AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: అయినవిల్లి వినాయకుడికి లక్ష పెన్నుల అభిషేకం

Video: అయినవిల్లి వినాయకుడికి లక్ష పెన్నుల అభిషేకం

Janardhan Veluru
|

Updated on: Jan 25, 2026 | 6:22 PM

Share

కోనసీమ జిల్లా అయినవిల్లిలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, లక్ష పెన్నులతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. దర్శనానికి వచ్చే భక్తులు, విద్యార్థులకు ఆ పెన్నులను ప్రసాదంగా పంపిణీ చేశారు.

కోనసీమ జిల్లా అయినవిల్లిలోని ప్రసిద్ధ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష పెన్నులతో ప్రత్యేక అభిషేకం చేయడం భక్తులను ఆకట్టుకుంది. విద్యాభివృద్ధి, జ్ఞానప్రాప్తికి ప్రతీకగా ఈ అభిషేకం నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అభిషేకం అనంతరం దర్శనానికి వచ్చిన భక్తులు, ముఖ్యంగా విద్యార్థులకు ఆ పెన్నులను ప్రసాదంగా పంపిణీ చేశారు.

ఈ అరుదైన అభిషేకాన్ని తిలకించేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వినాయకుడి కృపతో విద్యలో విజయం సాధించాలని విద్యార్థులు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. రథసప్తమి సందర్భంగా ఆలయం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

Published on: Jan 25, 2026 06:21 PM