AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత స్వాతంత్య్ర దినోత్సవం

భారత స్వాతంత్య్ర దినోత్సవం

భారతదేశం ఆగస్టు 15, 1947న బ్రిటిష్ పాలకుల వందల ఏళ్ల బానిసత్వం నుండి స్వాతంత్య్రం పొందింది. అందుకే దేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. స్వాతంత్ర భారతావని పలు రంగాల్లో సాధించిన పురోగతిని స్మరించుకుంటోంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 జాతీయ సెలవు దినంగా ఉంది. 1857లో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం మొదలుకుని.. దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎందరో స్వాతంత్య్ర పోరాట వీరులను భరతమాత కోల్పోయింది. పోరాటాల ఫలితంగా ఆగస్టు 14న అర్థరాత్రి సమయంలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది.

జూన్ 3, 1947న బ్రిటీష్ ఇండియా చివరి గవర్నర్ జనరల్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్, ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్య్రం ప్రసాదించే ప్రస్తావన ఉన్న ఒక ప్రణాళికను సమర్పించారు. దీనిని మౌంట్ బాటన్ ప్లాన్ అంటారు. ఆయన ప్రణాళికలో బ్రిటిష్ పాలన నుంచి ఇండియాను విడుదల చేయడం, భారతదేశం, పాకిస్తాన్‌ రెండు దేశాలను ఏర్పాటు చేయడం, రెండు దేశాల ప్రభుత్వాలకు స్వయంప్రతిపత్తి, సార్వభౌమాధికారం ఇవ్వడం వంటివి ఉన్నాయి. భారతదేశంలోని రాచరిక రాష్ట్రాలకు భారతదేశం లేదా పాకిస్తాన్‌లో చేరే హక్కు ఉంటుందని ఆయన ప్రణాళికలో పేర్కొనబడింది.

భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చేందుకు మౌంట్ బాటన్ 4 జూలై 1947న బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో భారత స్వాతంత్య్ర బిల్లును సమర్పించారు. ఈ బిల్లును బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించింది. భారతదేశానికి 15 ఆగస్టు 1947న స్వాతంత్య్రం ప్రకటించబడింది. అదే రోజున దేశ తొలి ప్రదాని జవహర్‌లాల్ నెహ్రూ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ప్రతి ఏటా ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రధాని జాతీయ జెండాను ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగించే సాంప్రదాయం కొనసాగుతోంది.

ఇంకా చదవండి

Watch: సముద్ర గర్భంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.. చూస్తే సెల్యూట్ చేయాల్సిందే..

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.. వాడ వాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. పంద్రాగస్టు వేడుకలతో భారతజాతి పులకించిపోయింది. ఇంతటి మహోన్నత రోజున.. విశాఖ సాగరంలో మరో అరుదైన దృశ్యం కనువిందు చేసింది. సాగర గర్భంలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు స్కూబా డ్రైవర్లు. లెహెరావో తిరంగా అంటూ దేశభక్తి చాటుకున్నారు.

Andhra: ఔరా.. అంకుడు కర్రతో అద్భుత సృష్టి.. చూపు తిప్పుకోలేనంతగా ఆ కళాఖండాలు..!

ఆయనో కళాకారుడు.. అంకుడ కర్రతో కళారూపాలు తయారు చేయడం హాబి..! కానీ స్వాతంత్ర దినోత్సవం వేళ ఈ కళాకారుడు తమదైన శైలిలో దేశభక్తి చాటుకున్నాడు. అంకుడు కర్రతో అద్భుత కళారూపాలను తయారు చేశాడు. సహజ సిద్ధ రంగుల మేళవింపుతో దేశ సమైక్యతను చాటుకునేలా జాతీయ పతాకం, యుద్ధ విమానాలు, మిసైల్స్, శాంతికపోతాల నమూనాలు రూపొందించి అందరినీ అబ్బురపరుస్తున్నాడు.

Viral Video: స్వాతంత్య్ర దినోత్సవం రోజున అరుదైన దృశ్యం… ఫారెస్ట్‌ అధికారులు షేర్‌ చేసిన వీడియో వైరల్

భారతదేశ జాతీయ జంతువు, జాతీయ పక్షిని ఒకే ఫ్రేమ్‌లో చూపించే అరుదైన దృశ్యం నెటిజన్స్‌కు కనువిందు చేస్తుంది. ఆ అందమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతదేశ గొప్ప వారసత్వానికి చిహ్నాలైన పులి, నెమలి ఒక ప్రత్యేకమైన దృశ్యంలో కలిసి...

79th Independence Day: అక్షర్‌ధామ్ ప్రాంగణంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఢిల్లీలోని స్వామినారాయణ అక్షర్‌దామ్ ఆవరణలో ఆగస్టు 15 ఉదయం సూర్యకిరణాల వెలుగులో కేశర, తెలుపు, ఆకుపచ్చ రంగుల జెండా రెపరెపలాడుతుండగా, అక్కడి ప్రతి హృదయం గర్వంతో పొంగిపొర్లింది. అక్షర్‌దామ్ పరిసరాలు దేశభక్తి రాగాలతో మార్మోగాయి. గత తరం వీరుల త్యాగాలను స్మరించుకుంటూ, రాబోయే తరాల కలలతో ఈ వేడుకలు ప్రతిధ్వనించాయి.

Watch: కడపలో మరోసారి ప్రొటోకాల్‌ రచ్చ.. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి సీరియస్

Kadapa Protocol Row: కడపలో మరోసారి ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తనకు స్టేజ్‌పై సీటు వేయకపోవడంతో ఎమ్మెల్యే మాధవీ రెడ్డి భగ్గుమన్నారు. స్థానిక ఎమ్మెల్యే కావడంతో పాటు ప్రభుత్వ విప్‌గా ఉన్న తనను స్టేజి మీదకు ఆహ్వానించకపోవడంపై మాధవీరెడ్డి మండిపడ్డారు.

ఫ్లిఫ్‌కార్ట్‌ ఇండిపెండెన్స్‌ డే సేల్.. ఐఫోన్‌ సహా ప్రముఖ బ్రాండ్‌లపై భారీ తగ్గింపు!

ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్ ఫ్లిఫ్‌కార్ట్‌ తన వినియోగదారులకు మరో సేల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్‌లో మీరు స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లపై గొప్ప ఆఫర్స్‌ను పొందవచ్చు. ఇటీవలే ఫ్రీడమ్‌ సేల్‌ పేరుతో పలు రకాల మొబైల్స్‌ పై భారీ ఆఫర్స్‌ తెచ్చిన ఫ్లిఫ్‌కార్టు తాజాగా మరో సేల్‌ను తీసుకురావడం గమనార్హం. ముఖ్యంగా ఈ సేల్‌లో ఐఫోన్‌, ఇతర బ్రాండెడ్‌ ఫోన్‌పై ప్లిఫ్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్లను తీసుకొచ్చింది. అయితే ఈ సేల్‌ ఆఫర్స్‌ ఏంటో చూద్దాం పదండి.

  • Anand T
  • Updated on: Aug 18, 2025
  • 12:04 pm

Team India: ఇండియాకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు అంటే 1947లో టీమిండియా కెప్టెన్ ఎవరో తెలుసా ?

భారతదేశం 1932లో తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత దాదాపు 15 సంవత్సరాలకు 1947లో భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందింది. భారత క్రికెట్ చరిత్రలో మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, కపిల్ దేవ్, విరాట్ కోహ్లీ వంటి గొప్ప కెప్టెన్‌లు ఉన్నారు.

  • Rakesh
  • Updated on: Aug 18, 2025
  • 12:05 pm

Independence Day : కూతురితో కలిసి రామ్ చరణ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్.. తారల శుభాకాంక్షలు..

దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మువ్వన్నెల జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా సినీతారలు సైతం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. అటు కూతురితో కలిసి రామ్ చరణ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

మీ డబ్బు ఎంత సంపాదిస్తుందనేదే ముఖ్యం.. HDFC ‘బర్నీ సే ఆజాది’ ప్రచారంలో మహిళా వ్యాపారవేత్తలు ఏమన్నారంటే..

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 79 ఏళ్ల తర్వాత కూడా మహిళల ఆర్థిక స్వాతంత్ర్య ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.. కుటుంబం ఆర్థికంగా బలపడేందుకు పలు నూతన మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి తరుణంలో HDFC మ్యూచువల్ ఫండ్ 'బర్నీ సే ఆజాది' ప్రచారం.. సాంప్రదాయ పొదుపులను దాటి పెట్టుబడి ద్వారా వారి కలలను సాకారం చేసుకోవడానికి మహిళలను ప్రేరేపిస్తోంది.

Virat Kohli : ఆగస్టు 15న సెంచరీ కొట్టిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్ అతడే.. వైరల్ అవుతున్న పోస్ట్

భారతదేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా మాజీ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు నివాళులర్పించారు. కోహ్లీ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.

  • Rakesh
  • Updated on: Aug 18, 2025
  • 12:05 pm

Independence Day Songs: స్వాతంత్ర్య దినోత్సవం స్పెషల్.. మనసులో స్పూర్తినింపే పాటలు ఇవే..

స్వాతంత్ర్య దినోత్సవం.. ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశం విముక్తి పొందిన సందర్భం. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మనకు స్వాతంత్ర్యం. కులమతాలకతీతంగా దేశం మొత్తం కలిసి సంబురంగా చేసుకునే పండుగ ఇది. ఇప్పుడు దేశం మొత్తం 79వ స్వాతంత్ర్యదినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దేశభక్తిని చాటిచెప్పే సాంగ్స్ మరోసారి మీ ముందుకు..

Independence Day: వర్షంలో తడిసిపోతూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రాహుల్ గాంధీ

యావత్ భారతావని 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన త్యాగధనులను కీర్తించుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రవేటు సంస్థల్లోనూ జెండావిష్కర కనులపండువగా సాగింది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండావిష్కరణ జరిగింది.