ఎన్నికలు
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికలంటే ఓ పండుగ. ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రజల తరఫున చట్ట సభల్లో ప్రాతినిధ్యంవహించేందుకు నాయకులు పోటీపడుతారు. వీరిలో ఒకరిని తమ తరఫు నాయకుడిగా ఓటు వేసి ప్రజలు ఎన్నుకుంటారు. ఒకే అభ్యర్థి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు అతని ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. భారత్లో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగ సంస్థ భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. 1950 జనవరి 25న ఏర్పాటైన భారత ఎన్నికల కమిషన్ స్వతంత్ర వ్యవస్థ. సుప్రీంకోర్టులానే ప్రభుత్వ నియంత్రణ లేకుండా భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్లో భాగంగా పనిచేస్తుంది.
ప్రజా ప్రతినిధులను(లోక్సభ సభ్యులు) ఎన్నుకుని తద్వారా కేంద్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రతి ఐదు సంవత్సరాలకు నిర్వహించే ఎన్నికలను సాధారణ ఎన్నికలు(జనరల్ ఎలక్షన్) అంటారు. దేశంలోని మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాల శాసనసభలకు కూడా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఏ కారణం చేతైనా ఐదు సంవత్సరాలు కొనసాగని పక్షంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. లోక్సభతో పాటు అసెంబ్లీ పదవీకాలం పూర్తయిన రాష్ట్రాలకు రెండు ఎన్నికలను కలిపి జమిలి ఎన్నికలు నిర్వహిస్తారు.
సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు(ఈవీఎం) ద్వారా నిర్వహిస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని పరూర్ శాసనసభ నియోజకవర్గంలో 1982లో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారిగా ఈవీఎంలు వాడారు. ఈవీఎంలను భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేశాయి. విద్యుత్ సరఫరా లేని చోట్ల కూడా ఆల్కలైన్ బ్యాటరీ సాయంతో ఈవీఎంలు పనిచేస్తాయి. ఒక్కో ఈవీఎంలో 3,840 ఓట్లను నిక్షిప్తం చేసేందుకు వీలుంటుంది. పోలీలో 64 మంది అభ్యర్థుల కంటే తక్కువగా ఉంటేనే ఈవీఎంలు వినియోగిస్తారు. అభ్యర్థుల సంఖ్య దాని కంటే ఎక్కువగా ఉంటే మాత్రం బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.
ఎన్నికలలో ధన, కుల, కండ బలము ప్రాధాన్యత పెరుగుతోంది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేందుకు పలువురు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పలు చర్యలు తీసుకుంటోంది. భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపడుతూ దీన్ని కట్టడి చేస్తున్నారు. అయినా ఎన్నికల్లో డబ్బు ప్రభావం మరీ ఎక్కువగా ఉండటం పట్ల ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా చదవండిఎన్నికల వేళ కీలక నిర్ణయం.. యోగి, అఖిలేష్, మాయావతికి బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు!
ఉత్తరప్రదేశ్లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు మొత్తం 52 మంది ప్రముఖ రాజకీయ నాయకులకు బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు అందించినట్లు తెలుస్తోంది. ఒక్కో జాకెట్ విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా.
- Balaraju Goud
- Updated on: Aug 22, 2026
- 4:09 pm
కలిసొస్తున్న కమలం నేతలు.. తెలంగాణలో అధికారం కోసం బీజేపీ వ్యూహం మారిందా?
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణపై అధిష్టానం ఫోకస్ చేసింది..అందులో భాగంగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ నాయకుల అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి పటిష్టత, భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనుంది.
- Gopikrishna Meka
- Updated on: Aug 7, 2026
- 1:11 pm
తెలంగాణ దంగల్ 2029కి సెమీఫైనల్స్ షురూ.. జీరో ఫోబియా.. ఏ పార్టీలకు..?
మొదటి నుంచీ తెలంగాణ రైజింగ్ అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ, డెవలప్మెంట్ సబ్జెక్ట్లో భిన్నాభిప్రాయాలుంటే ఉండొచ్చు. పొలిటికల్గా మాత్రం తెలంగాణ రైజింగే..! దీంతో టాప్గేర్లోకి వచ్చాయి మూడు పార్టీలు. ఎవరి బ్యాటింగ్ వాళ్లు ఆడుతూ, స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నారు. మూడు పార్టీల మధ్య ఒక నంబర్గేమ్ కూడా మొదలైంది. దంగల్ 2028.. కాదు.. కాదు.. తెలంగాణ దంగల్ 2029కి సెమీఫైనల్స్ షురూ అయ్యింది. డీటెయిల్డ్గా చూద్దాం..
- Balaraju Goud
- Updated on: Jul 17, 2026
- 10:46 pm
తెలంగాణ ఓటర్లకు అలర్ట్.. ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గడువు పొడిగింపు!
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఓటర్ల నమోదు, వెరిఫికేషన్ ప్రక్రియ గడువును పెంచాలంటూ వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన ఈసీ, తాజా షెడ్యూల్ను సవరించింది. మొదట ప్రకటించిన గడువును పొడిగిస్తూ, బూత్ స్థాయి అధికారుల (BLO) ఇంటింటి సర్వే, ఫారాల సమర్పణ గడువును ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించారు.
- Balaraju Goud
- Updated on: Jul 15, 2026
- 5:35 pm
బద్దలైన అస్తిత్వ అగ్నిపర్వతం.. రెండు రాష్ట్రాలను కుదిపేస్తున్న పవన్ కళ్యాణ్ పొలిటికల్ డైనమైట్లు!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఊహించని అగ్గి రాజుకుంది. పదేళ్ల ఆవిర్భావ వేడుకల వేళ, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ అస్తిత్వ రాజకీయాల తేనెతుట్టె ఒక్కసారిగా కదిలింది. అస్తిత్వ అగ్నిపర్వతం భళ్లున బద్దలై, రెండు రాష్ట్రాల నేతల మధ్య డైలాగ్ డైనమైట్లు పేలేలా చేస్తోంది. తెలంగాణ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? ఇక్కడికి వచ్చి రాజకీయం చేసే హక్కు ఎవరికి ఉంది? అనే యక్ష ప్రశ్నలతో 'తెంగాణం' మరోసారి భగభగా మండుతోంది.
- Balaraju Goud
- Updated on: Jun 2, 2026
- 9:49 pm
అస్సాం పీఠంపై హిమంత బిస్వా శర్మ ముద్ర.. 102 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నిక!
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిస్వా శర్మ వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం జరిగిన బీజేపీ, ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా నాయకుడిగా ఎన్నికయ్యారు. మే 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 126 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 102 స్థానాలను (బీజేపీ 82) కైవసం చేసుకుని భారీ విజయం సాధించింది.
- Balaraju Goud
- Updated on: May 10, 2026
- 6:39 pm
విశ్వకవి సాక్షిగా సరికొత్త చరిత్ర.. బెంగాల్లో నూతన శకం ఆరంభం.. సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో 2026, మే 9వ తేదీ ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోనుంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా బెంగాల్ గడ్డపై భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వం కొలువుదీరింది. కోల్కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కన్నుల పండువైన కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
- Balaraju Goud
- Updated on: May 9, 2026
- 3:03 pm
‘విజయ్ అనే నేను’.. వెనక ఎన్నో తిప్పలు! ప్రతిపక్షాల ప్రతివ్యూహాల మధ్య నిలబడగలరా?
విజయ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్. మొదటి నుంచి యువతే లక్ష్యంగా పావులు కదిపారు. తాను రాజకీయాన్ని ఒక హాబీగా చూడటం లేదు.. అది తన ఆశయం అనే స్టేట్మెంట్ జెన్-జీకి ఒక క్లారిటీ ఇచ్చింది. టెన్త్, ఇంటర్ క్లాస్ టాపర్లను పిలిచి సన్మానం చేయడం ద్వారా "చదువుకున్న వారే రాజకీయాల్లోకి రావాలి" అనే మెసేజ్ ఇచ్చారు.
- Shaik Madar Saheb
- Updated on: May 8, 2026
- 9:52 pm
మమతా బెనర్జీ సర్కార్ను బర్తరఫ్ చేసిన గవర్నర్.. నెక్స్ట్ సీఎం ఎవరు..?
గవర్నర్ రవి బెంగాల్లో మమతా బెనర్జీ సర్కార్ను బర్తరఫ్ చేశారు. సీఎం పదవికి రాజీనామా చేయడానికి మమత బెనర్జీ ఒప్పుకోకపోవడంతో గవర్నర్ గురువారం ఈ నిర్ణయం తీసుకున్నారు. మమతా రాజీనామా చేయకపోవడంతో గడువు ముగిసిన వెంటనే బెంగాల్ అసెంబ్లీని రద్దు చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: May 7, 2026
- 7:49 pm
విజయ్ కోర్టులో ద్రవిడ బంతి..! క్షణక్షణానికి మారిపోతున్న తమిళ రాజకీయాలు..
'బంతి విజయ్ కోర్టులోనే ఉంది. అన్నాడీఎంకే అధికార ప్రతినిధి నుంచి వచ్చిన మాట ఇది. డైలాగ్ చిన్నదే కావొచ్చు. బట్ మోస్ట్ పవర్ ఫుల్. 'వచ్చేయడానికి మేం రెడీ.. తీసుకోడానికి మీరు రెడీనా' అనే అర్థం ధ్వనిస్తోంది ఆ మాటలో. మరి.. పళనిస్వామి సంగతేంటి, ఆయన ఒప్పుకుంటారా అని ప్రశ్నిస్తే.. ఆయన సంగతి మాకెందుకు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు అన్నా ఎమ్మెల్యేలు.
- Shaik Madar Saheb
- Updated on: May 6, 2026
- 9:53 pm
Vijay: విజయ్ సీఎం కానట్టేనా..? డీఎంకే – అన్నాడీఎంకే చర్చలు..! అరవ రాజకీయాల్లో సంచలనం..
తమిళనాడులో ద్రవిడ పార్టీలు డీఎంకే.. అన్నాడీఎంకే తమ ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.. ఈ మేరకు అన్నాడీఎంకే, డీఎంకే మధ్య తెరవెనుక చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుండటం రాజకీయాల్లో సంచలనంగా మారింది. డీఎంకే ఖాతాలో 59, అన్నాడీఎంకే ఖాతాలో 47 ఉన్నాయి..
- Shaik Madar Saheb
- Updated on: May 6, 2026
- 9:44 pm
Vijay: 118 మంది కావాల్సిందే.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కు లభించని అనుమతి..
తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు విజయ్. అయితే గవర్నర్ నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి లభించలేదు. మెజారిటీపై గవర్నర్ను ఒప్పించలేకపోయారు. విజయ్కు 113 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి.
- Shaik Madar Saheb
- Updated on: May 6, 2026
- 5:46 pm