జి. జ్యోతి తెలుగు మీడియాలో 12ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012లో 10టీవీతో జర్నలిజంలో అడుగుపెట్టాను. రెండేళ్ల పాటు 10టీవీలోనే వర్క్ చేశాను. ఆ తరువాత ప్రముఖ మీడియా సంస్థలు, ఆంధ్రప్రభ, టీ న్యూస్, స్నేహా టీవీలో పనిచేసి విలువైన సేవలు అందించాను. 2017లో టీవీ 9లో చేరాను. ఇక్కడ ఏక్ నంబర్ నంబర్ బులిటెన్ ప్రొడ్యూసర్గా పనిచేశాను. వాయిస్ ఓవర్, డిజిటల్ టెక్ట్స్ స్టోరీస్ యూట్యూబ్ కోసం రాశాను. ప్రస్తుతం టీవీ9 వెబ్సైట్లో సీనియర్ సబ్ఎడిటర్గా పని చేస్తున్నాను. రిజినల్ న్యూస్, వైరల్ వార్తలు, ఫీచర్స్, లైఫ్స్టైల్, హెల్త్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫుడ్, బ్యూటీకి సంబంధించిన సరికొత్త విషయాలను సేకరించి అందిస్తున్నాను.
ఆరు నెలల తర్వాత భక్తులకు దర్శన భాగ్యం.. చార్ధామ్ ఆలయాల తలుపులు తెరుచుకునే తేదీలు ఖరారు – పూర్తి వివరాలు ఇక్కడే
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భక్తులకు శుభవార్త.. కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకునే శుభ సమయం వచ్చేసింది. చార్ ధామ్ యాత్రల్లో ముఖ్యమైన నాలుగు ఆలయాల ద్వారాలు ఏప్రిల్ నెలలో తిరిగి తెరచుకోనున్నాయి. ఈ మేరకు కేదార్ నాథ్ - బద్రీనాథ్ ఆలయాల కమిటీ అధికారికంగా తేదీలను ప్రకటించాయి. మహాశివరాత్రి శుభ సందర్భంగా ఉత్తరాఖండ్లోని ఉఖిమత్లోని ఓంకారేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రావల్పిండి ప్రభుత్వం కేదార్నాథ్ తలుపులు తెరిచే తేదీని ప్రకటించింది.
- Jyothi Gadda
- Updated on: Feb 17, 2026
- 7:44 am
కార్డ్బోర్డ్పై గొడుగు సింబల్ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఇది చిన్న కథ కాదు..!
కార్టన్ పెట్టెల్లో వచ్చే పెద్ద వస్తువుల ప్యాకేజింగ్పై గొడుగు గుర్తు ఎందుకుంటుందో తెలుసా? వర్షం, తడి నుండి లోపల ఉన్న విలువైన వస్తువులను కాపాడమని డెలివరీ చేసేవారికి, కస్టమర్లకు ఈ గుర్తు హెచ్చరిస్తుంది. ఎలక్ట్రానిక్ పరికరాలు నీటితో పాడవకుండా నిరోధించడానికి ఈ ప్రత్యేకమైన చిహ్నం రూపొందించబడింది, తద్వారా మీ వస్తువులు సురక్షితంగా మీ చేతికి అందుతాయి.
- Jyothi Gadda
- Updated on: Feb 16, 2026
- 2:14 pm
బంగారంపై పెట్టుబడి చాలు.. రూట్ మార్చేయండి..! ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లోహం..గ్రాము ధర తెలిస్తే..
కాలిఫోర్నియం-252 ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లోహం. దీని ఒక గ్రాము ధర 200 కిలోల బంగారంతో సమానం. ఇది సహజంగా లభించదు; అణు రియాక్టర్లలో ప్రత్యేక ప్రక్రియ ద్వారా మానవులు దీనిని ఉత్పత్తి చేస్తారు. క్యాన్సర్ చికిత్సలో న్యూట్రాన్ థెరపీ, చమురు అన్వేషణ, పారిశ్రామిక పరీక్షలలో దీనికి కీలక ఉపయోగాలున్నాయి. దాని అరుదైన ఉత్పత్తి, న్యూట్రాన్లను విడుదల చేసే సామర్థ్యం దీనికి అపారమైన విలువను ఇస్తుంది.
- Jyothi Gadda
- Updated on: Feb 16, 2026
- 2:00 pm
ఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకు ఉంటాయి..? 2000 సంవత్సరాల నాటి ఈ రహస్యం తెలిస్తే షాక్ అవుతారు.!
ఫిబ్రవరిలో 28 రోజులు ఉండటానికి శాస్త్రీయ కారణం లేదు. ఇది ప్రాచీన రోమన్ల నమ్మకాలు, చరిత్రతో ముడిపడి ఉంది. రోమన్లు బేసి సంఖ్యలను శుభప్రదంగా భావించేవారు. కింగ్ నుమా పాంపిలియస్ క్యాలెండర్ను సంస్కరించి, చనిపోయినవారితో సంబంధం ఉన్న ఫిబ్రవరిని 28 రోజులకు తగ్గించారు. జూలియన్, గ్రెగోరియన్ క్యాలెండర్ సంస్కరణలు వచ్చినా, ఫిబ్రవరి పొడవు అలాగే ఉండిపోయింది. లీప్ సంవత్సరంలో మాత్రమే 29 రోజులు ఉంటుంది.
- Jyothi Gadda
- Updated on: Feb 16, 2026
- 1:40 pm
రోజూ తేనె తింటే ఏమవుతుందో తెలుసా..? బాబా రామ్దేవ్ ఏం చెబుతున్నారంటే..
నేటి కల్తీకాలంలో మార్కెట్లో నకిలీ గురించి ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. దీని వలన తేనె స్వచ్ఛత చాలా ముఖ్యమైనది. ఈ సందర్భంలో, పతంజలి ఆయుర్వేద తేనె స్వచ్ఛతకు సంబంధించి ఒక శాస్త్రీయ అధ్యయనం ప్రచురించబడింది. దాని నాణ్యతా ప్రమాణాలను కాపాడుతూ వస్తోంది..పతంజలి ఆయుర్వేద తేనె గురించి శాస్త్రీయ పరిశోధనలు వెలువడ్డాయి. దాని నాణ్యతా ప్రమాణాలను పరిశీలించగా..
- Jyothi Gadda
- Updated on: Feb 16, 2026
- 1:14 pm
ఖాళీ కడుపుతో 4 నల్ల మిరియాలు చాలు..ఈ వ్యాధులు రమ్మన్నా రావు..!
నల్ల మిరియాలను బ్లాక్ గోల్డ్ గా పిలుస్తారు. వీటిలో సి, కె విటమిన్లు, ఫైబర్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కాలేయాన్ని శుభ్రం చేస్తుంది.
- Jyothi Gadda
- Updated on: Feb 16, 2026
- 12:46 pm
మీ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా..? ఈ తప్పు చేశారంటే డబ్బు రావడం కాదు.. ఉన్నది కూడా పోతుంది!
మనీ ప్లాంట్.. చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు.. పేరులోనే ఇది సంపదను ఆకర్షిస్తుందని సూచిస్తుంది. మనీ ప్లాంట్ ఉన్న ఇంట్లో నిరంతరం డబ్బు ప్రవహిస్తుందని నమ్ముతారు. అందుకే చాలా మంది ఇంట్లో మనీ ప్లాంట్ ను పెంచుకుంటారు. ఇంట్లో మనీప్లాంట్ పెంచుకుంటే ఇంటికి ఆనందంతోపాటు వాస్తుపరంగా మేలు జరుగుతుందని విశ్వాసం. అయితే, వాస్తు శాస్త్రం నియమాల ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ నాటడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయో ఇక్కడ చూద్దాం..
- Jyothi Gadda
- Updated on: Feb 16, 2026
- 12:16 pm
Banana Leaf Benefits: పండగ పూట పేపర్ ప్లేట్లు కాదు.. అరటి ఆకులో భోజనం చేయండి.. భక్తితో పాటు భలే ఆరోగ్యం..!
దక్షిణ భారతదేశంలో అరటి ఆకులపై ఆహారాన్ని వడ్డించే సంప్రదాయం తరతరాలుగా ఉంది. ఇది మన సంస్కృతిలో ఒక అందమైన భాగం మాత్రమే కాదు. మన పూర్వీకుల లోతైన శాస్త్రీయ అవగాహనకు నిదర్శనం. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేడి వేడి ఆహారం అరిటాకుల్లో వడ్డించినప్పుడు అవి వాటి ఉపరితలంపై కనిపించని పోషకాలు, సువాసనల్ని విడుదల చేస్తాయి. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా అనేక కడుపు సంబంధిత సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
- Jyothi Gadda
- Updated on: Feb 16, 2026
- 11:49 am
ఇంటికి కాదు, సూర్యుడికి అద్దె.. సన్లైట్ కోసమే రూ.80 వేల కిరాయి వసూలు చేస్తున్న ఫ్లాట్ ఓనర్!
అద్దెకు ఇల్లు దొరకడం, అద్దె చెల్లించడం బెంగళూరులో చాలా కష్టం. ఇటీవలి కాలంలో చాలా మంది తమ అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. పెరుగుతున్న అద్దెల కారణంగా బెంగళూరులో పరిస్థితి చాలా దారుణంగా మారింది. చిన్న చిన్న సౌకర్యాలకు కూడా ప్రజల నుండి అధిక మొత్తాలను వసూలు చేస్తున్నారు. ఇటీవల, ఒక మహిళ ఇలాంటి అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఇది చర్చనీయాంశంగా మారింది.
- Jyothi Gadda
- Updated on: Feb 16, 2026
- 11:27 am
ఉత్తరాఖండ్లో పుట్టి, నేపాల్తో సహజ సరిహద్దుగా ప్రవహించే నల్ల నది రహస్యం ఏంటో తెలుసా..?
కాళీ నది హిమాలయాలలోని కాలాపానీలో ఉద్భవించి, భారత్-నేపాల్ మధ్య సహజ సరిహద్దుగా ప్రవహిస్తుంది. దీనిని 'నల్ల నది' అని పిలుస్తారు, దీనికి పర్వత నీడలు, నల్లటి రాళ్లు, మత విశ్వాసాలు కారణం. పర్వతాల నుండి మైదానాలకు దిగిన తర్వాత శారదా నదిగా మారి, చివరికి గంగానదిలో కలుస్తుంది. ఇది కేవలం నది కాదు, చరిత్ర, సంస్కృతి, భౌగోళిక ప్రాముఖ్యత కలిగిన సజీవ కథ.
- Jyothi Gadda
- Updated on: Feb 16, 2026
- 11:05 am
రూ.3 కోట్లకు పైగా ఖరీదైన లగ్జరీ హౌజ్.. లివింగ్ రూమ్లోకి అడుగు పెట్టగానే ఉంటుందీ.. ఒకపెద్ద….!
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల.. ఈ కల కోసం ప్రజలు ఎన్నో కష్టాలు పడుతుంటారు. అలాంటి కలల ఇంటిని తమకు నచ్చినట్టుగా ఉండాలని ఎన్నో ఊహించుకుంటారు. అలాగే కొత్తగా ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటున్న వారికోసం సోషల్ మీడియాలో ఒక ఇల్లు ప్రత్యేకించి వైరల్ అవుతోంది. బయటి నుండి సాధారణంగా కనిపిస్తున్న ఈ ఇల్లు, లోపలి నుండి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అది చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఆ ఇంట్లో ఏముందో తెలియాలంటే పూర్తి కథలోకి వెళ్లాల్సిందే..
- Jyothi Gadda
- Updated on: Feb 16, 2026
- 10:23 am
Puri Beach Sand Art: పూరి బీచ్లో వెలసిన మహా శివుడు..17,000 రుద్రాక్షలతో అద్భుతమైన దర్శనం..! చూస్తే..
రుద్రాక్ష, శివలింగం ద్వారా తన శివ భక్తి, అంకితభావాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించానని ఆయన వివరించారు. ఈ వార్త భారతీయ పండుగలలో కళ, ఆధ్యాత్మికతల కలయికను ప్రదర్శిస్తుంది. మహాశివరాత్రి నాడు ఇటువంటి కార్యక్రమాలు ప్రజలలో భక్తి, సానుకూల శక్తిని నింపుతాయంటూ పలువురు నెటిజన్లు కొనియాడుతున్నారు.
- Jyothi Gadda
- Updated on: Feb 16, 2026
- 9:48 am