటిన స్నేహం.. మిత్రుల ఇళ్లకు మోదీ!
హైదరాబాద్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన రాజకీయంగా విస్తృత చర్చకు దారి తీసింది. సాధారణంగా ప్రధాని ఏ రాష్ట్రానికి వెళ్లినా అధికారిక కార్యక్రమాలకే పరిమితం కావడం ఆనవాయితీ. కానీ ఈసారి తెలంగాణ పర్యటనలో భాగంగా జూబ్లీహిల్స్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసాలకు మోదీ వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
- Eswar Chennupalli
- Updated on: May 10, 2026
- 7:09 pm
అస్సాం పీఠంపై హిమంత బిస్వా శర్మ ముద్ర.. 102 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నిక!
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిస్వా శర్మ వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం జరిగిన బీజేపీ, ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా నాయకుడిగా ఎన్నికయ్యారు. మే 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 126 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 102 స్థానాలను (బీజేపీ 82) కైవసం చేసుకుని భారీ విజయం సాధించింది.
- Balaraju Goud
- Updated on: May 10, 2026
- 6:39 pm
తెలంగాణకు రెట్టింపు నిధులు కావాలా? అయితే ‘మేరే సే జోడో’.. రేవంత్కు ప్రధాని మోదీ ఆఫర్!
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా "మేరే సే జోడో" (నాతో జతకట్టండి) అనే మాట మార్మోగిపోతోంది. ప్రధాని మోదీ చేసిన "మేరే సే జోడో" కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. హైదరాబాద్లోని HICCలో రూ. 9,377 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సరికొత్త రాజకీయ చర్చకు దారితీసింది.
- Balaraju Goud
- Updated on: May 10, 2026
- 5:41 pm
హైదరాబాద్లో మోదీ టూర్.. మరో అశ్వమేధ యాగానికి ట్రయల్ రన్! ఆ గ్యాప్లో ఏం జరగనుంది..
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయనగా.. ప్రధాని మోదీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఏదో యాధృచ్చికంగా ఫిక్స్ చేసిన షెడ్యూల్ కాదిది. ప్రధానిగా మూడోసారి గెలిచిన తరువాత తొలిసారి తెలంగాణలో అడుగుపెడుతున్న క్షణం ఇది. ఆ అడుగు మామూలుగా ఉండకూడదనుకున్నారో ఏమో.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాకనే తెలంగాణలో ముహూర్తం ఉండాలని ముందుగా నిర్ణయించుకున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: May 9, 2026
- 9:49 pm
విశ్వకవి సాక్షిగా సరికొత్త చరిత్ర.. బెంగాల్లో నూతన శకం ఆరంభం.. సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో 2026, మే 9వ తేదీ ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోనుంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా బెంగాల్ గడ్డపై భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వం కొలువుదీరింది. కోల్కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కన్నుల పండువైన కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
- Balaraju Goud
- Updated on: May 9, 2026
- 3:03 pm
ఉత్తరాదిని చుట్టేసిన ‘కాషాయం ఎక్స్ప్రెస్’.. ఇప్పుడు దక్షిణాది డెల్టాపై గురి..!
సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ సర్క్యులేట్ అవుతోంది. మోదీ-షా అశ్వమేధ యాగం చేస్తున్నారట. ఒక్కో రాజ్యాన్ని చేజిక్కించుకుంటూ, అధికారానికి అడ్డొచ్చిన చోట, రాజకీయ యుద్ధం చేయాల్సి చోట రణరంగానికి దిగుతూ, గెలుస్తూ పోతోందట. నదుల అనుసంధానంలో భాగంగా గంగా-కావేరీని కలపాలనే ప్రతిపాదన ఉంది. బీజేపీ తన రాజకీయ అనుసంధానంలో భాగంగా ఇదే గంగా-కావేరీని లక్ష్యంగా తీసుకుంది. గంగా బెల్ట్ నుంచి కావేరీ డెల్టా వరకు.. ఆ నదులు పారే ప్రతి రాష్ట్రంలో పాగా వేయాలనేది కమలదళం టార్గెట్. ఇప్పటికే ఉత్తరాదిన గంగా-యమునా బెల్ట్ను క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ. గంగోత్రి దగ్గర మొదలైన ఈ జైత్రయాత్ర, మొన్న బెంగాల్ కోటను దాటుకుని గంగాసాగర్ను ముద్దాడింది. అంటే.. గంగా బెల్ట్ ఇస్ కంప్లీట్లీ లాక్డ్! ఇప్పుడిక తన ఎక్స్పాన్షన్ మోడ్కు మరింత పదును పెట్టి, పొలిటికల్ కంపాస్ను సౌత్ వైపు తిప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా-గోదావరి బేసిన్ నుంచి కావేరీ వరకు.. ఈ రాష్ట్రాల ఓటు బ్యాంకును కాషాయంతో కనెక్ట్ చేయడమే మెయిన్ అజెండాగా వెళ్తోంది. ఆల్రడీ మహారాష్ట్రలో అధికారంలో ఉంది. కర్నాటకలో అధికారంలోకి వచ్చిపోయింది. ఇప్పుడిక తెలంగాణ వంతు. మే 10న మోదీ అడుగుపెడుతున్నారంటే.. మరో 'పొలిటికల్ టార్గెట్' సెట్ చేయడానికేనా! ఉత్తరాది నుంచి దక్షిణాది దాకా విస్తరించడానికి బీజేపీ వేస్తున్న నయా స్కెచ్ ఏంటి? ఎలాంటి వ్యూహాలతో వెళ్తోంది?
- Balaraju Goud
- Updated on: May 5, 2026
- 9:50 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి టీవీకే చీఫ్ విజయ్ కృతజ్ఞతలు.. ఏమని రాశారంటే..?
తమిళనాడు రాజకీయాల్లో ఒక నూతన శకం ఆరంభమైంది. దశాబ్దాల కాలంగా ద్రవిడ దిగ్గజాల నీడలో సాగిన రాష్ట్ర రాజకీయాలు, ఇప్పుడు ఒక సరికొత్త మలుపు తిరిగాయి. శాసనసభ ఎన్నికల ఫలితాలు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచాయి. ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ 108 స్థానాలను కైవసం చేసుకుని, అతిపెద్ద పార్టీగా అవతరించి చరిత్ర సృష్టించింది
- Balaraju Goud
- Updated on: May 5, 2026
- 6:25 pm
ముఖ్యమంత్రి ఎవరూ? బెంగాల్, అస్సాంలలో ముమ్మరమైన కసరత్తు.. రంగంలోకి దిగిన అగ్రనేతలు అమిత్ షా, నడ్డా
పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) సాధించిన అపూర్వ విజయం, ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేగవంతం చేసింది. ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానుల వరకు రాజకీయ సందడి నెలకొంది.
- Balaraju Goud
- Updated on: May 5, 2026
- 5:53 pm