భారత స్వాతంత్య్ర దినోత్సవం
భారతదేశం ఆగస్టు 15, 1947న బ్రిటిష్ పాలకుల వందల ఏళ్ల బానిసత్వం నుండి స్వాతంత్య్రం పొందింది. అందుకే దేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. స్వాతంత్ర భారతావని పలు రంగాల్లో సాధించిన పురోగతిని స్మరించుకుంటోంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 జాతీయ సెలవు దినంగా ఉంది. 1857లో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం మొదలుకుని.. దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎందరో స్వాతంత్య్ర పోరాట వీరులను భరతమాత కోల్పోయింది. పోరాటాల ఫలితంగా ఆగస్టు 14న అర్థరాత్రి సమయంలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది.
జూన్ 3, 1947న బ్రిటీష్ ఇండియా చివరి గవర్నర్ జనరల్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్, ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్య్రం ప్రసాదించే ప్రస్తావన ఉన్న ఒక ప్రణాళికను సమర్పించారు. దీనిని మౌంట్ బాటన్ ప్లాన్ అంటారు. ఆయన ప్రణాళికలో బ్రిటిష్ పాలన నుంచి ఇండియాను విడుదల చేయడం, భారతదేశం, పాకిస్తాన్ రెండు దేశాలను ఏర్పాటు చేయడం, రెండు దేశాల ప్రభుత్వాలకు స్వయంప్రతిపత్తి, సార్వభౌమాధికారం ఇవ్వడం వంటివి ఉన్నాయి. భారతదేశంలోని రాచరిక రాష్ట్రాలకు భారతదేశం లేదా పాకిస్తాన్లో చేరే హక్కు ఉంటుందని ఆయన ప్రణాళికలో పేర్కొనబడింది.
భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చేందుకు మౌంట్ బాటన్ 4 జూలై 1947న బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లో భారత స్వాతంత్య్ర బిల్లును సమర్పించారు. ఈ బిల్లును బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించింది. భారతదేశానికి 15 ఆగస్టు 1947న స్వాతంత్య్రం ప్రకటించబడింది. అదే రోజున దేశ తొలి ప్రదాని జవహర్లాల్ నెహ్రూ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ప్రతి ఏటా ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రధాని జాతీయ జెండాను ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగించే సాంప్రదాయం కొనసాగుతోంది.
ఇంకా చదవండిదేశవ్యాప్తంగా దాడులకు భారీ కుట్ర.. మెరుపు ఆపరేషన్తో దొరికిపోయిన 253 మంది టెర్రరిస్టులు!
స్వాతంత్ర్య దినోత్సవం ముందు దేశవ్యాప్తంగా భారీ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ జరిగింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న షాజాద్ భట్టి నెట్వర్క్ (SBN)కు చెందిన 253 మంది టెర్రరిస్టులను 14 రాష్ట్రాల్లో అరెస్ట్ చేశారు. ఐఈడీ దాడులు, లక్షిత హత్యలకు పన్నాగం పన్నిన ఈ నెట్వర్క్ కుట్రను భద్రతా సంస్థలు సమన్వయంతో ఛేదించాయి. ఉగ్రవాదంపై కేంద్రం జీరో టాలరెన్స్ విధానాన్ని స్పష్టం చేసింది.
- Balaraju Goud
- Updated on: Aug 17, 2026
- 7:16 pm
ఎర్రకోట అసలు పేరేంటి? మొఘల్ చక్రవర్తుల తర్వాత బ్రిటీషర్లు దీన్ని ఎలా వాడారు?
షాజహాన్ కాలంలో మొఘల్ సామ్రాజ్య అధికార కేంద్రంగా ఉన్న ఎర్రకోటను 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ స్వాధీనం చేసుకున్నారు. రాజభవనాన్ని సైనిక కంటోన్మెంట్గా మార్చి, అనేక భవనాలను కూల్చి బ్యారక్లు నిర్మించారు. బహదూర్ షా జఫర్ విచారణ కూడా ఇక్కడే జరిగింది.
- SN Pasha
- Updated on: Aug 15, 2026
- 3:30 pm
లష్కర్-ఎ-తైబా ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం.. షోపియాన్లో ఆసక్తికర దృశ్యం!
దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ జమ్మూకశ్మీర్లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. షోపియాన్లో లష్కర్-ఎ-తైబా కమాండర్ అబిద్ రంజాన్ షేక్ తల్లిదండ్రులు తమ ఇంటి పైకప్పుపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండాను చేతిలో పట్టుకుని ఊపుతూ వారు స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. భారత దేశం పట్ల వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
- Balaraju Goud
- Updated on: Aug 15, 2026
- 1:56 pm
ఎర్రకోట స్వాతంత్ర్య దినోత్సవాలకు ఖర్గే, రాహుల్ గాంధీ దూరం.. కారణం అదేనా..?
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరుకాలేదు. వరుసగా రెండో ఏడాది కూడా ఇద్దరూ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కూర్చునే ఏర్పాట్లు, ప్రోటోకాల్కు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ అసంతృప్తితోనే కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
- Balaraju Goud
- Updated on: Aug 15, 2026
- 2:58 pm
ఆహా..! పచ్చని పొలాల్లో మువ్వన్నెల జెండా.. డ్రోన్తో వినూత్న దేశభక్తి ప్రదర్శన! వీడియో ఇదిగో
Kankipadu Drone National Flag: కృష్ణా జిల్లా కంకిపాడులో పచ్చని పంట పొలాలపై జాతీయ జెండాను మోస్తూ డ్రోన్ ఎగిరింది. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతకు దేశభక్తిని జోడించిన ఈ వినూత్న దృశ్యం స్థానికులను ఆకట్టుకుంది. 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ప్రదర్శన చేశారు.
- M Sivakumar
- Updated on: Aug 15, 2026
- 1:48 pm
Gold Prices: అబ్బబ్బా.. భారత్కు స్వాతంత్య్రం వచ్చినప్పుడు బంగారం ధర మరీ ఇంత తక్కువా..? ఎవరికీ తెలిసి ఉండదు.
కాలం మారే కొద్ది బంగారం ధరలు కూడా రికార్డ్ స్థాయిలో పెరుగుతూ వస్తోన్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్డ్ రేట్లకు సంబంధించి ఒక వార్త ఆసక్తికరంగా మారింది. 1947లో బంగారం ధర అత్యంత చౌకగా ఉంది. కానీ ఇప్పుడు రికార్డ్ స్థాయిలో పెరిగింది.
- Venkatrao Lella
- Updated on: Aug 15, 2026
- 12:25 pm
త్యాగాలతో తెచ్చుకున్న స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యతః మోహన్ భగవత్
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పూర్వీకుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం సాధించడం మాత్రమే కాదని, దానిని కాపాడుకోవడం, దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు. నిజమైన దేశభక్తి అంటే స్వాతంత్ర్య స్ఫూర్తిని ఆచరణలో పెడుతూ జాతి నిర్మాణంలో భాగస్వామ్యం కావడమేనని ఆయన ఉద్ఘాటించారు.
- Balaraju Goud
- Updated on: Aug 15, 2026
- 11:45 am
ప్రోటోకాల్ పక్కబెట్టి.. జన సమూహంలోకి ప్రధాని మోదీ.. విద్యార్థులతో కరచాలనం
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంపై ఆయన కీలక ప్రసంగం చేశారు. యువత పాత్రను తెలియజేస్తూ.. ప్రధాని మోదీ, అనంతరం చిన్నారులు, ఎన్సీసీ క్యాడెట్లతో కరచాలనం చేసి ముచ్చటించి వారిలో స్ఫూర్తి నింపారు.
- Balaraju Goud
- Updated on: Aug 15, 2026
- 11:24 am
Team India: ఫ్యాన్స్కు షాకిచ్చిన ఇద్దరు దిగ్గజాలు.. స్వాతంత్య్ర దినోత్సవాన సైలెంట్గా రిటైర్మెంట్.. ఎవరో తెలుసా?
On This Day In Cricket: భారత క్రికెట్ చరిత్రలో ఎంతో మంది సూపర్ స్టార్లు పుట్టుకొచ్చినా ధోనీ, రైనా లాంటి విడదీయరాని బంధం మళ్లీ కనిపించడం అసాధ్యం. వారు మైదానాన్ని విడిచివెళ్లినా, వారు సృష్టించిన అద్భుతమైన జ్ఞాపకాలు, పంచుకున్న క్రీడా స్ఫూర్తి ఎన్నటికీ సజీవంగానే ఉంటూ రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.
- Venkata Chari
- Updated on: Aug 15, 2026
- 10:58 am
2047 వికసిత్ భారత్కు ప్రధాని మోదీ ‘సప్తధార’.. దేశ భవిష్యత్తును మార్చే ఏడు శక్తులివే!
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దేశ ప్రగతికి కొత్త శక్తి ప్రవాహాలు అవసరమని పేర్కొంటూ.. ఏడు ప్రధాన రంగాలపై ప్రత్యేక దృష్టి సారించే ‘సప్తధార’ సంస్కరణల చట్రాన్ని ఆవిష్కరించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాంగణం నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. రాబోయే ఐదేళ్ల నుంచి ఏడేళ్లలో ఈ ఏడు రంగాల సమిష్టి శక్తితో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
- Balaraju Goud
- Updated on: Aug 15, 2026
- 11:12 am
ఉదయం సాయి స్మరణ.. మధ్యాహ్నం జనగణమన.. ఈ ఆలయంలో రోజూ ఇదే ప్రత్యేకత!
సాధారణంగా ఆలయాల్లో మంత్రాలు, భజనలు, హారతులు వినిపిస్తాయి. కానీ నల్గొండ జిల్లా చింతపల్లిలోని సాయిబాబా ఆలయంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 12.30 గంటలకు ‘జనగణమన’ మార్మోగుతుంది. భక్తితో పాటు దేశభక్తిని పెంపొందించే ఈ ప్రత్యేక సంప్రదాయం గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- M Revan Reddy
- Updated on: Aug 15, 2026
- 10:52 am
CM Revanth Reddy: గోల్కొండ కోటపై జెండాను ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం రాష్ట్ర ప్రజలకు ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకు ముందు గోల్కొండ కోటకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు.
- Anand T
- Updated on: Aug 15, 2026
- 1:15 pm