భారత స్వాతంత్ర్య దినోత్సవం

భారత స్వాతంత్ర్య దినోత్సవం

భారతదేశం ఆగస్టు 15, 1947న బ్రిటిష్ పాలకుల వందల ఏళ్ల బానిసత్వం నుండి స్వాతంత్ర్యం పొందింది. అందుకే దేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. స్వాతంత్ర భారతావని పలు రంగాల్లో సాధించిన పురోగతిని స్మరించుకుంటోంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 జాతీయ సెలవు దినంగా ఉంది. 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం మొదలుకుని.. దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎందరో స్వాతంత్ర్య పోరాట వీరులను భరతమాత కోల్పోయింది. పోరాటాల ఫలితంగా ఆగస్టు 14న అర్థరాత్రి సమయంలో దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది.

జూన్ 3, 1947న బ్రిటీష్ ఇండియా చివరి గవర్నర్ జనరల్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్, ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రసాదించే ప్రస్తావన ఉన్న ఒక ప్రణాళికను సమర్పించారు. దీనిని మౌంట్ బాటన్ ప్లాన్ అంటారు. ఆయన ప్రణాళికలో బ్రిటిష్ పాలన నుంచి ఇండియాను విడుదల చేయడం, భారతదేశం, పాకిస్తాన్‌ రెండు దేశాలను ఏర్పాటు చేయడం, రెండు దేశాల ప్రభుత్వాలకు స్వయంప్రతిపత్తి, సార్వభౌమాధికారం ఇవ్వడం వంటివి ఉన్నాయి. భారతదేశంలోని రాచరిక రాష్ట్రాలకు భారతదేశం లేదా పాకిస్తాన్‌లో చేరే హక్కు ఉంటుందని ఆయన ప్రణాళికలో పేర్కొనబడింది.

భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చేందుకు మౌంట్ బాటన్ 4 జూలై 1947న బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో భారత స్వాతంత్ర్య బిల్లును సమర్పించారు. ఈ బిల్లును బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించింది. భారతదేశానికి 15 ఆగస్టు 1947న స్వాతంత్ర్యం ప్రకటించబడింది. అదే రోజున దేశ తొలి ప్రదాని జవహర్‌లాల్ నెహ్రూ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ప్రతి ఏటా ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రధాని జాతీయ జెండాను ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగించే సాంప్రదాయం కొనసాగుతోంది.

ఇంకా చదవండి

Independence Day: సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ.. చేతిగోటిపై దేశభక్తిని చాటుకున్న ఉపాధ్యాయడు!

కృషి.. పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చునని నిరూపిస్తున్నాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అందరిలా మైక్రో ఆర్ట్ చేస్తే ఏం బాగుటుంది అనుకున్నాడు ఏమో..! భిన్నంగా ఏదో ఒకటి చేద్దామని సంకల్పించుకున్నాడు. అందుకు తగ్గ ప్రయత్నాలు చేశాడు.

Independence Day 2024: సోషల్‌ మీడియా ప్రొఫైల్‌ మార్చేసిన ప్రధాని మోదీ.. ఇంతకీ ఏం పెట్టారో తెలుసా?

స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో పాల్గొనాలని దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అంతే కాకుండా మోదీ తన సోషల్ మీడియా ప్రొఫైల్ కూడా మార్చేశారు. మోదీ ఎక్స్‌ ఖాతా ప్రొఫైల్‌లో త్రివర్ణ పతాకాన్ని ఉంచారు. ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగా ప్రచారంలో పాల్గొనాలని దేశప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం..

Independence Day 2024: స్వాతంత్యం కోసం పోరాటం చేసిన తెలుగు యోధులు ఎందరో .. మీ త్యాగం మరువం..

ఎందరో చేసిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా బ్రిటిష్ పాలన నుంచి భారత దేశం విముక్తి పొంది 1947లో ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి భారత దేశానికి స్వాతంత్ర్యం లభించింది. అప్పటి నుంచి ఆగష్టు 15వ తేదీని భారత దేశం స్వాతంత్య దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాది 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోవడానికి ధిల్లీ నుంచి గల్లీ వరకూ ప్రజలు రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని తమ ప్రతాపాన్ని రుచి చూపించి .. బ్రిటిష్ అధికారులకు ముచ్చెమటలు పట్టించిన కొందరు తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల గురించి ఈ రోజు తెలుసుకుందాం..