ఎన్నికలు
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికలంటే ఓ పండుగ. ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రజల తరఫున చట్ట సభల్లో ప్రాతినిధ్యంవహించేందుకు నాయకులు పోటీపడుతారు. వీరిలో ఒకరిని తమ తరఫు నాయకుడిగా ఓటు వేసి ప్రజలు ఎన్నుకుంటారు. ఒకే అభ్యర్థి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు అతని ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. భారత్లో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగ సంస్థ భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. 1950 జనవరి 25న ఏర్పాటైన భారత ఎన్నికల కమిషన్ స్వతంత్ర వ్యవస్థ. సుప్రీంకోర్టులానే ప్రభుత్వ నియంత్రణ లేకుండా భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్లో భాగంగా పనిచేస్తుంది.
ప్రజా ప్రతినిధులను(లోక్సభ సభ్యులు) ఎన్నుకుని తద్వారా కేంద్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రతి ఐదు సంవత్సరాలకు నిర్వహించే ఎన్నికలను సాధారణ ఎన్నికలు(జనరల్ ఎలక్షన్) అంటారు. దేశంలోని మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాల శాసనసభలకు కూడా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఏ కారణం చేతైనా ఐదు సంవత్సరాలు కొనసాగని పక్షంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. లోక్సభతో పాటు అసెంబ్లీ పదవీకాలం పూర్తయిన రాష్ట్రాలకు రెండు ఎన్నికలను కలిపి జమిలి ఎన్నికలు నిర్వహిస్తారు.
సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు(ఈవీఎం) ద్వారా నిర్వహిస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని పరూర్ శాసనసభ నియోజకవర్గంలో 1982లో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారిగా ఈవీఎంలు వాడారు. ఈవీఎంలను భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేశాయి. విద్యుత్ సరఫరా లేని చోట్ల కూడా ఆల్కలైన్ బ్యాటరీ సాయంతో ఈవీఎంలు పనిచేస్తాయి. ఒక్కో ఈవీఎంలో 3,840 ఓట్లను నిక్షిప్తం చేసేందుకు వీలుంటుంది. పోలీలో 64 మంది అభ్యర్థుల కంటే తక్కువగా ఉంటేనే ఈవీఎంలు వినియోగిస్తారు. అభ్యర్థుల సంఖ్య దాని కంటే ఎక్కువగా ఉంటే మాత్రం బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.
ఎన్నికలలో ధన, కుల, కండ బలము ప్రాధాన్యత పెరుగుతోంది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేందుకు పలువురు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పలు చర్యలు తీసుకుంటోంది. భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపడుతూ దీన్ని కట్టడి చేస్తున్నారు. అయినా ఎన్నికల్లో డబ్బు ప్రభావం మరీ ఎక్కువగా ఉండటం పట్ల ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బెంగాల్ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం.. వాహనాల రాకపోకలపై కఠిన ఆంక్షలు..!
మరికొన్ని గంటల్లో ఎన్నికలు జరగబోయే బెంగాల్పై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా టూ వీలర్ రాకపోకలపై ఎన్నికల కమిషన్ కీలక ఆంక్షలు విధించింది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ గతంలో ఎన్నడూ లేని విధంగా భద్రతా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో టూ వీలర్ రాకపోకలపై ఎన్నికల కమిషన్ కీలక ఆంక్షలు విధించింది.
- Balaraju Goud
- Updated on: Apr 22, 2026
- 8:03 am
కేసులు వలయంలో చిక్కుకుపోయిన దళపతి.. రాజకీయ రణక్షేత్రంలో నెగ్గుకొచ్చేనా..?
తమిళ రాజకీయాల్లో 'దళపతి' విజయ్ ఎంట్రీ ఒక సంచలనం. వెండితెరపై అప్రతిహత విజయాలతో దూసుకెళ్లిన ఆయన, రాజకీయ రణక్షేత్రంలోకి అడుగుపెట్టగానే అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలో నాయకులు ప్రజల మధ్య ఉండాలి, కానీ విజయ్ మాత్రం ఇప్పుడు ప్రజా క్షేత్రం కంటే న్యాయస్థానాల చుట్టూనే ఎక్కువగా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
- Balaraju Goud
- Updated on: Apr 21, 2026
- 8:02 am
మరోసారి వార్తల్లో స్మగ్లర్ వీరప్పన్ ఫ్యామిలీ.. అసెంబ్లీ బరిలో భార్య, కూతురు.. మామూలు ట్విస్ట్ కాదుగా..
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 36 సంవత్సరాల పాటు పట్టు పడకుండా తప్పించుకుని తిరిగిన మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ వీరప్పన్ కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది.. వీరప్పన్ భార్య పెద్ద కుమార్తె ఇద్దరు తమిళనాడు ఎన్నికల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే తల్లీ కూతుర్లు వీరిద్దరూ వేరువేరు పార్టీల్లో పోటీ చేస్తుండటం.. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ వీరప్పన్ భార్య.. పెద్ద కుమార్తె పోటీ చేస్తున్న నియోజకవర్గాలు ఎక్కడున్నాయి.. ఏయే పార్టీల నుంచి పోటీ చేస్తున్నారో తెలుసుకుందాం..
- Ch Murali
- Updated on: Apr 18, 2026
- 5:25 pm
అప్పుడిలా.. ఇప్పుడిలా.. ఎన్నికలకు ముందు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కు షాక్..!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరో వారం రోజుల్లో జరగనున్నాయి.. ప్రధాన పార్టీలు డీఎంకే-కాంగ్రెస్, ఏఐడీఎంకే-బీజేపీ కూటమి సహా.. పలు పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు.. ఈ క్రమంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కు షాక్ తగిలింది. ఎన్నికల సమీపిస్తున్న వేళ గత ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్లో ఆస్తులను దాచిపెట్టారనన్న ఆరోపణలతో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
- Ch Murali
- Updated on: Apr 15, 2026
- 1:01 pm
రీల్ హీరో.. రియల్ పాలిటిక్స్.. ఎన్నికల వేళ రాజకీయ దుమారం రేపుతోన్న ‘TN 2026’..!
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయాలు హెటెక్కాయి. ప్రస్తుతం సినిమా సెటైర్లు, రాజకీయ విమర్శలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన వేళ, ఆయనను లక్ష్యంగా చేసుకుని తీసినట్లుగా భావిస్తున్న 'TN 2026' (తంగ నక్షత్రం 2026) అనే సినిమా ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
- Ch Murali
- Updated on: Apr 14, 2026
- 3:48 pm
“చొరబాటుదారులు సామాను సర్దుకోండి.. అక్రమార్కులను వదిలిపెట్టబోము” : ప్రధాని మోదీ
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ సందడి పెరుగుతోంది. శనివారం (ఏప్రిల్ 11) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కట్వా నుండి బెంగాల్ ప్రజల మనోభావాలను వివరిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. తన వెనుక ఉన్న జనసమూహాన్ని చూపిస్తూ, "దేశవాసులారా, మీరు బెంగాల్ ప్రజల మనోభావాలను చూడవచ్చు" అని ఆయన అన్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 11, 2026
- 9:48 pm
రైతుల జీవనాధారంపై టీఎంసీ ప్రభుత్వం దెబ్బ కొట్టింది.. మమతాపై మండిపడ్డ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
రైతుల జీవనాధారంపై టీఎంసీ ప్రభుత్వం క్రూరమైన దాడి చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు. మమతా బెనర్జీ ప్రభుత్వం అహంకారంతో అన్నదాతలకు అన్యాయం చేస్తన్నారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర మార్కెట్ల తలుపులను బెంగాల్ రైతులకు మూసివేశారని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు.
- Balaraju Goud
- Updated on: Apr 11, 2026
- 5:39 pm
అందరికీ సమాన అవకాశాలు, ఒకే చట్టం.. బెంగాల్లో యూసీసీని అమలు చేసి తీరుతామన్న అమిత్ షా
బెంగాల్లోని చట్టానా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఒక ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ అవినీతి కారణంగా అవకాశాలు కోల్పోయిన యువతకు బీజేపీ వయో సడలింపు కల్పిస్తుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామన్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 11, 2026
- 4:21 pm
తమిళనాట విజయ్ చరిత్ర తిరగరాస్తారా.. డీఎంకే, అన్నా డీఎంకేకు షాక్ తప్పదా..?
తమిళనాట టీవీకే పార్టీ ఎఫెక్ట్ రెండు ప్రధాన పార్టీలకు గట్టిగానే తగిలేట్టు ఉంది. తొలిసారి బరిలో ఉన్న దళపతి విజయ్కు ఏమాత్రం కలిసి వస్తుంది అన్నది అలా ఉంచితే, ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకేలకు మాత్రం గట్టి దెబ్బ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సర్వేలు తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పు తప్పదని సూచిస్తున్నాయి.
- Ch Murali
- Updated on: Apr 10, 2026
- 10:14 pm
నిరంకుశ ప్రభుత్వం కూలబోతోంది.. అభివృద్ధి చెందిన బెంగాల్ను నిర్మిస్తాంః ప్రధాని మోదీ
బెంగాల్లో బీజేపీ ప్రభంజనం వీస్తోందని, భవానీపూర్లో పరిస్థితి నందిగ్రామ్ మాదిరిగానే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నిరంకుశ ప్రభుత్వం కూలబోతోందని, బెంగాల్ మార్పు బాటలో పయనిస్తోందని, ఈ ఎన్నికలు అభివృద్ధి చెందిన బెంగాల్ను నిర్మించబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు. బెంగాల్ వ్యాప్తంగా మార్పుల తుఫాను వీస్తోందని ప్రధానమంత్రి అన్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 9, 2026
- 3:27 pm
తొలిసారి ఎన్నికల్లో పోటీ.. వివాదరహితుడు, క్లీన్ ఇమేజ్తో ఉన్న దళపతిపై ఇన్ని కేసులా..?
2026 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ సంచలన విషయం బయటపెట్టారు. తనపై రెండు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు తాజా అఫిడవిట్లో స్వయంగా ప్రకటించారు. తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీని స్థాపించి రాజకీయాల్లో వేగం పెంచిన ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Apr 7, 2026
- 7:16 pm
తమిళనాడు ఎన్నికల బరిలో అత్యంత ధనవంతురాలు.. ఆమె అస్తులు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
సాధారణంగా సినిమా వాళ్ల గురించి వాళ్ళ ఆస్తులు.. రెమ్యునేషన్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అలాగే ఎన్నికల సమయంలో పోటీలో నిలిచే అభ్యర్థులు ఆస్తులు గురించి సైతం అంతే ఆసక్తి ఇటీవల కాలంలో పెరిగింది. తాజాగా తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా లాల్ గుడి నియోజకవర్గం నుచి ఓ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి ఆస్తి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
- Ch Murali
- Updated on: Apr 7, 2026
- 5:33 pm