'రామాయణ' కోసం సాయి పల్లవి షాకింగ్ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లో తెలుసా?

15 April 2026

Basha Shek

న్యాచురల్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం 'రామయాణ'లో సీత పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

దంగల్ ఫేమ్ నితీశ్ తివారీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నాడు.

కన్నడ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనుండగా, హనుమంతుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్‌ యాక్ట్ చేస్తున్నారు.

కాగా  రెండు భాగాలుగా రానున్న రామాయణ కోసం మొత్తం 4000 కోట్ల బడ్జెట్ వెచ్చించినట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

రణబీర్ కపూర్‌కు 150 కోట్లు, రావణుడిగా యష్‌కు 100 కోట్లు, హనుమంతుడిగా సన్నీ డియోల్‌కు 40 కోట్లు  అందుతున్నట్లు తెలుస్తోంది.

కానీ ఈ భారీ బడ్జెట్ సినిమాలో, సీతమ్మ వంటి కీలక పాత్రకు రెండు పార్టులకు కలిపి సాయి పల్లవికి కేవలం 12 కోట్లు మాత్రమే ఇస్తున్నారట.

ఈ సినిమాలోని హీరోలు, ఇతర నటీనటులు, టెక్నీషియన్లతో పోల్చుకుంటే సాయి పల్లవి రెమ్యునరేషన్ చాలా తక్కువ అని చెప్పవచ్చు.

ఎన్నో ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న DNEG కంపెనీని నడిపిస్తున్న సీఈఓ నమిత్ మల్హోత్రా ఈ రామాయణ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.