తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. విశాఖలోని లీడర్ పేపర్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది. 2004 నుంచి లీడర్, 2009 నుంచి స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ లో పనిచేసి 2015 నుంచి టీవీ9 లో అడుగుపెట్టాను.. ప్రస్తుతం టీవీ9 ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
భారత నావికాదళంలో మరో కీర్తి పతాక.. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సరికొత్త అస్త్రం సిద్ధం!
భారతదేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు నౌక దళం తన అమ్ములపొదిలో మరో అస్త్రం చేరబోతోంది. స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి అధికారికంగా తన సేవలు ప్రారంభించారు. జూలై 11వ తేదీ శనివారం రోజున విశాఖ నేవల్ డాక్ యార్డ్ లో కమిషనింగ్ వేడుక జరగనుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. యుద్ధనౌకను జాతికి అంకితం చేస్తారు. శత్రు రాడార్లకు చిక్కకుండా కడలిలో దూసుకుపోతూ సింహంలా విరుచుకుపడే ప్రత్యేకత ఐఎన్ఎస్ మహేంద్రగిరి సొంతం.
- Maqdood Husain Khaja
- Updated on: Jul 10, 2026
- 12:44 pm
సరుగుడు తోటల్లో ఏదో జరుగుతుంది.. అనుమానంతో సీక్రెట్ ఆపరేషన్.. కనిపించిన సీన్ చూసి షాక్!
అనకాపల్లి జిల్లాలోని సరుగుడు తోటలు.. గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది లోపలికి వెళ్తూ వస్తున్నారు. వాళ్లకు తప్ప.. మిగతావారు ఎవ్వరికి అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. వెళ్తున్నారు.. పని పూర్తి చేసుకుని వచ్చేస్తున్నారు. ఎవరికో చిన్న ఉప్పందింది. అటువైపుగా కొంతమంది యువకులు వెళుతున్నారు.. ఘాటైన వాసన వస్తోంది. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దాడులు చేస్తే.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.
- Maqdood Husain Khaja
- Updated on: Jul 9, 2026
- 12:12 pm
Andhra News: గడ్డి వాము పక్కన కనిపించిన నల్లటి బ్యాగ్.. ఏంటని ఓపెన్ చేసి చూడగా..
అది ఓ వివాహ వేడుక.. రాత్రి అందరూ పెళ్లి హడావుడిలో ఉన్నారు.. పెళ్లికి వచ్చిన వధువు బంధువు ఓ బ్యాగు పట్టుకుని కూర్చుంది. అదిగమనించిన ఓ కేటుగాడు.. ఒక్కసారిగా ఆ బ్యాగ్ను లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. రాత్రి కావంతో అతన్ని పట్టుకోవడం కష్టతరం అయింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు 3 గంటల్లోనే కేసును చేధించారు.
- Maqdood Husain Khaja
- Updated on: Jul 5, 2026
- 10:00 am
Andhra Pradesh: ఆ మాత్రం దానికే చంపడం ఏందిరా.. నీ ఆవేశంతో మూడు కుటుంబాల్లో..
క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. మాట మాట పెరిగి ఘర్షణకు కారణమైంది. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. విశాఖ తాటి చెట్ల పాలెంలో ఈ ఘటన జరిగింది. భార్య నిండు గర్భిణీ కాగా ఒకగానొక్క కొడుకు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. స్నేహితుడే ఆ యువకుడు పాలిట యముడై ప్రాణాలు తీయడం అందరిని కలచివేస్తోంది.
- Maqdood Husain Khaja
- Updated on: Jul 4, 2026
- 2:31 pm
Andhra Pradesh: ఉపాధి పనులు చేస్తుండగా పేలుడు.. భయంతో కూలీల పరుగులు..!
Andhra Pradesh: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం స్వయంభు వరం గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాంసాగర్ చెరువు నుండి మధు చెరువు వరకు కాలువ పూడిక తీత పనులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 55 మంది కూలీలు..
- Maqdood Husain Khaja
- Updated on: Jul 4, 2026
- 1:20 pm
వర్షంలో తడుస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.. కలెక్టర్ మానవత్వానికి నెటిజన్ల ప్రశంసలు!
జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్.. మాడుగులలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం పూర్తి అయిన తర్వాత కారులో బయల్దేరారు. ఈ క్రమంలోనే బంగారు మెట్ట కూడలిలో కొంతమంది విద్యార్థులు వర్షంలో తడుస్తూ కనిపించారు. ఈ విషయాన్ని కలెక్టర్ గమనించి వెంటనే తన కారు ఆపారు. వారి నుంచి వాకబు చేశారు. బస్సు కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్న విషయాన్ని కలెక్టర్ గమనించారు.
- Maqdood Husain Khaja
- Updated on: Jul 4, 2026
- 10:29 am
బాబోయ్ పాములు..! ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్లో.. వీడియోలు చూస్తే వణుకు పుట్టాల్సిందే..
ఎక్కడో పొదలు, పొలాల్లో సంచరించే పాములు ఏకంగా రైల్వేస్టేషన్ లు, ఎయిర్పోర్టులో కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ లో హడలెత్తించిన పాములు.. తాజాగా విశాఖపట్నం ఎయిర్పోర్టులో హల్ చల్ చేశాయి. దీంతో ప్రజలు భయపడుతున్నారు.
- Maqdood Husain Khaja
- Updated on: Jul 3, 2026
- 10:16 pm
అబార్షన్ చేయించుకోమన్నారు.. చివరకు రోడ్డుపై పడేశారు! అత్తింటి ముందు గర్భిణీ దీక్ష!
ఓ గర్భిణి అత్తింటి ఎదుట బైఠాయించింది.. తనకు న్యాయం చేయాలని తల్లితో కలిసి నిరసనకు దిగింది. భర్త అత్తమామలు తనకు కనికరించాలని వేడుకుంటుంది. న్యాయం కావాలంటూ ఇంటి ముందు బయట ఇచ్చిన ఆ గర్భిణీ మహిళను చూసిన వారంతా అయ్యో పాపం అనక తప్పలేదు. విశాఖపట్నం 52వ వార్డు పాత కరాసలో ఈ ఘటన చోటుచేసుకుంది.
- Maqdood Husain Khaja
- Updated on: Jun 30, 2026
- 12:56 pm
అమానుషం…చోరీ నెపంతో ఎనిమిదేళ్ల బాలికపై చిత్రహింసలు, అట్లకాడతో వాతలు..
చిన్నపిల్లలకు చిన్న దెబ్బ తగిలినా తల్లిదండ్రుల మనసు విలవిలలాడిపోతుంది. అలాంటిది ఒక బాలికపై చోరీ నెపం మోపి, కనీస మానవత్వం లేకుండా అట్లకాడతో వాతలు పెట్టిన అత్యంత పశుత్వ సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సమాజంలో మనుషులు ఎంత క్రూరంగా మారుతున్నారో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.
- Maqdood Husain Khaja
- Updated on: Jun 30, 2026
- 10:23 am
రైలు పట్టాలపై పడుకున్న యువకుడు.. అంతలోనే దూసుకొచ్చిన గూడ్స్ రైలు.. చివరకు..
అనకాపల్లి జిల్లా నాగరాజుపేట రైల్వే గేట్ సమీపంలో రైల్వే పట్టాలపై పడుకున్న ఓ యువకుడు గూడ్స్ రైలు దూసుకొస్తుండగా క్షణాల్లో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. గేట్ కీపర్ అప్రమత్తం కావడం, స్థానికులు వెంటనే స్పందించి యువకుడిని హెచ్చరించడంతో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించిన యువకుడు రైల్వే పోలీసులు వచ్చేలోపే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
- Maqdood Husain Khaja
- Updated on: Jun 30, 2026
- 9:29 am
Watch Video: స్టోర్ రూంలో తిష్టవేసిన భారీ కొండ చిలువలు.. వీడియో చూస్తే దడే..
అది ఓ స్టోర్ రూం.. అప్పుడప్పుడు అందులో సామాన్లు పెట్టడం కోసం మాత్రమే.. ఆ రూమ్లోకి వెళ్తుంటారు.. అలానే తాజాగా స్టోర్ రూమ్కు వెళ్లిన ఇంటి యజమానికి ఊహించిన పరిణామం ఎదురైంది.. డోర్ ఓపెన్ చయగానే రూమ్ తిస్టవేసిన ఓ భారీ కొండ చిలువ అతనికి కనిపించింది. అది చూసిన ఆ ఓనర్ ఒక్కసారిగా భయంతో అక్కడి నుంచి బయటకు పరుగులు పెట్టాడు.
- Maqdood Husain Khaja
- Updated on: Jun 29, 2026
- 10:03 pm
చుట్టాలే కదాని గుడ్డిగా నమ్మి రూ.21 లక్షలు ఇచ్చింది.. తీరా తిరిగిమ్మని అడ్డగ్గా.. ఇది పరిస్థితి
తెలిసిన వాళ్లు.. పైగా బంధువులే కదా అని పలకరిస్తే మాట కలిపారు. ఆపదలో ఉన్నామని చెబితే అండగా నిలిచింది.. అవసరమున్న ప్రతిసారీ లక్షల మేర సాయం చేసింది. కానీ, తానిచ్చిన డబ్బు తిరిగి అడగడానికి వెళ్తే ఆమెకు ఊహించని షాక్ తగిలింది. అప్పటివరకు బంధువులుగా నటిస్తున్న వారి అసలు భాగోతం బయటపడింది. ఇంతకూ ఆమె ఎదుర్కొన్న సమస్య ఏంటి? వైజాగ్ టు విజయవాడ వరకు ఈ క్రైమ్ స్టోరీ ఎలా సాగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- Maqdood Husain Khaja
- Updated on: Jun 27, 2026
- 9:55 am