తెలుగు యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జెర్నలిజం (ఎం.సీ.జే)చేస్తూ 2008 లో లోకల్ న్యూస్ ఛానెల్ IN Digital ఛానల్ లో రిపోర్టర్ గా చేరాను..
2010 మే లో కొత్తగా ప్రారంభం అయిన రాజ్ న్యూస్ (Tnews)లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా చేరాను..
2024 మార్చ్ వరకు 14 సంవత్సరాల పాటు Tnews లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేశాను.
2024 ఏప్రిల్ లో Tv9 లో చేరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాను
పోలీసులను చూసి పరుగో పరుగు.. పట్టుకుని విచారించగా బయటపడిన షాకింగ్ నిజం
వ్యాపారిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని కొందరు చేసిన కుట్రను కామారెడ్డి జిల్లా పోలీసులు భగ్నం చేశారు. ఆరుగురిని అరెస్టు చేసి, వారి దగ్గర తుపాకీని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వ్యాపారవేత్తతో లావాదేవిలు జరిపిన వారే అతడి వద్ద తీసుకున్న అప్పును ఎగ్గోట్టడమే కాకుండా అతడిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసేందుకు స్కెచ్ వేసినట్లు గుర్తించారు.
- Diwakar P
- Updated on: May 28, 2026
- 7:53 pm
5 లారీలు.. 7 కార్లు.. హైవేపై భయానక యాక్సిడెంట్.. అసలేం జరిగిందో తెలుసా..?
నిజామాబాద్ జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఇందల్వాయి మండలం చంద్రయాన్పల్లి సమీపంలో ఒక లారీ టైరు పంచర్ కావడంతో రోడ్డుపైనే నిలిపివేయగా, వెనుక నుంచి వచ్చిన వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. మొత్తం ఐదు లారీలు, ఏడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. కొబ్బరి బొండాల లారీ పొలంలో బోల్తాపడగా, మరికొన్ని వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
- Diwakar P
- Updated on: May 26, 2026
- 11:23 am
చనిపోయాడు అనుకున్న ఇంటి పెద్ద.. 24 ఏళ్ల తర్వాత తిరిగి సొంత గూటికి!
కొన్ని సంఘటనలు వినడానికి సినిమా కథల్లా అనిపించినా, నిజ జీవితంలో జరిగినప్పుడు అంతులేని ఆనందాన్ని, భావోద్వేగాలను కలిగిస్తాయి. చనిపోయాడని భావించి, ఆశలు వదిలేసుకున్న తమ కుటుంబ పెద్ద.. ఏకంగా పాతికేళ్ల తర్వాత కళ్ల ముందుకు వస్తే ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి ఒక అద్భుతమైన మానవీయ ఘటన కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల సమయస్ఫూర్తి, బాధ్యతాయుతమైన కృషితో 24 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఒక వృద్ధుడు సురక్షితంగా తన పిల్లల చెంతకు చేరాడు. అసలేం జరిగిందంటే..
- Diwakar P
- Updated on: May 16, 2026
- 12:57 pm
కూతురి పెళ్లి చేసి ఇంటికొచ్చిన తండ్రి.. తెల్లారేసరికే ఊహించని విషాదం.. ఏం జరిగిందంటే?
కూతురి పెళ్లి జరిగి 24 గంటలు కూడా కాలేదు.. ఇంట్లో బంధువల సందడి, చిన్నారుల కిలకిల నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇంతలోనే ఓ వార్త అందరి ఆనందాన్ని చిదిమేసింది. బిడ్డ పెళ్లి చేసిన ఆనందం ఆ ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండలేక పోయింది. కన్న కూతురు పెళ్లి చేసిన రోజే తండ్రి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
- Diwakar P
- Updated on: Apr 28, 2026
- 6:04 pm
Nizamabad: అమ్మ తిట్టిందని అలిగి అర్థరాత్రి సైకిల్పై 50 కిలోమీటర్లు వెళ్లాడు.. ఆ తర్వాత
ఇంట్లో తల్లి మందలించిందనే మనస్తాపంతో 14 ఏళ్ల బాలుడు నిజామాబాద్ నుంచి సైకిల్పై బయలుదేరి దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణించి కామారెడ్డికి అర్ధరాత్రి చేరుకున్నాడు. టేక్రియాల్ జంక్షన్ వద్ద ఆపరేషన్ కవచ్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న దేవునిపల్లి పోలీసులు చీకట్లో ఒంటరిగా వెళ్తున్న బాలుడిని గమనించి ఆపారు.
- Diwakar P
- Updated on: Apr 9, 2026
- 11:10 am
Telangana: జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు కురిపిస్తున్న కొత్తిమీర పంట..
Coriander Farming: కొత్తిమీరే కదా అని తీసిపారేయకండి. ఎందుకంటే ఈ చిన్నరకం పంట ఆ ప్రాంత రైతులకు బోలెడు ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది. కార్పొరేట్ జాబులు చేసే వాళ్లకంటే అక్కడి రైతులే ఎక్కువ సంపాధిస్తున్నారు. జస్ట్ 30 రోజుల్లోనే అక్షరాల లక్షరూపాయలు ఇంటికి తీసుకెళ్తున్నారు. పసుపు సాగు చేసిన నేలలు కావటంతో అధిక దిగుబడితో పాటు ఇక్కడ పండించిన కొత్తిమీరకు రాష్ట్రవ్యాప్తంగా అధిక డిమాండ్ ఏర్పడుతుంది. ఇంతకు కొత్తమీరతో లక్షలు సంపాధిస్తున్న ఆ గ్రామం ఏదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే
- Diwakar P
- Updated on: Apr 6, 2026
- 6:28 pm
Telangana: ట్విన్స్ డే రోజు వాటే సీన్.. వారీద్దరూ.. వీరిద్దరూ ఏకమైన వేళ
అచ్చం ఒకేలా కనిపించే ఇద్దరు వరులు… అలాగే ఒకే రూపురేఖలతో మెరిసే ఇద్దరు వధువులు… ఒకే ముహూర్తానికి పెళ్లి పీటలపై కూర్చుంటే ఆ దృశ్యం ఎంత ప్రత్యేకంగా ఉంటుందో ఊహించండి! కామారెడ్డి జిల్లాలో అలాంటి అరుదైన ఘట్టమే ఆవిష్కృతమైంది. అది కూడా ట్విన్స్ డే రోజు..
- Diwakar P
- Updated on: Feb 23, 2026
- 9:09 am
Nizamabad Municipal Election Result: రెండోసారి కమలం చేజారిన ఇందూరు పీఠం.. మజ్లిస్తో కలిసి మేజిక్ ఫిగర్..!
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం భారతీయ జనతా పార్టీకి అందని ద్రాక్షలా మారింది. వరుసగా రెండుసార్లు సింగల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ పీఠం మాత్రం దక్కకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో చివరికి ఇందూరు మేయర్ పీఠం హస్తగతం అయింది. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.
- Diwakar P
- Updated on: Feb 15, 2026
- 4:16 pm
Watch: దేవుడి ఆభరణాలు దొంగలించిన పిల్లలకు భజంత్రీలతో ఊరెగింపు.. ఈ గ్రామం వింత ఆచారం గురించి మీకు తెలుసా?
సాధారణం గా గ్రామాల్లో దొంగతనం చేస్తూ పట్టుబడితే ఏం చేస్తారు. మొదట చితకబాది పోలీసులకు అప్పగిస్తారు. చిన్న పిల్లలు ఐతే జువెనల్ కు తరలిస్తారు. కానీ నిజామాబాద్ జిల్లాలోని ఆ గ్రామంలో మాత్రం చిన్నారి దొంగలను బాజా భజంత్రీలు, మంగళ హారతులతో ఊరేగిస్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తారు. ఇది అక్కడి ఆచారం. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. వారు నిజంగా దొంగలు కాదు. ఉత్తుత్తి దొంగలు. ఇంతకీ ఏంటి ఆ ఆచారం ,ఎందుకు ఆ గ్రామంలో ఈ వింత ఆచారం కొనసాగుతుందో తెలుసుకుందాం పదండి.
- Diwakar P
- Updated on: Feb 6, 2026
- 1:32 pm
Nizamabad: ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయలేనని.. కన్న బిడ్డనే కడతేర్చాడు
ఎన్నికల్లో పోటీ చేయాలనే కాంక్షతో ఓ కిరాతక తండ్రి కన్న కూతురునే బలిచేశాడు. ముగ్గురు పిల్లలు ఉంటే సర్పంచ్ పదవికి అనర్హత అనే నిబంధన మహారాష్ట్రలో అమలులో ఉండటంతో, అడ్డంకి తొలగించుకోవడానికి చిన్నారిని హత్య చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన నిందితుడు తన కూతురిని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంపు వద్ద నిజాంసాగర్ డీ–46 కెనాల్లో తోసి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
- Diwakar P
- Updated on: Feb 2, 2026
- 5:31 pm
Viral: ఇలా అయితే డైరెక్టుగా యమపురికే.. యమధర్మరాజులా మారిన పోలీస్.. వీడియో చూశారా…
రోడ్డూ ప్రమాదాల నివారణకు పోలీసులు రకరకాల వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఉచితంగా హెల్మెట్ల పంపిణీ, రీల్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా.. రోడ్ల ప్రమాదాల నివారణకు అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అయితే నిజామాబాద్ జిల్లాలో ఓ ఎస్ఐ మరింత వినూత్నంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవగాహన కార్యక్రమం చేపట్టారు.
- Diwakar P
- Updated on: Jan 18, 2026
- 3:34 pm
Telangana: డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. తీరా దగ్గరికి వెళ్లి చూడగా ఊహించని షాక్..
దూరం నుంచి చూస్తే.. ఆ ట్రాక్టర్ డ్రైవర్ లేకుండానే పొలం దున్నుతోంది. ఏదో వింత జరుగుతుందని గ్రామస్తులంతా ఆశ్చర్యంతో పరుగెత్తుకుంటూ వెళ్లారు. కానీ తీరా అక్కడికి వెళ్లి చూశాక కనిపించిన దృశ్యం చూసి అందరి గుండెలు పగిలాయి. డ్రైవర్ లేని ఆ ట్రాక్టర్ వెనుక ఒక రైతు మట్టిలో కూరుకుపోయి ఉన్నాడు. కామారెడ్డి జిల్లా మిషన్పల్లి గ్రామంలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా విషాదం నింపింది.
- Diwakar P
- Updated on: Jan 18, 2026
- 9:59 am