Video: అయినవిల్లి వినాయకుడికి లక్ష పెన్నుల అభిషేకం
కోనసీమ జిల్లా అయినవిల్లిలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, లక్ష పెన్నులతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. దర్శనానికి వచ్చే భక్తులు, విద్యార్థులకు ఆ పెన్నులను ప్రసాదంగా పంపిణీ చేశారు.
కోనసీమ జిల్లా అయినవిల్లిలోని ప్రసిద్ధ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష పెన్నులతో ప్రత్యేక అభిషేకం చేయడం భక్తులను ఆకట్టుకుంది. విద్యాభివృద్ధి, జ్ఞానప్రాప్తికి ప్రతీకగా ఈ అభిషేకం నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అభిషేకం అనంతరం దర్శనానికి వచ్చిన భక్తులు, ముఖ్యంగా విద్యార్థులకు ఆ పెన్నులను ప్రసాదంగా పంపిణీ చేశారు.
ఈ అరుదైన అభిషేకాన్ని తిలకించేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వినాయకుడి కృపతో విద్యలో విజయం సాధించాలని విద్యార్థులు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. రథసప్తమి సందర్భంగా ఆలయం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్కు గిఫ్ట్గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

