జి. జ్యోతి తెలుగు మీడియాలో 12ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012లో 10టీవీతో జర్నలిజంలో అడుగుపెట్టాను. రెండేళ్ల పాటు 10టీవీలోనే వర్క్ చేశాను. ఆ తరువాత ప్రముఖ మీడియా సంస్థలు, ఆంధ్రప్రభ, టీ న్యూస్, స్నేహా టీవీలో పనిచేసి విలువైన సేవలు అందించాను. 2017లో టీవీ 9లో చేరాను. ఇక్కడ ఏక్ నంబర్ నంబర్ బులిటెన్ ప్రొడ్యూసర్గా పనిచేశాను. వాయిస్ ఓవర్, డిజిటల్ టెక్ట్స్ స్టోరీస్ యూట్యూబ్ కోసం రాశాను. ప్రస్తుతం టీవీ9 వెబ్సైట్లో సీనియర్ సబ్ఎడిటర్గా పని చేస్తున్నాను. రిజినల్ న్యూస్, వైరల్ వార్తలు, ఫీచర్స్, లైఫ్స్టైల్, హెల్త్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫుడ్, బ్యూటీకి సంబంధించిన సరికొత్త విషయాలను సేకరించి అందిస్తున్నాను.
తాతగారి 24 ఏళ్ల నాటి SBI పాస్బుక్లో రూ.1 లక్ష బ్యాలెన్స్.. ఇప్పుడు ఆ డబ్బును క్లెయిమ్ చేయడం ఎలా?
ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తికి తన తాతగారికి చెందిన సుమారు 24 ఏళ్ల నాటి పాత ఎస్బీఐ బ్యాంక్ పాస్బుక్ లభించింది. ఆశ్చర్యకరంగా, ఆ ఖాతాలో రూ.1 లక్షకు పైగా బ్యాలెన్స్ ఉన్నట్లు అందులో నమోదై ఉంది. ఖాతాదారుడు మరణించినందున, ఇన్నేళ్ల తర్వాత ఆ డబ్బును తిరిగి పొందడం సాధ్యమేనా? లేదా ఆ డబ్బు పోయినట్లేనా..? అంటూ సదరు వ్యక్తి సోషల్ మీడియాలో నెటిజన్ల సలహా కోరగా ఈ విషయం వైరల్గా మారింది. బ్యాంకింగ్ నిపుణుల ప్రకారం,..
- Jyothi Gadda
- Updated on: Jul 16, 2026
- 4:20 pm
పెళ్లి ఇష్టం లేక యువతి గుండు చేయించుకుందా? వైరల్ వీడియో వెనుక అసలు నిజం తెలిస్తే అవాక్కే!
సోషల్ మీడియా ప్రపంచంలో వైరల్ అవ్వడానికి, లైక్లు, వ్యూస్ పెంచుకోవడం కోసం ప్రజలు ఎంతకైనా తెగిస్తారనడానికి ఒక దిగ్భ్రాంతికరమైన ఉదాహరణ ఇటీవల కనిపించింది. కెమెరా ముందు ఒక యువతి తన తలని గుండు చేయించుకుంటున్న వీడియో ఇంటర్నెట్లో వేగంగా వైరల్ అవుతోంది. మరింత షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ వీడియో పైన ఉన్న టెక్స్ట్లో, ఆమె తల్లి ఆమెకు పెళ్లి కుదిర్చిందని, దానిని తప్పించుకోవడానికే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుందని పేర్కొనబడింది. ఈ వింత వాదన చేస్తున్న ఈ వీడియో, సోషల్ మీడియాలో ఒక చర్చకు దారితీసింది. అసలేం జరిగిందంటే..
- Jyothi Gadda
- Updated on: Jul 16, 2026
- 3:50 pm
ఇంటి పైకప్పును చీల్చి బెడ్రూమ్లో పడిన అంతరిక్ష రాయి..అదేంటని పరిశీలించగా, శాస్త్రవేత్తలే షాక్!
భూమిపై అసలు నీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ జీవం ఎలా మొదలైంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు నాసా వంటి పెద్ద పెద్ద అంతరిక్ష సంస్థలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అయితే, ప్రకృతి మాత్రం ఆ రహస్యాల నిధిని నేరుగా ఒక వ్యక్తి బెడ్రూమ్లో తెచ్చి పడేసింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఒక ఇంటిపై పడిన ఉల్కాపాతంపై ఇటీవల సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో ప్రచురితమైన పరిశోధన, భూమి అత్యంత పురాతన రహస్యాలను వెల్లడించింది.
- Jyothi Gadda
- Updated on: Jul 16, 2026
- 3:51 pm
ఓరీ దేవుడో అస్తిపంజరం ఖరీదు రూ.482కోట్లు.. 10నిమిషాల వేలంలో ప్రపంచ రికార్డు! శాస్త్రవేత్తల ఆందోళన..?
గస్ అని పిలిచే ఈ డైనోసార్ అస్థిపంజరానికి వేలంలో ఊహించని రీతిలో భారీ పోటీ నెలకొంది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఒక రహస్య కొనుగోలుదారుడు దీనిని ఏకంగా 50.1 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.482 కోట్లు) కొనుగోలు చేశారు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అస్థిపంజరంగా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే, ఈ వేలం ప్రక్రియపై శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- Jyothi Gadda
- Updated on: Jul 16, 2026
- 2:58 pm
వంటింటి రత్నం నల్ల మిరియాలు.. రోజూ తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
బరువు తగ్గడం, రోగనిరోధక శక్తిని పెంచడం, కీళ్ల నొప్పులను తగ్గించడం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు నల్ల మిరియాల ద్వారా లభిస్తాయి. ఈ చిన్న గింజలు మన శరీరానికి చేసే మేలు, వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే
- Jyothi Gadda
- Updated on: Jul 15, 2026
- 9:56 pm
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసే నెయ్యి.. డయాబెటిస్ ఉన్నవారు ఇలా తిన్నారంటే తిరుగుండదు..!
మధుమేహం ఉన్నవారు నెయ్యి తినవచ్చా? లేదా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే, పరిమితంగా నెయ్యిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అద్భుతంగా నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు పిండిపదార్థాల శోషణను నెమ్మదింపజేసి, తిన్న వెంటనే షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరగకుండా అడ్డుకుంటాయి. డయాబెటిస్ నియంత్రణకు నెయ్యి ఎలా సహాయపడుతుంది.. దానిని ఎంత మోతాదులో, ఎలా తినాలో అనే పూర్తి వివరాలను తెలుసుకోండి.
- Jyothi Gadda
- Updated on: Jul 15, 2026
- 9:41 pm
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెండకాయ నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలన్నీ మాయం!
ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది ఉదయాన్నే నిమ్మరసం నీరు, కలబంద రసం లేదా నానబెట్టిన చియా విత్తనాల నీటిని తాగుతుంటారు. అయితే, వీటన్నింటిలాగే బెండకాయ నీరు తాగడం వల్ల కూడా శరీరానికి అపారమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెండకాయలో ఉండే జిగురు లాంటి పదార్థం, ఫైబర్, విటమిన్-సి వంటి పోషకాలు శరీరంలోని అనేక వ్యాధులను దూరం చేయడానికి సహాయపడతాయి. ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఈ నీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య లాభాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం:
- Jyothi Gadda
- Updated on: Jul 15, 2026
- 8:40 pm
ప్రపంచ డ్రాగన్ ఫ్రూట్ రాజధాని ఆ దేశమే.. ఏడాది పొడవునా రాత్రి పూట వెలిగే తోటల వెనుక రహస్యం!
పిటాయా లేదా స్ట్రాబెర్రీ పియర్ అని పిలవబడే డ్రాగన్ ఫ్రూట్, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఉష్ణమండల పండ్లలో ఒకటి. ప్రస్తుతం అనేక దేశాలు దీనిని పండిస్తున్నాయి. రూపంలో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ, ఆరోగ్యానికి అద్భుతమైన మేలు చేసే ఈ డ్రాగన్ ఫ్రూట్ అసలు ఎక్కడ పుట్టింది..! ప్రపంచ వ్యాప్తంగా డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువగా ఏ దేశంలో పండిస్తారో తెలుసా..? ఈ వింతైన పండు చరిత్ర దాని ప్రాముఖ్యత గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
- Jyothi Gadda
- Updated on: Jul 15, 2026
- 8:22 pm
తక్కువ ఎత్తు ఉన్నవారికి బెస్ట్ క్రూజర్ బైక్లు..స్టైలిష్ లుక్, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!
ద్విచక్ర వాహన మార్కెట్లో తక్కువ ఎత్తు ఉన్న సవారీదారులకు అనువైన మోటార్ సైకిల్ను ఎంచుకోవడం ఒక సవాలుతో కూడుకున్న విషయం. ముఖ్యంగా పవర్ఫుల్ క్రూజర్ లేదా రెట్రో-స్టైల్ బైక్లను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు సీటు ఎత్తు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా 5.3 అడుగుల నుండి 5.6 అడుగుల ఎత్తు ఉన్నవారు భారీ బైక్లను ట్రాఫిక్లో నడపడం లేదా ఆగినప్పుడు పాదాలను నేలపై ఆరామంగా ఉంచడం కొంచెం కష్టం. అయితే, భారతదేశంలో తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు అద్భుతమైన బ్యాలెన్స్, విశ్వాసాన్ని ఇచ్చే మూడు సూపర్ క్రూజర్ బైక్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం..
- Jyothi Gadda
- Updated on: Jul 15, 2026
- 7:21 pm
ఈ నాలుగు ప్రదేశాలలో మీకు కావలసినంత బంగారం ఉచితంగా లభిస్తుంది..! రెండు మన భారతదేశంలోనే..?
బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత తరుణంలో, ప్రపంచంలో ఉచితంగా బంగారం లభించే నదులు ఉన్నాయంటే నమ్ముతారా? అవును, నిజమే! ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా బంగారం లభించే నాలుగు ప్రధాన ప్రాంతాలు ఉండగా, అందులో రెండు మన భారతదేశంలోనే ఉండటం విశేషం. ఇక్కడి స్థానిక ప్రజలు నది ఇసుకను వడపోసి బంగారం సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ అద్భుతమైన బంగారు నదుల గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
- Jyothi Gadda
- Updated on: Jul 15, 2026
- 6:47 pm
ఏందక్కాయ్ నువ్వు.. ప్రయాణికురాలిగా వచ్చి ఏకంగా కండక్టర్ బ్యాగుకే ఎసరు పెట్టావ్..
బస్సులో ప్రయాణికురాలిగా ఎక్కిన ఒక మహిళ.. ఏకంగా కండక్టర్ టికెట్, నగదు బ్యాగ్నే దొంగిలించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బస్సులో రద్దీగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని ఆమె చాకచకర్యంగా ఈ దొంగతనానికి పాల్పడింది. అయితే తన బ్యాగ్ మాయమవడాన్ని గమనించిన కండక్టర్ సమయస్ఫూర్తితో బస్సు తలుపులు మూయించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ప్రయాణికుల సామాన్లను తనిఖీ చేయగా సదరు మహిళ బ్యాగులో కండక్టర్ లగేజీ బ్యాగ్ దొరికింది. ఆ తర్వాత ఏం జరిగిందో పూర్తి డిటెల్స్ లోకి వెళ్లాల్సిందే..
- Jyothi Gadda
- Updated on: Jul 15, 2026
- 6:21 pm
మీ ఇంటి ఆవరణలో ఈ 5 మొక్కలు ఉంటే జాగ్రత్త.. పాములు ఖచ్చితంగా లోపలికి వస్తాయి!
వర్షాకాలం ప్రారంభం కాగానే చాలా ప్రాంతాల్లో పాముల సంచారం పెరుగుతుంది. ముఖ్యంగా ఇళ్ల చుట్టూ ఉండే తోటలు, పెరడు, పొలాలు, దట్టమైన పొదలు ఉన్నచోట పాములు ఎక్కువగా ఆశ్రయం పొందుతాయి. అయితే, మన ఇంటి చుట్టూ పెంచే కొన్ని రకాల మొక్కలు పాములు దాక్కోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి మొక్కలు ఏవో, పాములు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
- Jyothi Gadda
- Updated on: Jul 15, 2026
- 4:33 pm