ఎన్నికలు
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికలంటే ఓ పండుగ. ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రజల తరఫున చట్ట సభల్లో ప్రాతినిధ్యంవహించేందుకు నాయకులు పోటీపడుతారు. వీరిలో ఒకరిని తమ తరఫు నాయకుడిగా ఓటు వేసి ప్రజలు ఎన్నుకుంటారు. ఒకే అభ్యర్థి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు అతని ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. భారత్లో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగ సంస్థ భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. 1950 జనవరి 25న ఏర్పాటైన భారత ఎన్నికల కమిషన్ స్వతంత్ర వ్యవస్థ. సుప్రీంకోర్టులానే ప్రభుత్వ నియంత్రణ లేకుండా భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్లో భాగంగా పనిచేస్తుంది.
ప్రజా ప్రతినిధులను(లోక్సభ సభ్యులు) ఎన్నుకుని తద్వారా కేంద్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రతి ఐదు సంవత్సరాలకు నిర్వహించే ఎన్నికలను సాధారణ ఎన్నికలు(జనరల్ ఎలక్షన్) అంటారు. దేశంలోని మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాల శాసనసభలకు కూడా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఏ కారణం చేతైనా ఐదు సంవత్సరాలు కొనసాగని పక్షంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. లోక్సభతో పాటు అసెంబ్లీ పదవీకాలం పూర్తయిన రాష్ట్రాలకు రెండు ఎన్నికలను కలిపి జమిలి ఎన్నికలు నిర్వహిస్తారు.
సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు(ఈవీఎం) ద్వారా నిర్వహిస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని పరూర్ శాసనసభ నియోజకవర్గంలో 1982లో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారిగా ఈవీఎంలు వాడారు. ఈవీఎంలను భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేశాయి. విద్యుత్ సరఫరా లేని చోట్ల కూడా ఆల్కలైన్ బ్యాటరీ సాయంతో ఈవీఎంలు పనిచేస్తాయి. ఒక్కో ఈవీఎంలో 3,840 ఓట్లను నిక్షిప్తం చేసేందుకు వీలుంటుంది. పోలీలో 64 మంది అభ్యర్థుల కంటే తక్కువగా ఉంటేనే ఈవీఎంలు వినియోగిస్తారు. అభ్యర్థుల సంఖ్య దాని కంటే ఎక్కువగా ఉంటే మాత్రం బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.
ఎన్నికలలో ధన, కుల, కండ బలము ప్రాధాన్యత పెరుగుతోంది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేందుకు పలువురు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పలు చర్యలు తీసుకుంటోంది. భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపడుతూ దీన్ని కట్టడి చేస్తున్నారు. అయినా ఎన్నికల్లో డబ్బు ప్రభావం మరీ ఎక్కువగా ఉండటం పట్ల ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అకౌంట్లో రూ.44.. చేతిలో రూ. 40.. ప్రజా సమస్యలే పెట్టుబడిగా ఎన్నికల బరిలోకి 26 ఏళ్ల యువతి!
సాధారణంగా సర్పంచ్ ఎన్నికలకే కోట్లు ఖర్చు చేస్తున్న ఈ రోజుల్లో.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేసేందుకు సిద్ధమైన ఓ అభ్యర్థి దాఖలు చేసిన అఫిడవిట్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ అఫిడవిట్లో అభ్యర్థి పొందుపరిచిన ఆస్తి వివరాలు చూసిన ఈసీ అధికారులు నివ్వెరపోయారు. ఇంతకు ఆమె దగ్గర ఉన్న ఎంతో తెలుసా?
- Anand T
- Updated on: Apr 1, 2026
- 1:19 pm
Tamil Nadu: ఎన్నికల వేళ ఊహించని ఘటన.. ముఖ్యమంత్రి కారులో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు!
తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయాలు హీటెక్కాయి. వివిధ రాజకీయ పార్టీలు, నేతల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారం నిర్వహిస్తున్న నేతలపై ఎన్నికల అధికారుల నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఈరోజు మంగళవారం (మార్చి 31) తంజావూరు సమీపంలో డీఎంకే నాయకుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కారును ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు.
- Balaraju Goud
- Updated on: Mar 31, 2026
- 12:57 pm
తొలిసారి ఎన్నికల బరిలో విజయ్.. రెండు చోట్ల పోటీకి సై.. తమిళనాట చరిత్ర తిరగరాసేనా..?
చూడప్పా సిద్దప్పా.. ఇది తమిళఅడ్డా.. నాందా హీరో. పెట్టింది తిను, ఇచ్చింది తీసుకో..! ఇది నా మాట.. మామాటే శాసనం. అంటూ ద్రవిడగడ్డను ఆరెండు పార్టీలే దశాబ్దాలుగా ఏలుతున్నాయి. జాతీయ పార్టీలు ఎన్ని వచ్చినా.. సపోర్టింగ్ రోల్కే పరిమితం. అధికారమైనా, అపోజిషన్ అయినా.. ఆ రెండు పార్టీలను దాటుకుని వచ్చిన చరిత్ర లేదు. ఇప్పుడైనా ఆ.. పొజిషన్ మారుతుందా.? కొత్త నీరు, కొత్త శకం లిఖిస్తుందా..?
- Ch Murali
- Updated on: Mar 29, 2026
- 1:17 pm
ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఇంటింటికి రూ.10వేలు, పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. మామూలు స్కెచ్ కాదుగా..
ఎన్నికల వేళ ఓటర్లను ప్రసంగం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు అనేక తాయిలాలు ప్రకటిస్తూ ఉంటాయి.. అందులోనూ ఉచిత పథకాలకు పుట్టినిల్లు లాంటి తమిళనాడు ఎన్నికలంటే ఉచితాల జోరు మామూలుగా ఉండదు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఉచిత పథకాలను అక్కడి ప్రభుత్వాలు గతంలో అమలు చేసే ప్రస్తుత ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది.
- Ch Murali
- Updated on: Mar 25, 2026
- 7:06 pm
గుడ్న్యూస్.. మహిళలకు 1500 రూపాయలు, నిరుద్యోగులకు పాకెట్ మనీ.. పోటా పోటీ హామీల వర్షం..!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మేనిఫెస్టోను విడుదల చేశారు. "లక్ష్మీ భండార్" పథకం కింద, సాధారణ వర్గానికి చెందిన మహిళలకు నెలకు రూ.1,500, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.1,700 ఆర్థిక సాయాన్ని టీఎంసీ పార్టీ ప్రకటించింది.
- Balaraju Goud
- Updated on: Mar 20, 2026
- 5:57 pm
మూడు ముక్కలాట! మూడు రాష్ట్రాల్లో ఉత్కంఠ భరితం.. బ్రేకప్ ఎవరికి.. విక్టరీ ఎవరిది..?
మూడు ప్రధాన రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ మరింత హీట్ పెంచాయి.. 2028లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగవు అంటున్నారు సీఎం రేవంత్. అంటే అర్థం.. జమిలి రాబోతోందనేగా..! అలా జమిలి జరగాలంటే ఓ ఈక్వేషన్ పాస్ అవ్వాలి. వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజారిటీ గెలిస్తే జమిలి ఎన్నికలు ఇక ఎంతో దూరం ఉండవు. సో, తమిళనాడులో పాగా వేయడం, బెంగాల్లో విజయం సాధించడం, అసోంలో మళ్లీ అధికారం, కేరళంలో బలమైన అడుగులు వేయడం, పుదుచ్చేరిలో సునాయాస విజయం సాధించడం.. ఈ ఈక్వేషన్ వర్కౌట్ అయితేనే బీజేపీ అనుకున్నది సాధ్యం. సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్కు ఓ అర్ధం. మరి అలా జరుగుతుందా? సాధ్యమేనా? తమిళనాట DMK వర్సెస్ అన్నా DMK.. మధ్యలో TVK. కేరళంలో NDF వర్సెస్ LDF.. మధ్యలో బీజేపీ. బెంగాల్లో దీదీ వర్సెస్ మోదీ.. మధ్యలో కాంగ్రెస్. ఇప్పుడిప్పుడే సీట్ల సర్దుబాటు, అభ్యర్ధుల ప్రకటన జరుగుతున్న వేళ.. ఆ మూడు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది?
- Balaraju Goud
- Updated on: Mar 18, 2026
- 9:50 pm
ఎన్నికల వేళ ఎన్నెన్నీ సిత్రాలో.. ఓటర్ల కోసం భారీగా తాయిలాలు సిద్ధం..మామూలు కానుకలు కాదండోయ్..!
తమిళనాడు ఎన్నికల వేళ రాజకీయ సందడితో పాటు ఎన్నికల సంఘం (EC) నిఘా కూడా అత్యంత కఠినంగా మారింది. మీరు అందించిన కథనం ప్రకారం, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవడంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ (Flying Squads) కీలక పాత్ర పోషిస్తున్నాయి. పలుచోట్ల వజ్రం, ప్లాటినం , బంగారు నగలు, వెండి వస్తువులను సీజ్ చేశారు అధికారులు.
- Jyothi Gadda
- Updated on: Mar 18, 2026
- 7:59 am
టీఎంసీ తొలి జాబితా విడుదల.. నందిగ్రామ్ వదులుకున్న సీఎం మమతా.. ఎక్కడి నుంచి పోటీ అంటే?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి పోటీ చేయనున్నారు. డార్జిలింగ్లో అనిత్ థాపా నేతృత్వంలోని బీజీపీఎం మూడు స్థానాల్లో పోటీ చేస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. టీఎంసీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.
- Balaraju Goud
- Updated on: Mar 17, 2026
- 5:27 pm
Election Commission Live Updates: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. ఎన్నికలు ఎప్పుడంటే..?
Election Commission Press Conference Live Updates in Telugu : 5 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.
- Ram Naramaneni
- Updated on: Mar 15, 2026
- 6:03 pm
ఎన్డీఏ కూటమిలోకి విజయ్.. రంగంలోకి ఏపీ డిప్యూటీ సీఎం.. తమిళ నేతల క్లారిటీ ఇదే..!
టీవీకేను ఎన్డీఏలోకి చేర్చుకునేందుకు బీజేపీ మరోసారి ప్రయత్నిస్తోందనే పుకార్ల మధ్య పార్టీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. బీజేపీ లేదా ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకోకపోవడంపై విజయ్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇద్దరు సీనియర్ టీవీకే నాయకులు, ఏఐఏడీఎంకేతో సహా అనేక పార్టీలు తమను ముందే సంప్రదించాయని, కానీ వారి వైఖరి అలాగే ఉందని చెప్పారు.
- Balaraju Goud
- Updated on: Mar 10, 2026
- 7:55 am
రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల.. బరిలోకి జాతీయ అధ్యక్షులు నితిన్..!
భారతీయ జనతా పార్టీ తరుపున పోటీ చేసే రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ను కూడా నిలబెట్టింది. బీహార్ నుండి రాజ్యసభకు నితిన్ నబిన్, శివేష్ రామ్లను నామినేట్ చేసింది. నామినేషన్లు దాఖలు చేయడానికి మార్చి 5 చివరి తేదీ. మార్చి 15న ఓటింగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాన్ని ప్రకటిస్తారు.
- Balaraju Goud
- Updated on: Mar 3, 2026
- 4:43 pm
Errabelli Dayakar Rao: ఆరోజు అలా.. ఈరోజు ఇలా.. బోరున ఏడ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. వీడియో చూశారా..?
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.. మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక కూడా ముగిసింది. ఈ క్రమంలోనే.. ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి పెట్టారు. దీంతో మాజీమంత్రికి ఏమైంది. అన్న చర్చ టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది. అసలు తొర్రూరులో గతంలో ఏం జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతోంది. మీకు తెలియాలా? అయితే ఈ స్టోరీ చూసేయండి..
- Shaik Madar Saheb
- Updated on: Feb 18, 2026
- 9:22 am