AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికలు

ఎన్నికలు

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికలంటే ఓ పండుగ. ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రజల తరఫున చట్ట సభల్లో ప్రాతినిధ్యంవహించేందుకు నాయకులు పోటీపడుతారు. వీరిలో ఒకరిని తమ తరఫు నాయకుడిగా ఓటు వేసి ప్రజలు ఎన్నుకుంటారు. ఒకే అభ్యర్థి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు అతని ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. భారత్‌లో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగ సంస్థ భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. 1950 జనవరి 25న ఏర్పాటైన భారత ఎన్నికల కమిషన్ స్వతంత్ర వ్యవస్థ. సుప్రీంకోర్టులానే ప్రభుత్వ నియంత్రణ లేకుండా భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్‌లో భాగంగా పనిచేస్తుంది.

ప్రజా ప్రతినిధులను(లోక్‌సభ సభ్యులు) ఎన్నుకుని తద్వారా కేంద్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రతి ఐదు సంవత్సరాలకు నిర్వహించే ఎన్నికలను సాధారణ ఎన్నికలు(జనరల్ ఎలక్షన్) అంటారు. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాల శాసనసభలకు కూడా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఏ కారణం చేతైనా ఐదు సంవత్సరాలు కొనసాగని పక్షంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. లోక్‌సభతో పాటు అసెంబ్లీ పదవీకాలం పూర్తయిన రాష్ట్రాలకు రెండు ఎన్నికలను కలిపి జమిలి ఎన్నికలు నిర్వహిస్తారు.

సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు(ఈవీఎం) ద్వారా నిర్వహిస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని పరూర్ శాసనసభ నియోజకవర్గంలో 1982లో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారిగా ఈవీఎంలు వాడారు. ఈవీఎంలను భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేశాయి. విద్యుత్ సరఫరా లేని చోట్ల కూడా ఆల్కలైన్ బ్యాటరీ సాయంతో ఈవీఎంలు పనిచేస్తాయి. ఒక్కో ఈవీఎంలో 3,840 ఓట్లను నిక్షిప్తం చేసేందుకు వీలుంటుంది. పోలీలో 64 మంది అభ్యర్థుల కంటే తక్కువగా ఉంటేనే ఈవీఎంలు వినియోగిస్తారు. అభ్యర్థుల సంఖ్య దాని కంటే ఎక్కువగా ఉంటే మాత్రం బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.

ఎన్నికలలో ధన, కుల, కండ బలము ప్రాధాన్యత పెరుగుతోంది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేందుకు పలువురు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పలు చర్యలు తీసుకుంటోంది. భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపడుతూ దీన్ని కట్టడి చేస్తున్నారు. అయినా ఎన్నికల్లో డబ్బు ప్రభావం మరీ ఎక్కువగా ఉండటం పట్ల ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి

Telangana: 70 ఏళ్లుగా సర్పంచ్ ఎన్నికలకు ఓటు వేయని గ్రామస్తులు.. ఎట్టకేలకు నెరవేరిన ఓటర్ల కల..!

ఆ ఊరు ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికల కోసం ఓటేసింది. సర్పంచ్‌ను ఎన్నుకోవాలనుకున్న ఆ ఊరి ఓటర్ల కల 70 ఏళ్లకు నెరవేరింది. ఎమ్మెల్యే, ఎంపీ సహా ఇతర ఎన్నికలకు ఓటు వేసినా.. ఇప్పటివరకు సర్పంచ్ ఎన్నికలకు దూరంగా ఉన్న ఆ గ్రామ ఓటర్లు.. ఈ సారి జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా సర్పంచ్‌ను ఎన్నుకోవడం ఓ విశేషం.

ఆ గ్రామంలో 70 ఏళ్ల తర్వాత పంచాయతీ పోరు.. తొలిసారి ఓటేస్తున్న ప్రజలు.. ఎక్కడంటే?

ఆ గ్రామంలో ఏడు దశాబ్దాలుగా అసలు సర్పంచ్ ఎన్నికల ముచ్చటే లేదు. పంచాయితీ ఎన్నికల్లో ఆ ఊరు ఓటు వేసిన దాఖలాలే లేవు. 70 ఏళ్లు దాటినా స్థానిక ఎన్నికల్లో చేతికి సిరా చుక్క తాకలేదు. కానీ చరిత్రను తిరగ రాస్తూ 7 దశాబ్దాల తర్వాత తొలిసారి పంచాయితీ ఎన్నికలను చూసింది ఆ గ్రామం. ఇంతకు ఆ గ్రామం ఏంది.. అక్కడ ఇన్నాళ్లు ఎందుకు ఎన్నికలు జరగలేదో తెలుసుకుందాం పదండి.

Telangana Panchayat Elections 2025 Live: కొనసాగుతున్న మూడో విడత పంచాయతీ ఎన్నికలు పోలింగ్! పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన ఓటర్లు

Telangana Panchayat Polls 2025 Live Updates :తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయాన్ని పోలింగ్ కేంద్రాలకు భారీగా చేరుకుంటున్నారు ఓటర్లు.. పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి త్వరగా స్వగ్రామాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ నిర్వహించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు అధికారులు.

  • Anand T
  • Updated on: Dec 17, 2025
  • 1:32 pm

సర్పంచ్ ఎన్నికల్లో అభిమానం చాటుకున్న గ్రామస్తులు.. చనిపోయినా సరే గెలిపించారు..!

రంగారెడ్డి జిల్లాలో విషాదం మధ్య ప్రజాస్వామ్య ఘట్టం చోటుచేసుకుంది. శంకర్‌పల్లి మండలం మాసానిగూడ గ్రామ పంచాయతీ 8వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన పల్లె లత (42) ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దీంతో కుటుంబసభ్యులు, మద్దతుదారులు శోకసంద్రంలో మునిగిపోయారు. అభ్యర్థి మృతితో గ్రామంలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా విషాదంగా మారింది.

రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు.. చిన్న చిన్న ఉద్రిక్తతల మధ్య ప్రశాంతం!

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఆధిక్యంతో దూసుకుపోతోంది. తొలి దశ ఎన్నికల తరహాలోనే రెండో విడతలో బీఆర్ఎస్, బీజేపీ మూడో స్ధానంలో కొనసాగుతున్నాయి. ఆదివారం (డిసెంబర్ 14) జరిగిన రెండో దశ సర్పంచ్ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి.ఎన్నికల్లో ఓ సర్పంచ్‌ అభ్యర్థి భర్త మిస్సింగ్ మిగతా అభ్యర్థులను టెన్షన్ పెట్టింది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ దూకుడు పెంచిన టీవీకే అధినేత విజయ్.. పార్టీ సంస్థాగతంపై దృష్టి..!

తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అందులోనూ ఇటీవల పార్టీని ఏర్పాటు చేసిన నటుడు విజయ్ మరింత స్పీడ్ పెంచారు. పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నిర్ణయాల కోసం కమిటీలను నియామకం జరిగింది.

Telangana: గ్రామస్తులకు బంపర్ ఆఫర్.. ఏకంగా ఊరికి బాండ్ పేపర్ రాసిచ్చిన అభ్యర్థి..!

సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు జనాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి.. వింత హామీలతో అభ్యర్థులు ప్రజలను నోరెళ్ళ బెట్టేలా చేస్తున్నారు.. ములుగు జిల్లాలో ఓ అభ్యర్థి తనను గెలిపిస్తే ఏకంగా ఊరందరికీ ఫ్రీ వైఫై, టీవీ చానల్స్ ప్రసారాలు ఉచితంగా అందిస్తానని హామీ ఇస్తున్నారు. వట్టి మాట కాదు.. ఒట్టు పెట్టి బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఊరంతా చర్చగా మారారు..

ఢిల్లీలో మరోసారి రెపరెపలాడిన కాషాయ జెండా.. ఒకే స్థానానికే పరిమితమైన కాంగ్రెస్

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హవా చూపించింది. 12 డివిజన్లకు జరిగిన ఉపఎన్నికల్లో 7 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. మిగతా ఐదు స్థానాల్లో మూడింటిని ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఒకటి కాంగ్రెస్‌ గెలుచుకోగా.. మరో స్థానంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి గెలుపొందారు. నవంబర్ 30న జరిగిన ఎన్నికల ఫలితాలను ఈరోజు (డిసెంబర్ 3న) ప్రకటించారు.

పల్లెల్లో ‘పంచాయతీ’ సందళ్లు.. ఊరుఊరంతా ఒకటే గుసగుస..! ఇంతకీ ఊరికి మొనగాడు ఎవరు?

సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు చోటు లేదు. తమ గ్రామాన్ని పాలించేందుకు.. తమలో ఒకరిని 'ప్రెసిడెంట్'ను చేసుకునేందుకు ప్రజలు ఎన్నుకునే ఎన్నిక ఇది. స్వపరిపాలనకు అసలైన అర్ధం ఈ సర్పంచ్ ఎన్నికలు. బట్.. ఇప్పుడా పరిస్థితి లేదనుకోండి. గ్రామాల్లో ఎవరు సర్పంచ్ అభ్యర్ధిగా నిలబడాలో శాసించేది ఆఖరికి రాజకీయ పార్టీలే అవుతున్నాయి. పోటీ చేయాలనుకున్న అభ్యర్ధుల కూడా రాజకీయ పార్టీల అండదండలు కోరుకుంటున్నారు. పార్టీల జోక్యం ఉంటోంది కాబట్టే ఎన్నికలు మరింత రంజుగా సాగుతున్నాయి. సో, ఊళ్లల్లో పైచేయి 'చేతి' గుర్తుదా, కారుదా, కమలమా, సుత్తికొడవలా, కంకి కొడవలా, పతంగినా.. ఎవరు బలపరిచిన అభ్యర్ధి గెలుస్తాడనే దానిపైనే ఇప్పుడు చర్చంతా జరుగుతోంది. ఇంతకీ.. గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితి ఎలా ఉంది?

Freebies in Elections: అదంతా ఓల్డ్ స్టైల్!.. ఇల్లు, బైకు, కారు లేటెస్ట్ వర్షన్.. మరో ‘ఫ్రీ’వార్..

ఓ వైపు ఈ ఎగ్జాంపుల్ కనిపిస్తున్నా సరే.. తమిళనాడులో మళ్లీ అవే ఉచిత పథకాలను అక్కడి నేతలు నమ్ముకోబోతున్నారు. ఇప్పటికే, దేశంలోనే ఎక్కువ ఉచిత పథకాలు అమలవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు అంతకు మించి తాయిలాలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

శరవేగంగా పంచాయతీ ఎన్నికల దిశగా అడుగులు.. రిజర్వేషన్ల లెక్కలు తేలేనా..?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా రంగం సిద్ధం చేస్తోంది. కేబినెట్ మీటింగ్ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాబోతోంది. రిజర్వేషన్ల వివాదాన్ని అధిగమించేలా ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లబోతోంది? అన్నదీ ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.

Bihar: 10వ సారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం.. ఏ పార్టీ నుండి ఎంతమంది మంత్రులు ఉన్నారంటే..?

బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఈరోజు గురువారం (నవంబర్ 20) కొలువుదీరనుంది. ముఖ్యమంత్రి పదవిపై నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది. బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ బాధ్యతలు చేపడతారు. ఆయన 10వసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీహార్‌కు 19వ ముఖ్యమంత్రి అవుతారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం పాట్నాలోని గాంధీ మైదానంలో జరుగుతుంది.