Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత స్వాతంత్య్ర దినోత్సవం

భారత స్వాతంత్య్ర దినోత్సవం

భారతదేశం ఆగస్టు 15, 1947న బ్రిటిష్ పాలకుల వందల ఏళ్ల బానిసత్వం నుండి స్వాతంత్య్రం పొందింది. అందుకే దేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. స్వాతంత్ర భారతావని పలు రంగాల్లో సాధించిన పురోగతిని స్మరించుకుంటోంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 జాతీయ సెలవు దినంగా ఉంది. 1857లో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం మొదలుకుని.. దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎందరో స్వాతంత్య్ర పోరాట వీరులను భరతమాత కోల్పోయింది. పోరాటాల ఫలితంగా ఆగస్టు 14న అర్థరాత్రి సమయంలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది.

జూన్ 3, 1947న బ్రిటీష్ ఇండియా చివరి గవర్నర్ జనరల్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్, ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్య్రం ప్రసాదించే ప్రస్తావన ఉన్న ఒక ప్రణాళికను సమర్పించారు. దీనిని మౌంట్ బాటన్ ప్లాన్ అంటారు. ఆయన ప్రణాళికలో బ్రిటిష్ పాలన నుంచి ఇండియాను విడుదల చేయడం, భారతదేశం, పాకిస్తాన్‌ రెండు దేశాలను ఏర్పాటు చేయడం, రెండు దేశాల ప్రభుత్వాలకు స్వయంప్రతిపత్తి, సార్వభౌమాధికారం ఇవ్వడం వంటివి ఉన్నాయి. భారతదేశంలోని రాచరిక రాష్ట్రాలకు భారతదేశం లేదా పాకిస్తాన్‌లో చేరే హక్కు ఉంటుందని ఆయన ప్రణాళికలో పేర్కొనబడింది.

భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చేందుకు మౌంట్ బాటన్ 4 జూలై 1947న బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో భారత స్వాతంత్య్ర బిల్లును సమర్పించారు. ఈ బిల్లును బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించింది. భారతదేశానికి 15 ఆగస్టు 1947న స్వాతంత్య్రం ప్రకటించబడింది. అదే రోజున దేశ తొలి ప్రదాని జవహర్‌లాల్ నెహ్రూ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ప్రతి ఏటా ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రధాని జాతీయ జెండాను ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగించే సాంప్రదాయం కొనసాగుతోంది.

ఇంకా చదవండి

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ఉగ్రవాదంపై పోరులో భారత్ ఏం సాధించింది..? పాకిస్తాన్‌ను ఎలా ఒంటరి చేసింది..

ఖచ్చితమైన, ప్రభావవంతమైన దాడుల ద్వారా భారతదేశం సీమాంతర ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు, వాటి ప్రాయోజిత సంస్థలకు స్పష్టమైన సందేశాన్ని పంపింది. ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటానికి చిహ్నంగా మారిన ఆపరేషన్ సింధూర్.. కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, జాతీయ సంకల్పానికి నిదర్శనం. భారతదేశం శాంతిని కోరుకుంటుందని, కానీ పిరికితనాన్ని కాదని మరోసారి నిరూపించింది. ఉగ్రవాదంపై ఈ పోరాటం సరిహద్దులకే పరిమితం కాదు. ఇది భారతదేశ భవిష్యత్తును కాపాడటానికి ఒక సంకల్పం..

Upasana: ఇలాంటి ఘటనల మధ్య ఎలాంటి స్వాతంత్ర్యం జరుపుకుంటున్నాం.?

కోల్‌క‌తా జూనియ‌ర్ వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌పై కొణిదెల ఉపాస‌న ఎక్స్ వేదిక‌గా ఆవేద‌న‌ వ్యక్తం చేశారు. కొంద‌రిలో క‌నీస మాన‌వ‌త్వం ఉండ‌డం లేద‌ని విచారం వ్యక్తం చేశారు. మాన‌వ‌త్వాన్నే అప‌హాస్యం చేసే ఘ‌ట‌న ఇది అని పేర్కొన్నారు. స‌మాజంలో అనాగ‌రిక‌త కొన‌సాగుతుంటే మ‌నం ఎలాంటి స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్నామ‌ని ఆమె ప్రశ్నించారు. దేశ ఆరోగ్య సంర‌క్షణ‌కు మ‌హిళ‌లే వెన్నెముక అని తెలిపిన ఉపాస‌న‌.

Independence Day 2024: ఆ గ్రామంలో ఆగస్ట్ 16న స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు.. రెండు రోజుల పాటు జల్సా ఉత్సవాలు..

మన దేశానికి 15 ఆగస్ట్ 1947న స్వాతంత్ర్యం వచ్చిందని అందుకే భారతదేశ ప్రజలు ఈ రోజున స్వాతంత్ర్య దినోత్సవాన్ని పండగలా జరుపుకుంటారు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు, అయితే మన దేశంలో ఒక ప్రాంతంలో మాత్రం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆగష్టు 15 వ తేదీన కాకుండా ఆగష్టు 16 న జరుపుకుంటుంది. ఈ ప్రత్యేక గ్రామం హిమాచల్‌ ప్రదేశ్ లో ఉంది. ఈ నగరంలో స్వాతంత్ర్య దినోత్సవం 15న కాదు ఆగస్టు 16న అంటే ఈరోజు జరుపుకుంటుంది.

Upasana: ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఇండిపెండెన్స్‌డే ఎలా? ఉపాసన సంచలన పోస్ట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మెగా ఫ్యామిలీ కోడలిగా, రామ్ చరణ్ భార్యగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన. అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తూనే పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది.

Independence Day: ఆ గ్రామంలో 78 ఏళ్లుగా నిరంతరాయంగా ఎగురుతోన్న మువ్వన్నెల జెండా.. కారణం అదే!

ఎంతోమంది వీరుల ప్రాణ త్యాగంతో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. వారి త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. దేశభక్తిని అలవర్చుకునేందుకు స్వాతంత్య్రం సాధించుకున్నప్పటి నుంచి అంటే 78 ఏళ్లుగా ఆ గ్రామంలో నిరంతరాయంగా మువ్వన్నెల జాతీయ జెండా ఎగురుతూనే ఉంది.

Independence Day: రూ. వెయ్యితో విమానం ఎక్కొచ్చు.. త్వరపడండి.. మళ్లీ మళ్లీ రాదు ఇలాంటి ఆఫర్..

ఇండిగో ఎయిర్ లైన్స్ కూడా ఫ్రీడమ్ సేల్ ని ప్రకటించింది. ఆగస్టు 13 నుంచి ఈ సేల్ ప్రారంభమైంది. ఈ రోజు అంటే ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు ఇండిగో తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇండిగో ఫ్రీడమ్ సేల్లో మీరు విమాన టికెట్ ను కేవలం రూ. 1015కే కొనుగోలు చేయొచ్చు.

  • Madhu
  • Updated on: Aug 15, 2024
  • 12:06 pm

PM Modi Car: రేంజ్ రోవర్ కాన్వాయ్‌తో ఎర్రకోటలోకి ప్రధాని మోదీ గ్రాండ్ ఎంట్రీ.. ఈ కారు ధర ఎంతో తెలుసా?

భారత దేశవ్యాప్తంగా 78వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రేంజ్ రోవర్ సెంటినెల్, ఫార్చ్యూనర్ కార్ల కాన్వాయ్‌తో ప్రధాని మోదీ ఎర్రకోటకు చేరుకున్నారు.

Independence day: నట్లు, బోల్టులతో పూజ్య బాపూజీ.. ఆకట్టుకుంటున్న అపురూపమైన శిల్పం..!

బ్రిటీష్ పాలన నుండి స్వేచ్చ వాయువులు ప్రసాదించిన గాంధీ మహాత్ముని గురించి భారతీయులందరికీ తెలిసిందే..! అయితే స్వాంతంత్ర్య దినోత్సవం రోజు ఆయన విగ్రహం మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాపూజీ ఎన్నో రకాల విగ్రహాలను భారతీయులందరూ చూసే ఉంటారు.

Independence day: దేశ భక్తిని ఉప్పొంగించే టాలీవుడ్ సాంగ్స్.. నరనరానా ఇంకిన పాటలు ఇవి

దేశ భక్తి గీతాలు అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చే పాట పుణ్యభూమి నాదేశం. నందమూరి తారకరామారావు నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో పుణ్యభూమి నాదేశం నమోనామమి అనే సాంగ్ ప్రతి తెలుగువాడి నరనరానా.. ఇంకిపోయింది. ఆ సాంగ్ వింటేనే దేశ భక్తి ఉప్పొంగుతుంది. ఈ పాటలో ఎంతో గొప్ప భావం ఉంటుంది.

Indepencence Day:2014 నుంచి 2024 వరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ధరించే తలపాగాలు ఇవే..

భారతదేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. దేశానికి ప్రధానిగా మూడోసారి భాద్యతలు చేపట్టిన ప్రధాని మోడీ ఈ రోజు ఎర్రకోటపై11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. అంతేకాదు ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేసిన ప్రధాని జవహల్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ తర్వాత స్థానంలో ప్రధాని నిలిచారు. అయితే ఈ వేడుకల్లో అందరి దృష్టి ప్రధాని మోడీ ఆకర్షణీయమైన కుర్తా, తలపాగాపైనే ఉంది. ఈ రోజు ప్రధాని మోడీ నారింజ, ఆకుపచ్చ రంగు చారలతో కూడిన రాజస్థానీ లెహరియా తలపాగాను ధరించారు. అయితే ఇప్పటి వరకూ ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ధరించిన తలపాగాల రూపాల గురించి తెలుసుకుందాం