AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maqdood Husain Khaja

Maqdood Husain Khaja

Reporter - TV9 Telugu

husainkhaja.maqdood@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. విశాఖలోని లీడర్ పేపర్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది. 2004 నుంచి లీడర్, 2009 నుంచి స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ లో పనిచేసి 2015 నుంచి టీవీ9 లో అడుగుపెట్టాను.. ప్రస్తుతం టీవీ9 ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Andhra Pradesh: వల వేస్తూ ఉండగా మాయం.. గిరిజనుడి అదృశ్యం వెనుక మిస్టరీ!

Andhra Pradesh: వల వేస్తూ ఉండగా మాయం.. గిరిజనుడి అదృశ్యం వెనుక మిస్టరీ!

అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం చేపల వేటకు వెళ్లిన ఓ గిరిజనుడు అనుమానాస్పద పరిస్థితుల్లో గల్లంతవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ముంచంగిపుట్టు మండలంలోని జోలపుట్టు పంచాయతీ బొండ్రుగూడ గ్రామానికి చెందిన నరంజి అద్దు (45) శనివారం (జూన్ 20) చేపల వేట కోసం సమీపంలోని బొండ్రుగూడ గెడ్డ బలిఘాట్ ప్రాంతానికి వెళ్లాడు. అతనితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా చేపల వేటలో పాల్గొన్నట్లు సమాచారం.

శవాలపై పేలాలు ఏరుకునే కక్కుర్తి.. మృత ఉద్యోగి కుటుంబం నుంచి లంచం అడిగి బుక్కైన జీవీఎంసీ అధికారి

శవాలపై పేలాలు ఏరుకునే కక్కుర్తి.. మృత ఉద్యోగి కుటుంబం నుంచి లంచం అడిగి బుక్కైన జీవీఎంసీ అధికారి

GVMC Bribe Case: విశాఖపట్నంలోని జీవీఎంసీ వెస్ట్ జోన్ కార్యాలయంలో అవినీతి వెలుగుచూసింది. మృత పారిశుద్ధ్య కార్మికుడికి రావాల్సిన రూ.30 లక్షల బెనిఫిట్స్ విడుదల కోసం రూ.30 వేల లంచం డిమాండ్ చేసిన జూనియర్ అసిస్టెంట్ ఎం.శ్రీనును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో నిర్వహించిన ట్రాప్‌లో నిందితుడు బుక్కయ్యాడు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మళ్ళీ కలకలం.. ఫైర్ బాల్ ఒక్కసారిగా ఎగసిపడటంతో భయం భయం..

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మళ్ళీ కలకలం.. ఫైర్ బాల్ ఒక్కసారిగా ఎగసిపడటంతో భయం భయం..

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో మరోసారి ప్రమాద భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నెల 8న జరిగిన ఘోర ప్రమాదంలో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నుంచి ఇంకా కోలుకోకముందే, తాజాగా ఎస్‌ఎమ్‌ఎస్-1 యూనిట్‌లో ల్యాడిల్ నుంచి ఫైర్‌బాల్ ఎగసిపడటంతో కలకలం రేగింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, వరుసగా చోటుచేసుకుంటున్న స్వల్ప ప్రమాదాలు కార్మికుల్లో ఆందోళన పెంచుతున్నాయి. నాసిరకం ముడి పదార్థాలు, నాణ్యత నియంత్రణ లోపాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తూ, భద్రతా ప్రమాణాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

UK యూత్ పార్లమెంట్‌లో తెలుగు వెలుగు.. ప్రపంచ వేదికపై వైజాగ్‌ అమ్మాయి సత్తా

UK యూత్ పార్లమెంట్‌లో తెలుగు వెలుగు.. ప్రపంచ వేదికపై వైజాగ్‌ అమ్మాయి సత్తా

Kalasha Naidu Success Story: 'కలలు కనాలి... ఆ కలలను సాకారం చేసుకోవాలి.. అప్పటివరకు శ్రమించాలి..' ఇది మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన మాట. ఆ మాటలను జీవిత బాటలుగా మార్చుకొని ప్రపంచ వేదికపై మెరిసింది ఓ యువతి. విశాఖలో పుట్టి... అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగి అందరి మన్ననలు అందుకుంటుంది. యువత ఆశయాలకు ప్రతినిధిగా నిలుస్తూ యూకే యూత్ పార్లమెంట్ సభ్యులుగా గుర్తింపు పొందింది. ఇంతకీ అంతర్జాతీయ వేదికలపై వెలుగుతున్న ఆ తెలుగు యువతి ఎవరు..? వైజాగ్ టు యూకే.. ఆమె ప్రయాణం ఎలా సాగింది..?

రోడ్లు లేవు.. సదుపాయాలు లేవు.. చివరకు 108లోనే పండంటి బిడ్డకు జన్మ

రోడ్లు లేవు.. సదుపాయాలు లేవు.. చివరకు 108లోనే పండంటి బిడ్డకు జన్మ

Ambulance Birth: అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలానికి చెందిన ఓ గర్భిణి మహిళను ప్రసవం కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే 108 అంబులెన్స్‌లో సుఖ ప్రసవం జరిగింది. వైద్య సదుపాయాల కొరత, రవాణా సమస్యల మధ్య అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈ ఘటన మన్యంలో ఆరోగ్య సదుపాయాల పరిస్థితిపై మరోసారి చర్చకు దారి తీసింది.

Andhra News: తరాలు మారుతున్నా.. తప్పని డోలీ కష్టాలు.. మన్యంలో వెలుగులోకి మరో ఘటన!

Andhra News: తరాలు మారుతున్నా.. తప్పని డోలీ కష్టాలు.. మన్యంలో వెలుగులోకి మరో ఘటన!

డిజిటల్ యుగంలో ప్రపంచం దూసుకుపోతున్నా, ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల గిరిజన గ్రామాలు మాత్రం కనీస రహదారి భాగ్యం నోచుకోవడం లేదు. అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి గిరిజనులు ఇప్పటికీ డోలీలనే నమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా అనంతగిరి మండలంలో చోటుచేసుకున్న ఘటనే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.

Andhra News: శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా.. ఊహించని

Andhra News: శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా.. ఊహించని

అదో శ్మశానం.. సాధారణంగా ఆ ప్రాంతంలో అంత్యక్రియల సమయంలో తప్ప ఎప్పుడూ అలికిడే ఉండదు.. పగటిపూట కూడా అక్కడికి వెళ్లే సాహసం చేయరు. అలాంటి స్మశాన వాటికను గుర్తు తెలియని ముగ్గరు వ్యక్తులు కనిపించడం కాస్త అనుమానానికి దారి తీసింది. ఈ విషయం కాస్త పోలీసుల వరకు వెళ్లడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు వారిని పట్టుకొని నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకూ వాళ్లు అక్కడ ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

మిస్సింగ్ అని ఆశ పెట్టారు..చివరకు మృతదేహం గుర్తించామని చెప్పారు! సురేష్ మృతితో విషాదసాగరం

మిస్సింగ్ అని ఆశ పెట్టారు..చివరకు మృతదేహం గుర్తించామని చెప్పారు! సురేష్ మృతితో విషాదసాగరం

ఒమన్ తీరంలో నౌకపై దాడి జరిగి ముగ్గురు గల్లంతయ్యారనే వార్తను టీవీల్లో చూసి, అయ్యో పాపం అనుకున్నారు సురేష్ భార్య భార్గవి. కానీ, ఆ ప్రమాదంలో చిక్కుకున్నది తన భర్తేనని ఆమె ఊహించలేకపోయారు. మొదట భర్త మిస్సింగ్ అయ్యారని, రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందని సమాచారం రావడంతో ఎక్కడో ఒక చిన్న ఆశ మిగిలింది. కానీ,

పోలీసులను చూసి వెనక్కి తిరిగిన కుర్రోళ్లు.. ఛేజ్ చేసి పట్టుకుంటే.. పెద్ద ప్లానే..

పోలీసులను చూసి వెనక్కి తిరిగిన కుర్రోళ్లు.. ఛేజ్ చేసి పట్టుకుంటే.. పెద్ద ప్లానే..

పోలీసులను చూసి బైక్‌ను వెనక్కి తిప్పిన ముగ్గురు యువకుల వ్యవహారం అనుమానం రేకెత్తించడంతో పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. విచారణలో వారు బైక్ చోరీల ముఠాకు చెందిన వారని తేలింది. మైదాన ప్రాంతాల్లో వాహనాలు దొంగిలించి, ఏజెన్సీ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో నాలుగు బైకులను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

మండే ఎండల నుంచి ఉపశమనం.. ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు!

మండే ఎండల నుంచి ఉపశమనం.. ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు!

భానుడి భగభగలతో అల్లాడుతున్న ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి. ప్రస్తుతం రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో విస్తరిస్తున్న రుతుపవనాలు త్వరలో మరిన్ని ప్రాంతాలకు చేరనున్నాయి. దీంతో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఎండల తీవ్రత కూడా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

Underwater Cycling: సముద్ర గర్భంలో సైక్లింగ్..  ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసుండర్.. నెటిజన్లు ఫిదా!

Underwater Cycling: సముద్ర గర్భంలో సైక్లింగ్.. ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసుండర్.. నెటిజన్లు ఫిదా!

సైకిలను సాధారణంగా ఎక్కడ తొక్కుతాం..? రోడ్ల పైనో, గట్ల పైన, లేదా కొండల్లో లోయల్లోనో కదా..? మరి సముద్రం అడుగు భాగంలో సైకిల్ తొక్కడం ఎప్పుడైనా చూశారా? పోనీ ఎక్కడైనా విన్నారా లేదు కదా.. కానీ విశాఖకు చెందిన స్కూబా డ్రైవర్లు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. సముధ్రం అడుగునా సైకిల్ తొక్కి అందరినీ ఆకట్టుకున్నారు. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం దీని గురించి పూర్తిగా తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Vizag: బాత్రూం నుంచి చప్పుళ్లు.. వెళ్లి చూడగా కమోడ్‌లో.. బాబోయ్..

Vizag: బాత్రూం నుంచి చప్పుళ్లు.. వెళ్లి చూడగా కమోడ్‌లో.. బాబోయ్..

విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్‌లోని ఓ ఇంటి వాష్‌రూమ్ కమోడ్‌లో ఉడుము కనిపించడం కలకలం రేపింది. తొలుత దానిని పాముగా భావించిన కుటుంబ సభ్యులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. గంటపాటు శ్రమించి ఉడుమును సురక్షితంగా రెస్క్యూ చేశారు. .. ..