AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికలు

ఎన్నికలు

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికలంటే ఓ పండుగ. ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రజల తరఫున చట్ట సభల్లో ప్రాతినిధ్యంవహించేందుకు నాయకులు పోటీపడుతారు. వీరిలో ఒకరిని తమ తరఫు నాయకుడిగా ఓటు వేసి ప్రజలు ఎన్నుకుంటారు. ఒకే అభ్యర్థి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు అతని ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. భారత్‌లో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగ సంస్థ భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. 1950 జనవరి 25న ఏర్పాటైన భారత ఎన్నికల కమిషన్ స్వతంత్ర వ్యవస్థ. సుప్రీంకోర్టులానే ప్రభుత్వ నియంత్రణ లేకుండా భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్‌లో భాగంగా పనిచేస్తుంది.

ప్రజా ప్రతినిధులను(లోక్‌సభ సభ్యులు) ఎన్నుకుని తద్వారా కేంద్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రతి ఐదు సంవత్సరాలకు నిర్వహించే ఎన్నికలను సాధారణ ఎన్నికలు(జనరల్ ఎలక్షన్) అంటారు. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాల శాసనసభలకు కూడా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఏ కారణం చేతైనా ఐదు సంవత్సరాలు కొనసాగని పక్షంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. లోక్‌సభతో పాటు అసెంబ్లీ పదవీకాలం పూర్తయిన రాష్ట్రాలకు రెండు ఎన్నికలను కలిపి జమిలి ఎన్నికలు నిర్వహిస్తారు.

సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు(ఈవీఎం) ద్వారా నిర్వహిస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని పరూర్ శాసనసభ నియోజకవర్గంలో 1982లో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారిగా ఈవీఎంలు వాడారు. ఈవీఎంలను భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేశాయి. విద్యుత్ సరఫరా లేని చోట్ల కూడా ఆల్కలైన్ బ్యాటరీ సాయంతో ఈవీఎంలు పనిచేస్తాయి. ఒక్కో ఈవీఎంలో 3,840 ఓట్లను నిక్షిప్తం చేసేందుకు వీలుంటుంది. పోలీలో 64 మంది అభ్యర్థుల కంటే తక్కువగా ఉంటేనే ఈవీఎంలు వినియోగిస్తారు. అభ్యర్థుల సంఖ్య దాని కంటే ఎక్కువగా ఉంటే మాత్రం బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.

ఎన్నికలలో ధన, కుల, కండ బలము ప్రాధాన్యత పెరుగుతోంది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేందుకు పలువురు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పలు చర్యలు తీసుకుంటోంది. భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపడుతూ దీన్ని కట్టడి చేస్తున్నారు. అయినా ఎన్నికల్లో డబ్బు ప్రభావం మరీ ఎక్కువగా ఉండటం పట్ల ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి

ఎన్డీఏ కూటమిలోకి విజయ్.. రంగంలోకి ఏపీ డిప్యూటీ సీఎం.. తమిళ నేతల క్లారిటీ ఇదే..!

టీవీకేను ఎన్డీఏలోకి చేర్చుకునేందుకు బీజేపీ మరోసారి ప్రయత్నిస్తోందనే పుకార్ల మధ్య పార్టీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. బీజేపీ లేదా ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకోకపోవడంపై విజయ్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇద్దరు సీనియర్ టీవీకే నాయకులు, ఏఐఏడీఎంకేతో సహా అనేక పార్టీలు తమను ముందే సంప్రదించాయని, కానీ వారి వైఖరి అలాగే ఉందని చెప్పారు.

రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల.. బరిలోకి జాతీయ అధ్యక్షులు నితిన్..!

భారతీయ జనతా పార్టీ తరుపున పోటీ చేసే రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్‌ను కూడా నిలబెట్టింది. బీహార్ నుండి రాజ్యసభకు నితిన్ నబిన్, శివేష్ రామ్‌లను నామినేట్ చేసింది. నామినేషన్లు దాఖలు చేయడానికి మార్చి 5 చివరి తేదీ. మార్చి 15న ఓటింగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాన్ని ప్రకటిస్తారు.

Errabelli Dayakar Rao: ఆరోజు అలా.. ఈరోజు ఇలా.. బోరున ఏడ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. వీడియో చూశారా..?

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.. మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక కూడా ముగిసింది. ఈ క్రమంలోనే.. ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి పెట్టారు. దీంతో మాజీమంత్రికి ఏమైంది. అన్న చర్చ టాక్‌ ఆఫ్‌ ది తెలంగాణగా మారింది. అసలు తొర్రూరులో గతంలో ఏం జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతోంది. మీకు తెలియాలా? అయితే ఈ స్టోరీ చూసేయండి..

Kothagudem: ఆటో డ్రైవర్ టు మేయర్.. కొత్తగూడెంలో ఎర్రజెండా సరికొత్త చరిత్ర.. ఎన్నో ట్విస్టుల తర్వాత..

అతనో సామాన్య ఆటో డ్రైవర్.. కట్ చేస్తే.. రాజకీయాల్లోకి అరంగ్రేటం.. బీఆర్ఎస్ పై అభిమానంతో.. 2019లో ఆ పార్టీ నుంచి ఎంపీటీసీగా పోటీ చేసి విజయం సాధించాడు.. ఆ తర్వాత.. 2023 లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమక్షంలో సీపీఐలో చేరి.. ఏకంగా కార్పోరేషన్ మేయర్ అయ్యాడు.

Telangana: ఇక ఉప్పు నిప్పుల్లేవ్..! మేయర్, ఛైర్మన్‌గిరి కోసం.. బద్ధ శత్రువుల మధ్య చిగురించిన ప్రేమలు!

ఇట్స్ మిరాకిల్. పొలిటికల్ సైన్స్‌లో ఇవో విచిత్రమైన సన్నివేశాలు. గతంలో చూసుంటారు.. బట్ అడపాదడపా. కాని, ఒకేసారి, ఒకేపూటలో ఇన్ని రాజకీయ వైచిత్రిలు చూడ్డం బహుశా మొదటిసారి అయి ఉంటుంది. ఉప్పు నిప్పులా ఉండే పార్టీలు.. వాళ్లని ఓడించండి, మాకే ఓటేయండని ప్రచారాల్లో సెగలు కక్కుకున్న పార్టీలు.. ఇలా కలిసిపోయి అధికారం పంచుకుంటాయని ఎవ్వరూ ఊహించరు.

Municipal Election: మున్సిపల్‌ ఛైర్మన్‌, మేయర్‌ ఎన్నికలపై ఎక్స్‌ అఫీషియోల ఎఫెక్ట్‌.. కీలక క్లారిటీ ఇచ్చిన ఎస్ఈసీ!

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డు స్థాయి ఫలితాలు వచ్చాక.. రాజకీయ పోరు ఇప్పుడు రెండో దశకు చేరింది. అంటే.. ఛైర్మన్‌, మేయర్‌ల పరోక్ష ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఎక్స్‌ అఫీషియో సభ్యుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫిబ్రవరి 16న పరోక్ష ఎన్నికలు నిర్వహించనుంది.

Telangana Municipal Election Results: ఒక్క ఓటు మ్యాజిక్‌.. అభ్యర్థుల జీవితాలనే మార్చేసింది..!

పంచాయతీ ఎన్నికల్లో పల్లె ఓటరు ఇచ్చిన తీర్పు చాలా క్లియర్‌కట్‌గా ఉంది. రూలింగ్ పార్టీకే జైకొట్టింది. నంబర్ల విషయంలో నో కన్‌ఫ్యూజన్. కానీ, పట్టణ ఓటరు మాత్రం పెద్ద పజిలే పెట్టేశాడు. ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం లేదు, అలాగని ఏ పార్టీనీ నిరుత్సాహపర్చలేదు మున్సిపల్ ఫలితం. ఓవరాల్‌గా పురపోరు ప్రశాంతంగా ముగిసింది. కొన్నిచోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. మరికొన్నిచోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్‌ఎస్.. ముక్కోణపు పోటీ నడిచింది.

కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో దుమ్మురేపిన కాంగ్రెస్.. చిట్యాలలో ప్రత్యేక విజయం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 2026లో కాంగ్రెస్ పార్టీ 800 వార్డులు దాటి భారీ ఆధిక్యాన్ని సాధించింది. నల్గొండ జిల్లా చిట్యాలలో, ట్రాన్స్‌జెండర్ స్వతంత్ర అభ్యర్థి కావేరి (సుధాకర్) వార్డు 1లో చారిత్రాత్మక విజయం సాధించారు, ఇది సమాజంలో మార్పునకు నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా 116 మునిసిపాలిటీలు, 7 మునిసిపల్ కార్పొరేషన్లకు జరిగిన కౌంటింగ్‌లో కాంగ్రెస్ హవా కొనసాగింది.

Nizamabad Corporation Election Result : నిజామాబాద్‌లో బీజేపీ హవా.. అర్వింద్ ఇలాకాలో అదరగొట్టిన కమలం పార్టీ..

తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం ఉదయం నుంచి వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకోగా.. ఆ తర్వాతి స్థానంలో బీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్, జిల్లాలోని మున్సిపాలిటీల ఫలితాల సరళిని ఇప్పుడు తెలుసుకుందాం.

Telangana Municipal Election Results: ఆ మున్సిపాలిటీల్లో హోరాహోరీ ఫైట్.. 9 చోట్ల హంగ్..

Telangana Municipal Poll Results: తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఫలితాలు వెలువడుతున్నాయి.. కొన్ని మున్సిపాలిటీల్లో పూర్తి ఫలితాలు వెలువడగా.. మరికొన్ని ప్రాంతాల్లో వెలువడాల్సి ఉంది.. తెలంగాణ మున్సిపాలిటీ, కార్పోరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ పోటీ ఇస్తోంది.

Bangladesh Election Result: బంగ్లాదేశ్ ఎన్నికల్లో BNP ఘన విజయం.. కనీవినీ ఎరుగని రీతిలో మెజారిటీ

బంగ్లాదేశ్ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ దేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఘన విజయాన్ని సాధించింది. ఆ పార్టీ అధినేత తారిక్ రెహమాన్ తదుపరి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) తన మాజీ మిత్రపక్షమైన జమాత్-ఇ-ఇస్లామీపై తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

Telangana Municipal Election Results: పెరిగిన పోలింగ్ శాతం.. కలిసొస్తుందని లెక్కలేసుకుంటున్న పార్టీలు

Telangana Municipal Poll Results 2026: ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం కూడా కౌంటింగ్‌పై ఆసక్తి పెరగడానికి మరో కారణం. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తంగా 70.26 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఇప్పుడు 73.01 శాతం ఓటింగ్ నమోదైంది. ఏడు కార్పొరేషన్లలో 66.05 శాతం పోలింగ్ నమోదైంది. 116 మున్సిపాలిటీల్లో 75.88 శాతం పోలింగ్ రికార్డ్ అయ్యింది.