ఎన్నికలు
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికలంటే ఓ పండుగ. ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రజల తరఫున చట్ట సభల్లో ప్రాతినిధ్యంవహించేందుకు నాయకులు పోటీపడుతారు. వీరిలో ఒకరిని తమ తరఫు నాయకుడిగా ఓటు వేసి ప్రజలు ఎన్నుకుంటారు. ఒకే అభ్యర్థి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు అతని ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. భారత్లో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగ సంస్థ భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. 1950 జనవరి 25న ఏర్పాటైన భారత ఎన్నికల కమిషన్ స్వతంత్ర వ్యవస్థ. సుప్రీంకోర్టులానే ప్రభుత్వ నియంత్రణ లేకుండా భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్లో భాగంగా పనిచేస్తుంది.
ప్రజా ప్రతినిధులను(లోక్సభ సభ్యులు) ఎన్నుకుని తద్వారా కేంద్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రతి ఐదు సంవత్సరాలకు నిర్వహించే ఎన్నికలను సాధారణ ఎన్నికలు(జనరల్ ఎలక్షన్) అంటారు. దేశంలోని మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాల శాసనసభలకు కూడా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఏ కారణం చేతైనా ఐదు సంవత్సరాలు కొనసాగని పక్షంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. లోక్సభతో పాటు అసెంబ్లీ పదవీకాలం పూర్తయిన రాష్ట్రాలకు రెండు ఎన్నికలను కలిపి జమిలి ఎన్నికలు నిర్వహిస్తారు.
సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు(ఈవీఎం) ద్వారా నిర్వహిస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని పరూర్ శాసనసభ నియోజకవర్గంలో 1982లో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారిగా ఈవీఎంలు వాడారు. ఈవీఎంలను భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేశాయి. విద్యుత్ సరఫరా లేని చోట్ల కూడా ఆల్కలైన్ బ్యాటరీ సాయంతో ఈవీఎంలు పనిచేస్తాయి. ఒక్కో ఈవీఎంలో 3,840 ఓట్లను నిక్షిప్తం చేసేందుకు వీలుంటుంది. పోలీలో 64 మంది అభ్యర్థుల కంటే తక్కువగా ఉంటేనే ఈవీఎంలు వినియోగిస్తారు. అభ్యర్థుల సంఖ్య దాని కంటే ఎక్కువగా ఉంటే మాత్రం బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.
ఎన్నికలలో ధన, కుల, కండ బలము ప్రాధాన్యత పెరుగుతోంది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేందుకు పలువురు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పలు చర్యలు తీసుకుంటోంది. భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపడుతూ దీన్ని కట్టడి చేస్తున్నారు. అయినా ఎన్నికల్లో డబ్బు ప్రభావం మరీ ఎక్కువగా ఉండటం పట్ల ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం పీఠంపై హిమంత బిస్వా శర్మ ముద్ర.. 102 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నిక!
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిస్వా శర్మ వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం జరిగిన బీజేపీ, ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా నాయకుడిగా ఎన్నికయ్యారు. మే 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 126 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 102 స్థానాలను (బీజేపీ 82) కైవసం చేసుకుని భారీ విజయం సాధించింది.
- Balaraju Goud
- Updated on: May 10, 2026
- 6:39 pm
విశ్వకవి సాక్షిగా సరికొత్త చరిత్ర.. బెంగాల్లో నూతన శకం ఆరంభం.. సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో 2026, మే 9వ తేదీ ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోనుంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా బెంగాల్ గడ్డపై భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వం కొలువుదీరింది. కోల్కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కన్నుల పండువైన కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
- Balaraju Goud
- Updated on: May 9, 2026
- 3:03 pm
‘విజయ్ అనే నేను’.. వెనక ఎన్నో తిప్పలు! ప్రతిపక్షాల ప్రతివ్యూహాల మధ్య నిలబడగలరా?
విజయ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్. మొదటి నుంచి యువతే లక్ష్యంగా పావులు కదిపారు. తాను రాజకీయాన్ని ఒక హాబీగా చూడటం లేదు.. అది తన ఆశయం అనే స్టేట్మెంట్ జెన్-జీకి ఒక క్లారిటీ ఇచ్చింది. టెన్త్, ఇంటర్ క్లాస్ టాపర్లను పిలిచి సన్మానం చేయడం ద్వారా "చదువుకున్న వారే రాజకీయాల్లోకి రావాలి" అనే మెసేజ్ ఇచ్చారు.
- Shaik Madar Saheb
- Updated on: May 8, 2026
- 9:52 pm
మమతా బెనర్జీ సర్కార్ను బర్తరఫ్ చేసిన గవర్నర్.. నెక్స్ట్ సీఎం ఎవరు..?
గవర్నర్ రవి బెంగాల్లో మమతా బెనర్జీ సర్కార్ను బర్తరఫ్ చేశారు. సీఎం పదవికి రాజీనామా చేయడానికి మమత బెనర్జీ ఒప్పుకోకపోవడంతో గవర్నర్ గురువారం ఈ నిర్ణయం తీసుకున్నారు. మమతా రాజీనామా చేయకపోవడంతో గడువు ముగిసిన వెంటనే బెంగాల్ అసెంబ్లీని రద్దు చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: May 7, 2026
- 7:49 pm
విజయ్ కోర్టులో ద్రవిడ బంతి..! క్షణక్షణానికి మారిపోతున్న తమిళ రాజకీయాలు..
'బంతి విజయ్ కోర్టులోనే ఉంది. అన్నాడీఎంకే అధికార ప్రతినిధి నుంచి వచ్చిన మాట ఇది. డైలాగ్ చిన్నదే కావొచ్చు. బట్ మోస్ట్ పవర్ ఫుల్. 'వచ్చేయడానికి మేం రెడీ.. తీసుకోడానికి మీరు రెడీనా' అనే అర్థం ధ్వనిస్తోంది ఆ మాటలో. మరి.. పళనిస్వామి సంగతేంటి, ఆయన ఒప్పుకుంటారా అని ప్రశ్నిస్తే.. ఆయన సంగతి మాకెందుకు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు అన్నా ఎమ్మెల్యేలు.
- Shaik Madar Saheb
- Updated on: May 6, 2026
- 9:53 pm
Vijay: విజయ్ సీఎం కానట్టేనా..? డీఎంకే – అన్నాడీఎంకే చర్చలు..! అరవ రాజకీయాల్లో సంచలనం..
తమిళనాడులో ద్రవిడ పార్టీలు డీఎంకే.. అన్నాడీఎంకే తమ ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.. ఈ మేరకు అన్నాడీఎంకే, డీఎంకే మధ్య తెరవెనుక చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుండటం రాజకీయాల్లో సంచలనంగా మారింది. డీఎంకే ఖాతాలో 59, అన్నాడీఎంకే ఖాతాలో 47 ఉన్నాయి..
- Shaik Madar Saheb
- Updated on: May 6, 2026
- 9:44 pm
Vijay: 118 మంది కావాల్సిందే.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కు లభించని అనుమతి..
తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు విజయ్. అయితే గవర్నర్ నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి లభించలేదు. మెజారిటీపై గవర్నర్ను ఒప్పించలేకపోయారు. విజయ్కు 113 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి.
- Shaik Madar Saheb
- Updated on: May 6, 2026
- 5:46 pm
ఉత్తరాదిని చుట్టేసిన ‘కాషాయం ఎక్స్ప్రెస్’.. ఇప్పుడు దక్షిణాది డెల్టాపై గురి..!
సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ సర్క్యులేట్ అవుతోంది. మోదీ-షా అశ్వమేధ యాగం చేస్తున్నారట. ఒక్కో రాజ్యాన్ని చేజిక్కించుకుంటూ, అధికారానికి అడ్డొచ్చిన చోట, రాజకీయ యుద్ధం చేయాల్సి చోట రణరంగానికి దిగుతూ, గెలుస్తూ పోతోందట. నదుల అనుసంధానంలో భాగంగా గంగా-కావేరీని కలపాలనే ప్రతిపాదన ఉంది. బీజేపీ తన రాజకీయ అనుసంధానంలో భాగంగా ఇదే గంగా-కావేరీని లక్ష్యంగా తీసుకుంది. గంగా బెల్ట్ నుంచి కావేరీ డెల్టా వరకు.. ఆ నదులు పారే ప్రతి రాష్ట్రంలో పాగా వేయాలనేది కమలదళం టార్గెట్. ఇప్పటికే ఉత్తరాదిన గంగా-యమునా బెల్ట్ను క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ. గంగోత్రి దగ్గర మొదలైన ఈ జైత్రయాత్ర, మొన్న బెంగాల్ కోటను దాటుకుని గంగాసాగర్ను ముద్దాడింది. అంటే.. గంగా బెల్ట్ ఇస్ కంప్లీట్లీ లాక్డ్! ఇప్పుడిక తన ఎక్స్పాన్షన్ మోడ్కు మరింత పదును పెట్టి, పొలిటికల్ కంపాస్ను సౌత్ వైపు తిప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా-గోదావరి బేసిన్ నుంచి కావేరీ వరకు.. ఈ రాష్ట్రాల ఓటు బ్యాంకును కాషాయంతో కనెక్ట్ చేయడమే మెయిన్ అజెండాగా వెళ్తోంది. ఆల్రడీ మహారాష్ట్రలో అధికారంలో ఉంది. కర్నాటకలో అధికారంలోకి వచ్చిపోయింది. ఇప్పుడిక తెలంగాణ వంతు. మే 10న మోదీ అడుగుపెడుతున్నారంటే.. మరో 'పొలిటికల్ టార్గెట్' సెట్ చేయడానికేనా! ఉత్తరాది నుంచి దక్షిణాది దాకా విస్తరించడానికి బీజేపీ వేస్తున్న నయా స్కెచ్ ఏంటి? ఎలాంటి వ్యూహాలతో వెళ్తోంది?
- Balaraju Goud
- Updated on: May 5, 2026
- 9:50 pm
దీదీ మొండితనం.. మమత రాజీనామా చేయకపోతే ఏం జరుగుతుంది?
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో 2026 ఎన్నికలు ఒక అనూహ్య మలుపుగా నిలిచిపోయాయి. దశాబ్ద కాలం పాటు అప్రహత ద్విజయ యాత్రను కొనసాగించిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) కోటలు బద్ధలయ్యాయి. గతంలో 214 స్థానాలతో తిరుగులేని శక్తిగా ఉన్న టీఎంసీ, ఈసారి కేవలం 80 స్థానాలకు పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది.
- Balaraju Goud
- Updated on: May 5, 2026
- 7:50 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి టీవీకే చీఫ్ విజయ్ కృతజ్ఞతలు.. ఏమని రాశారంటే..?
తమిళనాడు రాజకీయాల్లో ఒక నూతన శకం ఆరంభమైంది. దశాబ్దాల కాలంగా ద్రవిడ దిగ్గజాల నీడలో సాగిన రాష్ట్ర రాజకీయాలు, ఇప్పుడు ఒక సరికొత్త మలుపు తిరిగాయి. శాసనసభ ఎన్నికల ఫలితాలు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచాయి. ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ 108 స్థానాలను కైవసం చేసుకుని, అతిపెద్ద పార్టీగా అవతరించి చరిత్ర సృష్టించింది
- Balaraju Goud
- Updated on: May 5, 2026
- 6:25 pm
ముఖ్యమంత్రి ఎవరూ? బెంగాల్, అస్సాంలలో ముమ్మరమైన కసరత్తు.. రంగంలోకి దిగిన అగ్రనేతలు అమిత్ షా, నడ్డా
పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) సాధించిన అపూర్వ విజయం, ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేగవంతం చేసింది. ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానుల వరకు రాజకీయ సందడి నెలకొంది.
- Balaraju Goud
- Updated on: May 5, 2026
- 5:53 pm
Vijay TVK: విజయ్కి తల్లిగా, లవర్గా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడేమో..
సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా వెలిగిన హీరో విజయ్ దళపతి ఇప్పుడు రాజకీయల్లోనూ కింగ్ అయ్యారు. ఆయన నేతృత్వంలోని టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ప్రస్తుతమున్న ట్రెండ్స్ ను బట్టి సుమారు 110కు పైగా స్థానాల్లో విజయ్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది.
- Basha Shek
- Updated on: May 4, 2026
- 7:49 pm