బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తామంటే పోయారు.. ఆ తర్వాత 67 మంది ఆస్పత్రి పాలయ్యారు
ఒత్తైన జుట్టు అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. అందుకే జుట్టు మీద ప్రతీఒక్కరు ప్రత్యేక శ్రద్ధ పెడతారు. జుట్టు అందంగా ఉంచుకోవడం కోసం ఎంత దూరమైనా వెళతారు. జుట్టు ఎంత అందంగా ఉంటే ఆత్మవిశ్వాసం కూడా అంత రెట్టింపు ఉంటుంది. జుట్టు రాలిపోవడం, చిన్న వయసులోనే బట్టతల రావడం ఆత్మనూన్యతకు దారి తీస్తుంది. ఒత్తైన, పొడవైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం అంటూ అనేక కాస్మొటిక్ ఉత్పత్తులు మార్కెట్లోకి కుప్పలు తెప్పలుగా వచ్చి
- K Sammaiah
- Updated on: Mar 18, 2025
- 6:53 pm
Viral Video: రోబో దగ్గర బ్యాగ్ను చోరీ చేసిన మహిళ… తరువాత ఏమి జరిగిందో చూస్తే మీరు షాక్ అవుతారు!
సోషల్ మీడియా ప్రతిఒక్కరికి అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీ వీడియోస్ వైరల్ అవుతూ నెటిజన్స్ను ఆకట్టుకుంటాయి. అలాంటి కోవకు చెందినదే ఈ వీడియో. ఒక మహిళ AI రోబోట్ను దోచుకుంటున్నట్లు చూపించే హాస్యాస్పదమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో పట్ల నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. వైరల్ క్లిప్లో, ఆ మహిళ AI-ఆధారిత రోబోట్ నుంచి బ్యాగ్ను
- K Sammaiah
- Updated on: Mar 18, 2025
- 5:41 pm
ఆ ఫొటోపై ముగిసిన సీఐడీ విచారణ… మరోసారి పోసానిని కస్టడీకి కోరే అవకాశం
పోసాని కృష్ణ మురళి ఒకరోజు సీఐడీ విచారణ ముగిసింది. చంద్రబాబు అధికారం కోసం అమిత్ షా కాళ్లు పట్టుకున్నారంటూ ఒక ఫోటోను తయారు చేసి దాన్ని మీడియా సమావేశంలో పెట్టి.. ఏపీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని. దీనిపై గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన తెలుగు యువత నేత వంశీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ప్రస్తుతం పోసాని రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో పోసానిని కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు... ఆ ఫోటోను ఎవరు తయారు చేశారు.. ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది.. పోసానినే ఫోటో తయారు చేసి మీడియా
- K Sammaiah
- Updated on: Mar 18, 2025
- 3:52 pm
మహానగరానికి ముంచుకొచ్చిన ముప్పు… ప్రభుత్వానికి నివేదిక పంపిన జలమండలి
హైదరాబాద్కు భూగర్భజల నీటి కరువు ముప్పు ముంచుకొచ్చింది. అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ మహానగరంలో అంతకు రెట్టింపు స్థాయిలో భూగర్భ జలాలు కూడా అడుగంటి పోతున్నాయి. తాజా సర్వేనే అందుకు నిదర్శనం. ఔటర్ రింగ్ రోడ్డు వరకు దాదాపు 948 చదరపు కిలోమీటర్లలో సాంకేతిక నిపుణులతో జలమండలి జరిపిన సర్వేలో కేవలం 27 చదరపు కిలోమీటర్లు మినహా, మిగిలిన 921 చదరపు కిలోమీటర్లలో భూగర్భ జలాలు ప్రమాద స్థాయిలో
- K Sammaiah
- Updated on: Mar 18, 2025
- 2:36 pm
నిరుద్యోగులకు రూ. 3లక్షల ప్రభుత్వ రుణం… ఆన్లైన్లో ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం రేవంత్ చేతుల మీదుగా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్లో ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. ఈ స్కీమ్ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు ప్రయోజనం కలగనుంది. రాజీవ్ యువ వికాస పథకం ద్వారా ప్రభుత్వం రాయితీతో రుణాలు అందించనుంది. దాదాపు 5 లక్షల మందికి రూ.6 వేల కోట్ల రాయితీలు అందించనున్నట్లు తెలుస్తోంది. రాజీవ్ యువ వికాసం పథకం కింద మూడు క్యాటగిరీలుగా
- K Sammaiah
- Updated on: Mar 17, 2025
- 6:05 pm
Video: పాక్ అంటే అట్లుంటది మరీ… చైనా కాల్ సెంటర్ ను లూటీ చేసిన స్థానికులు
ఇస్లామాబాద్ సెక్టార్ F-11లోని ఓ కాల్ సెంటర్లో స్కామ్ బయటపడటంతో స్థానికులు లూటీ చేశారు. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మరియు నిఘా సంస్థల దాడితో భారీ స్కామ్ వెలుగు చూసింది. దీంతో ఆ కాల్ సెంటర్లోకి చొరబడిన యువకులు లూటీకి తెగబడ్డారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం యువకుల గుంపులు కాల్సెంటర్ ప్రాంగణంలోకి చొరబడి సాంకేతిక పరికరాలతో
- K Sammaiah
- Updated on: Mar 17, 2025
- 5:58 pm
కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న… తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరణ పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమావేశః అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలతో తీన్మార్ మల్లన్న బీసీ బిల్లుపై చర్చించారు. బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ నేతలను తీన్మార్ మల్లన్న కోరారు. ప్రభుత్వం బీసీ బిల్లు తేవటం గొప్ప విషయం కాదన్నారు తీన్మార్ మల్లన్న. దాన్ని పార్లమెంటులో ఆమోదించేలా ఒత్తిడి తేవాలన్నారు. అవసరం అయితే కేంద్రంలో ఆమోదం కోసం జంతర్ మంతర్
- K Sammaiah
- Updated on: Mar 17, 2025
- 4:53 pm
పోసాని కృష్ణమురళికి మరో షాక్… ఉద్యోగం పేరుతో రూ.9 లక్షలు కాజేశాడని టీడీపీ కార్యాలయంలో కంప్లైంట్
టీడీపీ కేంద్ర కార్యాలయంలో పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం కల్లూరుకు చెందిన కె. సత్యనారాయణ శెట్టి సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చారు. పోసాని కృష్ణమురళీ, మహేశ్ అనే వ్యక్తులు వైసీపీ ప్రభుత్వం హయాంలో తనకు ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 9 లక్షలు తీసుకొని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై గచ్చిబౌలిలో కేసు
- K Sammaiah
- Updated on: Mar 17, 2025
- 6:07 pm
బడ్జెట్ కాపీపై హిందీ రూపీ సింబల్ తొలగించిన స్టాలిన్ సర్కార్… తమిళనాట ముదిరిన త్రీ-లాంగ్వేజ్ వార్
చరిత్రలో ఎన్నడూ జరగని సంఘటన తమిళనాడు బడ్జెట్ సమావేశాల్లో జరిగింది. త్రిభాషా విధానం, డీలిమిటేషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేంద్రంపై నిప్పులు చెరుగుతున్న తమిళ ప్రభుత్వం... ఏకంగా బడ్జెట్ కాపీపై రూపీ సింబల్ను తొలగించడం తీవ్ర దుమారం రేపుతోంది. బడ్జెట్ కాపీపై హిందీ రూపీ సింబల్ బదులు తమిళంలో రూపాయి సింబల్ను ప్రింట్ చేయడంపై రాజకీయ రచ్చ నడుస్తోంది. హిందీ భాషాకు తాము ఎన్నటికీ వ్యతిరేకమేనంటూ ఈ విధంగా
- K Sammaiah
- Updated on: Mar 13, 2025
- 5:00 pm
తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీష్రెడ్డి సస్పెన్షన్… ఈ సెషన్ వరకు సస్పెండ్ చేసిన స్పీకర్
స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చర్యలు తీసుకున్నారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు స్పీకర్ను కించపరిచేలా ఉన్నాయంటూ అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ పరిణామాలతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సభ వాయిదా అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను ఆయన ఛాంబర్లో కలిశారు. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలన్నారు మాజీమంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు. స్పీకర్ను జగదీష్రెడ్డి అవమానించలేదన్నారు. సభ మీ ఒక్కరిది కాదు..అందరిది అని మాత్రమే జగదీష్ రెడ్డి అన్నారని
- K Sammaiah
- Updated on: Mar 13, 2025
- 4:03 pm
రక్త ప్రవాహాన్ని తలపించేలా ‘బ్లడ్ రెయిన్’… ఇరాన్ బీచ్లో టూరిస్టులు మస్త్ ఎంజాయ్
సాధారణంగా వర్షపు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతారు. అదే వర్షం ఎరుపు రంగులో పడితే.. యస్.. మీరు ఎప్పుడైనా బ్లడ్ రెయిన్ను చూశారా? అవును ఇరాన్లో రక్తం రంగులో వర్షం కురిసింది. ఇరాన్ లోని రెయిన్ బో ఐలాండ్ లో ఎర్రని రంగులో వర్షం కురిసింది. ఆకాశం నుంచి ధారగా కురుస్తున్న వర్షం అక్కడి కొండలపై చేరగానే ఎరుపు వర్ణంలోకి మారిపోయింది. అది రక్తపు నీరులా ప్రవహించి సముద్రంలోకి చేరింది. ఈ ఎర్రని వర్షపు నీటితో బీచ్ మొత్తం ఎరుపు రంగులోకి మారి భయపెడుతోంది. ఏటా ఈ దృశ్యం
- K Sammaiah
- Updated on: Mar 13, 2025
- 3:14 pm
Watch: గుమ్మం బయట చెప్పులు, బూట్లు మాయం… ఆటోలో వచ్చి మరీ ఎత్తుకెళుతున్న దొంగలు
దొంగోడికి చెప్పే లాభం అనే సామెత ఇలాంటి దొంగతనాల వల్లే పుట్టి ఉంటుంది. సాధారణంగా దొంగలు ఇంట్లోని నగదు, బంగారం లేదా విలువైన వస్తువులు ఎత్తుకెళుతుంటారు. కానీ ఈ దొంగలు మాత్రం ఇంటి ముందు చెప్పులు, బూట్లు కనిపిస్తే చాలు కండ్లు మూసి తెరిచే లోపు మాయం చేస్తున్నారు. హైదరాబాద్ మూసారాంబాగ్లో బూట్లు, చెప్పుల దొంగతనం కలకలం రేపుతోంది. ఈస్ట్ ప్రశాంత్ నగర్లో అపార్ట్మెంట్లలోకి వచ్చి దొంగతనాలు చేస్తున్నారు. అర్ధరాత్రి చొరబడి బూట్లు, చెప్పులు ఎత్తుకెళుతున్నారు. దొంగలు ఆటోలో వచ్చి మరీ బూట్లు, చెప్పులు ఎత్తుకెళుతుండటం
- K Sammaiah
- Updated on: Mar 13, 2025
- 2:55 pm