
ఎన్నికలు
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికలంటే ఓ పండుగ. ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రజల తరఫున చట్ట సభల్లో ప్రాతినిధ్యంవహించేందుకు నాయకులు పోటీపడుతారు. వీరిలో ఒకరిని తమ తరఫు నాయకుడిగా ఓటు వేసి ప్రజలు ఎన్నుకుంటారు. ఒకే అభ్యర్థి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు అతని ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. భారత్లో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగ సంస్థ భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. 1950 జనవరి 25న ఏర్పాటైన భారత ఎన్నికల కమిషన్ స్వతంత్ర వ్యవస్థ. సుప్రీంకోర్టులానే ప్రభుత్వ నియంత్రణ లేకుండా భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్లో భాగంగా పనిచేస్తుంది.
ప్రజా ప్రతినిధులను(లోక్సభ సభ్యులు) ఎన్నుకుని తద్వారా కేంద్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రతి ఐదు సంవత్సరాలకు నిర్వహించే ఎన్నికలను సాధారణ ఎన్నికలు(జనరల్ ఎలక్షన్) అంటారు. దేశంలోని మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాల శాసనసభలకు కూడా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఏ కారణం చేతైనా ఐదు సంవత్సరాలు కొనసాగని పక్షంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. లోక్సభతో పాటు అసెంబ్లీ పదవీకాలం పూర్తయిన రాష్ట్రాలకు రెండు ఎన్నికలను కలిపి జమిలి ఎన్నికలు నిర్వహిస్తారు.
సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు(ఈవీఎం) ద్వారా నిర్వహిస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని పరూర్ శాసనసభ నియోజకవర్గంలో 1982లో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారిగా ఈవీఎంలు వాడారు. ఈవీఎంలను భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేశాయి. విద్యుత్ సరఫరా లేని చోట్ల కూడా ఆల్కలైన్ బ్యాటరీ సాయంతో ఈవీఎంలు పనిచేస్తాయి. ఒక్కో ఈవీఎంలో 3,840 ఓట్లను నిక్షిప్తం చేసేందుకు వీలుంటుంది. పోలీలో 64 మంది అభ్యర్థుల కంటే తక్కువగా ఉంటేనే ఈవీఎంలు వినియోగిస్తారు. అభ్యర్థుల సంఖ్య దాని కంటే ఎక్కువగా ఉంటే మాత్రం బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.
ఎన్నికలలో ధన, కుల, కండ బలము ప్రాధాన్యత పెరుగుతోంది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేందుకు పలువురు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పలు చర్యలు తీసుకుంటోంది. భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపడుతూ దీన్ని కట్టడి చేస్తున్నారు. అయినా ఎన్నికల్లో డబ్బు ప్రభావం మరీ ఎక్కువగా ఉండటం పట్ల ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సై అంటే సై అంటున్న బీజేపీ-ఎంఐఎం.. 22 ఏళ్ల తర్వాత ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక!
22 ఏళ్ల తర్వాత ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతుండటంతో అందరి చూపు ఇప్పుడే గ్రేటర్ వార్ వైపేనే నెలకొంది. బలాబలాల్లో మజ్లిస్కు మొగ్గు ఉన్నా.. వార్ వన్ సైడ్ కాదంటోంది భారతీయ జనతా పార్టీ. ఇంతకీ ఎంఐఎం వర్సెస్ బీజేపీ పోరులో ఫలితం ఎలా ఉండబోతోంది? గాలిపటాన్ని అడ్డుకునేందుకు కమలం ముందున్న దారేది? అన్నదీ తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
- Vidyasagar Gunti
- Updated on: Apr 20, 2025
- 9:38 pm
బీహార్ పర్యటనకు ప్రధాని మోదీ.. నితీష్కుమార్ను మళ్లీ సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తారా..?
బీహార్లో ఏప్రిల్ 24న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. సీఎం అభ్యర్ధిగా నితీష్ కుమార్ పేరు ప్రకటిస్తారా? లేక సస్పెన్స్ కొనసాగిస్తారా? నితీష్ రాజకీయ జీవితం ముగిసిందని విపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో మోదీ ఏం చెబుతారన్న విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 13, 2025
- 10:19 am
తమిళనాట వేగంగా మారుతున్న పొలిటికల్ పరిణామాలు.. బీజేపీ వేస్తోన్న బిగ్ స్కెచ్ ఏంటీ?
దక్షిణాదిలో పాగా వేసేందుకు స్కెచ్ వేస్తోంది బీజేపీ. అందులో భాగంగానే తమిళనాడులో గత కొన్నిరోజులుగా పొలిటికల్ డ్రామాకు తెరతీస్తోంది. తమిళనాడులో పాతమిత్రుడితో కలిసి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ. అధికార DMKను గద్దెదించేందుకు పక్కా ప్రణాళికతో వెళ్తోంది. వీటన్నింటిని గమనిస్తే, తమిళనాట పొలిటికల్ నాటకీయ పరిణామానికి వేళాయిందా? అనిపిస్తుంది.
- Ch Murali
- Updated on: Apr 7, 2025
- 4:13 pm
Telangana BJP: తెలంగాణలో సత్తా చాటుతున్న బీజేపీ.. 2 ఎమ్మెల్సీ స్థానాలు కైవసం.. కమళదళంలో ఫుల్ జోష్..
తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కీలక విజయాల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాత్ర అత్యంత కీలకమనే చెప్పాలి. సాధారణంగా గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ అగ్రనేతలు అంత సీరియస్గా తీసుకోరు. కానీ ఇందుకు భిన్నంగా కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు.
- Shaik Madar Saheb
- Updated on: Mar 6, 2025
- 12:41 pm
MS Dhoni: తమిళనాడు పాలిటిక్స్లో ధోనీ పేరు రీసౌండ్.. ప్రశాంత్ కిషోర్ స్కెచ్ మామూలుగా లేదుగా..
తమిళగ వెట్రి కజగం (TVK) మహానాడు చెన్నైలో యమా గ్రాండ్గా జరిగింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో కలిసి కార్యక్రమానికి విజయ్ హాజరుకావడం హాట్టాపిక్గా మారింది. మహాబలిపురంలో జరిగిన టీవీకే తొలి వార్షికోత్సవ సమావేశంలో విజయ్.. తన స్పీచ్లో ఆరు ప్రధాన అంశాలను ప్రస్తావించారు.. మహిళల భద్రతతో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Feb 26, 2025
- 8:22 pm
Tamil Nadu Politics: ముగ్గురు హీరోలు తలో దారిలో.. ఇంట్రెస్టింగ్గా తమిళనాడు పాలిటిక్స్..
తమిళనాట ఎన్నికలకు ఏడాది సమయం ఉంది.. అయితే అక్కడ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి.. ముగ్గురు బడా సినీ హీరోల వైఖరి ఇందుకు ప్రధాన కారణం.. సూపర్ స్టార్ రజనీకాంత్, విభిన్న కథానాయకుడు కమల్ హసన్, మాస్ హీరో విజయ్... ఈ ముగ్గురు ఒక్కో దారిలో ఉండడం ఇప్పుడు అక్కడ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారడానికి కారణం అయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. తమిళనాట రాజకీయాలను సినీ పరిశ్రమను వేరు చేసి చూడలేం..
- Ch Murali
- Updated on: Feb 24, 2025
- 9:01 pm
Telangana MLC Polls: శివరాత్రి తెల్లారే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. తలపట్టుకుంటున్న అభ్యర్థులు.. కారణం ఏంటంటే..
శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదంటారు.. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ డేట్ కూడా శివయ్య ఆజ్ఞతోనే ఫిక్స్ అయినట్టుగా ఉంది. పోటీలో ఉన్న అభ్యర్థులు అటు ఓటరును ప్రాపకం చేసుకోవడంతో పాటు ఇటు శివయ్య అనుగ్రహం కోసం ప్రయత్నించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 26న శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలను సందర్శించుకునే అవకాశం ఉంటుంది.
- G Sampath Kumar
- Updated on: Feb 18, 2025
- 10:39 am
MLC Election: కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా.. నేనా ఫైట్.. గట్టి పోటీ ఇస్తున్న ఇండిపెండెంట్!
పార్లమెంటు ఎన్నికల తరువాత జరిగే అత్యంత కీలకమైన ఎన్నికలు. దీంతో అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలలో సత్తాచాటిన బీజేపీ ఈ ఎన్నికలు మరింత కీలకంగా మారాయి. అయితే ఎప్పుడూ ఎన్నికలు అనగానే సై అనే బీఅర్ఎస్.. ఈసారికి మాత్రం నై అంటుంది. దీంతో అధికార కాంగ్రెస్, బీజేపీ తోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్యనే పోరు నెలకొంది.
- G Sampath Kumar
- Updated on: Feb 10, 2025
- 6:10 pm
MLC Election: రసవత్తరంగా నల్లగొండ -ఖమ్మం -వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక..!
తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇవాళ్టితో నామినేషన్లు స్వీకరణ ముగియనుంది. ఫిబ్రవరి 27న ఎన్నికల జరగనున్నాయి. మార్చిన 3న ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలపై సీరియస్గానే దృష్టి పెట్టాయి. ఇక, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ
- M Revan Reddy
- Updated on: Feb 10, 2025
- 5:39 pm
BJP-NDA: దేశవ్యాప్తంగా వెలిగిపోతున్న బీజేపీ.. మొత్తం ఎన్ని రాష్ట్రాల్లో పాగా వేసిందో తెలుసా..?
కమలం వెలిగిపోతోంది. కాషాయ దండు సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ వెళ్తున్న పార్టీని ముందుండి నడిపిస్తున్నారు ప్రధాని మోదీ. పదేళ్లలో ఎన్నో విజయాలు సాధించినా.. ఈరోజు దక్కిన విజయం బీజేపీకి వెరీ స్పెషల్. అయితే ఇప్పటివరకు ఎన్నిరాష్ట్రాల్లో బీజేపీ ఉంది? ఎన్డీఏ పాలిత రాష్ట్రాలేంటి? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
- Shaik Madar Saheb
- Updated on: Feb 9, 2025
- 7:28 am