AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సుపరిచయమైన పేరు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు తనయుడైన బాలకృష్ణ..తండ్రికి తగ్గ తనయుడిగా ఇటు నటుడిగా.. అటు రాజకీయ నాయకుడిగా తనదైన ప్రత్యేక గుర్తింపు సాధించారు. వందకు పైగా చిత్రాల్లో నటించారు. అలాగే వరుసగా మూడుసార్లు హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో అనంతపురం జిల్లా హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2019, 2014 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1969 జూన్ 10న ఆయన జన్మించారు. ఆయన బాల్యం హైదరాబాద్‌లోనే గడిచింది. నిజాం కళాశాలలో డిగ్రీ వరకు చదువుకున్నారు.

బాలకృష్ణ 14 ఏళ్ల వయసులోనే తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంవహించిన తాతమ్మకల(1974) చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఎన్టీఆర్ 12 మంది సంతానంలో బాలకృష్ణ ఆరవ కుమారుడు. బాలకృష్ణ 100కు పైగా చిత్రాల్లో నటించారు. మంగమ్మగారి మనవడు,ఆదిత్య 369, భైరవద్వీపం, నరసింహ నాయుడు, సింహా, పాండు రంగడు, లెజెండ్, శ్రీరామరాజ్యం తదితర చిత్రాలు బాలకృష్ణకు మంచి గుర్తింపు సాధించిపెట్టాయి. బాలకృష్ణను ఆయన అభిమానులు బాలయ్యగా పిలుచుకుంటారు. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తి నెలకొంటోంది.

ఇంకా చదవండి

Akhanda 2: డేట్ మాత్రమే మారింది.. విధ్యంసం కాదు.. అఖండ 2 వాయిదాపై ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ 2 వాయిదా పడిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో ప్రీమియర్ షోలు రద్దు చేసిన మేకర్స్.. కాసేపటికి ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించింది. దీంతో ఇప్పుడు ట్విట్టర్ వేదికగా నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ‘అఖండ’ 2 రిలీజ్‌పై నిర్మాతల సంచలన ప్రకటన

బాలకృష్ణ -బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ 2 తాండవం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ షో చూడాలని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అనూహ్యంగా ప్రీమియర్స్ రద్దు కావడం ఫ్యాన్స్ ను కాస్త నిరుత్సాహానికి గురి చేసింది.

Akhanda 2: రూ. 5 లక్షలు పలికిన బాలయ్య ‘అఖండ 2’ టికెట్.. ఎవరు కొన్నారో తెలుసా?

బాలకృష్ణ -బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ 2 తాండవం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ షో చూడాలని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అనూహ్యంగా ప్రీమియర్స్ రద్దు కావడం ఫ్యాన్స్ ను కాస్త నిరుత్సాహానికి గురి చేసింది.

బాలయ్య అభిమానులకు ఊహించని షాక్.. అఖండ 2 ప్రీమియర్స్ రద్దు..

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయెల్ రోల్ లో నటించారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్స్, ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.

బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్.. అఖండ2 టికెట్ రేట్ల పెంపుకు అనుమతి

టాలీవుడ్‌ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ మూవీ డిసెంబ‌ర్ 05న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్‌ అనుమతిచ్చింది. అంతేకాదు, ప్రీమియర్స్ వేసుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Akhanda 2: ‘అఖండ 2’ స్టార్స్ రెమ్యునరేషన్స్.. బాలయ్య కంటే అతనికే ఎక్కువ పారితోషికం.. ఏకంగా అన్ని కోట్లా?

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'అఖండ 2: తాండవం'. గతంలో వచ్చిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్. డైరెక్టర్ బోయపాటి శీను తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ మరికొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్రప్రదేశ్ నా ఆత్మభూమి : బాలకృష్ణ

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్రప్రదేశ్ నా ఆత్మభూమి. దేవుని దయ లేకుండా 'అఖండ 2' లాంటి సినిమా చేయలేం. ఖచ్చితంగా చిత్రం ఘన విజయాన్ని సాధిస్తుందని చెన్నై ప్రెస్ మీట్ లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అన్నారు.

Samyuktha Menon: బాలయ్యతో సాంగ్ దెబ్బకు ఫిజియోథెరపీ తీసుకున్నాను : సంయుక్త మీనన్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘అఖండ 2 – తాండవం’. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మరోసారి సత్తా చాటేందుకు బాలయ్య సిద్ధమయ్యారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి.

Akhanda 2: తెలుగులో ఆ హీరోలంటే చాలా ఇష్టం.. ‘బజరంగీ భాయిజాన్‌’ ఫేమ్ హర్షాలి

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'అఖండ 2: తాండవం'. డైరెక్టర్ బోయపాటి శీను తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇందులో బజరంగీ భాయిజాన్ ఛైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

బాలయ్య బాబు కాబట్టే ఆ సీన్స్ చేశారు.. మరొకరి వల్ల కాదు.. అఖండ 2 నిర్మాతలు

సింహా, లెజెండ్, అఖండ తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో వస్తోన్న మరో సినిమా అఖండ 2 : తాండవం. గతంలో సంచలన విజయం సాధించిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానున్న ఈ మూవీలో సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటించింది. అలాగే హర్షాలీ మల్హోత్రా, జగపతి బాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు.