మూడేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ పేరుతో రూ.19 వేల కోట్లు వసూలు చేశాయని కేంద్ర మంత్రి పార్లమెంట్లో వెల్లడించారు. ఇందులో ప్రైవేట్ బ్యాంకుల వాటా రూ.11 వేల కోట్లు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అగ్రస్థానంలో ఉండగా, ఎస్బీఐ 2020 నుంచే పెనాల్టీలు రద్దు చేసింది. ఈ అధిక ఛార్జీలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.