Video: అయినవిల్లి వినాయకుడికి లక్ష పెన్నుల అభిషేకం
కోనసీమ జిల్లా అయినవిల్లిలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, లక్ష పెన్నులతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. దర్శనానికి వచ్చే భక్తులు, విద్యార్థులకు ఆ పెన్నులను ప్రసాదంగా పంపిణీ చేశారు.
కోనసీమ జిల్లా అయినవిల్లిలోని ప్రసిద్ధ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష పెన్నులతో ప్రత్యేక అభిషేకం చేయడం భక్తులను ఆకట్టుకుంది. విద్యాభివృద్ధి, జ్ఞానప్రాప్తికి ప్రతీకగా ఈ అభిషేకం నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అభిషేకం అనంతరం దర్శనానికి వచ్చిన భక్తులు, ముఖ్యంగా విద్యార్థులకు ఆ పెన్నులను ప్రసాదంగా పంపిణీ చేశారు.
ఈ అరుదైన అభిషేకాన్ని తిలకించేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వినాయకుడి కృపతో విద్యలో విజయం సాధించాలని విద్యార్థులు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. రథసప్తమి సందర్భంగా ఆలయం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా!
స్కూటీలో భారీ పాము..భయంతో జనం పరుగులు
పుర్రె తెరవకుండానే బ్రెయిన్ సర్జరీ.. భారత సంతతి డాక్టర్ అద్భుతం!
మంచూరియా చైనా వంటకం కాదు.. మన ఇండియాదే..

