ఎన్నికలు

ఎన్నికలు

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికలంటే ఓ పండుగ. ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రజల తరఫున చట్ట సభల్లో ప్రాతినిధ్యంవహించేందుకు నాయకులు పోటీపడుతారు. వీరిలో ఒకరిని తమ తరఫు నాయకుడిగా ఓటు వేసి ప్రజలు ఎన్నుకుంటారు. ఒకే అభ్యర్థి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు అతని ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. భారత్‌లో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగ సంస్థ భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. 1950 జనవరి 25న ఏర్పాటైన భారత ఎన్నికల కమిషన్ స్వతంత్ర వ్యవస్థ. సుప్రీంకోర్టులానే ప్రభుత్వ నియంత్రణ లేకుండా భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్‌లో భాగంగా పనిచేస్తుంది.

ప్రజా ప్రతినిధులను(లోక్‌సభ సభ్యులు) ఎన్నుకుని తద్వారా కేంద్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రతి ఐదు సంవత్సరాలకు నిర్వహించే ఎన్నికలను సాధారణ ఎన్నికలు(జనరల్ ఎలక్షన్) అంటారు. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాల శాసనసభలకు కూడా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఏ కారణం చేతైనా ఐదు సంవత్సరాలు కొనసాగని పక్షంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. లోక్‌సభతో పాటు అసెంబ్లీ పదవీకాలం పూర్తయిన రాష్ట్రాలకు రెండు ఎన్నికలను కలిపి జమిలి ఎన్నికలు నిర్వహిస్తారు.

సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు(ఈవీఎం) ద్వారా నిర్వహిస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని పరూర్ శాసనసభ నియోజకవర్గంలో 1982లో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారిగా ఈవీఎంలు వాడారు. ఈవీఎంలను భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేశాయి. విద్యుత్ సరఫరా లేని చోట్ల కూడా ఆల్కలైన్ బ్యాటరీ సాయంతో ఈవీఎంలు పనిచేస్తాయి. ఒక్కో ఈవీఎంలో 3,840 ఓట్లను నిక్షిప్తం చేసేందుకు వీలుంటుంది. పోలీలో 64 మంది అభ్యర్థుల కంటే తక్కువగా ఉంటేనే ఈవీఎంలు వినియోగిస్తారు. అభ్యర్థుల సంఖ్య దాని కంటే ఎక్కువగా ఉంటే మాత్రం బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.

ఎన్నికలలో ధన, కుల, కండ బలము ప్రాధాన్యత పెరుగుతోంది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేందుకు పలువురు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పలు చర్యలు తీసుకుంటోంది. భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపడుతూ దీన్ని కట్టడి చేస్తున్నారు. అయినా ఎన్నికల్లో డబ్బు ప్రభావం మరీ ఎక్కువగా ఉండటం పట్ల ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి

Lok Sabha Elections 2024: మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..

ఇప్పటికే 2 విడతల పోలింగ్ ముగించుకున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో.. మూడో పోలింగ్ కోసం ఏర్పాటు చకచకా సాగుతున్నాయి. మంగళవారం (మే 7న) 13 రాష్ట్రాల్లో 94 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, అస్సాం, గుజరాత్, పశ్చిమ బెంగాల్ సహా మొత్తం 13 రాష్ట్రాలున్నాయి. భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్‌ నేతృత్వంలోని I.N.D.I.A కూటమి మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది.

Telangana: బీజేపీ అభ్యర్థిని భయపెడుతున్న ఓటింగ్ మెషీన్.. అసలు విషయం తెలిస్తే షాక్..

చేవెళ్ళ బీజేపీ ఎంపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. 5 అంకె ఆయనికి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. నిజానికి 5ను బ్యాడ్ సెంటిమెంట్‌గా పరిగణించరు. అయినా కానీ ఆయన ఇబ్బంది పడటానికి కారణం.. తన లాంటి పేరు ఉన్న మరో అభ్యర్ధి కూడా చేవెళ్ళ ఎంపీగా పోటీ చేస్తున్నారు. దీంతో కొండా తెగ మదనపడుతున్నారు. ఈయన ఇటీవల ప్రచారానికి వెళ్లిన సందర్భంలో.. డమ్మీ ఈవీఎం మెషీన్ చూపించగానే.. అందులో 5 నెంబర్‌లో కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు ఉంది. అక్కడే బటన్ నొక్కుతాం అని కొందరు అంటున్నారట.

Watch Video: దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని మోదీ విమర్శలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్

ప్రధానమంత్రి అండ్‌ 5 ఎడిటర్స్‌ టీవీ9 ప్రోగ్రాంలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు చేశారు. అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ వస్తాయన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనను బడే భాయ్ అంటున్నారన్న మోదీ.. పెద్దల నుంచి మంచి విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో డబులార్ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు.

Telangana: లోక్‌సభ ఎన్నికల వేళ.. కమలదళం ఎంపీపై కాంగ్రెస్ అగ్రజుడి ప్రేమాభిమానాల.. మతలబేంటో..?

ఆయన ప్రతిపక్ష పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ.. ఆదివాసీ ఉద్యమ నేత.. నిన్నమొన్నటి వరకు ఉద్యమాల్లో దూకుడుగా వ్యవహరించి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, గెలిచి నిలిచిన నాయకుడు. కానీ ఐదేళ్ల కాలంలోనే ఆ చరిష్మా ఒక్కసారిగా మాయమై చివరికి సిట్టింగ్ సీటును కూడా దక్కించుకోలేని పరిస్థితి ఆయనకి ఎదురైంది.

Andhra Pradesh: అర్హత ఉన్నప్పటికీ హోం ఓటింగ్ వేసేందుకు ముందుకు రాని ఓట‌ర్లు.. కారణం అదేనా..!

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నిక‌ల‌కు గ‌డువు ముంచుకొస్తుంది. ఎన్నిక‌ల షెడ్యూల్ ప్రకారం ఈసీ అధికారులు ఒక్కొక్కటిగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు...ఇప్పటికే తుది ఓట‌ర్ల జాబితా విడుద‌ల చేయ‌డంతో పాటు నామినేష‌న్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఇక పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు.

  • MP Rao
  • Updated on: May 3, 2024
  • 1:55 pm

Congress Manifesto: హైదరాబాద్‌కు జాతీయ సంస్థలు, పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా.. కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే!

కేంద్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 6 హామీల మంత్రం ఫలించడంతో ఈసారి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన హామీలపై రాజకీయ వర్గాలు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

PM Modi: భయపడ్డారు.. పారిపోయారు.. రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ, టీఎంసీతోపాటు కాంగ్రెస్ నేత రాహుల్ టార్గెట్ చేస్తూ ఘాటుగా విమర్శించారు. బెంగాల్‌లో హిందువులు సురక్షితంగా లేరని ప్రధాని మోదీ అన్నారు.

PM Modi: ప్రత్యేక శైలితో ప్రజా రాజకీయ నాయకుల హృదయాలను గెలుచుకుంటున్న నరేంద్ర మోదీ

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి సంబంధించి బీజేపీ నేతలు పలు వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇప్పుడు మాజీ బిజూ జనతా దళ్ నాయకుడు మరియు ఎంపీ భర్తృహరి మహతాబ్ ఒక వీడియోను పంచుకున్నారు. చాలా మంది ప్రతిపక్ష నేతలు కూడా ప్రధాని మోదీని సంరక్షకుడిగా వ్యవహరిస్తున్నారని ఇందులో ఆయన చెప్పారు.

Hyper Aadi: నేను పిఠాపురంలో ఎందుకు పుట్టలేదని బాధపడుతున్నా: హైపర్‌ ఆది

వైసీపీ నేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై విమర్శల దాడికి దిగుతున్నాడు. గురువారం పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆది ప్రచారం నిర్వహించారు. దుర్గాడ గ్రామంలో రోడ్‌ షోలో పాల్గొన్న ఆది సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించాడు. ఇంట్లోనే మంచి చేయనివాడు జనాలకు ఏం చేస్తాడంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ చెల్లెలు షర్మిల, సునీత గుర్తించి రోడ్‌ షోలో..

Amit Shah Fake Video: అమిత్ షా నకిలీ వీడియో సృష్టి తెలంగాణలోనే.. తేల్చిన ఢిల్లీ పోలీసులు!

రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేయని వ్యాఖ్యలను చేసినట్టుగా ఎడిట్ చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేసిన వీడియో సృష్టించింది తెలంగాణలోనేనని తేలింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ (IFSO Unit) ఐపీ అడ్రస్ ఆధారంగా వీడియో సృష్టించిన ప్రదేశం తెలంగాణలోనే ఉందని గుర్తించింది.

CM YS Jagan: వైసీపీ త్రిశూల వ్యూహం.. గెలుపు కోసం అభ్యర్థుల ప్రచారం.. వాళ్ల కోసం జగన్ ప్రచారం

రెండోసారి అధికారమే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ దూకుడుగా వెళ్తోంది. అభ్యర్థులు తమ గెలుపు కోసం వాళ్లు కష్టపడుతున్నారు. వాళ్లను గెలిపించడం కోసం అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టపడుతున్నారు. జగన్‌ కోసం తాము సైతం అంటూ కొత్తగా వీళ్లు రంగంలోకి దిగారు.

KCR Tour: నిషేధం తర్వాత జనంలోకి కేసీఆర్… పద్దతిగా మారేనా? మరింతగా డోసు పెంచుతారా ?

48 గంటల నిషేధం తర్వాత ఇవాళ మళ్లీ ప్రచారం నిర్వహించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌. అయితే ఇకపై పద్దతిగా మాట్లాడతారా? లేక మరింతగా మాటల డోసు పెంచుతారా ? అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు కేసీఆర్‌ ప్రచారం చేయకుండా 48 గంటల బ్యాన్‌ విధించడం బీజేపీ, కాంగ్రెస్‌ కుట్ర అంటున్నారు బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు

Modi on Third Front: కేసీఆర్ థర్డ్‌ ఫ్రంట్‌ డైలాగ్‌కి మోదీ కౌంటర్.. కేసీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి..?

ఆప్షన్‌1, ఆప్షన్2, ఆప్షన్3 అంటూ నేషనల్ పాలిటిక్స్‌లో తన ఫ్యూచర్‌ని వెతుక్కుంటున్నారు గులాబీ దళపతి కేసీఆర్. కానీ.. ఫస్ట్ ఆప్షన్‌కి నో చెప్పేశారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇప్పుడు సెకండ్ ఆప్షన్‌ని కూడా తిరగ్గొట్టేశారు ప్రధాని నరేంద్ర మోదీ. టీవీ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో కేసీఆర్ పొలిటికల్ ఫ్యూచర్‌పై ప్రధాని మోద క్లారిటీ ఇచ్చేశారు.

Congress List: రాయ్‌బరేలీ నుండి రాహుల్ గాంధీ, అమేథీ నుండి కేఎల్ శర్మ.. మరోసారి పోటీకి దూరంగా ప్రియాంక గాంధీ

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ ఈరోజు అభ్యర్థులను ఖరారు చేసింది. నామినేషన్ల దాఖలు ముగియడానికి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఎట్టకేలకు రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ అభ్యర్థిగా పేరును ప్రకటించిన ఏఐసీసీ, అమేఠీ నుంచి పోటీలో కిషోర్ లాల్ శర్మ పేరును ఖరారు చేసింది.

PM Modi Exclusive Interview Highlights: నమ్మకం విశ్వాసంగా మారింది.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై మోదీ మనోగతం ఇదే..

PM Narendra Modi Exclusive Interview Highlights at TV9 Telugu: 2014లో ప్రజలకు తనపై ఉన్న నమ్మకం 2019 నాటికి విశ్వాసంగా మారిపోయిందని, 2024 వచ్చేసరికి ఆ విశ్వాసం గ్యారెంటీగా మారిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పదేళ్ల పాలనా అనుభవంతో ఏది సాధ్యమో, ఏది అసాధ్యమో తనకు స్పష్టంగా తెలిసిందని టీవీ9 నెట్‌వర్క్‌ ఫైవ్‌ ఎడిటర్స్‌ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ తెలిపారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?