తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. విశాఖలోని లీడర్ పేపర్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది. 2004 నుంచి లీడర్, 2009 నుంచి స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ లో పనిచేసి 2015 నుంచి టీవీ9 లో అడుగుపెట్టాను.. ప్రస్తుతం టీవీ9 ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
ఊపిరిపోతున్నా.. వీడని డ్రైవింగ్ పటిమ..! సలాం చేయాల్సిందే..
అతను ఓ డ్రైవర్.. గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారికి డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒక్కసారిగా గుండెల్లో దడ మొదలైంది.. భరించలేని గుండె నొప్పి.. ఊపిరి ఆగినట్టు అనిపిస్తుంది. కానీ చేతిలో స్టీరింగ్.. కాస్త పట్టు తప్పితే.. నడిరోడ్డుపై ఎంతోమంది ప్రాణాలు బలైపోతాయి. అయినా ఓర్చుకున్నాడు. గుండెల్లో నొప్పిని పంటి కింద బిగబట్టి.. వాహనాన్ని మెల్లగా డివైడర్ వైపు తీసుకెళ్లాడు. అంతబాధలోనూ వాహనాన్ని అతి కష్టం మీద డివైడర్ పైకి ఎక్కించి.. ఊపిరి వదిలేసాడు. డ్రైవర్ క్యాబిన్లోనే స్టీరింగ్పై వాలి ప్రాణాలు కోల్పోయాడు.
- Maqdood Husain Khaja
- Updated on: Jul 25, 2024
- 9:48 pm
టమాటా కోసం తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లు.. కారణమిదే…!
నరసింహనగర్ రైతు బజార్ వద్ద ఉదయం నుంచి జనం క్యూ లైన్ లో నిలిచిన మరీ సబ్సిడీ టమాట కొనుగోలు చేస్తున్నారు. అధికారులు ఒక్కొక్కరికి రెండు రోజులు చొప్పున టమాటా ఇచ్చేలా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. టమాటా ధరలు తగ్గేవరకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా మార్కెటింగ్ శాఖ ద్వారా తగ్గించిన టమాటాను విక్రయిస్తామని అంటున్నారు నరసింహ నగర్ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ చినబాబు.
- Maqdood Husain Khaja
- Updated on: Jul 25, 2024
- 12:45 pm
ఆ జాలరి పంట పండింది.. వలకు చిక్కిన బంగారు వర్ణంలో నిగనిగలాడుతున్న చేప..!
ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో అరుదైన చేప జాలర్ల వలకు చిక్కింది. 25కిలోల బరువు ఉండే ఈ చేప చిక్కింది. అత్యంత అరుదుగా కనిపించే చేపల మత్స్యకారుల వలలో పడింది. శరీరం నిగనిగలాడే బంగారు వర్ణంలో కనిపించే ఈ చేపను బంగారు తీగ, మిలట్రీ మౌస్, గెలస్కోపి అనే పేర్లతో పిలుస్తారు.
- Maqdood Husain Khaja
- Updated on: Jul 24, 2024
- 1:35 pm
Watch Video: గుండె తరుక్కుపోయే ఘటన.. మోకాళ్లపై గిరిజనుల మొర.. ఎందుకంటే..
అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి సరిహద్దు మండలాలైన కొయ్యూరు మండలం మాలపేట పంచాయతీ జాజుల బంద, పెద్దగరువు, పిత్ర గడ్డ, నీళ్ల బంధ. నాలుగు గ్రామాల్లో 100 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. పివిటిజీ తెగకు చెందిన 250 మంది జనాభా జీవిస్తున్నారు. జాజులబంద వెళ్లాలి అంటే జాజులు బంద అనే కొండ గ్రామానికి ఆరు కిలోమీటర్లు నడవాలి. ఈ గ్రామాలకు కనీస సౌకర్యాలు లేవు. రోడ్లు, మంచినీళ్లు అందుబాటులో ఉండవు. ఈ ప్రాంతాలవైపు అధికారులు కన్నతైనా చూడరు. తాగు నీటి కోసం కిలోమీటర్లు నడవాల్సిందే అంటున్నారు గ్రామస్థులు.
- Maqdood Husain Khaja
- Updated on: Jul 22, 2024
- 4:43 pm
Watch Video: అమ్మో.. రెప్పపాటులో ప్రమాదం.. వరదలో ఆటో బోల్తా.. వైరల్ వీడియో..
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. గత రెండు రోజులగా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో విశాఖలో జోరుగా వర్షాలు కురిశాయి. చాలా చోట్ల రోడ్లపైకి వరద నీరు ప్రవహించింది. కొన్నిచోట్ల రోడ్లు ప్రమాదకరంగా మారాయి.
- Maqdood Husain Khaja
- Updated on: Jul 20, 2024
- 7:49 pm
సింహాచలం గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి.. మధ్యాహ్నం బయలుదేరనున్న స్వామివారి పుష్పరథం..భారీగా తరలివస్తున్న భక్తగణం..
గిరి ప్రదక్షిణ చేస్తే భువి ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం. దీనికి తోడు వనమూలికలతో కూడిన కొండ చుట్టూ 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేస్తే ఆయురారోగ్యాలు ఉంటాయని భక్తుల విశ్వాసం. సింహాచలం తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి.. 32 కిలోమీటర్ల కాలినడకన గిరిప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటే ఆ భాగ్యమే వేరు. అందుకే ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే గిరిప్రదక్షిణలో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు.
- Maqdood Husain Khaja
- Updated on: Jul 20, 2024
- 10:09 am
AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షసూచన
దిశగా కదులుతోంది. రుతుపవనాలు మరింత చురుగ్గా మారాయి. రెండు రోజులపాటు ఏపీలో చాలా చోట్ల కుండపోత వర్షాలు కురుస్తాయి. ఐదు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడతాయి. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు మరికొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి
- Maqdood Husain Khaja
- Updated on: Jul 18, 2024
- 2:56 pm
Andhra Pradesh: నడిరోడ్డుపైనే నరికి చంపేశారు..! పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు..!
విశాఖ గాజువాక లో దారుణ హత్య జరిగింది. వేమిరెడ్డి అప్పలనాయుడు అనే మాజీ సైనికొద్యోగి అయిన దివ్యాంగుడిని కత్తితో నరికి చంపేశారు. నడి రోడ్డుపైనే రెండు చేతులు నరికి, మెడపై కత్తితో అత్యంత దారుణంగా దాడి చేసి హతమార్చారు. జగ్గు జంక్షన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Maqdood Husain Khaja
- Updated on: Jul 16, 2024
- 1:05 pm
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
అల్లూరి జిల్లా ఏజెన్సీలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులో గడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రమాదకరంగా మారాయి. రహదారి లేకపోవడంతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు గడ్డల నుంచి ప్రయాణం సాగిస్తున్నారు గిరిజనులు. ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డ నుంచి ఈదుకుంటూ.. ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఒడ్డు దాటుతున్నారు.
- Maqdood Husain Khaja
- Updated on: Jul 15, 2024
- 9:55 pm
AP News: మేక మిస్సయిందని వెతుకుతుండగా.. అడవిలో చెట్ల పొదల మాటున
అల్లూరి ఏజెన్సీలో మేతకు వెల్లింది ఓ మేకల మంద.. కొండపై వెళ్లి మేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి జీవాలు.. అలా అలా ముందుకు వెళ్లిపోయాయి.. చివరకు తిరిగి వెళ్తున్న క్రమంలో.. మందలో ఉన్న ఓ మేక మిస్సయింది. ఎక్కడుందని అంతా వెతికారు. కొండపై గాలించారు. ఎక్కడా కనిపించలేదు.. ఈ క్రమంలో...
- Maqdood Husain Khaja
- Updated on: Jul 12, 2024
- 4:35 pm
Andhra Pradesh: పుట్టగొడుగుల కూర లొట్టలేసుకుని తిన్నారు.. ఆ తరువాతే మొదలైంది అసలు కథ..!
ఎంతో ఇష్టంతో అడవిలో దొరికిన పుట్టగొడుగులను తీసుకొచ్చాడు ఇంటిపెద్ద. కాఫీ తోటల్లో పనులు ముగించుకుని వస్తుండగా, పుట్టగొడుగులు కనిపించాయి. వాటిని సేకరించి ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటికి తీసుకువచ్చి కూర వండుకొని కుటుంబమంతా కలిసి తిన్నారు. ఒక్కొక్కరుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో ఆసుపత్రి పాలయ్యారు.
- Maqdood Husain Khaja
- Updated on: Jul 12, 2024
- 3:02 pm
AP News: పాడుబడ్డ బావిలో వింత శబ్దాలు.. ఏంటని తొంగి చూడగా..! అమ్మబాబోయ్
పన్నెండడుగుల భారీ కింగ్ కోబ్రా.. దాదాపు ఐదడుగుల పొడవున్న జెర్రిపోతు..! జీవన పోరాటం ఒక పాముదైతే.. మరొక పాముది ఆకలి కోసం ఆరాటం.! ఓ పామును మరో పాము వెంటాడింది. ప్రాణ భయంతో మరోపాము తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ చివరకు రెండూ బావిలో పడిపోయాయి.
- Maqdood Husain Khaja
- Updated on: Jul 12, 2024
- 11:59 am