AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maqdood Husain Khaja

Maqdood Husain Khaja

Reporter - TV9 Telugu

husainkhaja.maqdood@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. విశాఖలోని లీడర్ పేపర్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది. 2004 నుంచి లీడర్, 2009 నుంచి స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ లో పనిచేసి 2015 నుంచి టీవీ9 లో అడుగుపెట్టాను.. ప్రస్తుతం టీవీ9 ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Andhra Pradesh: అకాల మరణం.. అయినా చిరంజీవిగానే..ఆ పేరేంట్స్ కు సలాం..

Andhra Pradesh: అకాల మరణం.. అయినా చిరంజీవిగానే..ఆ పేరేంట్స్ కు సలాం..

పేరెంట్స్ గొప్ప మనస్సు చాటుకున్నారు. కుమారుడి గుండె, కిడ్నీ, కాలేయం దానం చేసేందుకు ముందుకొచ్చారు. యాక్సిడెంట్‌లో కుమారుడి బ్రెయిన్ డెడ్ అవ్వగా.. అతడి అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో తల్లిదండ్రులను అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

Watch Video: మొబైల్ టార్చ్ వెలుతురులో.. కారు చీకట్లో.. ఓ నిండు గర్భిణీ నరకయాతన!

Watch Video: మొబైల్ టార్చ్ వెలుతురులో.. కారు చీకట్లో.. ఓ నిండు గర్భిణీ నరకయాతన!

తరాలు మారినా ఆ అడవి బిడ్డల తలరాతలు మారడం లేదు. ఆధునిక యుగంలోనూ వారికి అష్ట కష్టాలే. మారుమూల ప్రాంతాలకు రహదారులు లేక అత్యవసర సమయంలో వారి కష్టాలు అన్ని ఇన్ని కావు. రోగమొచ్చినా రోస్టొచ్చినా డోలీమోయాల్సిందే.. వాగులు రాళ్లు రప్పలు దాటుకుంటూ ముందుకు సాగాల్సిందే! తాజాగా ఓ నిండు గర్భిణి పడిన కష్టం మరోసారి రహదారులేక గిరిజనులు పడుతున్న అవస్థలకు అద్దం పడుతోంది..

Andhra News: పైనచూస్తే తెల్లటి సంచులు.. డౌట్ వచ్చి విప్పి చూడగా.. దిమ్మతిరిగే సీన్

Andhra News: పైనచూస్తే తెల్లటి సంచులు.. డౌట్ వచ్చి విప్పి చూడగా.. దిమ్మతిరిగే సీన్

ఏపీలో మరోసారి భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు అల్లూరి జిల్లా పోలీసులు. రాష్ట్రంలో అక్రమ గంజాయి రవాణా సాగుతుందన్న విశ్వసనీయ వర్గాల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు..అల్లూరి జిల్లా పెదబయలు మండలం కుజుబంగి జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టి గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. నిందితుల నుంచి 1,373 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Watch: ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగుపాము.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?

Watch: ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగుపాము.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెక్టార్-1లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కలకలం రేగింది. ఆలయ పరిసరాల్లో కనిపించిన నాగుపాము ఒక్కసారిగా గర్భగుడిలోకి చేరడంతో భక్తులు, ఆలయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్ ఘటనాస్థలికి చేరుకుని, అత్యంత విషపూరితమైన ఇండియన్ స్పెక్టాకిల్డ్ కోబ్రాను సురక్షితంగా రెస్క్యూ చేశారు. దీంతో ఆలయ అర్చకులు, భక్తులు ఊపిరి పీల్చుకుంటూ స్నేక్ క్యాచర్ బృందాన్ని అభినందించారు.

బావిలోంచి వింత శబ్దాలు.. తొంగి చూస్తే గుండె ఆగినంత పనైంది.. ఏం చేసారో తెలుసా..?

బావిలోంచి వింత శబ్దాలు.. తొంగి చూస్తే గుండె ఆగినంత పనైంది.. ఏం చేసారో తెలుసా..?

అల్లూరి జిల్లా అనంతగిరి మండలం గంగవరం గ్రామంలో బావిలో చిక్కుకున్న 13 అడుగుల భారీ గిరినాగును అటవీశాఖ అధికారులు, EGWS బృందం సంయుక్తంగా సురక్షితంగా రక్షించారు. అనంతరం శంకరం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టగా, వన్యప్రాణులు కనిపిస్తే హాని చేయకుండా వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు సూచించారు.

Vizag Earthquake: విశాఖలో భూ ప్రకంపనలు.. తెల్లవారుజామున ఉలిక్కిపడిన జనం..

Vizag Earthquake: విశాఖలో భూ ప్రకంపనలు.. తెల్లవారుజామున ఉలిక్కిపడిన జనం..

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఆదివారం తెల్లవారుజామున 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాకినాడకు 225 కి.మీ దూరంలో బంగాళాఖాతంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు.

భారత నావికాదళంలో మరో కీర్తి పతాక.. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సరికొత్త అస్త్రం సిద్ధం!

భారత నావికాదళంలో మరో కీర్తి పతాక.. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సరికొత్త అస్త్రం సిద్ధం!

భారతదేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు నౌక దళం తన అమ్ములపొదిలో మరో అస్త్రం చేరబోతోంది. స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి అధికారికంగా తన సేవలు ప్రారంభించారు. జూలై 11వ తేదీ శనివారం రోజున విశాఖ నేవల్ డాక్ యార్డ్ లో కమిషనింగ్ వేడుక జరగనుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. యుద్ధనౌకను జాతికి అంకితం చేస్తారు. శత్రు రాడార్లకు చిక్కకుండా కడలిలో దూసుకుపోతూ సింహంలా విరుచుకుపడే ప్రత్యేకత ఐఎన్ఎస్ మహేంద్రగిరి సొంతం.

సరుగుడు తోటల్లో ఏదో జరుగుతుంది.. అనుమానంతో సీక్రెట్ ఆపరేషన్.. కనిపించిన సీన్‌ చూసి షాక్!

సరుగుడు తోటల్లో ఏదో జరుగుతుంది.. అనుమానంతో సీక్రెట్ ఆపరేషన్.. కనిపించిన సీన్‌ చూసి షాక్!

అనకాపల్లి జిల్లాలోని సరుగుడు తోటలు.. గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది లోపలికి వెళ్తూ వస్తున్నారు. వాళ్లకు తప్ప.. మిగతావారు ఎవ్వరికి అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. వెళ్తున్నారు.. పని పూర్తి చేసుకుని వచ్చేస్తున్నారు. ఎవరికో చిన్న ఉప్పందింది. అటువైపుగా కొంతమంది యువకులు వెళుతున్నారు.. ఘాటైన వాసన వస్తోంది. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దాడులు చేస్తే.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.

Andhra News: గడ్డి వాము పక్కన కనిపించిన నల్లటి బ్యాగ్.. ఏంటని ఓపెన్ చేసి చూడగా..

Andhra News: గడ్డి వాము పక్కన కనిపించిన నల్లటి బ్యాగ్.. ఏంటని ఓపెన్ చేసి చూడగా..

అది ఓ వివాహ వేడుక.. రాత్రి అందరూ పెళ్లి హడావుడిలో ఉన్నారు.. పెళ్లికి వచ్చిన వధువు బంధువు ఓ బ్యాగు పట్టుకుని కూర్చుంది. అదిగమనించిన ఓ కేటుగాడు.. ఒక్కసారిగా ఆ బ్యాగ్‌ను లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. రాత్రి కావంతో అతన్ని పట్టుకోవడం కష్టతరం అయింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు 3 గంటల్లోనే కేసును చేధించారు.

Andhra Pradesh: ఆ మాత్రం దానికే చంపడం ఏందిరా.. నీ ఆవేశంతో మూడు కుటుంబాల్లో..

Andhra Pradesh: ఆ మాత్రం దానికే చంపడం ఏందిరా.. నీ ఆవేశంతో మూడు కుటుంబాల్లో..

క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. మాట మాట పెరిగి ఘర్షణకు కారణమైంది. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. విశాఖ తాటి చెట్ల పాలెంలో ఈ ఘటన జరిగింది. భార్య నిండు గర్భిణీ కాగా ఒకగానొక్క కొడుకు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. స్నేహితుడే ఆ యువకుడు పాలిట యముడై ప్రాణాలు తీయడం అందరిని కలచివేస్తోంది.

Andhra Pradesh: ఉపాధి పనులు చేస్తుండగా పేలుడు.. భయంతో కూలీల పరుగులు..!

Andhra Pradesh: ఉపాధి పనులు చేస్తుండగా పేలుడు.. భయంతో కూలీల పరుగులు..!

Andhra Pradesh: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం స్వయంభు వరం గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాంసాగర్ చెరువు నుండి మధు చెరువు వరకు కాలువ పూడిక తీత పనులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 55 మంది కూలీలు..

వర్షంలో తడుస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.. కలెక్టర్ మానవత్వానికి నెటిజన్ల ప్రశంసలు!

వర్షంలో తడుస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.. కలెక్టర్ మానవత్వానికి నెటిజన్ల ప్రశంసలు!

జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్.. మాడుగులలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం పూర్తి అయిన తర్వాత కారులో బయల్దేరారు. ఈ క్రమంలోనే బంగారు మెట్ట కూడలిలో కొంతమంది విద్యార్థులు వర్షంలో తడుస్తూ కనిపించారు. ఈ విషయాన్ని కలెక్టర్ గమనించి వెంటనే తన కారు ఆపారు. వారి నుంచి వాకబు చేశారు. బస్సు కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్న విషయాన్ని కలెక్టర్ గమనించారు.