AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల.. బరిలోకి జాతీయ అధ్యక్షులు నితిన్..!

భారతీయ జనతా పార్టీ తరుపున పోటీ చేసే రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్‌ను కూడా నిలబెట్టింది. బీహార్ నుండి రాజ్యసభకు నితిన్ నబిన్, శివేష్ రామ్‌లను నామినేట్ చేసింది. నామినేషన్లు దాఖలు చేయడానికి మార్చి 5 చివరి తేదీ. మార్చి 15న ఓటింగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాన్ని ప్రకటిస్తారు.

రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల.. బరిలోకి జాతీయ అధ్యక్షులు నితిన్..!
Bjp President Nitin Nabin
Balaraju Goud
|

Updated on: Mar 03, 2026 | 4:43 PM

Share

భారతీయ జనతా పార్టీ తరుపున పోటీ చేసే రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్‌ను కూడా నిలబెట్టింది. బీహార్ నుండి రాజ్యసభకు నితిన్ నబిన్, శివేష్ రామ్‌లను నామినేట్ చేసింది. నామినేషన్లు దాఖలు చేయడానికి మార్చి 5 చివరి తేదీ. మార్చి 15న ఓటింగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాన్ని ప్రకటిస్తారు.

మంగళవారం (మార్చి 03) ఆరు రాష్ట్రాల నుంచి తొమ్మిది మంది రాజ్యసభ అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. అయితే, మహారాష్ట్ర అభ్యర్థుల పేర్లను పార్టీ ఇంకా ఖరారు కాలేదు. హర్యానా నుంచి సంజయ్ భాటియా రాజ్యసభకు వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హా నామినేట్ అయ్యారు. లక్ష్మీ వర్మ ఛత్తీస్‌గఢ్ నుంచి రాజ్యసభకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన్మోహన్ షమల్, సుజిత్ కుమార్ ఒడిశా నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. తరాష్ గోవాలా, జగన్మోహన్ అస్సాం నుంచి బరిలోకి దిగుతున్నారు.

బీహార్ గురించి చెప్పాలంటే, 2026 రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. బీహార్‌కు చెందిన ఐదుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగుస్తుంది. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, ప్రేమ్‌చంద్ గుప్తా, కేంద్ర మంత్రులు రామ్‌నాథ్ ఠాకూర్, అమరేంద్ర ధరి సింగ్, ఉపేంద్ర కుష్వాహ ఉన్నారు. JDU తరపున హరివంశ్ నారాయణ్ సింగ్, రామ్‌నాథ్ ఠాకూర్, RJD తరపున ప్రేమ్‌చంద్ గుప్తా, అమరేంద్ర ధరి సింగ్, రాష్ట్రీయ లోక్ మోర్చా తరపున ఉపేంద్ర కుష్వాహా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే, NDA ఐదు స్థానాల్లో నాలుగు స్థానాలను గెలుచుకుంటుందని భావిస్తున్నారు. ఐదవ స్థానానికి, NDAకి అదనంగా ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం, JDU రెండు స్థానాలను కలిగి ఉంది. బీజేపీ ఇప్పటికే రెండు స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టింది. ఇప్పుడు, ఐదవ స్థానం మిగిలి ఉంది. ఇది రాజకీయంగా తీవ్రమైన చర్చకు దారితీసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us