AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. తీరా దగ్గరికి వెళ్లి చూడగా ఊహించని షాక్..

దూరం నుంచి చూస్తే.. ఆ ట్రాక్టర్ డ్రైవర్ లేకుండానే పొలం దున్నుతోంది. ఏదో వింత జరుగుతుందని గ్రామస్తులంతా ఆశ్చర్యంతో పరుగెత్తుకుంటూ వెళ్లారు. కానీ తీరా అక్కడికి వెళ్లి చూశాక కనిపించిన దృశ్యం చూసి అందరి గుండెలు పగిలాయి. డ్రైవర్ లేని ఆ ట్రాక్టర్ వెనుక ఒక రైతు మట్టిలో కూరుకుపోయి ఉన్నాడు. కామారెడ్డి జిల్లా మిషన్‌పల్లి గ్రామంలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా విషాదం నింపింది.

Telangana: డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. తీరా దగ్గరికి వెళ్లి చూడగా ఊహించని షాక్..
Tractor Plows Field Without Driver
Diwakar P
| Edited By: |

Updated on: Jan 18, 2026 | 9:59 AM

Share

కామారెడ్డి జిల్లాలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ లేకుండానే దానికదే పొలం దున్నింది. వినడానికి వింతగా ఉన్నా ఈ ఘటన ఎల్లారెడ్డి మండలం మిషన్‌పల్లిలో జరిగింది. గ్రామంలో యాసంగి నాట్లు ఊపందుకున్నాయి. బోండ్ల శ్రీను అనే రైతు పొలంలో ట్రాక్టర్ దానికదే దున్నుతోంది. డ్రైవర్ సీట్లో ఎవరూ లేకుండా చుట్టూ తిరుగుతోంది. అదేంటి ట్రాక్టర్ అలా దానికదే తిరుగుతోందని చుట్టుపక్కల పొలాల్లో ఉన్న వారు చూసి ఆశ్చర్యపోయారు. కొందరు ఆ పొలం రైతు శ్రీనుకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. వెంటనే ట్రాక్టర్ దగ్గరకు వెళ్లి చూడగా గుండె పగిలే దృశ్యం కనిపంచింది.

పొలంలో కూడా ఎవరూ కనిపించడం లేదు.. రైతులకు అనుమానం వచ్చి మడి మొత్తం వెతికారు.. ఓ చోట రైతు శ్రీను మట్టిలో కూరుకుపోయిన దృశ్యాలు కనిపించాయి. ఒక్కసారిగా అంతా షాక్.. ట్రాక్టర్‌తో దున్నుతున్న సమయంలో గుండె పోటు వచ్చి ట్రాక్టర్ పై నుంచి కింద పడిపోయి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. కింద పడ్డాక ట్రాక్టర్ రైతు శ్రీను మీద నుంచి వెళ్లిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి.. గుండె పోటు వచ్చిందా లేదా ఇంకేదైనా కారణంతో కింద పడినప్పుడు ట్రాక్టర్‌పై నుంచి వెళ్లి ఊపిరాడక చనిపోయాడా అనే విషయాలు తేలాల్సి ఉంది. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వీడియో చూడండి..

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం