తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. విశాఖలోని లీడర్ పేపర్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది. 2004 నుంచి లీడర్, 2009 నుంచి స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ లో పనిచేసి 2015 నుంచి టీవీ9 లో అడుగుపెట్టాను.. ప్రస్తుతం టీవీ9 ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
గిరినాగుతో అట్లుంటది మరి.. ధైర్యమున్నోళ్లు కూడా వణికిపోయారు.. వీడియో చూస్తే..
అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి మండలం గరిసింగి గ్రామంలో భారీ గిరినాగు కలకలం సృష్టించింది. రెండు ఇళ్ల గోడల మధ్య సుమారు 13 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రా కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించగా.. తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులు రంగంలోకి దిగి సుమారు రెండు గంటలపాటు శ్రమించి పామును సురక్షితంగా రెస్క్యూ చేశారు.
- Maqdood Husain Khaja
- Updated on: Aug 20, 2026
- 7:18 am
Andhra: ఆషాడం తర్వాత అత్తారింటికి కొత్త అల్లుడు.. అడుగడుగుకో గిఫ్ట్.. వీడియో చూడండి..
ఆషాడ మాసం ముగిసిన తర్వాత అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుడికి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘన స్వాగతం లభించింది. ఇంటి గేటు నుంచి గడప వరకు అడుగుకో బహుమతి అందించడంతో పాటు.. డైనింగ్ టేబుల్పై ఏకంగా వంద రకాల వంటకాలు సిద్ధం చేసి అత్తమామలు అల్లుడికి అదిరిపోయే మర్యాదలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- Maqdood Husain Khaja
- Updated on: Aug 17, 2026
- 3:21 pm
దెబ్బకు దండం పెట్టుకున్నారు.. కిచెన్లో పడగవిప్పి నాగుపాము ఏం చేసిందంటే.. ఇదిగో వీడియో
విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో ఓ కుటుంబానికి ఊహించని షాక్ ఎదురైంది. వంటగదిలో ఏదో కదులుతున్నట్లు గుర్తించిన మహిళ దగ్గరకు వెళ్లి చూడగా.. భారీ నాగుపాము పడగ విప్పి బుసలు కొడుతూ కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
- Maqdood Husain Khaja
- Updated on: Aug 17, 2026
- 8:22 am
Vizag: ఇక చరిత్ర పుటల్లోనే..! విశాఖ ఎయిర్ పోర్టులో భావోద్వేగ క్షణాలు.. చివరి ఫ్లైట్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ పౌర విమానయాన చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. నాలుగున్నర దశాబ్దాల పాటు నిరంతరాయంగా సేవలందించిన విశాఖపట్నం ఎయిర్పోర్టు నుంచి వాణిజ్య విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి VTZ కోడ్తో సహా అన్ని పౌర విమాన సర్వీసులు భోగాపురం మానాశ్రయానికి బదిలీ అయ్యాయి.
- Maqdood Husain Khaja
- Updated on: Aug 16, 2026
- 8:13 pm
గుండెనిండా దేశభక్తి.. గుర్రాలతో నిరసన.. ఆ గిరిజనుల ఆవేదన ఎందుకో తెలుసా..?
వాళ్లంతా అమాయక ఆదివాసీలు.. కొండ శిఖర గ్రామంలో నివాసం.. ఇరవై రెండు కుటుంబాలు నూటా ఇరవై మంది వరకు జనాభా.. పశువుల బంధ, జీలుగు లోవ, సోంపురం గ్రామాల్లో సామాలమ్మ కొండపై జీవనం.. కాళ్లు అరిగేలా అధికారుల చుట్టూ తిరిగుతున్నారు... కనిపించిన వారందరికీ వినతి పత్రాలు సమర్పిస్తున్నారు.. పట్టించుకునే నాధుడే లేకపోవడంతో ఇక గళం విప్పారు.. స్వాతంత్ర దినోత్సవ వేళ త్రివర్ణ పతాకాలతో గుర్రాలపైనే ర్యాలీ చేశారు.. గుర్రాలతో మూడు కిలోమీటర్ల నిరసన యాత్ర చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేళ గుండె నిండా దేశభక్తి ఉన్నా.. పాలకులు తమ కష్టాలు తీర్చడం అందుకు ఆవేదన చేంతున్నారు ఆ అడవి బిడ్డలు.
- Maqdood Husain Khaja
- Updated on: Aug 17, 2026
- 4:04 pm
Visakhapatnam–Bhogapuram: విశాఖ- భోగాపురానికి ఎయిరో ఎక్స్ప్రెస్ బస్సులు ప్రారంభం.. ప్రత్యేక సదుపాయాలు
Visakhapatnam–Bhogapuram: బస్సులో ప్రయాణించే వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక సౌకర్యం కల్పించారు. హైడ్రాలిక్ వీల్ చైర్ తో బస్సు ఎక్కి దిగే సదుపాయం కల్పించారు. భద్రతాపరంగా ప్రత్యేక ఏర్పాట్లు బస్సులో ఉన్నాయి. సీసీ కెమెరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లతో పాటు హేమర్లు, ఫైర్ ఎస్టింగ్..
- Maqdood Husain Khaja
- Updated on: Aug 15, 2026
- 6:26 pm
ఒళ్లు గగుర్పొడిచే సీన్.. పామును మింగుతూ షెడ్డులో ఇరుక్కున్న రాచనాగు.. వీడియో చూస్తే..
అనకాపల్లి జిల్లాలో రెండు భారీ కింగ్ కోబ్రాలు కలకలం సృష్టించాయి. మాడుగుల మండలం కుర్మానాధపురంలో సుమారు 13 అడుగుల కింగ్ కోబ్రా మరో పామును మింగుతూ రేకుల షెడ్లో ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ వెంకటేష్ సుమారు రెండు గంటలు శ్రమించి పామును సురక్షితంగా బయటకు తీశారు.
- Maqdood Husain Khaja
- Updated on: Aug 15, 2026
- 9:01 am
బ్యాగ్ తెరిచిన యువకుడికి దిమ్మతిరిగే షాక్.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఓ యువకుడు రోజు మాదిరిగానే స్పోర్ట్స్ ప్రాక్టీస్ కోసం బయలుదేరుతున్నాడు. ఇంటి నుంచి బయటికి వచ్చి.. షూస్ వేసుకున్నడు. అక్కడే ఉన్న బ్యాగులో గ్లౌస్ పెట్టుకుని బయలుదేరినందుకు సిద్ధమయ్యాడు. బ్యాగు పట్టుకునే సరికి ఏదో కదిలినట్టు అనిపించింది. తెరిచి చూస్తే.. లోపల తిష్ట వేసి కూర్చుంది. వెంటనే కేకలు పెట్టి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు ఆ యువకుడు. తృటిలో పెద్ద ముప్పే తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.
- Maqdood Husain Khaja
- Updated on: Aug 12, 2026
- 11:47 am
Allu Arjun : వైజాగ్లో సందడి చేసిన అల్లు అర్జున్.. బన్నీ ప్రయాణించిన కారు గురించి నెట్టింట చర్చ..
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఆదివారం విశాఖపట్నంలో సందడి చేశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విశాఖ సమీపంలో ప్రారంభించిన అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడం సంతోషకరమని అన్నారు. విశాఖలోని ఇనార్పిట్ మాల్ లో AAA సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభించిన బన్నీ.. అనంతరం మాట్లాడారు.
- Maqdood Husain Khaja
- Updated on: Aug 10, 2026
- 6:31 am
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్..
అనకాపల్లి జిల్లాలో మైన్స్ సర్వేయర్ ఏసీబీకి చిక్కాడు. అయిదు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యాడు సర్వేయర్ మురళి కృష్ణ. కార్యాలయం వెనకవైపు ఉన్న తోటలో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. గతంలోనూ ఒకసారి ఏసీబికి పట్టుపడ్డాడు మురళీకృష్ణ. ఆ కేసు కోర్టులో ఉండగానే మరోసారి ట్రాప్ అయ్యాడు.
- Maqdood Husain Khaja
- Updated on: Aug 6, 2026
- 11:03 pm
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం.. ఎట్టకేలకు..!
Achyutapuram sea incident: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక తీరంలో సాయిల్ టెస్ట్ నిర్వహిస్తున్న సమయంలో బార్జ్కు అనుసంధానమైన బోట్ల తాళ్లు తెగిపోవడంతో నలుగురు నిపుణులు సముద్రంలో చిక్కుకున్నారు. మెరైన్ పోలీసులు, మత్స్యకారులు, గజ ఈతగాళ్ల సమన్వయంతో వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.
- Maqdood Husain Khaja
- Updated on: Aug 6, 2026
- 10:11 pm
Andhra Pradesh: అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి.. సీన్ కట్ చేస్తే..
అరకు అడవిలో కలకలం రేగింది. గంజాయి భారీగా పట్టుబడింది. 30 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ పంకజ్ కుమార్ దివేది ఆధ్వర్యంలో ఆపరేషన్ జరగ్గా.. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోట్లల్లో ఉంటుందని అంచనా..
- Maqdood Husain Khaja
- Updated on: Aug 6, 2026
- 9:40 pm