AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News For Diabetics: వావ్‌.. డయాబెటిస్ ఉన్నా అన్నం తినొచ్చు! శాస్త్రవేత్తలు కనిపెట్టిన డిజైనర్ రైస్‌తో చింతలేదిక

చాలా మంది డయాబెటిస్ లేదా అధిక బరువు సమస్యలతో బాధపడుతుంటారు. దీనివల్ల వైద్యులు తరచుగా అన్నం (బియ్యం) తగ్గించాలని సూచిస్తారు. ఎందుకంటే సాధారణ బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండి, తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలను (Blood Sugar) పెంచుతాయి. అయితే, భారతీయ శాస్త్రవేత్తలు తాజాగా డిజైనర్ రైస్ అనే కొత్త రకం బియ్యాన్ని అభివృద్ధి చేశారు. ఈ బియ్యం ప్రత్యేకత, పోషకాల విలువలు తెలిస్తే నిజంగానే షుగర్‌ బాధితులకు గుడ్‌న్యూస్‌ అంటారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Good News For Diabetics: వావ్‌.. డయాబెటిస్ ఉన్నా అన్నం తినొచ్చు! శాస్త్రవేత్తలు కనిపెట్టిన డిజైనర్ రైస్‌తో చింతలేదిక
Good News For Diabetics
Jyothi Gadda
|

Updated on: Mar 16, 2026 | 7:05 AM

Share

భారతీయుల భోజనంలో అన్నం లేనిదే ముద్ద దిగదు. కానీ, చక్కెర వ్యాధి ఉన్నవారు మాత్రం అన్నం తినాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే బియ్యంలో ఉండే పిండి పదార్థం (Carbohydrates) రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) శాస్త్రవేత్తలు ఒక వినూత్నమైన కొత్త రకం బియ్యాన్ని అభివృద్ధి చేశారు. దీనికి వారు డిజైనర్ రైస్ అని పేరు పెట్టారు.

ఎందుకిది ప్రత్యేకం?

అధిక ప్రోటీన్: సాధారణ బియ్యంలో ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. కానీ, ఈ డిజైనర్ రైస్‌లో ప్రోటీన్ శాతాన్ని పెంచారు. ఇది కండరాల పుష్టికి, శరీర మరమ్మతులకు సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

లో గ్లైసీమిక్ ఇండెక్స్ (Low GI): గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల, ఇది శరీరంలో నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.

దీర్ఘకాలిక శక్తి: ప్రోటీన్, ఫైబర్ సమతుల్యత వల్ల, ఈ అన్నం తింటే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచిది.

డయాబెటిస్ రోగులకు ఒక వరం:

భారతదేశం ప్రస్తుతం డయాబెటిక్ క్యాపిటల్‌గా మారుతున్న తరుణంలో ఈ ఆవిష్కరణ ఎంతో కీలకమైనది. తమ ఆహార అలవాట్లను పూర్తిగా మార్చుకోలేక ఇబ్బంది పడేవారు, ఈ బియ్యాన్ని వాడటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ బియ్యం రుచిలో కానీ, వండే విధానంలో కానీ సాధారణ బియ్యానికి ఏమాత్రం తీసిపోదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ డిజైనర్ రైస్‌పై మరిన్ని పరిశోధనలు, క్షేత్రస్థాయి పరీక్షలు జరుగుతున్నాయి. త్వరలోనే ఇది సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అన్నం ప్రియులకు, ఆరోగ్య స్పృహ ఉన్నవారికి ఇది నిజంగా ఒక తీపి కబురు. ఆధునిక శాస్త్ర సాంకేతికత ద్వారా ఆహారాన్ని మన ఆరోగ్యానికి అనుగుణంగా మార్చుకోవడం గొప్ప పరిణామం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us