AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janardhan Veluru

Janardhan Veluru

Executive Editor (Digital), Current Affairs, Politics - TV9 Telugu

janardhan.veluru@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 1999లో ఈనాడు దినపత్రికతో జర్నలిజంలో అడుగుపెట్టాను. 2004 నుంచి సిఫీ.కామ్, విస్సా టీవీ, రాజ్ న్యూస్ తెలుగు, మనం డైలీ, న్యూస్18.కామ్ వంటి ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా సంస్థల్లో సీనియర్ స్థాయిలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించాను. 2021 మార్చి నుంచి టీవీ9 తెలుగు (డిజిటల్)లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Follow On:
Toppers Corner: ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌ ర్యాంకు

Toppers Corner: ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌ ర్యాంకు

UPSC Civil 68th Rank Holder Sai Chaitanya: తెలుగు విద్యార్థి సాయి చైతన్య ఐదుసార్లు విఫలమైనప్పటికీ, తన పట్టుదలను వదులుకోకుండా ఆరో ప్రయత్నంలో ఆలిండియా 68వ ర్యాంకుతో యుపిఎస్సి సివిల్స్ పరీక్షలో విజయం సాధించారు. నిరంతర కృషి, ఓటముల నుండి నేర్చుకునే సామర్థ్యం, ప్రణాళికాబద్ధమైన సన్నాహాలతో విజయాన్ని ముద్దాడారు. సాయి చైతన్య సివిల్స్ సక్సస్ స్టోరీ అనేకమందికి ప్రేరణగా నిలుస్తోంది.

కాంగ్రెస్‌లో మంత్రి పదవుల పంచాయితీ.. ప్రేమ్‌సాగర్ వ్యాఖ్యలపై వివేక్ ఏమన్నారంటే..?

కాంగ్రెస్‌లో మంత్రి పదవుల పంచాయితీ.. ప్రేమ్‌సాగర్ వ్యాఖ్యలపై వివేక్ ఏమన్నారంటే..?

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరిగితే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవి ఎవరికి? దీనిపైనే కాంగ్రెస్‌లో మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోతే ఉమ్మడి ఆదిలాబాద్‌కు అన్యాయం చేసినట్టే అంటున్నారు ప్రేమ్‌సాగర్ రావు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వివేక్ ఎలా స్పందిస్తున్నారు?

Telangana: వారికే ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Telangana: వారికే ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

అత్యంత నిరుపేద‌లు.. అర్హుల‌కే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందిర‌మ్మ క‌మిటీల అనుమ‌తితోనే ల‌బ్ధిదారుల ఎంపిక‌ జరుగుతుందని తెలిపారు. అర్హుల జాబితాను మండ‌ల అధికారుల బృందం త‌నిఖీ చేయాలని ఇందిర‌మ్మ ఇళ్ల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు.

Telangana: భూ భార‌తి పోర్టల్ ప్రారంభానికి ముహుర్తం ఖరారు.. పైలట్ ప్రాజెక్ట్‌గా 3 మండలాల్లో..

Telangana: భూ భార‌తి పోర్టల్ ప్రారంభానికి ముహుర్తం ఖరారు.. పైలట్ ప్రాజెక్ట్‌గా 3 మండలాల్లో..

తెలంగాణ ప్రభుత్వం భూ భారతి పోర్టల్‌ను సోమవారం ప్రారంభించనుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి శనివారంనాడు సమీక్షించారు. రైతులు, ప్రజలకు భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సులభమైన మార్గం అందించడం దీని లక్ష్యం. మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంచుకొని, ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. పోర్టల్ సులభమైన భాషలో ఉండాలని, ప్రజల సూచనలతో అప్‌డేట్ చేయాలని సూచించారు.

ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు.. ఆ మండలాలకు తీవ్ర వడగాలుల హెచ్చరిక

ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు.. ఆ మండలాలకు తీవ్ర వడగాలుల హెచ్చరిక

ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భగభగమండే భానుడి ప్రభావానికి జనం విలవిలలాడిపోతున్నారు. వడగాలులతో ఉదయం 10 గంటలు దాటితే జనం రోడ్లపైకి వచ్చేందుకు సాహసించడం లేదు. ఏపీలో శనివారంనాడు పలు ప్రాంతాల్లో 41 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యింది. పల్నాడు జిల్లా రావిపాడులో 43.7°C రికార్డు గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది.

పోలీసు అధికారులకు వైఎస్ జగన్ వార్నింగ్.. వారికి శిక్ష తప్పదంటూ..

పోలీసు అధికారులకు వైఎస్ జగన్ వార్నింగ్.. వారికి శిక్ష తప్పదంటూ..

ఏపీ పోలీసు అధికారులకు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఎల్లకాలం టీడీపీ పాలన కొనసాగదని.. తాము అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు ఊడిగం చేసేవారికి శిక్ష తప్పదన్నారు. టీడీపీ పట్ల పక్షపాతంతో వ్యవహరించే పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. యూనిఫామ్‌ తీయించి చట్టం ముందు నిలబెడతామన్నారు.

Watch Video: భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో రంభ

Watch Video: భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో రంభ

ఒకప్పుడు సినీ నటిగా ఓ వెలుగు వెలిగిన అందాల రాశి రంభ.. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు టాలీవుడ్‌లో రీఎంట్రీకి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె తన భర్తతో కలిసి మంగళవారంనాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Watch: తిరుమల శ్రీవారి సేవలో పూజా హెగ్డే.. వీడియో చూశారా?

Watch: తిరుమల శ్రీవారి సేవలో పూజా హెగ్డే.. వీడియో చూశారా?

ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే తిరుమల ఆలయాన్ని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం(ఏప్రిల్ 4న) శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా గురువారంనాడు ఆమె శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ రాహు, కేతు, సర్ప దోష నివారణ పూజలు చేశారు.

Watch: ఫ్లై ఓవర్‌పై సడన్‌గా కాన్వాయ్‌ ఆపిన ఢిల్లీ సీఎం..!

Watch: ఫ్లై ఓవర్‌పై సడన్‌గా కాన్వాయ్‌ ఆపిన ఢిల్లీ సీఎం..!

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రభుత్వ పాలనలో తనదైన ప్రత్యేకతను చూపుతున్నారు. హైదర్‌పూర్ ఫ్లైఓవర్‌పై తిరుగుతున్న పశువులను గమనించి వెంటనే చర్య తీసుకున్నారు. ఆమె కాన్వాయ్‌ను ఆపి, సంబంధిత అధికారులకు ఆశ్రయం లేని పశువులకు సరైన ఆశ్రయం కల్పించాలని ఆదేశించారు. రోడ్లపై పశువుల సంచారం సమస్యకు ఇది ఒక మంచి పరిష్కారమని, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

AP News: మీకు – నాకు మధ్య పరదాలు లేవు.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

AP News: మీకు – నాకు మధ్య పరదాలు లేవు.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

తణుకు సభలో గత వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. గత సీఎం ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా? వారితో మాట్లాడారా? అని ప్రశ్నించారు. అయితే ఇప్పుడు తనకు, ప్రజలకు మధ్య పరదాలు లేవన్నారు. ప్రజల సమస్యలు వినేందుకే తాను వచ్చానని వ్యాఖ్యానించారు.

Variety Protest: ప్లాస్టిక్ సర్పాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినూత్న నిరసన.. ఎందుకంటే..?

Variety Protest: ప్లాస్టిక్ సర్పాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినూత్న నిరసన.. ఎందుకంటే..?

Plastic Snakes Protest: ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను చేపట్టకపోవడంపై మధ్యప్రదేశ్‌లోని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్లాస్టిక్ పాములను ప్రదర్శిస్తూ మీడియా దృష్టిని ఆకర్షించారు. ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం పాములా కూర్చొందని ఆరోపించారు. వెంటనే ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

Railway Info: హైదరాబాద్ – చెన్నై మధ్య ట్రావెల్ చేసే రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్..

Railway Info: హైదరాబాద్ – చెన్నై మధ్య ట్రావెల్ చేసే రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్..

South Central Railway: హైదరాబాద్-చెన్నై మధ్య ప్రయాణించే ప్రయాణీకులకు కీలక సమాచారం. చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ (12603), హైదరాబాద్-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (12604) రైళ్లు ఇకపై చర్లపల్లి నుండి రాకపోకలు సాగిస్తాయి. అలాగే గోరఖ్‌పుర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (12589, 12590) రైలు కూడా ఇకపై చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి.