AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ

బీజేపీ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారత దేశంలో ఒక జాతీయ రాజకీయ పార్టీ. ప్రస్తుతం బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉంది. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పార్టీ అధికారంలో ఉంది. హిందూ జాతీయవాద సిద్ధాంతంతో ఆ పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించింది.

1980లో బీజేపీ ఏర్పడింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత రామమందిరం విషయంలో జరిగిన ఉద్యమంతో ఆ పార్టీ చాలా ఊపందుకుంది. 1996లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే పూర్తి మెజార్టీ లేకపోవడంతో 13 రోజులకే ప్రధాని పదవికి అటల్ బిహారీ వాజ్‌పేయి రాజీనామా చేశారు. 1998 ఎన్నికల తర్వాత 13 మాసాల పాటు మాత్రమే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి 2004 వరకు పూర్తి ఐదేళ్లు పదవీకాలం కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత పదేళ్లపాటు కేంద్రంలో బీజేపీ అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది.

2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. దీని తర్వాత 2019లో అంతకంటే పెద్ద విజయం సాధించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, యూనిఫాం సివిల్ కోడ్ మొదలైనవి బిజెపి ప్రధాన ఎజెండా. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మాణం, జమ్మూ కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగింపును పూర్తి చేసింది. బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు.

ఇంకా చదవండి

తుమ్మిడిహెట్టి ఎత్తుపై తెలంగాణ కీలక ప్రతిపాదన.. మహారాష్ట్రను ఒప్పించేందుకు రంగంలోకి సీఎం రేవంత్..!

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా 152 మీటర్ల ఎత్తును మహారాష్ట్ర ముందు ఉంచి, కనీసం 150 మీటర్ల నిర్మాణానికి ఒప్పందం కోరుతోంది. ఈ అంశంపై ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ముంపు, భూసేకరణ నివేదికలను పరిగణనలోకి తీసుకుని నిర్మాణంపై చర్చలు జరుగనున్నాయి.

ఎన్నికల వేళ కీలక నిర్ణయం.. యోగి, అఖిలేష్, మాయావతికి బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు!

ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు మొత్తం 52 మంది ప్రముఖ రాజకీయ నాయకులకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు అందించినట్లు తెలుస్తోంది. ఒక్కో జాకెట్ విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా.

నితిన్ నబిన్ కొత్త టీమ్ రెడీ.. పురందరేశ్వరీ, వసుంధర రాజేకు కీలక బాధ్యతలు..!

బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. కీలక పదవుల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. వసుంధర రాజే, రామ్ మాధవ్, పురంధేశ్వరి వంటి వారికి ఉపాధ్యక్ష పదవులు లభించాయి. స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే, కొత్త టీమ్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కకపోవడం చర్చనీయాంశమైంది. ఇది పార్టీ భవిష్యత్ వ్యూహాలను ప్రతిబింబిస్తుంది.

Andhra Pradesh: వాళ్లది డీఎస్‌సీ.. వీళ్లది ఏపీపీఎస్‌సీ.. పరీక్షలను రౌండప్ చేసిన పాలిటిక్స్

ఏ ఫర్ ఆంధ్రా, పీ ఫర్ పాలిటిక్స్. పొలిటికల్లీ మాంచి డెన్సిటీ ఉండే రాష్ట్రంగా ఏపీకి ప్రత్యేక క్రెడిట్టే ఉంది. ఇక్కడ పార్టీలకు బీపీలు రైజవ్వడం ఎప్పుడూ కొత్తకాదు. కానీ, ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది ఏపీలో రాజకీయ చదరంగం. ఏ పార్టీ ఎప్పుడు ఏ పాచిక వేస్తుందో ఏ పార్టీకీ తెలీదు. ఎగస్పార్టీల్ని అనుక్షణం అణువణువూ చదువుతుండాల్సిందే. ఇక్కడ ప్రతీ ఇయరూ ఎలక్షన్ ఇయరే. ఓటుబ్యాంకులకు కన్నమెయ్యడం మీదే పార్టీలకు కన్ను. రాబోయే స్థానిక ఎన్నికలకు నగారా మోగకముందే, మందుగుండు సిద్ధం చేసుకుంటున్నాయి పార్టీలు. 2029కి ఇప్పటినుంచే వామప్ మ్యాచ్‌లకు ప్యాడ్లు కట్టుకుంటున్నాయి టీడీపీ-వైసీపీ. ఎలాగో డీటెయిల్డ్‌గా చూద్దాం.

నదీ జలాలపై మళ్లీ రాజకీయం..! మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. ఆగస్టు 18న ఏం జరగబోతోంది?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య గోదావరి జలాల వివాదం మరోసారి వేడెక్కింది. ఆగస్టు 18న జరగనున్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) సమావేశం చుట్టూ రెండు రాష్ట్రాల్లో రాజకీయ హీట్ పెరిగింది. తెలంగాణలోని ఏడు సాగునీటి ప్రాజెక్టులపై పునస్సమీక్ష, కాళేశ్వరం నీటి సామర్థ్యం, సమ్మక్కసాగర్ అనుమతులు, తుమ్మిడిహట్టి ప్రాజెక్టు వంటి అంశాలపై ఏపీ లేవనెత్తిన డిమాండ్లు చర్చకు రానున్నాయి.

ఆయన అహంకారం వల్లే పార్లమెంట్ సమావేశాలు దెబ్బతిన్నాయి: రాహుల్‌ గాంధీపై ప్రహ్లాద్ జోషి ఆగ్రహం..

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్‌ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల చర్చలు, నిర్మాణాత్మక కార్యక్రమాలు సజావుగా సాగలేదని ఆరోపించారు. కేవలం ఒక వ్యక్తి అహంకారం కారణంగానే మొత్తం సమావేశాలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. డిమాండ్లను అంగీకరించినప్పటికీ విపక్షాలు వెనక్కి తగ్గకుండా కొత్త డిమాండ్లు తెరపైకి తెస్తున్నాయని ప్రహ్లాద్‌ జోషి విమర్శించారు.

‘ఒకప్పుడు 135 కేజీలు.. ఇప్పుడు 89’.. నితిన్ గడ్కరీ 46 కేజీలు తగ్గడానికి అసలు కారణమిదే!

కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన బరువు తగ్గిన విధానం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒకప్పుడు 135 కిలోల బరువున్న తాను ఇప్పుడు 89 కిలోలకు చేరుకున్నానని.. ఏకంగా 46 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. అయితే ఇది ఎలాంటి తక్షణ పరిష్కారం లేదా కఠినమైన డైట్ వల్ల సాధ్యపడలేదని.. తన జీవనశైలిలో క్రమశిక్షణ, ప్రతిరోజూ వ్యాయామం చేయడం ప్రధాన కారణాలని చెప్పారు.

యూపీలో సరికొత్త రాజకీయ వ్యూహాలు.. ఆ ఓటర్ల వైపే అన్ని పార్టీల చూపు..!

Gen Z Voters: ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కుల సమీకరణాలు, సంప్రదాయ ఓటు బ్యాంకులతో పాటు ఇప్పుడు జెన్-జీ ఓటర్లపై ప్రధాన పార్టీల దృష్టి పడింది. సోషల్ మీడియా, విద్య, ఉద్యోగ అవకాశాల వంటి అంశాలతో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీలు డిజిటల్ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. రాష్ట్రంలోని యువ ఓటర్ల మద్దతు వచ్చే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో, వారిని ప్రసన్నం చేసుకోవడం పార్టీలకు కీలకంగా మారింది.

గాల్లో ఉండగానే హైటెన్షన్.. సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్! రెప్పపాటులో తప్పిన ముప్పు!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మంగళవారం (ఆగస్టు 11) అనూహ్యంగా అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పైలట్ ముందుజాగ్రత్త చర్యగా తూర్పు మేదినీపూర్ జిల్లా కోలఘాట్‌లోని ఓ బహిరంగ ప్రదేశంలో హెలికాప్టర్‌ను దించినట్లు అధికారులు తెలిపారు. సీఎం సువేందు డమ్‌డమ్ నుంచి పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని కేశ్‌పూర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

కలిసొస్తున్న కమలం నేతలు.. తెలంగాణలో అధికారం కోసం బీజేపీ వ్యూహం మారిందా?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణపై అధిష్టానం ఫోకస్ చేసింది..అందులో భాగంగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ నాయకుల అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి పటిష్టత, భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనుంది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫేవరెట్ పొలిటిషియన్ బీజేపీ నేత..! ఎవరో తెలుసా..?

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జెన్ జెడ్‌ (Gen Z) యువత, విద్యార్థులతో నేరుగా మమేకమయ్యేందుకు కొత్త ప్రయత్నం ప్రారంభించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ (Ask Me Anything) సెషన్ నిర్వహించారు. విద్యార్థుల నిరసనలు, విద్యా వ్యవస్థ, మహిళా విద్య, రాజకీయాలు వంటి అంశాలతో పాటు బాట్‌మాన్ వంటి సరదా ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చారు.

పాదయాత్రల నుంచి పబ్లిక్ సర్వీస్ వరకు… మారుతున్న రాజకీయాల కొత్త ఫార్ములా!

ఒకప్పుడు రాజకీయాల్లో ప్రజల మనసు గెలవాలంటే పాదయాత్రే ప్రధాన ఆయుధంగా ఉండేది. వేల కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలు తెలుసుకోవడం ద్వారా నాయకులు తమ రాజకీయ ప్రస్థానాన్ని బలోపేతం చేసుకునేవారు. కానీ కాలం మారుతోంది... రాజకీయ కమ్యూనికేషన్ కూడా మారుతోంది. ఇప్పుడు జాబ్ మేళాలు, మెడికల్ క్యాంపులు, మహిళా సమావేశాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువ కావడం వంటి కొత్త పద్ధతులు రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. మరి నిజంగానే పాదయాత్రల యుగానికి ప్రత్యామ్నాయం వచ్చిందా?

ప్రయాణికులకు ఎగిరిగంతేసే న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ-మెట్రో పాస్
ప్రయాణికులకు ఎగిరిగంతేసే న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ-మెట్రో పాస్
ఝాన్సీ గురించి ఈ విషయాలు తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే
ఝాన్సీ గురించి ఈ విషయాలు తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే
బిగ్‌బాస్‌ 10 రెండో కంటెస్టెంట్‌గా త్రిగుణ్.. ఈ విషయాలు తెలుసా?
బిగ్‌బాస్‌ 10 రెండో కంటెస్టెంట్‌గా త్రిగుణ్.. ఈ విషయాలు తెలుసా?
ఆరోగ్యకరమైన టేస్టీ టిఫిన్ ఇదే.. ఈ దోశ తింటే శరీరానికి సూపర్ బలం..
ఆరోగ్యకరమైన టేస్టీ టిఫిన్ ఇదే.. ఈ దోశ తింటే శరీరానికి సూపర్ బలం..
దేబ్జానీ మోదక్ బ్యాగ్రౌండ్ ఇదే
దేబ్జానీ మోదక్ బ్యాగ్రౌండ్ ఇదే
రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గడానికి 5 కారణాలు.. అవేంటో తెలుసా?
రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గడానికి 5 కారణాలు.. అవేంటో తెలుసా?
కలలో బంగారం, డబ్బు లేదా వెలుగు కనిపిస్తే ఏం జరుగుతుంది? సంపద రాక
కలలో బంగారం, డబ్బు లేదా వెలుగు కనిపిస్తే ఏం జరుగుతుంది? సంపద రాక
మీ ఐఫోన్ బ్యాటరీని ఏ యాప్ ఎక్కువగా తీసుకుంటుంది? తెలుసుకోండిలా?
మీ ఐఫోన్ బ్యాటరీని ఏ యాప్ ఎక్కువగా తీసుకుంటుంది? తెలుసుకోండిలా?
ఎయిర్ షోలో కుప్పకూలిన F-4 యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి!
ఎయిర్ షోలో కుప్పకూలిన F-4 యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి!
టీమిండియా కెప్టెన్‌గా ప్రమోషన్.. 3 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసం
టీమిండియా కెప్టెన్‌గా ప్రమోషన్.. 3 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసం