AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికలు

ఎన్నికలు

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికలంటే ఓ పండుగ. ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రజల తరఫున చట్ట సభల్లో ప్రాతినిధ్యంవహించేందుకు నాయకులు పోటీపడుతారు. వీరిలో ఒకరిని తమ తరఫు నాయకుడిగా ఓటు వేసి ప్రజలు ఎన్నుకుంటారు. ఒకే అభ్యర్థి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు అతని ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. భారత్‌లో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగ సంస్థ భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. 1950 జనవరి 25న ఏర్పాటైన భారత ఎన్నికల కమిషన్ స్వతంత్ర వ్యవస్థ. సుప్రీంకోర్టులానే ప్రభుత్వ నియంత్రణ లేకుండా భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్‌లో భాగంగా పనిచేస్తుంది.

ప్రజా ప్రతినిధులను(లోక్‌సభ సభ్యులు) ఎన్నుకుని తద్వారా కేంద్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రతి ఐదు సంవత్సరాలకు నిర్వహించే ఎన్నికలను సాధారణ ఎన్నికలు(జనరల్ ఎలక్షన్) అంటారు. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాల శాసనసభలకు కూడా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఏ కారణం చేతైనా ఐదు సంవత్సరాలు కొనసాగని పక్షంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. లోక్‌సభతో పాటు అసెంబ్లీ పదవీకాలం పూర్తయిన రాష్ట్రాలకు రెండు ఎన్నికలను కలిపి జమిలి ఎన్నికలు నిర్వహిస్తారు.

సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు(ఈవీఎం) ద్వారా నిర్వహిస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని పరూర్ శాసనసభ నియోజకవర్గంలో 1982లో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారిగా ఈవీఎంలు వాడారు. ఈవీఎంలను భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేశాయి. విద్యుత్ సరఫరా లేని చోట్ల కూడా ఆల్కలైన్ బ్యాటరీ సాయంతో ఈవీఎంలు పనిచేస్తాయి. ఒక్కో ఈవీఎంలో 3,840 ఓట్లను నిక్షిప్తం చేసేందుకు వీలుంటుంది. పోలీలో 64 మంది అభ్యర్థుల కంటే తక్కువగా ఉంటేనే ఈవీఎంలు వినియోగిస్తారు. అభ్యర్థుల సంఖ్య దాని కంటే ఎక్కువగా ఉంటే మాత్రం బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.

ఎన్నికలలో ధన, కుల, కండ బలము ప్రాధాన్యత పెరుగుతోంది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేందుకు పలువురు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పలు చర్యలు తీసుకుంటోంది. భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపడుతూ దీన్ని కట్టడి చేస్తున్నారు. అయినా ఎన్నికల్లో డబ్బు ప్రభావం మరీ ఎక్కువగా ఉండటం పట్ల ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి

ఢిల్లీలో మరోసారి రెపరెపలాడిన కాషాయ జెండా.. ఒకే స్థానానికే పరిమితమైన కాంగ్రెస్

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హవా చూపించింది. 12 డివిజన్లకు జరిగిన ఉపఎన్నికల్లో 7 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. మిగతా ఐదు స్థానాల్లో మూడింటిని ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఒకటి కాంగ్రెస్‌ గెలుచుకోగా.. మరో స్థానంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి గెలుపొందారు. నవంబర్ 30న జరిగిన ఎన్నికల ఫలితాలను ఈరోజు (డిసెంబర్ 3న) ప్రకటించారు.

పల్లెల్లో ‘పంచాయతీ’ సందళ్లు.. ఊరుఊరంతా ఒకటే గుసగుస..! ఇంతకీ ఊరికి మొనగాడు ఎవరు?

సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు చోటు లేదు. తమ గ్రామాన్ని పాలించేందుకు.. తమలో ఒకరిని 'ప్రెసిడెంట్'ను చేసుకునేందుకు ప్రజలు ఎన్నుకునే ఎన్నిక ఇది. స్వపరిపాలనకు అసలైన అర్ధం ఈ సర్పంచ్ ఎన్నికలు. బట్.. ఇప్పుడా పరిస్థితి లేదనుకోండి. గ్రామాల్లో ఎవరు సర్పంచ్ అభ్యర్ధిగా నిలబడాలో శాసించేది ఆఖరికి రాజకీయ పార్టీలే అవుతున్నాయి. పోటీ చేయాలనుకున్న అభ్యర్ధుల కూడా రాజకీయ పార్టీల అండదండలు కోరుకుంటున్నారు. పార్టీల జోక్యం ఉంటోంది కాబట్టే ఎన్నికలు మరింత రంజుగా సాగుతున్నాయి. సో, ఊళ్లల్లో పైచేయి 'చేతి' గుర్తుదా, కారుదా, కమలమా, సుత్తికొడవలా, కంకి కొడవలా, పతంగినా.. ఎవరు బలపరిచిన అభ్యర్ధి గెలుస్తాడనే దానిపైనే ఇప్పుడు చర్చంతా జరుగుతోంది. ఇంతకీ.. గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితి ఎలా ఉంది?

Freebies in Elections: అదంతా ఓల్డ్ స్టైల్!.. ఇల్లు, బైకు, కారు లేటెస్ట్ వర్షన్.. మరో ‘ఫ్రీ’వార్..

ఓ వైపు ఈ ఎగ్జాంపుల్ కనిపిస్తున్నా సరే.. తమిళనాడులో మళ్లీ అవే ఉచిత పథకాలను అక్కడి నేతలు నమ్ముకోబోతున్నారు. ఇప్పటికే, దేశంలోనే ఎక్కువ ఉచిత పథకాలు అమలవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు అంతకు మించి తాయిలాలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

శరవేగంగా పంచాయతీ ఎన్నికల దిశగా అడుగులు.. రిజర్వేషన్ల లెక్కలు తేలేనా..?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా రంగం సిద్ధం చేస్తోంది. కేబినెట్ మీటింగ్ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాబోతోంది. రిజర్వేషన్ల వివాదాన్ని అధిగమించేలా ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లబోతోంది? అన్నదీ ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.

Bihar: 10వ సారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం.. ఏ పార్టీ నుండి ఎంతమంది మంత్రులు ఉన్నారంటే..?

బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఈరోజు గురువారం (నవంబర్ 20) కొలువుదీరనుంది. ముఖ్యమంత్రి పదవిపై నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది. బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ బాధ్యతలు చేపడతారు. ఆయన 10వసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీహార్‌కు 19వ ముఖ్యమంత్రి అవుతారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం పాట్నాలోని గాంధీ మైదానంలో జరుగుతుంది.

భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచే కుట్ర.. రాజ్యాంగబద్ధ సంస్థలపై విషపూరిత వ్యాఖ్యలు సముచితం కాదు..

భారతదేశ ప్రజాస్వామ్యం బలమైనదని.. దాని పునాది సంస్థలపై పెరుగుతున్న విషపూరిత వాక్చాతుర్యంతో నిరంతరం దాడికి గురవుతోందని పలువురు న్యాయమూర్తులు, రిటైర్డ్ రాయబారులు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, సాయుధ దళాల మాజీ అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. ఇవి భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచే కొత్త కుట్ర అంటూనే.. రాజ్యాంగబద్ధ సంస్థలపై విషపూరిత వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు పెరగడం సముచితం కాదంటూ గుర్తుచేశారు.

Bihar New CM: బీహార్ కొత్త ముఖ్యమంత్రిపై ఫుల్ క్లారిటీ.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి కీలక ప్రకటన..!

బీహార్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ కీలక ప్రకటన చేశారు. ఒక మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారని దిలీప్ జైస్వాల్ అన్నారు. ఆయనను నాయకుడిగా ఎన్నుకునే లాంఛనప్రాయ ప్రక్రియ మాత్రమే పూర్తి చేయాల్సి ఉందన్నారు.

Telangana local body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్‌ అప్‌డేట్.. ఎలక్షన్స్ ఎప్పుడంటే?

రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల అనిశ్చితికి త్వరలో తెరపడేలా కనిపిస్తోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను త్వరితగతిన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 17న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్‌లో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశంపైనే తుది నిర్ణయం వెలువడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

చిచ్చురాజేసిన ఓటమి.. కుటుంబం, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు లాలూ ప్రసాద్ కుమార్తె ప్రకటన!

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయ కుంపటి రాజేసింది. ముఖ్యంగా రాష్ట్రీయ జనతాదళ్ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో చీలిక ఏర్పడింది. లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య సోషల్ మీడియా సైట్ Xలో కుటుంబం నుండి విడిపోతున్నట్లు ప్రకటించారు. తాను వెళ్లిపోవడానికి కారణాలు ఏంటో కూడా కూడా మెల్లగా వివరించారు.

SIR టెన్షన్.. నెక్స్ట్ ఏం జరగనుంది..? బిహార్‌ ఫలితాలతో ఆ రాష్ట్రాల్లో ప్రకంపనలు..

S.I.R... స్పెషల్‌ ఇంటెన్సివ్ రివిజన్..! బిహార్ ఫలితాల తర్వాత ఇప్పుడు దీనిపైనే దేశవ్యాప్తంగా తెగ చర్చ జరుగుతోంది. SIR వల్లే ఓడిపోయామని మహాఘట్‌బంధన్‌ పదేపదే చెబుతుండటం... ఎన్నికల ముందు కూడా ఇదే అంశంపై రచ్చరచ్చ చేయడంతో నెక్ట్స్‌ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో టెన్షన్‌ నెలకొంది. మరీ S.I.Rతో నిజంగానే అన్యాయం జరుగుతోందా..? పార్టీల ఆందోళనల్లో వాస్తవమెంత..?