
బీజేపీ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారత దేశంలో ఒక జాతీయ రాజకీయ పార్టీ. ప్రస్తుతం బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉంది. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పార్టీ అధికారంలో ఉంది. హిందూ జాతీయవాద సిద్ధాంతంతో ఆ పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించింది.
1980లో బీజేపీ ఏర్పడింది. 1984 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత రామమందిరం విషయంలో జరిగిన ఉద్యమంతో ఆ పార్టీ చాలా ఊపందుకుంది. 1996లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే పూర్తి మెజార్టీ లేకపోవడంతో 13 రోజులకే ప్రధాని పదవికి అటల్ బిహారీ వాజ్పేయి రాజీనామా చేశారు. 1998 ఎన్నికల తర్వాత 13 మాసాల పాటు మాత్రమే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి 2004 వరకు పూర్తి ఐదేళ్లు పదవీకాలం కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత పదేళ్లపాటు కేంద్రంలో బీజేపీ అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది.
2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. దీని తర్వాత 2019లో అంతకంటే పెద్ద విజయం సాధించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, యూనిఫాం సివిల్ కోడ్ మొదలైనవి బిజెపి ప్రధాన ఎజెండా. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మాణం, జమ్మూ కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగింపును పూర్తి చేసింది. బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు.
BJP on Delhi: ఢిల్లీలో డబుల్ ఇంజన్ కాదు.. ‘ట్రిపుల్ ఇంజన్’ సర్కార్.. వేగంగా కదులుతున్న పావులు..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కేజ్రీవాల్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరడంతో ఆప్కు షాక్ తగిలింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా సమక్షంలో ఆప్ కౌన్సిలర్లు అనిత బసోయా, సందీప్ బసోయా , నిఖిల్ చప్రానా , ధరమ్వీర్ బీజేపీలో చేరారు. ఇప్పటివరకు 12 మంది ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరారు..
- Balaraju Goud
- Updated on: Feb 15, 2025
- 6:02 pm
Congress vs BJP: ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ నేతల ఆగ్రహం
ప్రధాని మోదీ బీసీ కాదా? ఆయన లీగల్ మార్గాల్లో బీసీ జాబితాలో చేరారా? ఔననే అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని తాను బీసీనని చెప్పుకుంటారని.. వాస్తవంగా ఆయన బీసీ వ్యతిరేకి అని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో రేవంత్ ప్రధాని మోదీ కులంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
- Shaik Madar Saheb
- Updated on: Feb 15, 2025
- 7:22 am
భారత్-అమెరికా బంధాన్ని కొత్తగా నిర్వచించిన ప్రధాని మోదీ! “MAGA+MIGA=MEGA” అంటే ఏంటంటే?
భారత్-అమెరికా మైత్రి మరింత బలోపేతం అయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కొత్త నిర్వచనం చెప్పారు. మగా ప్లస్ మిగా ఈక్వాల్ టూ మెగా అంటూ అద్భుతమైన ఈక్వేషన్ ను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఈక్వేషన్ కు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన వస్తుంది. అసలింతకీ ఈ మగా ప్లస్ మిగా ఈక్వల్ టూ మెగా అంటే ఏంటో వివరంగా తెలుసుకుందాం..
- SN Pasha
- Updated on: Feb 14, 2025
- 11:42 am
MLC Election: కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా.. నేనా ఫైట్.. గట్టి పోటీ ఇస్తున్న ఇండిపెండెంట్!
పార్లమెంటు ఎన్నికల తరువాత జరిగే అత్యంత కీలకమైన ఎన్నికలు. దీంతో అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలలో సత్తాచాటిన బీజేపీ ఈ ఎన్నికలు మరింత కీలకంగా మారాయి. అయితే ఎప్పుడూ ఎన్నికలు అనగానే సై అనే బీఅర్ఎస్.. ఈసారికి మాత్రం నై అంటుంది. దీంతో అధికార కాంగ్రెస్, బీజేపీ తోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్యనే పోరు నెలకొంది.
- G Sampath Kumar
- Updated on: Feb 10, 2025
- 6:10 pm
Delhi CM Race: కౌన్ బనేగా ఢిల్లీ సీఎం..? మరోసారి మహిళకు ఛాన్సిస్తారా.. రేసులో ఉన్నది వీళ్లే..
హోరాహోరీగా జరిగిన ఢిల్లీ పోరులో... కమలం వికసించింది. గత నాలుగు దఫాలు... ప్రత్యర్థులను ఊడ్చిపారేసిన చీపురు, ఈసారి ప్రతిపక్షానికి పరిమతమైంది. 70 స్థానాల్లో బీజేపీ 48 సీట్లతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.. ఆప్ 22 స్థానాల్లో గెలిచింది.. కాంగ్రెస్ అసలు ప్రభావమే చూపలేదు.. మరి, హస్తినకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరు? కమలదళంలో ఆ సత్తా ఉన్న నాయకులెవరు? రేసులో ఉన్నదెవరు.. అధిష్ఠానం ఆశీసులు దక్కేదెవరికి? దేశరాజధానిలో ఇప్పుడిదే చర్చనీయాంశం. కొత్త బాస్ ఎవరనే విషయంలో ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
- Shaik Madar Saheb
- Updated on: Feb 9, 2025
- 11:33 am
BJP-NDA: దేశవ్యాప్తంగా వెలిగిపోతున్న బీజేపీ.. మొత్తం ఎన్ని రాష్ట్రాల్లో పాగా వేసిందో తెలుసా..?
కమలం వెలిగిపోతోంది. కాషాయ దండు సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ వెళ్తున్న పార్టీని ముందుండి నడిపిస్తున్నారు ప్రధాని మోదీ. పదేళ్లలో ఎన్నో విజయాలు సాధించినా.. ఈరోజు దక్కిన విజయం బీజేపీకి వెరీ స్పెషల్. అయితే ఇప్పటివరకు ఎన్నిరాష్ట్రాల్లో బీజేపీ ఉంది? ఎన్డీఏ పాలిత రాష్ట్రాలేంటి? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
- Shaik Madar Saheb
- Updated on: Feb 9, 2025
- 7:28 am
Delhi Election Results 2025: తగ్గేదేలే.. ఒక్కో రాష్ట్రం.. పక్కా విజయం.. అంతటా కమ్మేస్తున్న కమలం
పాతికేళ్లకు పైగా ఢిల్లీ గద్దెకు దూరంగా ఉన్న బీజేపీ ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ ను పటిష్టంగా నిర్వహించింది. మైక్రోలెవల్లో ఇంటింటికీ పార్టీ కార్యకర్తలు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించి ప్రచారం చేయడంతో బీజేపీకి కలిసి వచ్చింది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఢిల్లీ లోని పలు కాలనీల్లో, మురికివాడ ప్రాంతాల్లో పర్యటిస్తూ వేలాదిగా చిన్న చిన్న సమావేశాలను నిర్వహించింది.
- Shaik Madar Saheb
- Updated on: Feb 9, 2025
- 7:36 am
Pawan Kalyan: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్ 22 స్థానాలను కైవసం చేసుకున్నాయి.. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది.. దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. దీంతో బీజేపీతో పాటు ఎన్డీయే శ్రేణులు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంపై పవన్ కల్యాణ్ స్పందించారు.
- Shaik Madar Saheb
- Updated on: Feb 8, 2025
- 7:25 pm
CM Chandrababu: ఢిల్లీలో బీజేపీ విజయం చరిత్రాత్మకం.. ప్రతిపక్షహోదా కావాలంటే 10శాతం సీట్లు దక్కాల్సిందే
ఢిల్లీలో బీజేపీ గెలుపు చరిత్రాత్మకమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశ ప్రజలందరూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆమోదించారని.. తాజాగా ఢిల్లీ ప్రజలు కూడా మోదీ నాయకత్వాన్ని బలపరిచారని చెప్పారు. ప్యాలెస్ల విషయంలోనూ ఏపీ, ఢిల్లీకి పోలికలు ఉన్నాయని.. రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నా.. ఢిల్లీలో శీష్ మహల్ కట్టుకున్నా.. వాటిలోకి అడుగుపెట్టలేకపోయారన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Feb 9, 2025
- 9:21 am
KIshan Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణ వరకు వచ్చింది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది.. 27 ఏళ్ల తర్వాత తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 సీట్లలో ముందంజలో ఉండగా.. ఆప్ 22 స్థానాల్లో ముందంజలో ఉంది.. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు.. దీంతో కాషాయ పార్టీ సంబరాలు అంబరాన్నంటాయి.. ఢిల్లీలో ఫలితాలు, బీజేపీ ఘన విజయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
- Shaik Madar Saheb
- Updated on: Feb 8, 2025
- 4:09 pm