
Janardhan Veluru
Executive Editor (Digital), Current Affairs, Politics - TV9 Telugu
janardhan.veluru@tv9.comతెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 1999లో ఈనాడు దినపత్రికతో జర్నలిజంలో అడుగుపెట్టాను. 2004 నుంచి సిఫీ.కామ్, విస్సా టీవీ, రాజ్ న్యూస్ తెలుగు, మనం డైలీ, న్యూస్18.కామ్ వంటి ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా సంస్థల్లో సీనియర్ స్థాయిలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించాను. 2021 మార్చి నుంచి టీవీ9 తెలుగు (డిజిటల్)లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Watch: ఫ్లై ఓవర్పై సడన్గా కాన్వాయ్ ఆపిన ఢిల్లీ సీఎం..!
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రభుత్వ పాలనలో తనదైన ప్రత్యేకతను చూపుతున్నారు. హైదర్పూర్ ఫ్లైఓవర్పై తిరుగుతున్న పశువులను గమనించి వెంటనే చర్య తీసుకున్నారు. ఆమె కాన్వాయ్ను ఆపి, సంబంధిత అధికారులకు ఆశ్రయం లేని పశువులకు సరైన ఆశ్రయం కల్పించాలని ఆదేశించారు. రోడ్లపై పశువుల సంచారం సమస్యకు ఇది ఒక మంచి పరిష్కారమని, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- Janardhan Veluru
- Updated on: Mar 26, 2025
- 9:13 pm
AP News: మీకు – నాకు మధ్య పరదాలు లేవు.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
తణుకు సభలో గత వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం వైఎస్ జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. గత సీఎం ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా? వారితో మాట్లాడారా? అని ప్రశ్నించారు. అయితే ఇప్పుడు తనకు, ప్రజలకు మధ్య పరదాలు లేవన్నారు. ప్రజల సమస్యలు వినేందుకే తాను వచ్చానని వ్యాఖ్యానించారు.
- Janardhan Veluru
- Updated on: Mar 15, 2025
- 1:39 pm
Variety Protest: ప్లాస్టిక్ సర్పాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినూత్న నిరసన.. ఎందుకంటే..?
Plastic Snakes Protest: ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను చేపట్టకపోవడంపై మధ్యప్రదేశ్లోని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్లాస్టిక్ పాములను ప్రదర్శిస్తూ మీడియా దృష్టిని ఆకర్షించారు. ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం పాములా కూర్చొందని ఆరోపించారు. వెంటనే ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
- Janardhan Veluru
- Updated on: Mar 12, 2025
- 3:48 pm
Railway Info: హైదరాబాద్ – చెన్నై మధ్య ట్రావెల్ చేసే రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్..
South Central Railway: హైదరాబాద్-చెన్నై మధ్య ప్రయాణించే ప్రయాణీకులకు కీలక సమాచారం. చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్ప్రెస్ (12603), హైదరాబాద్-చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ (12604) రైళ్లు ఇకపై చర్లపల్లి నుండి రాకపోకలు సాగిస్తాయి. అలాగే గోరఖ్పుర్-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ (12589, 12590) రైలు కూడా ఇకపై చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి.
- Janardhan Veluru
- Updated on: Mar 8, 2025
- 3:15 pm
AP Heatwave Alert: వామ్మో.. ఏపీలో భానుడి భగభగలు.. ఆ మండలాల్లో తీవ్ర వడగాల్పులు..!
Andhra Pradesh Heatwave Alert: శుక్రవారం నాడు ఏపీలోని రెండు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 84 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, సీతంపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముంది. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండలో తిరగడం నివారించాలని, ఎండదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
- Janardhan Veluru
- Updated on: Mar 6, 2025
- 7:41 pm
Holi Special Trains: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. మరో 22 హోలీ ప్రత్యేక రైళ్లు
Railway Passengers Alert: హోలీ సందర్భంగా రైల్వే శాఖ అధికారులు ప్రయాణీకుల సౌకర్యార్థం మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల వివిధ ప్రాంతాల మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించగా.. ఇప్పుడు మరో 22 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది రైల్వే శాఖ.
- Janardhan Veluru
- Updated on: Mar 6, 2025
- 5:23 pm
బడ్జెట్లో ఆ కేటాయింపులు అమరావతి నిర్మాణానికి కాదు.. ఏపీ సర్కారు వివరణ
Andhra Pradesh Budget 2025: ఏపీ వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో శుక్రవారంనాడు ప్రవేశపెట్టారు. బడ్జెట్లో రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.6000 కోట్లు కేటాయించినట్లు కొన్ని మీడియాల్లో ప్రచారం జరిగింది. దీనిపై వివరణ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని స్పష్టంచేసింది. బడ్జెట్లో కేటాయించిన రూ.6000 కోట్లు ఎందుకు వినియోగిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది.
- Janardhan Veluru
- Updated on: Mar 1, 2025
- 8:12 pm
AP News: టీడీపీ కార్యకర్తలకు ఆ మాటిస్తున్నా.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాబోయే రోజుల్లో కార్యకర్తలను ఇప్పటికప్పుడు కలుస్తుంటానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. గత 9 మాసాలుగా కార్యకర్తలతో కలిసి మాట్లాడలేకపోయినట్లు అంగీకరించారు. ఇక ఈ గ్యాప్ రాకుండా చూస్తానని కార్యకర్తలకు మాట ఇస్తున్నట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో పర్యటించిన చంద్రబాబు నాయుడు.. అక్కడ పింఛన్లు పంపిణీ చేశారు.
- Janardhan Veluru
- Updated on: Mar 1, 2025
- 7:53 pm
Telangana Politics: రేవంత్ రెడ్డి vs కిషన్ రెడ్డి.. ఇద్దరి మధ్య ఓ రేంజ్లో మాటల తూటాలు
తెలంగాణ రాజకీయం ఇప్పుడు కాంగ్రెస్ వర్సస్ బీజేపీగా మారింది. మరీ ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డే అడ్డుకుంటున్నారని రేవంత్ ఆరోపిస్తున్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తిప్పికొడుతున్నారు.
- Janardhan Veluru
- Updated on: Mar 1, 2025
- 7:22 pm
Viral: పెళ్లి చేసుకోండి లేదా ఉద్యోగం ఊడపోతుంది.. అవివాహితులకు కంపెనీ అల్టిమేటం
కంపెనీలో పనిచేసే అవివాహిత ఉద్యోగులు పెళ్లి చేసుకోవాలని.. లేదంటే ఉద్యోగం కోల్పోవాల్సి ఉంటుందని చైనాకు చెందిన ఓ కెమికల్ కంపెనీ అల్టిమేటం విధించింది. నాలుగు మాసాల్లో పెళ్లి చేసుకోవాలని ఆ కంపెనీ ఉద్యోగులకు హెచ్చరిక లేఖ పంపింది. అయితే ఈ ఆదేశాలు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు.
- Janardhan Veluru
- Updated on: Feb 26, 2025
- 4:54 pm
ఏపీ డిప్యూటీ సీఎం పవన్తో VH భేటీ.. ఆ జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలని వినతి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ భేటీ అయ్యారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని వీహెచ్ సూచించారు. అలాగే ఆయన పేరుతో స్మారక భవనాన్ని నిర్మించేందుకు చొరవ చూపాలని కోరారు.
- Janardhan Veluru
- Updated on: Feb 25, 2025
- 8:01 pm
Shashi Tharoor: శశి థరూర్ ఆ పార్టీలో చేరనున్నారా? X పోస్ట్తో హింట్ ఇచ్చేసినట్టేనా..?
మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న ప్రచారం జాతీయ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీంతో ఆయన ఏ పార్టీలో చేరుతారన్న అంశంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శశి థరూర్ ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఓ ఫొటో రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫొటోతో ఆయన ఏ పార్టీలో చేరనున్నారో క్లారిటీ ఇచ్చేసినట్టేనన్న టాక్ వినిపిస్తోంది.
- Janardhan Veluru
- Updated on: Feb 25, 2025
- 5:16 pm