తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. విశాఖలోని లీడర్ పేపర్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది. 2004 నుంచి లీడర్, 2009 నుంచి స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ లో పనిచేసి 2015 నుంచి టీవీ9 లో అడుగుపెట్టాను.. ప్రస్తుతం టీవీ9 ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Andhra: ఇలాంటి పోలీస్ను ఎక్కడా చూసుండరు.. స్పీకర్ మెచ్చిన ఎస్ఐ గురించి తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..!
పోలీస్ శాఖలో పనిచేస్తూ తన ఉద్యోగ ధర్మాన్ని సంతృప్తిగా నిర్వహించడమే కాకుండా.. ప్రవృత్తిగా సేవాపథంవైపు అడుగులు వేస్తున్నారు అనకాపల్లి జిల్లా నాతవరం ఎస్ఐ తారకేశ్వరావు. శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్లలో జన్మించిన తారకేశ్వరరావు తండ్రి ఏఆర్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసేవారు. చిన్నతనం నుంచి తారకేశ్వరరావుకు క్రీడలపై మక్కువ.
- Maqdood Husain Khaja
- Updated on: Jan 7, 2026
- 4:28 pm
వెనిజులా గులాబీ.. ఆకుల కింద దాక్కునే ఆ పూలను చూశారా..? ఎక్కడో కాదు మన దగ్గరే..
వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్తో సహా దక్షిణ అమెరికాకు చెందిన ఉష్ణమండల పుష్పించే చెట్టు... ఇప్పుడు విశాఖలో కూడా కనువిందు చేస్తోంది.. వెనిజులా గులాబీ పూలను విరబూసింది. సందర్శకులను తన వైపు ఆకర్షిస్తుంది. ఎర్రని అగ్ని కిరీటం లాంటి పూలతో చూపుతిప్పుకోలేనంతగా ఆకట్టుకుంటుంది.
- Maqdood Husain Khaja
- Updated on: Jan 7, 2026
- 10:59 am
Andhra News: ఛీ.. ఛీ ఎంతకు తెగించార్రా.. అరకు హాస్పిటల్ వాష్రూమ్లో..
అరకు ఏరియా ఆసుపత్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వాష్ రూమ్లో ఓ నవజాత శిశువును వదిలేసి వెళ్లారు కొందరు వ్యక్తులు. ఉదయాన్నే శానిటేషన్ సిబ్బంది గుర్తించగా, ఆసుపత్రి సూపరింటెండెంట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తూ, గర్భిణుల వివరాలు ఆరా తీస్తున్నారు. నిందితుల పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటన అరకు ప్రాంతంలో కలకలం రేపింది.
- Maqdood Husain Khaja
- Updated on: Jan 3, 2026
- 5:41 pm
Andhra: ఆడుకున్న కుక్కే చిన్నోడి మరణానికి కారణమైంది.. అత్యంత విషాదకర మరణం..
ఎప్పుడూ తనతోనే ఆడుకున్న కుక్కే… ఆ బాలుడి ప్రాణాలకు కారణమైంది. కుక్క గోళ్లతో రక్కిన గాయానికి సకాలంలో వ్యాక్సిన్ వేయించుకోకపోవడంతో రేబిస్ సోకి 12 ఏళ్ల పూర్ణానంద్ మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా దుప్పుతూరులో జరిగిన ఈ విషాద ఘటన గ్రామాన్ని కన్నీళ్లలో ముంచింది.
- Maqdood Husain Khaja
- Updated on: Jan 3, 2026
- 3:20 pm
Andhra: తొంగి చూస్తే ఒక్కసారిగా గుండె గుభేల్.. ఫ్రిడ్జ్లో దాగి ఉన్నదేంటో తెలుసా.. ఇదిగో వీడియో
విశాఖ సిందియా ప్రాంతంలో షిప్ యార్డ్ క్వార్టర్స్.. ఇల్లు షిఫ్ట్ అయ్యే క్రమంలో.. ఫ్రిజ్ ను ఖాళీ చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లన్నీ ఖాళీ చేసేసారు. ఇంతలో ఫ్రిడ్జ్ పై భాగం నుంచి.. చిన్న తల కనిపిస్తుంది. ఏదో బల్లి అయి ఉంటుందని లైట్ తీసుకున్నారు. కానీ ఎక్కడ వచ్చిన డౌట్.. కాస్త తేడాగా ఉంది అని అనుకున్నారు. దగ్గరకు వెళ్లి.. అది బల్లి కాదు.. పాము..
- Maqdood Husain Khaja
- Updated on: Jan 3, 2026
- 12:05 pm
Andhra: చలిమంటలతో జాగ్రత్త.. నిద్రలోకి జారితే అంతే..!
చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రాణాలకే ముప్పు ఏర్పడుతోంది. చలిమంటలు, కుంపట్లే కొందరి ఆయువు తీస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో చలి నుంచి ఉపశమనం కోసం మంట పెట్టుకున్న వృద్ధురాలు సజీవ దహనం కావడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. .. .. ..
- Maqdood Husain Khaja
- Updated on: Jan 2, 2026
- 8:26 pm
Visakhapatnam: సముద్రపు ఒడ్డున మత్య్సకారులకు ఎదురైన వింతజీవి.. దగ్గరకు వెళ్లి చూడగా..
విశాఖపట్నం ఋషికొండ తీరంలో అరుదైన కలిమొయి చేప (స్పాటెడ్ మోరే ఈల్) నిర్జీవంగా ఒడ్డుకు కొట్టుకువచ్చింది. చిరుతపులి చారలతో ఆకర్షణీయంగా కనిపించే ఈ లోతైన సముద్రపు చేప, పదునైన దంతాలు కలిగి 5 మీటర్ల వరకు పెరుగుతుంది. రాత్రిపూట వేటాడే ఈ చేప వలకు చిక్కడం చాలా అరుదు. ఈ వింత చేప విశాఖ ప్రజలను ఆశ్చర్యపరిచింది.
- Maqdood Husain Khaja
- Updated on: Dec 31, 2025
- 10:40 am
Andhra News: వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. అసలు నడి సముద్రంలో జరిగిందేంటి?
అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. అచ్యుతాపురం వద్ద చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటును ఓ భారీ కార్గో నౌక ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులలో ఐదుగురు సురరక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, కొమరాని నీలాకరి అనే మత్స్యకారుడు సముద్రంలో గల్లంతయ్యాడు. గల్లంతైన మత్స్యకారుడి కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇది మత్స్యకారుల కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
- Maqdood Husain Khaja
- Updated on: Dec 27, 2025
- 1:18 pm
Andhra: ఆరి బద్మాష్గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే.. బయటకొచ్చి చేసిన యవ్వారం ఇదా
ఎవరైనా నేరం చేస్తే.. చట్ట ప్రకారం పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు. కోర్టు ఆదేశాలతో నిందితుడిని జ్యూడిషల్ రిమాండ్కు పంపిస్తారు. ఒకసారి ఒక నేరం చేసినవాడు.. మళ్లీ బయటికి వచ్చి కొంతమంది నేరాలు మానేస్తారు. మరి కొంతమంది.. తమ పాత అలవాటును కొనసాగిస్తారు. కానీ.. విశాఖ పోలీసులకు చిక్కిన ఓ మోసగాడు.
- Maqdood Husain Khaja
- Updated on: Dec 26, 2025
- 9:03 am
Andhra: భార్య మాయ ఫోన్ మాయలో పడింది.. అది చూసి ఇంటికొచ్చిన భర్త ఏం చేశాడో తెలిస్తే
అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యనే కడతేర్చేలా చేసింది. విచక్షణ కోల్పోయిన భర్త స్క్రూ డ్రైవర్తో పొడిచి భార్యను అంతమొందించాడు. దీంతో అభం శుభం తెలియని నాలుగు నెలలు చిన్నారి తల్లి లేని అనాధగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చెక్ చేయండి.
- Maqdood Husain Khaja
- Updated on: Dec 25, 2025
- 10:50 am
Andhra News: అబ్బా.. అదృష్టం అంటే ఈ జాలర్దే.. ఈ చేప ఎంత రేటు పలికిందో తెలుస్తే..
ఏఓబిలో గిరిజన మత్స్యకారుల పంట పండింది. బలిమెల జలాశయంలో వేటకు వెళ్ళిన జాలర్లకు అదృష్టం తలుపు తట్టింది. చేపల కోసం వేసిన వల ఒక్కసారిగా బరువెక్కింది. ఎంతలాగినా కదల్లేదు.. దీంతో స్థానికుల సమాయంతో బలంగా వలను బయటకు లాగారు.. ఇంకే ముంది వలలో చిక్కిన భారీ చేపను చూసి గంతులేశారు.
- Maqdood Husain Khaja
- Updated on: Dec 22, 2025
- 9:33 pm
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత పులి.. వణికిపోతున్న జనం!
ఆంధ్ర-ఒడిస్సా బోర్డర్లో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. ఎటునుంచి ఎటాక్ చేస్తోందన్న భయంతో జనం జంకుతున్నారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. మాచారాన్ని ఉన్నతాధికారులకు అందించడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతంలో ప్రజలతో పాటు వాహనదారులు, పర్యాటకులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
- Maqdood Husain Khaja
- Updated on: Dec 22, 2025
- 7:06 am