ఎన్నికలు

ఎన్నికలు

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికలంటే ఓ పండుగ. ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రజల తరఫున చట్ట సభల్లో ప్రాతినిధ్యంవహించేందుకు నాయకులు పోటీపడుతారు. వీరిలో ఒకరిని తమ తరఫు నాయకుడిగా ఓటు వేసి ప్రజలు ఎన్నుకుంటారు. ఒకే అభ్యర్థి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు అతని ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. భారత్‌లో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగ సంస్థ భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. 1950 జనవరి 25న ఏర్పాటైన భారత ఎన్నికల కమిషన్ స్వతంత్ర వ్యవస్థ. సుప్రీంకోర్టులానే ప్రభుత్వ నియంత్రణ లేకుండా భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్‌లో భాగంగా పనిచేస్తుంది.

ప్రజా ప్రతినిధులను(లోక్‌సభ సభ్యులు) ఎన్నుకుని తద్వారా కేంద్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రతి ఐదు సంవత్సరాలకు నిర్వహించే ఎన్నికలను సాధారణ ఎన్నికలు(జనరల్ ఎలక్షన్) అంటారు. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాల శాసనసభలకు కూడా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఏ కారణం చేతైనా ఐదు సంవత్సరాలు కొనసాగని పక్షంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. లోక్‌సభతో పాటు అసెంబ్లీ పదవీకాలం పూర్తయిన రాష్ట్రాలకు రెండు ఎన్నికలను కలిపి జమిలి ఎన్నికలు నిర్వహిస్తారు.

సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు(ఈవీఎం) ద్వారా నిర్వహిస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని పరూర్ శాసనసభ నియోజకవర్గంలో 1982లో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారిగా ఈవీఎంలు వాడారు. ఈవీఎంలను భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేశాయి. విద్యుత్ సరఫరా లేని చోట్ల కూడా ఆల్కలైన్ బ్యాటరీ సాయంతో ఈవీఎంలు పనిచేస్తాయి. ఒక్కో ఈవీఎంలో 3,840 ఓట్లను నిక్షిప్తం చేసేందుకు వీలుంటుంది. పోలీలో 64 మంది అభ్యర్థుల కంటే తక్కువగా ఉంటేనే ఈవీఎంలు వినియోగిస్తారు. అభ్యర్థుల సంఖ్య దాని కంటే ఎక్కువగా ఉంటే మాత్రం బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.

ఎన్నికలలో ధన, కుల, కండ బలము ప్రాధాన్యత పెరుగుతోంది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేందుకు పలువురు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పలు చర్యలు తీసుకుంటోంది. భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపడుతూ దీన్ని కట్టడి చేస్తున్నారు. అయినా ఎన్నికల్లో డబ్బు ప్రభావం మరీ ఎక్కువగా ఉండటం పట్ల ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి

అమెరికాలో EVMల వాడకం తక్కువ.. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహణకు అసలు కారణం ఇదే..

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) పై ఎలాన్ మస్క్ ఒక ప్రకటన చేశారు. వాటిని హ్యాక్ చేసే అవకాశం ఉందని ట్వీట్ చేసిన తర్వాత భారతదేశంలో ఈవీఎంలపై అనేక ప్రకంపనలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకునే అమెరికాలో యంత్రం కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎందుకు ఓటింగ్ చేస్తారన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. దీనికి గల కారణం ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ అయినా, అమెరికా అయినా ఈవీఎం వాడకంపై తీవ్రంగా చర్చ నడుస్తోంది.

  • Srikar T
  • Updated on: Jun 21, 2024
  • 5:26 pm

Teachers to Ministers: రాజకీయాల్లోకి వచ్చిన మహిళ టీచర్లకు ఏకంగా మంత్రి పదవులే..!

ఏపీలో ఓ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ ట్రెండు ఇప్పుడేమి కొత్తగా మొదలైందీ కాదు..! ఓ సినిమాలో నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తా.. అన్నట్లు ఇక్కడ వ్యవహారం ఉంది. అయితే ఇక్కడ అదే ట్రెండు ఫాలో అవుతూ జాక్‌పాట్ కొట్టేస్తున్నారు ఆ మహిళా నేతలు.

Priyanka Gandhi: రాజకీయాల్లో టైమింగ్‌ ముఖ్యం.. అదను చూసి అస్త్రాలను ప్రయోగిస్తున్న కాంగ్రెస్..!

ప్రచారం లోనే కాదు.. పార్లమెంట్‌లో కూడా అన్నకు తోడుగా ఉండాలని డిసైడ్‌ అయ్యారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కేరళలోని వయనాడు నుంచి ప్రియాంక పోటీకి దిగడం కాంగ్రెస్‌కు అన్ని విధాలా కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

BJP: హర్యానాలో జాట్ల ఆగ్రహమే కొంప ముంచిందా?.. బీజేపీ ఆత్మపరిశీలన

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ (BJP) దృష్టి సారించింది. ఆ రాష్ట్రాల్లో పార్టీ స్థితిగతులు, లోటుపాట్లపై ఆత్మపరిశీలన చేస్తోంది. తమకు ఎదురేలేదు అనుకున్న హిందీ హార్ట్‌ల్యాండ్‌లోనే కమలదళానికి ఎదురుదెబ్బలు తగిలాయి. ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో ఆశించిన ఫలితాలు సాధించలేక బీజేపీ చతికిలపడింది. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు హర్యానాలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఏపీలో ఆ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్.. అప్పటి నుంచే అసెంబ్లీ సమావేశాలు.. పూర్తి వివరాలు..

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 21 నుంచి రెండు రోజులపాటు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ముందుగా ప్రొటెం స్పీకర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 21న ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‎లో ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఘట్టం రానే వచ్చింది. అసెంబ్లీ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. సార్వత్రిక ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు మారిపోయాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలపై సీఎం చంద్రబాబు ఐదు సంతకాలు చేశారు.

  • Srikar T
  • Updated on: Jun 18, 2024
  • 2:46 pm

Renu Desai: చెల్లెల్ని ప్రధాని మోదీకి పరిచయం చేసిన అకీరా.. రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్..

ఇటీవల ఢిల్లీ వెళ్లిన పవన్ ప్రధాని మోదీకి అకీరాను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తాను మొదటి నుంచి బీజేపీ వ్యక్తినని.. అలాంటిది తన కుమారుడు మోదీని కలవడం సంతోషంగా ఉందంటూ రేణూ దేశాయ్ పోస్ట్ చేసింది. ఆ సమయంలో కూతురు ఆద్య అకీరాతో కలిసి ఢిల్లీకి వెళ్లలేకపోయింది.

Megastar Chiranjeevi: పవన్, చిరులతో మోదీ మాట్లాడింది ఇదే.. వీడియో పోస్ట్ చేసిన మెగాస్టార్..

ప్రధాని మోదీని స్వయంగా అన్నయ్యకు పరిచయం చేశారు పవర్ స్టార్. అనంతరం చిరు, పవన్‏తో మాట్లాడిన మోదీ.. మెగా బ్రదర్స్ చేతులు పట్టుకొని అభివాదం చేశారు. ఆ సమయంలో చిరు తమ్ముడిని చూస్తూ ఉప్పోంగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మోదీతో మెగా బ్రదర్స్ అనుబంధం చూసి మెగా ఫ్యాన్స్ సంతోషం అంబరాన్నంటింది. అన్నదమ్ముల బంధం ఇదే అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

Pawan Kalyan: తమ్ముడి ప్రమాణ స్వీకారం వేళ.. అలా చూస్తుండిపోయిన అన్నయ్య.. భావోద్వేగానికి గురైన అన్నా లెజనోవా..

కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. ఆయన భార్య అన్నా లెజనోవా ముఖం సంతోషంతో వెలిగిపోయింది. భర్త ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీడియో తీస్తూ ఉప్పోంగిపోయింది. జనాల మధ్యలో కూర్చున్న అన్నా లెజనోవా పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆనందంతో తన ఫోన్ లో వీడియో తీసుకుంది.

Ram Charan: బాబాయ్ కోసం అబ్బాయ్.. పవన్ ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్ గ్రాండ్ ఎంట్రీ..

అలాగే కుటుంబంతో కలిసి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు.. పవన్ తనయుడు అకీరా నందన్, కుమార్తె ఆద్య, సాయి ధరమ్ తేజ్, నాగబాబు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా బాబాయ్ పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు.

Renu Desai: పవన్ కళ్యాణ్‍కు రేణూ దేశాయ్ స్పెషల్ విషెస్.. పంచె కట్టులో అకీరా.. వీడియో వైరల్..

మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో మెగాస్టార్ చిరంజీవితోపాటు సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్, మెగా ఫ్యామిలీ, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఇప్పటికే మెగా అభిమానులు భారీ ఎత్తున ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు. మరోవైపు మెగా ఫ్యామిలీ మొత్తం ప్రత్యేక బస్సులలో ప్రమాణ స్వీకార వేదిక వద్దకు బయలుదేరారు. అలాగే తండ్రి కోసం అకీరా నందన్, ఆద్య కూడా గన్నవరం వచ్చేశారు.

Pawan Kalyan: పవన్ ప్రమాణ స్వీకారం పైనే అందరి కళ్లు.. తండ్రి కోసం అకీరా, ఆద్య..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరికొంత మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని మోదీతోపాటు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. అలాగే సినీ పరిశ్రమ నుంచి పలువురు నటీనటులు, డైరెక్టర్స్, నిర్మాతలు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవికి స్టేట్ గెస్ట్ గా ఆహ్వనం రాగా.. పవన్ ప్రమాణ స్వీకారం చూసేందుకు భారీగా అభిమానులు తరలివస్తున్నారు.

PM Modi Swearing-in Ceremony: ప్రధాని మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి రజనీకాంత్.. టాలీవుడ్ నుంచి ఎవరంటే?

భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ నేడు (జూన్ 09) మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 7:15 గంటలకు ప్రమాణస్వీకార మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి కొందరు విదేశీ అతిథులతో పాటు దేశంలోని పలువురు ముఖ్య రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు.

Telangana: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‎లో ఉత్కంఠకు తెర.. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు..

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల MLC ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. 3 రోజులపాటు ఉత్కంఠంగా సాగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ గెలుపొందారు. హోరాహోరీగా సాగిన పోరులో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మేజిక్‌ ఫిగర్‌ చేరుకోకపోయినా.. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డి ఎలిమినేట్‌ కావడంతో మల్లన్నను విజయం వరించింది. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల పోరు ఆసక్తికరంగా సాగింది. మూడు రోజులపాటు కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగింది.

  • Srikar T
  • Updated on: Jun 8, 2024
  • 6:27 am

Telangana: బ్యాలెట్‎పై పిచ్చి గీతలు.. మారిన ఎమ్మెల్సీ అభ్యర్థుల తలరాతలు..

వాళ్లంతా విద్యావంతులే.. డిగ్రీ, పీజీ చదివిన ఉన్నత విద్యావంతులు. పట్టభద్రులందరికీ అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుందని భావిస్తుంటారు. కానీ, ఓ విషయంలో వాళ్ళందరూ ఫెయిలయ్యారు. ఫెయిల్ అయ్యారంటే చదువులో కాదు.. ఓటు వేసే విషయంలో వీళ్లంతా ఫెయిల్ అయ్యారు. గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలో తమ ఓటు హక్కును సక్రమంగా వేయలేకపోవడంతో చెల్లని ఓట్లుగా పోలయ్యాయి. ప్రజాస్వామ్యానికి పునాదిగా భావించే ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారులు అనేక రకాలుగా అవగాహన కల్పించారు.

Rise of Rahul Gandhi: ఒక్కడే నడిచారు.. కమలాన్ని కుదిపారు..! రాహుల్‌ గాంధీ.. ద కింగ్‌ ఆఫ్‌ అలయన్స్‌..!

రాహుల్‌గాంధీపై ఎన్నెన్ని కామెంట్లో. తడబడ్డాడన్నారు, నిలబడలేడన్నారు, గెలవలేరన్నారు.. ఎంత తొక్కాలో అంత తొక్కే ప్రయత్నం చేశారు. బట్.. వీటన్నింటికీ ఒకేసారి సమాధానం ఇచ్చేశారు. కాంగ్రెస్‌ను ఫామ్‌లోకి తీసుకొచ్చి, కూటమిని నడిపించగలనని నిరూపించారు. సో, రాహుల్‌గాంధీ నెక్ట్స్‌ స్టెప్‌ ఏంటి? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకుంటారా? కూటమి తరపున ప్రధాని అభ్యర్థి అని చెప్పేస్తారా?

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!