జి. జ్యోతి తెలుగు మీడియాలో 12ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012లో 10టీవీతో జర్నలిజంలో అడుగుపెట్టాను. రెండేళ్ల పాటు 10టీవీలోనే వర్క్ చేశాను. ఆ తరువాత ప్రముఖ మీడియా సంస్థలు, ఆంధ్రప్రభ, టీ న్యూస్, స్నేహా టీవీలో పనిచేసి విలువైన సేవలు అందించాను. 2017లో టీవీ 9లో చేరాను. ఇక్కడ ఏక్ నంబర్ నంబర్ బులిటెన్ ప్రొడ్యూసర్గా పనిచేశాను. వాయిస్ ఓవర్, డిజిటల్ టెక్ట్స్ స్టోరీస్ యూట్యూబ్ కోసం రాశాను. ప్రస్తుతం టీవీ9 వెబ్సైట్లో సీనియర్ సబ్ఎడిటర్గా పని చేస్తున్నాను. రిజినల్ న్యూస్, వైరల్ వార్తలు, ఫీచర్స్, లైఫ్స్టైల్, హెల్త్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫుడ్, బ్యూటీకి సంబంధించిన సరికొత్త విషయాలను సేకరించి అందిస్తున్నాను.
గాన గంధర్వుడు కిషోర్ కుమార్ డ్రీమ్ హోమ్ గౌరీ కుంజ్.. ఇప్పుడు విరాట్ కోహ్లీ వన్8 కమ్యూన్!
బహుముఖ ప్రజ్ఞాశాలి, దిగ్గజ గాయకుడు కిషోర్ కుమార్ ముంబైలోని జుహు తారా రోడ్లో నిర్మించుకున్న గౌరీ కుంజ్ బంగ్లా ఆయనకు ఎంతో ప్రియమైన నివాసం. తన తల్లి గౌరీ దేవి పేరు మీదుగా నిర్మించుకున్న ఈ ప్రాంగణం ఆయనకు సంగీత సాధనా కేంద్రంగానే కాకుండా ఒక ప్రశాంతమైన విశ్రాంతి స్థలంగా ఉండేది. ఆయన చెట్లతో సంభాషించడం, తన ప్రైవసీ కోసం గేటుపై బేవార్ ఆఫ్ కిషోర్ అనే బోర్డు పెట్టడం వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ బంగ్లాతో ముడిపడి ఉన్నాయి. ప్రస్తుతం ఈ చారిత్రక ప్రాంగణం భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వన్8 కమ్యూన్ రెస్టారెంట్గా మారింది..!
- Jyothi Gadda
- Updated on: Aug 6, 2026
- 1:56 pm
అమ్మవారికి సమర్పించే బోనం ఎన్ని రకాలుగా చేస్తారు? ఒక్కో బోనం వెనుక ఉన్న మహత్యం ఇదే!
ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తి పారవశ్యం వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోతాయి. ఊరూ వాడా ఏకమై శక్తి స్వరూపిణి అయిన గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం తెలుగువారికి మాత్రమే సొంతమైన ఒక అరుదైన, విశిష్టమైన సంస్కృతి. ఇంతకీ బోనం అంటే ఏమిటి? అందులో ఏముంటుంది..? ఇప్పుడు చూద్దాం..
- Jyothi Gadda
- Updated on: Aug 6, 2026
- 1:33 pm
మీ పెంపుడు కుక్కను పిడుదులు వేధిస్తున్నాయా? తక్షణ ఉపశమనం కోసం అద్భుతమైన చిట్కాలు ఇవే!
మీ ప్రియమైన పెంపుడు కుక్క నిరంతరం తనను తాను గోక్కుంటోందా? అలా అయితే, దానికి ఈగలు లేదా పురుగులు పట్టి ఉండవచ్చు. ఈ చిన్న కీటకాలు మీ కుక్కను ఇబ్బంది పెట్టడమే కాకుండా, క్రమంగా ఇల్లంతా వ్యాపిస్తాయి. అవి ఇంట్లోని ఇతర వ్యక్తులను, పెంపుడు జంతువులను కూడా ప్రభావితం చేయగలవు. వాటిని వదిలించుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలను, కుక్కల కోసం 7-7-7 నియమాన్ని తెలుసుకుందాం.
- Jyothi Gadda
- Updated on: Aug 6, 2026
- 12:29 pm
మరో విషాదం.. నీట్ కోచింగ్ తీసుకుంటున్న హైదరాబాద్ విద్యార్థిని హాస్టల్లో బలవన్మరణం
కృష్ణా జిల్లాలోని కానూరులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నీట్ (NEET) ప్రవేశ పరీక్ష కోసం శిక్షణ పొందుతున్న హైదరాబాద్కు చెందిన ఓ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచెత్తింది. విద్యార్థి మృతికి సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల్లోకి వెళితే...
- Jyothi Gadda
- Updated on: Aug 6, 2026
- 12:15 pm
పరగడుపున నాలుగు మారేడు ఆకులు నమిలి తింటే.. శరీరంలో జరిగేది అద్భుతమే!
ఉదయాన్నే పరగడుపున మారేడు ఆకులను నమిలి తినడం వల్ల శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల..
- Jyothi Gadda
- Updated on: Aug 6, 2026
- 11:37 am
వారానికి ఎంత మటన్ తింటే మంచిది? ఆరోగ్య ప్రయోజనాలు, పరిమితులు, నిపుణుల సూచనలు ఇవే!
మనదేశంలో నాన్వెజ్ ప్రియులు అత్యంత ఇష్టంగా తినే ఆహారాల్లో మటన్ ఒకటి. మటన్ వంటకాలు విశేషమైన రుచితో పాటు శరీరానికి అవసరమైన అనేక ముఖ్య పోషకాలను అందిస్తాయి. అయితే, మటన్ రెడ్ మీట్ కావడం వల్ల దీనిని ఎంత మోతాదులో తింటున్నామనేది చాలా ముఖ్యం. పరిమితికి మించి తింటే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మటన్ తినడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరంగా తెలుసుకుందాం.
- Jyothi Gadda
- Updated on: Aug 6, 2026
- 10:58 am
అరటి పువ్వు అద్భుతాలు.. మధుమేహ నియంత్రణలో లక్ష్మణ రేఖ! వారానికి ఒక్కసారైనా తింటే
మనదేశంలో అరటి చెట్టులోని ప్రతి భాగానికి ఒక ప్రత్యేకత ఉంది. అరటి పండ్లు, అరటి కాయలు తినడం, అరటి ఆకులో భోజనం చేయడం మన సంప్రదాయంలో భాగం. అయితే చాలామంది అరటి పువ్వును వంటల్లో వాడేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. నిజానికి ఆయుర్వేదం, ఆధునిక పోషకాహార శాస్త్రం ప్రకారం అరటి పండు కంటే అరటి పువ్వులోనే అత్యధిక పోషకాలు ఉన్నాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.
- Jyothi Gadda
- Updated on: Aug 6, 2026
- 10:41 am
దబ్బచెట్టు కాయ, పండు కాదు.. ఆకులలో ఉంది అద్భుతమైన ఆరోగ్య రహస్యం.. తెలిస్తే అస్సలు వదలిపెట్టరు!
సిట్రస్ జాతికి చెందిన దబ్బకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ, దబ్బకాయ ఆకులలో ఇంకా ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో మీకు తెలుసా? మీరు ఎన్నడూ ఊహించని ప్రయోజనాలను అవి అందించగలవు. దబ్బకాయ చెట్టు ఆకులు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని సిద్ధ వైద్య నిపుణురాలు డాక్టర్ మైథిలి స్పష్టం చేస్తున్నారు. సాంప్రదాయ సిద్ధ వైద్యంలో ప్రాచీన కాలం నుండి ఈ ఆకులను వివిధ అనారోగ్య సమస్యల నివారణకు ఉపయోగిస్తున్నారు.
- Jyothi Gadda
- Updated on: Aug 6, 2026
- 10:14 am
Silver: బంగారం కాదు, వెండి జ్యూవెలరీ కొనాలని అనుకుంటున్నారా? దేశంలోనే బెస్ట్ సిటీ ఇదే!
ప్రస్తుతం బంగారం ధరలు రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. సామాన్యులు బంగారం కొనడం భారంగా మారడంతో, అందరి దృష్టి ఇప్పుడు వెండి ఆభరణాలపై పడింది. రకరకాల ట్రెండీ డిజైన్లు, ఆక్సిడైజ్డ్ మోడల్స్లో లభిస్తున్న సిల్వర్ జ్యువెలరీకి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. అయితే, దేశంలోనే అత్యంత నాణ్యమైన, యూనిక్ డిజైన్లు కలిగిన వెండి నగలను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయాలంటే రాజస్థాన్లోని జైపూర్ సరైన గమ్యస్థానం.
- Jyothi Gadda
- Updated on: Aug 6, 2026
- 9:43 am
ఓరీ దేవుడో.. ఈ కలర్ ఫుల్ పాపడాల వెనుక ఇంత ప్రమాదం పొంచివుందా..? లొట్టలేసుకుంటూ తిన్నారంటే..
భోజనంలో నంజుకోవడానికి వడియాలు, అప్పడాలు ఉండటం మన భారతీయ ఇళ్లలో సర్వసాధారణం. అయితే, ఈ రోజుల్లో మార్కెట్లో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, గులాబీ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభించే కలర్ పాపడ్స్, రంగు రంగుల వడియాలకు ఆదరణ పెరిగింది. ముఖ్యంగా పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. కానీ, చూడటానికి కంటికి ఇంపుగా ఉండే ఈ రంగు అప్పడాలు మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- Jyothi Gadda
- Updated on: Aug 6, 2026
- 8:29 am
తరచూ పొట్ట ఉబ్బరం, గ్యాస్ సమస్య వేధిస్తోందా? అజీర్తిని తరిమికొట్టే అద్భుత ఆయుర్వేద చిట్కాలు ఇవే!
కడుపు ఉబ్బరం అనేది చాలా మంది ఎదుర్కొనే ఒక సాధారణ జీర్ణ సమస్య. దీనివల్ల కడుపు నిండుగా, బిగుతుగా లేదా ఉబ్బినట్లుగా అనిపించవచ్చు. ఇది తరచుగా భోజనం చేసిన తర్వాత వస్తుంది. దీనితో పాటు గ్యాస్, త్రేనుపులు లేదా కడుపు నొప్పి కూడా ఉండవచ్చు. అప్పుడప్పుడు వచ్చే కడుపు ఉబ్బరం ప్రమాదకరం కాదు . అయితే, ఇది తరచుగా సంభవిస్తే, అది జీర్ణక్రియ సరిగా లేదనడానికి లేదా ఏదైనా ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. ఆయుర్వేదం ప్రకారం, కడుపు ఉబ్బరానికి ప్రధాన కారణం వాత దోషంలో అసమతుల్యత. ఈ దోషం జీర్ణక్రియతో సహా శరీరంలోని అన్ని విధులను నియంత్రిస్తుంది. జీర్ణాశయ అగ్ని బలహీనపడినప్పుడు, ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. జీర్ణం కాని ఆహార వ్యర్థాలు ఏర్పడవచ్చు. దీనివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటి సమస్యలకు ఆయుర్వేదంలో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. కడుపు ఉబ్బరం కోసం 6 ఆయుర్వేద నివారణలు, వాటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం.
- Jyothi Gadda
- Updated on: Aug 6, 2026
- 7:47 am
ఆరోగ్యానికి అద్భుత ఔషధం, సర్వరోగ నివారిణి అమృతవల్లి..! ఖాళీ కడుపుతో ఇలా వాడారంటే తిరుగులేని..
మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో రకాల మూలికా మొక్కలు లభిస్తాయి. అందులో ముఖ్యంగా అమృతం లాంటి గుణాలు కలిగి ఉన్న అద్భుతమైన మొక్క తిప్పతీగ. ఆయుర్వేదంలో ప్రాచీన కాలం నుండి తిప్పతీగను రకరకాల అనారోగ్య సమస్యల నివారణకు ఉపయోగిస్తున్నారు. ఈ మొక్క ఆకులు, కాండం, వేర్లు.. ఇలా ప్రతి భాగం అపారమైన ఔషధ విలువలను కలిగి ఉంటుంది. తిప్పతీగతో చేసిన జ్యూస్, పౌడర్ లేదా కషాయం తీసుకోవడం ద్వారా శరీరానికి కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- Jyothi Gadda
- Updated on: Aug 6, 2026
- 7:01 am