ఎన్నికలు
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికలంటే ఓ పండుగ. ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రజల తరఫున చట్ట సభల్లో ప్రాతినిధ్యంవహించేందుకు నాయకులు పోటీపడుతారు. వీరిలో ఒకరిని తమ తరఫు నాయకుడిగా ఓటు వేసి ప్రజలు ఎన్నుకుంటారు. ఒకే అభ్యర్థి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు అతని ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. భారత్లో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగ సంస్థ భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. 1950 జనవరి 25న ఏర్పాటైన భారత ఎన్నికల కమిషన్ స్వతంత్ర వ్యవస్థ. సుప్రీంకోర్టులానే ప్రభుత్వ నియంత్రణ లేకుండా భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్లో భాగంగా పనిచేస్తుంది.
ప్రజా ప్రతినిధులను(లోక్సభ సభ్యులు) ఎన్నుకుని తద్వారా కేంద్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రతి ఐదు సంవత్సరాలకు నిర్వహించే ఎన్నికలను సాధారణ ఎన్నికలు(జనరల్ ఎలక్షన్) అంటారు. దేశంలోని మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాల శాసనసభలకు కూడా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఏ కారణం చేతైనా ఐదు సంవత్సరాలు కొనసాగని పక్షంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. లోక్సభతో పాటు అసెంబ్లీ పదవీకాలం పూర్తయిన రాష్ట్రాలకు రెండు ఎన్నికలను కలిపి జమిలి ఎన్నికలు నిర్వహిస్తారు.
సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు(ఈవీఎం) ద్వారా నిర్వహిస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని పరూర్ శాసనసభ నియోజకవర్గంలో 1982లో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారిగా ఈవీఎంలు వాడారు. ఈవీఎంలను భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేశాయి. విద్యుత్ సరఫరా లేని చోట్ల కూడా ఆల్కలైన్ బ్యాటరీ సాయంతో ఈవీఎంలు పనిచేస్తాయి. ఒక్కో ఈవీఎంలో 3,840 ఓట్లను నిక్షిప్తం చేసేందుకు వీలుంటుంది. పోలీలో 64 మంది అభ్యర్థుల కంటే తక్కువగా ఉంటేనే ఈవీఎంలు వినియోగిస్తారు. అభ్యర్థుల సంఖ్య దాని కంటే ఎక్కువగా ఉంటే మాత్రం బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.
ఎన్నికలలో ధన, కుల, కండ బలము ప్రాధాన్యత పెరుగుతోంది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేందుకు పలువురు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పలు చర్యలు తీసుకుంటోంది. భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపడుతూ దీన్ని కట్టడి చేస్తున్నారు. అయినా ఎన్నికల్లో డబ్బు ప్రభావం మరీ ఎక్కువగా ఉండటం పట్ల ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Telangana: ఎన్నికల బరిలోకి కేసీఆర్ కూతురు.. సింహం గుర్తుతోరంగంలోకి.. పోటీ ఎక్కడినుంచంటే?
భారత రాష్ట్ర సమితితో తెగదెంపులు చేసుకొని బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్సీ కేసీర్ కుమార్తె కవిత వచ్చే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.అయితే తన సొంత రాజకీయ పార్టీ అయిన జాగ్రృతి పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో.. ఈ ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కలిపి పోటీ చేసేలా ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉన్నారు. అన్ని సెట్ అయితే ఈ పార్టీ గుర్తుపైనే కవిత ఎన్నికల బరిలోకి దిగనున్నారు.
- Rakesh Reddy Ch
- Updated on: Jan 24, 2026
- 2:31 pm
తమిళనాడు స్వేచ్ఛ, మార్పును కోరుకుంటోంది.. డీఎంకేకు కౌంట్డౌన్ ప్రారంభంః ప్రధాని మోదీ
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయాలు ఉపందుకున్నాయి. ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనే మధురాంతకంలో నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈసందర్భంగా డీఎంకే పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా విమర్శించారు.
- Balaraju Goud
- Updated on: Jan 23, 2026
- 5:14 pm
బ్యాలెట్ పేపర్ తోనే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. ఎన్నికలు ఎప్పుడంటే..?
తెలంగాణ రాష్ట్రం మున్సిపల్ ఎన్నికల సంగ్రామానికి రెడీ అయింది. ఫిబ్రవరి 15వ తేదీ లోపు మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘాకి ప్రభుత్వం లేఖ రాసింది. ఇక ఎన్నికల సంఘం అధికారులు షెడ్యూల్ ఫిక్స్ చేయనున్నారు. ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Jan 21, 2026
- 7:00 pm
27 ఏళ్ల థాకరే కుటుంబం కోట బద్దలైంది… BMCలో బీజేపీ-శివసేన అజేయమైన విక్టరీ
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. దీంతో ఆసియాలోనే అత్యంత సంపన్నమైన మున్సిపల్ సంస్థపై థాకరే కుటుంబం దీర్ఘకాలంగా కొనసాగిన ఆధిపత్యానికి ముగింపు పలికింది. ఇప్పుడు, చాలా కాలం తర్వాత, ముంబైకి బీజేపీ-శివసేన (షిండే వర్గం) నుండి మేయర్ రానున్నారు.
- Balaraju Goud
- Updated on: Jan 17, 2026
- 7:43 am
ఏ క్షణానైన మోగనున్న మున్సిపల్ ఎన్నికల నగారా.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి..!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగబోతోంది. ఈ నేపథ్యంలో క్వార్టర్ ఫైనల్స్ కొట్టాం, రేపటిరోజున సెమీఫైనల్స్ కూడా కొట్టబోతున్నాం.. అని మున్సిపల్ పోరుపై ఆశాజనకంగా ఉంది హస్తం పార్టీ. మొత్తం 117 మున్సిపాలిటీలు.. 6 కార్పొరేషన్లు. 52 లక్షలకు పైగా ఉన్న పట్టణ ఓటర్లే టార్గెట్గా ఇవాళ్టి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన సాగనుంది.
- Balaraju Goud
- Updated on: Jan 16, 2026
- 7:12 am
BMCతో సహా 29 మునిసిపాలిటీలకు ఎన్నికలు.. ఓటేసుందుకు బారులు తీరిన జనం!
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో సహా మహారాష్ట్రలోని 29 మునిసిపల్ సంస్థల ఎన్నికలకు ఓటింగ్ జరుగుతోంది. గురువారం, జనవరి 15న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రముఖ రాజకీయ నాయకులు, నటులు, ప్రజలు తమ ఓటు వేయడానికి క్యూలో ఉన్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్లకూ ఎన్నికలు జరుగుతున్నాయి.
- Balaraju Goud
- Updated on: Jan 15, 2026
- 10:04 am
తెలంగాణలో పోటీకి సై అంటోన్న జససేనా.. మరీ.. ఫ్రెండ్లీ పార్టీ ముఖచిత్రం ఏంటి..?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన..తెలంగాణలోనూ పోటీకి సై అంటోంది. రానున్న స్థానిక ఎన్నికల్లో బరిలోకి దిగుతామని ప్రకటించిన గ్లాస్ పార్టీ.. అందుకు కార్యాచరణ కూడా స్టార్ట్ చేసినట్టు స్పష్టం చేసింది. మరి జనసేన ప్రకటనతో.. ఫ్రెండ్లీ పార్టీ బీజేపీ ముఖచిత్రం ఏంటి..? ఆంధ్రాలో మిత్రులు.. తెలంగాణలోనూ కలిసి పోటీ చేస్తారా..? లేక మీకు మీరే..మాకు మేమే అంటారా..?
- Balaraju Goud
- Updated on: Jan 11, 2026
- 7:43 am
వంశపారంపర్య రాజకీయాలను అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది: అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడు డీఎంకే పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు పర్యటనలో భాగంగా అమిత్ షా ఆదివారం పుదుక్కోట్టైలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై దాడి చేసిన ఆయన, ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 ఏప్రిల్లో తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు.
- Balaraju Goud
- Updated on: Jan 4, 2026
- 9:39 pm
Telangana: 70 ఏళ్లుగా సర్పంచ్ ఎన్నికలకు ఓటు వేయని గ్రామస్తులు.. ఎట్టకేలకు నెరవేరిన ఓటర్ల కల..!
ఆ ఊరు ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికల కోసం ఓటేసింది. సర్పంచ్ను ఎన్నుకోవాలనుకున్న ఆ ఊరి ఓటర్ల కల 70 ఏళ్లకు నెరవేరింది. ఎమ్మెల్యే, ఎంపీ సహా ఇతర ఎన్నికలకు ఓటు వేసినా.. ఇప్పటివరకు సర్పంచ్ ఎన్నికలకు దూరంగా ఉన్న ఆ గ్రామ ఓటర్లు.. ఈ సారి జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా సర్పంచ్ను ఎన్నుకోవడం ఓ విశేషం.
- Naresh Gollana
- Updated on: Dec 17, 2025
- 7:47 pm
ఆ గ్రామంలో 70 ఏళ్ల తర్వాత పంచాయతీ పోరు.. తొలిసారి ఓటేస్తున్న ప్రజలు.. ఎక్కడంటే?
ఆ గ్రామంలో ఏడు దశాబ్దాలుగా అసలు సర్పంచ్ ఎన్నికల ముచ్చటే లేదు. పంచాయితీ ఎన్నికల్లో ఆ ఊరు ఓటు వేసిన దాఖలాలే లేవు. 70 ఏళ్లు దాటినా స్థానిక ఎన్నికల్లో చేతికి సిరా చుక్క తాకలేదు. కానీ చరిత్రను తిరగ రాస్తూ 7 దశాబ్దాల తర్వాత తొలిసారి పంచాయితీ ఎన్నికలను చూసింది ఆ గ్రామం. ఇంతకు ఆ గ్రామం ఏంది.. అక్కడ ఇన్నాళ్లు ఎందుకు ఎన్నికలు జరగలేదో తెలుసుకుందాం పదండి.
- Naresh Gollana
- Updated on: Dec 17, 2025
- 1:55 pm
Telangana Panchayat Elections 2025 Live: కొనసాగుతున్న మూడో విడత పంచాయతీ ఎన్నికలు పోలింగ్! పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన ఓటర్లు
Telangana Panchayat Polls 2025 Live Updates :తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయాన్ని పోలింగ్ కేంద్రాలకు భారీగా చేరుకుంటున్నారు ఓటర్లు.. పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి త్వరగా స్వగ్రామాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు అధికారులు.
- Anand T
- Updated on: Dec 17, 2025
- 1:32 pm
సర్పంచ్ ఎన్నికల్లో అభిమానం చాటుకున్న గ్రామస్తులు.. చనిపోయినా సరే గెలిపించారు..!
రంగారెడ్డి జిల్లాలో విషాదం మధ్య ప్రజాస్వామ్య ఘట్టం చోటుచేసుకుంది. శంకర్పల్లి మండలం మాసానిగూడ గ్రామ పంచాయతీ 8వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన పల్లె లత (42) ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దీంతో కుటుంబసభ్యులు, మద్దతుదారులు శోకసంద్రంలో మునిగిపోయారు. అభ్యర్థి మృతితో గ్రామంలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా విషాదంగా మారింది.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Dec 14, 2025
- 9:12 pm