తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆంధ్రప్రభలో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2000 నుంచి 2002 వరకు హైదరాబాద్ లో ఆంధ్రప్రభ రిపోర్టర్ గా, 2002 నుంచి 2003 జూలై వరకు ఆంధ్రప్రభలో మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ గా పని చేశారు. 2003 ఆగస్టులో టివి9 సంస్థలో అడుగు పెట్టారు. ప్రస్తుతం టివి9 ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై అనేక ప్రత్యేక కథనాలు రాశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. నల్లగొండ జిల్లాను పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్య, గిరిజన తండాల్లో శిశు విక్రయాలపై ప్రత్యేక కథనాలు రాసి జాతీయ స్థాయిలో ప్రాచూర్యం తీసుకువచ్చారు. 2005లో జరిగి ఘోర డెల్టా రైలు ప్రమాద సమయంలో అనేక మానవీయ కథనాలు రాశారు. 2009లో కృష్ణా నదికి వచ్చిన వరదలను కవర్ చేశారు. 2016లో జిల్లాలో కృష్ణ పుష్కరాలను కవర్ చేశారు. 2004 నుండి వరసగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను కవర్ చేస్తూ ప్రత్యేక కథనాలు రాశారు. పాలిటిక్స్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్, బిజినెస్కు సంబంధించిన కంటెంట్ను రాయగలరు. రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.
Telangana: బర్డ్ ప్లూ భయాల వేళ నెమలి మాంసంతో వ్యాపారం.. అడ్డంగా బుక్కయ్యాడు..
రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ భయాలు ఉన్నవేళ మాంసాహారులు... ముఖ్యంగా చికెన్ ప్రియులు భయపడుతున్నారు. ఫ్లూ భయంతో చికెన్ తినేందుకు చాలామంది వెనకాడుతూ ఉండటంతో.. నెమలి మాంసం అయితే కాస్త ఎక్కువ రేటు పెట్టి అయినా తీసుకుంటారని ఓ వ్కక్తి భావించాడు. జాతీయ పక్షి నెమలి మాంసాన్ని అమ్మేందుకు ప్రయత్నించాడు. విషయం బయటకు పొక్కి పోలీసులు, అటవీ సిబ్బంది వద్దకు చేరి కటకటాల పాలయ్యాడు.
- M Revan Reddy
- Updated on: Mar 24, 2025
- 5:27 pm
Hyderabad: రేషన్కార్డు ఉన్నవారికి పండుగ ముందే వచ్చింది.. ఉగాది నుంచి..
రేషన్ కార్డు దారులకు పండుగ ముందే వచ్చేసింది.. సీఎం రేవంత్ సర్కార్ ఈ ఉగాది నుంచి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయనుంది. ఈ పధకాన్ని హుజూర్ నగర్ లో ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. దీనిపై పూర్తి వివరాలు ఇలా..
- M Revan Reddy
- Updated on: Mar 24, 2025
- 9:45 am
Telangana: పండుగకు వెళ్లి వస్తుండగా ఎదురొచ్చిన మృత్యు శకటం.. చిన్నారులతో సహా నలుగురు మృతి
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం శివారులో చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు, కారు బలంగా ఢీకొనడంతో దంపతులతోపాటు ఎనిమిదేళ్ల కుమార్తె, మరో బాలుడు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
- M Revan Reddy
- Updated on: Mar 23, 2025
- 9:06 pm
Telangana: పిట్ట కొంచెం.. కూత ఘనం.. సీఎం నారా చంద్రబాబు మనుమడు రికార్డును తిరగ రాసిన బుడుతడు..
బాలల మేధో వికాసానికి చదరంగం ఎంతో దోహదపడుతుంది. ఈ చదరంగంలో కొందరు బాలలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. చదరంగంలో సరికొత్త ప్రపంచ రికార్డును సాధించి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు ఓ బుడతడు.180 బోర్డులపై వేగంగా పావులు కదుపుతూ 5,334 ప్రాబ్లమ్స్, కాంబినేషన్స్ అండ్ గేమ్స్ ఇన్ లాస్లో పోల్గారు ను విజయవంతంగా పూర్తి చేసి నోబెల్ ప్రపంచ రికార్డుల్లో చోటు సంపాదించాడు. అయితే ఈ రికార్డు ఇప్పటి వరకూ ఓ సీఎం మనవడి పేరిట ఉండగా.. ఆ రికార్డును తిరగరాశాడు ఈ బుడతడు. ఇంతకీ ఆ సీఎం మనవడు ఎవరు.. రికార్డ్ ని బీట్ చేసిన బుడతడు ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
- M Revan Reddy
- Updated on: Mar 17, 2025
- 11:26 am
Telangana: ఎలా వస్తాయ్రా ఇలాంటి ఐడియాలు..! పోలీస్ డీపీలు పెట్టి ఏం చేశారంటే..
సాధారణంగా పోలీసులంటే అందరికీ భయమే. పోలీసుల నుండి ఫోన్ వచ్చిందంటే వణికిపోతుంటారు. ముఖ్యంగా దొంగతనం చేసిన వారికి, సహకరించిన వారికి పోలీసు స్టేషన్ నుండి వచ్చే ఫోన్లు అంటే మరింత భయం.. అలాంటి భయాన్ని ఈ కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. చివరికి ఈ కేటుగాళ్లు ఎలా బుక్కయ్యారు..? పోలీసులు ఎలా పట్టుకున్నారు..? అనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Mar 16, 2025
- 12:30 pm
Telangana: నిత్యం తల్లిదండ్రులకు నరకం.. పశ్చాతాపంతో ఓ కొడుకు ఏం చేశాడంటే..?
అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదనే నానుడి నిజమవుతోంది. నవ మాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఆసరాగా ఉండాల్సిన కొందరు కొడుకులు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రులను అవమానించిన ఓ కొడుకు మాత్రం.. పశ్చాత్తాపంతో పోలీసుల సమక్షంలో వారి పాదాలను తాకి క్షమాపణలు కోరాడు.
- M Revan Reddy
- Updated on: Mar 14, 2025
- 11:22 am
నమ్మి చేరదిస్తే.. నరకం చూపాడు.. అన్నం పెట్టిన ఇంటికే సున్నం పెట్టిన కేటుగాడు..!
న్యూడ్ వీడియో కాల్స్ తో బ్లాక్ మెయిల్ చేస్తే.. మరికొందరు హనీట్రాప్ తో మోసాలకు పాల్పడుతున్నారు. నమ్మి చేరదీసిన వారినే.. ఊహించని రీతిలో మోసం చేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడిన ఓ కేటుగాడు డబ్బుల కోసం హనీట్రాప్ తో రిటైర్డు ఉద్యోగిని బ్లాక్ మెయిల్ చేశాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు.
- M Revan Reddy
- Updated on: Mar 13, 2025
- 11:44 am
Telangana: పోలీస్ కావాలనే తన కలను నెరవేర్చుకునేందుకు భలే స్కెచ్ వేశాడు.. చివరికి ఇలా..!
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాస రావుపై సినిమాల ప్రభావం ఎక్కువగా ఉండేది. దీంతో పోలీస్ కావాలని కలలు కన్నాడు. పదో తరగతితోనే ఆ కల నెరకపోవడంతో వక్రమార్గం పట్టాడు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. 15 ఏళ్ల కిందట పోలీస్ యూనిఫాం ధరించి మట్టపల్లి శివారులో లారీడ్రైవర్లను ఆపి డబ్బులు వసూలు చేశాడు.
- M Revan Reddy
- Updated on: Mar 11, 2025
- 10:08 am
Pranay murder case: సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో మరికొన్ని గంటల్లో తుది తీర్పు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో రేపే తుది తీర్పు వెలువడనుంది. నల్గొండ జిల్లాలో అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ప్రణయ్ని అతి కిరాతకంగా మట్టుపెట్టారు అమ్మాయి తరఫు వాళ్లు. ఈ కేసులో 8మంది నిందితులకు ఎలాంటి శిక్ష పడనుంది? ఎలాంటి తీర్పు వెలువడనుంది?
- M Revan Reddy
- Updated on: Mar 9, 2025
- 6:04 pm
Telangana: పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ సూపర్ ఆఫర్..
సమాజంలో ఏ రంగంలో రాణించాలన్నా విద్య ప్రధాన ఆయుధం. చిన్నతనం నుంచే విద్యార్థులకు విద్యపై మక్కువ పెంచేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పలు ప్రోత్సాహకాలు ఇస్తుంటారు. ఉత్తమ మార్కులు సాధిస్తే.. విద్యార్థులకు ఇష్టమైన గిఫ్టులు ఇస్తామని హామీ ఇస్తుంటారు. కానీ ఓ జిల్లా కలెక్టర్ మాత్రం.. పదో తరగతి విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆ ఆఫర్ ఆఫర్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
- M Revan Reddy
- Updated on: Mar 9, 2025
- 3:53 pm
Yadadri: కనులపండువగా లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవం.. గోవింద నామస్మరణతోమార్మోగిన ప్రాంగణం
Yadadri: ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశేష ఘట్టమైన కల్యాణోత్సవం శనివారం రాత్రి పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం వైభవోపేతంగా నిర్వహించారు. ఏకశిఖరవాసుడైన నారసింహుడు ఏకపత్నీవ్రతుడైన శ్రీరామచంద్రుడి అలంకరణలో..
- M Revan Reddy
- Updated on: Mar 9, 2025
- 7:15 am
Nalgonda: ఆస్పత్రి ఆవరణలో ఆడుకుంటూ మాయమైన బాలుడు.. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా
నల్లగొండకు చెందిన అహ్మద్, షమీమున్నిసా బేగం దంపతులు కొన్నేళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల అబూ అనే బాలుడు ఉన్నాడు. చిన్నచిన్న కూలి పనులు చేస్తూ.. ప్రభుత్వం అందించే ఐదు రూపాయల భోజనంతో పూట గడుపుకుంటున్నారు. ఆ వివరాలు..
- M Revan Reddy
- Updated on: Mar 6, 2025
- 11:21 am