AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ

బీజేపీ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారత దేశంలో ఒక జాతీయ రాజకీయ పార్టీ. ప్రస్తుతం బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉంది. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పార్టీ అధికారంలో ఉంది. హిందూ జాతీయవాద సిద్ధాంతంతో ఆ పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించింది.

1980లో బీజేపీ ఏర్పడింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత రామమందిరం విషయంలో జరిగిన ఉద్యమంతో ఆ పార్టీ చాలా ఊపందుకుంది. 1996లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే పూర్తి మెజార్టీ లేకపోవడంతో 13 రోజులకే ప్రధాని పదవికి అటల్ బిహారీ వాజ్‌పేయి రాజీనామా చేశారు. 1998 ఎన్నికల తర్వాత 13 మాసాల పాటు మాత్రమే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి 2004 వరకు పూర్తి ఐదేళ్లు పదవీకాలం కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత పదేళ్లపాటు కేంద్రంలో బీజేపీ అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది.

2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. దీని తర్వాత 2019లో అంతకంటే పెద్ద విజయం సాధించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, యూనిఫాం సివిల్ కోడ్ మొదలైనవి బిజెపి ప్రధాన ఎజెండా. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మాణం, జమ్మూ కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగింపును పూర్తి చేసింది. బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు.

ఇంకా చదవండి

Telangana: జెండాకో ఇరిగేషన్ ఎజెండా..! ఈసారి చిచ్చు పేరు కన్నెపల్లి మోటార్లు

కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్‌ను కేంద్రంగా చేసుకుని తెలంగాణలో సాగునీటి రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. పంపులను వెంటనే ఆన్ చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తుండగా, డ్యామ్ భద్రతా కారణాల వల్ల ఇప్పుడే నీటి ఎత్తిపోతలు సాధ్యం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ వివాదంలో బీజేపీ కూడా రంగంలోకి దిగడంతో కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రక్షాళన దిశగా బీజేపీ జాతీయ కార్యవర్గం.. అమిత్ షాతో అధ్యక్షుడు నితిన్ నబిన్ కీలక భేటీ

భారతీయ జనతా పార్టీ (BJP) కేంద్ర సంస్థాగత వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ కొత్త కేంద్ర బృందం ఏర్పాటు, జాతీయ కార్యవర్గ పునర్వ్యవస్థీకరణ, సంస్థాగత బాధ్యతల కేటాయింపు వంటి అంశాలపై చర్చించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ గురువారం (జూన్ 02) కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న ప్రతిష్టాత్మక 'వీబీజీ రామ్ జీ' (వికసిత్ భారత్ గ్రీన్ - రాష్ట్రీయ గ్రామీణ మౌలిక సదుపాయాలు) పథకం పేదల జీవితాలనే మార్చే పథకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లె సభ నుంచి VBG RAM G పథకాన్ని సీఎం చంద్రబాబు ఘనంగా ప్రారంభించారు. గతంలో నరేగా పథకం రాయలసీమ నుంచే ప్రారంభమైందని, ఇప్పుడు ఈ చారిత్రాత్మక పథకం కూడా ఇక్కడి నుంచే ఆవిష్కృతం కావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చేలా పథకాన్ని అమలు చేస్తామన్నారు.

పశ్చిమ బెంగాల్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఓబీసీ రిజర్వేషన్‌లో కీలక మార్పు..!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సోమవారం నాడు ఇతర వెనుకబడిన తరగతుల (OBC) రిజర్వేషన్లకు సంబంధించిన రెండు ముఖ్యమైన సవరణ బిల్లులను ఆమోదించింది. ఈ బిల్లులకు అనుకూలంగా 186 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా, 17 మంది వ్యతిరేకించారు. ఆరుగురు ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఈ కొత్త చట్టాల అమలుతో రాష్ట్రంలో ఓబీసీ రిజర్వేషన్ల వ్యవస్థలో గణనీయమైన మార్పులు రానున్నాయి. ముఖ్యంగా, రిజర్వేషన్ల విధానాన్ని ప్రస్తుతమున్న 17 శాతం నుంచి 7 శాతానికి తగ్గించడంతో పాటు, ఓబీసీ వర్గాలను పునర్వ్యవస్థీకరించారు.

Telangana Politics: రేవంత్‌ అండ్ కిషన్‌..! మధ్యలో మెట్రో రైల్.. ఎవరి ఎత్తుగడలు వాళ్లవే

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 అంశం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో కలిసి మెట్రో ప్రాజెక్టుపై చర్చించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాంగ్రెస్-బీజేపీ మధ్య అవగాహన రాజకీయాలు నడుస్తున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, రాష్ట్ర అభివృద్ధి కోసమే కలిసి పనిచేస్తున్నామని ఇరు పార్టీలు చెబుతున్నాయి. మెట్రో నుంచి సింగరేణి వరకు వివిధ అంశాలపై మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కుతోంది.

రాజ్యసభలో పెరుగుతున్న బీజేపీ బలం.. మూడింట రెండు వంతుల మెజారిటీ దిశగా ఎన్డీఏ..!

కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఇప్పుడు రాజ్యసభలోనూ తన బలాన్ని మరింత పెంచుకుంటున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏకు అనుకూలంగా రావడంతో, ఆ కూటమి సంఖ్యాబలం గణనీయంగా పెరిగింది. దీంతో భవిష్యత్తులో కీలక బిల్లులను ఆమోదించుకునే దిశగా బీజేపీ మరింత బలపడుతున్నట్లు కనిపిస్తోంది.

మెట్రో విస్తరణపై కేంద్రం వివక్ష చూపుతోంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!

హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జంట నగరాల ప్రజలు, మెట్రో కారిడార్ పరిధిలోని ప్రజలకు కీలక విషయాలను వెల్లడించారు. విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ అభివ‌ృద్దిని అడ్డుకుంటారని మండిపడ్డారు.

Watch Video: పొలంలో చెమటోడ్చిన ముఖ్యమంత్రి.. నాగలి పట్టి దుక్కి దున్నిన సీఎం ధామి..!

సేంద్రియ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వినూత్న చర్య చేపట్టారు. సోమవారం (జూన్ 15) తన స్వగ్రామ ప్రాంతమైన నాగ్లా తరైలోని ప్రైవేట్ నివాసం వద్ద స్వయంగా నాగలి పట్టి పొలం దున్నారు. అనంతరం పొలంలో ఆవు పేడతో తయారుచేసిన సహజ ఎరువును చల్లి సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యతను రైతులకు చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన తల్లి బిష్ణా దేవి కూడా పాల్గొనడం విశేషం.

Andhra: స్వర్ణాంధ్ర దిశగా పన్నెండో అడుగు.. పడుతూ లేస్తూనే ప్రగతి వైపు..!

రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంపై విస్తృత చర్చ జరుగుతోంది. రాజధాని లేకుండా ప్రారంభమైన రాష్ట్ర ప్రయాణం రాజకీయ మార్పులు, పాలనా విధానాల ప్రభావంతో ఎన్నో మలుపులు తిరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అమరావతి పునర్నిర్మాణం, భారీ పెట్టుబడుల ఆకర్షణ, పోలవరం ప్రాజెక్టు పురోగతి, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను ప్రభుత్వం విజయాలుగా చెబుతోంది.

తిరుపతిలో కూటమి గర్జన.. రెండేళ్ల పాలనపై ప్రజల ముందుకు ప్రోగ్రెస్ కార్డ్!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తిరుపతి వేదికగా శుక్రవారం (జూన్ 12) భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. "2 ఏళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం" పేరుతో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. గత రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రజలకు సమగ్ర నివేదిక అందించేందుకు ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది.

Tamil Nadu: బీజేపీతో డీఎంకే చేతులు కలుపుతుందా..? క్లారిటీ ఇచ్చిన మాజీ కేంద్ర మంత్రి!

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన డీఎంకే ఇప్పుడు రాజకీయంగా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూటమిలోని ప్రధాన మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరమవుతుండటంతో డీఎంకే భవిష్యత్ వ్యూహంపై చర్చలు జోరందుకున్నాయి. ఇదే సమయంలో డీఎంకే బీజేపీతో చేతులు కలపబోతోందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

మీనాక్షి నటరాజన్‌కు షాక్.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎన్నిక ఏకగ్రీవం..!

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థులు రజనీష్ అగర్వాల్, తరుణ్ చుగ్, మహేష్ కేవత్ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఎన్నిక అనివార్యం కాకుండా పోయింది. దీంతో ఓటింగ్ నిర్వహించాల్సిన అవసరం లేకుండానే ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజేతలుగా ప్రకటించబడ్డారు.

వారెవ్వా.. వందేభారత్‌.. వరదనీటిలో దూసుకెళ్తూ సినిమా చూపించిందిగా!
వారెవ్వా.. వందేభారత్‌.. వరదనీటిలో దూసుకెళ్తూ సినిమా చూపించిందిగా!
తెలంగాణ వాసులకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్
తెలంగాణ వాసులకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్
అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!
అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!
మన చెరువుల్లో దొరికే ఈ దెయ్యం చేప గురించి తెలుసా?
మన చెరువుల్లో దొరికే ఈ దెయ్యం చేప గురించి తెలుసా?
ఫుల్‌గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!
ఫుల్‌గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
గుడ్‌న్యూస్‌.. గ్యాస్‌ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గుడ్‌న్యూస్‌.. గ్యాస్‌ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
రొనాల్డో ఆఖరి మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి కోహ్లీ, ధోనీ వెళ్లారా
రొనాల్డో ఆఖరి మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి కోహ్లీ, ధోనీ వెళ్లారా
రూ.3 వేల కోట్ల లంచం కేసు.. ఆ అధికారికి మరణశిక్ష విధించిన కోర్టు
రూ.3 వేల కోట్ల లంచం కేసు.. ఆ అధికారికి మరణశిక్ష విధించిన కోర్టు
ఆధార్ కార్డు ద్వారా బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు విత్ డ్రా ఎలా..?
ఆధార్ కార్డు ద్వారా బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు విత్ డ్రా ఎలా..?