AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

M Revan Reddy

M Revan Reddy

Senior Staff Reporter - TV9 Telugu

revan.muppa@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆంధ్రప్రభలో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2000 నుంచి 2002 వరకు హైదరాబాద్ లో ఆంధ్రప్రభ రిపోర్టర్ గా, 2002 నుంచి 2003 జూలై వరకు ఆంధ్రప్రభలో మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ గా పని చేశారు. 2003 ఆగస్టులో టివి9 సంస్థలో అడుగు పెట్టారు. ప్రస్తుతం టివి9 ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై అనేక ప్రత్యేక కథనాలు రాశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. నల్లగొండ జిల్లాను పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్య, గిరిజన తండాల్లో శిశు విక్రయాలపై ప్రత్యేక కథనాలు రాసి జాతీయ స్థాయిలో ప్రాచూర్యం తీసుకువచ్చారు. 2005లో జరిగి ఘోర డెల్టా రైలు ప్రమాద సమయంలో అనేక మానవీయ కథనాలు రాశారు. 2009లో కృష్ణా నదికి వచ్చిన వరదలను కవర్ చేశారు. 2016లో జిల్లాలో కృష్ణ పుష్కరాలను కవర్ చేశారు. 2004 నుండి వరసగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను కవర్ చేస్తూ ప్రత్యేక కథనాలు రాశారు. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలరు. రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.

Read More
వీళ్లు కదా అసలైన ప్రజాప్రతినిధులు! సిబ్బంది డుమ్మాతో.. పారిశుద్ధ్య పనుల్లో సర్పంచ్, వార్డు మెంబర్స్!

వీళ్లు కదా అసలైన ప్రజాప్రతినిధులు! సిబ్బంది డుమ్మాతో.. పారిశుద్ధ్య పనుల్లో సర్పంచ్, వార్డు మెంబర్స్!

గ్రామాన్ని శుభ్రం చేయాల్సిన సిబ్బంది విధులకు డుమ్మా కొట్టారు. గ్రామంలో చెత్త పేరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఆదేశాలు ఇచ్చే సర్పంచ్, వార్డు సభ్యులు.. సిబ్బంది రాలేదనీ చేతులెత్తేయకుండా పారిశుద్ధ్య కార్మికుల అవతారం ఎత్తారు. సర్పంచ్ ట్రాక్టర్ స్టీరింగ్ పట్టగా, వార్డు సభ్యులు చీపుర్లు పట్టారు. నల్లాల నీళ్లు కూడా వారే విడుదల చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

AIIMS బీబీనగర్‌కు వచ్చే రోగులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి OPD రిజిస్ట్రేషన్ టైమింగ్స్ మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే!

AIIMS బీబీనగర్‌కు వచ్చే రోగులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి OPD రిజిస్ట్రేషన్ టైమింగ్స్ మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే!

AIIMS Bibinagar OPD timings: యాదాద్రి జిల్లా AIIMS బీబీనగర్‌కు వచ్చే రోగులకు కీలక సమాచారం. ఆగస్టు 1, 2026 నుంచి OPD రిజిస్ట్రేషన్ సమయాల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. సూపర్ స్పెషాలిటీ విభాగాల OPD రోజుల వివరాలను కూడా ఆసుపత్రి ప్రకటించింది. ఆసుపత్రికి వెళ్లే ముందు కొత్త షెడ్యూల్‌ను తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచించారు.

శభాస్ శివాని.. నీ సేవకు సలాం! SIR ప్రక్రియలో దివ్యాంగురాలి డెడికేషన్!

శభాస్ శివాని.. నీ సేవకు సలాం! SIR ప్రక్రియలో దివ్యాంగురాలి డెడికేషన్!

దివ్యాంగురాలు శివాని, పీజీ పట్టభద్రురాలై, SIR సర్వేలో స్వచ్ఛందంగా 800కు పైగా దరఖాస్తులు పూర్తి చేసి ఆదర్శంగా నిలిచింది. విద్యావంతులు సైతం వెనుకడుగు వేస్తున్న పరిస్థితుల్లో, ఆమె తన శారీరక వైకల్యాన్ని లెక్కచేయకుండా సమాజ సేవకు అంకితమైంది. 'సేవకు సంకల్పం ముఖ్యం' అని నిరూపిస్తూ, వందలాది మందికి స్ఫూర్తినిచ్చింది.

చేనేత కళాకారుడు నేసింది చీర కాదు..! దేశం మెచ్చిన కళాఖండం.. వరించిన జాతీయ పురస్కారం..

చేనేత కళాకారుడు నేసింది చీర కాదు..! దేశం మెచ్చిన కళాఖండం.. వరించిన జాతీయ పురస్కారం..

ఒకరు బ్రష్‌తో బొమ్మలు వేస్తారు... మరొకరు ఉలితో శిల్పాలు చెక్కుతారు... కానీ ఈ కళాకారుడు మాత్రం నూలు పోగులతో చరిత్రనే నేసాడు..! ఒక చీరను కాదు... భారతీయ సంస్కృతిని మగ్గంపై ఆవిష్కరించాడు..! చేనేత కళ అంతరించిపోతుందనుకుంటున్న వేళ... చేనేత చావదు... ప్రతిభకు సరిహద్దులు లేవు అని నిరూపించాడు ఓ చేనేత కార్మికుడు. ఆ కార్మికుడు నేసిన చీర రాష్ట్రపతి భవన్ వరకు చేరింది. ఆ కార్మికుడికి జాతీయ చేనేత పురస్కారం వరించింది. ఆ కార్మికుడు ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

కుక్క కోసం పోలీస్ స్టేషన్‌కు.. ఆచూకీ చెబితే రూ.10 వేల రివార్డ్..

కుక్క కోసం పోలీస్ స్టేషన్‌కు.. ఆచూకీ చెబితే రూ.10 వేల రివార్డ్..

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఓ పెంపుడు కుక్క కనిపించకుండా పోవడంతో యజమాని పోలీసులను ఆశ్రయించాడు. సీసీటీవీ ఫుటేజీలో గుర్తుతెలియని వ్యక్తులు కుక్కను తీసుకెళ్లినట్లు గుర్తించిన నాగరాజు, వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తన పెంపుడు కుక్క ఆచూకీ చెప్పిన వారికి రూ.10 వేల నగదు బహుమతి ప్రకటించడం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Short Circuit: బూడిదైన ఆశలు… చిద్రమైన సొంతింటి కల.. డబ్బులన్ని అగ్నిపాలు..!

Short Circuit: బూడిదైన ఆశలు… చిద్రమైన సొంతింటి కల.. డబ్బులన్ని అగ్నిపాలు..!

Short Circuit: ఇంట్లోని నిత్యావసర వస్తువులు, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోవడంతో పాటు.. కొత్త ఇంటి కోసం ఎంతో కష్టపడి తెచ్చి దాచుకున్న రూ. 2.50 లక్షల నగదు పూర్తిగా బూడిదైపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, తెచ్చిన అప్పులకు వడ్డీ ఎలా కట్టాలో..

Telangana: ఈ ఖాకీల్లో కఠినత్వమే కాదు.. మనసులో మానవత్వం కూడా ఎక్కువే..

Telangana: ఈ ఖాకీల్లో కఠినత్వమే కాదు.. మనసులో మానవత్వం కూడా ఎక్కువే..

పోలీస్ అంటే నేరస్థులపై ఉక్కుపాదం.. చట్టం ముందు రాజీలేని తీరు, కఠిన నిర్ణయాలు అని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ అదే ఖాకీ చొక్కా వెనున మానవత్వంతో ఆలోచించే మనసు కూడా ఉంటుందనే విషయం మరోసారి రుజువైంది.తోటి ఉద్యోగి శాశ్వతంగా దూరం అవ్వడం ఎస్సైలను కదిలించింది. ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో.. ఒంటరైన ఫ్యామిలీకి అండగా నిలిచేందుకు రెండు రాష్ట్రాల ఖాకీలు ఒక్కటయ్యారు. అందరూ కలిసి ఆ ఫ్యామిలీకి భరోసా నిలిచారు.

Telangana: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌కు నల్లగొండ పోలీసుల చెక్.. ఎలా పట్టుకున్నారో తెలుసా..?

Telangana: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌కు నల్లగొండ పోలీసుల చెక్.. ఎలా పట్టుకున్నారో తెలుసా..?

మద్యం ఎర.. దొంగతనాల్లో స్పెషల్ ట్రైనింగ్.. సీసీటీవీల కళ్లు గప్పడంలో దిట్ట.. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసిరిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కథ ఎట్టకేలకు ముగిసింది. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ, ఏకంగా 9 మందితో గ్యాంగ్ ఏర్పాటు చేసి 40కి పైగా చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును నల్లగొండ పోలీసులు రట్టు చేశారు.

Telangana: ఇంట్లో అమ్మాయి.. చెట్టుకు అబ్బాయి.. తండ్రి సమాధిపై రక్తంతో పేర్లు.. అసలేం జరిగిందంటే..?

Telangana: ఇంట్లో అమ్మాయి.. చెట్టుకు అబ్బాయి.. తండ్రి సమాధిపై రక్తంతో పేర్లు.. అసలేం జరిగిందంటే..?

ఓ గ్రామంలో గంటల వ్యవధిలో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ ఇద్దరిలో ఒకరు అమ్మాయి కాగా.. మరొకరు అబ్బాయి. ఆత్మహత్యలుగా కనిపిస్తున్న ఈ ఘటనలు.. ఒకవైపు హత్య ఆరోపణలు.. మరోవైపు రక్తంతో రాసిన సందేశం.. ఇవన్నీ కలిసి డబుల్ డెత్ మిస్టరీగా మారాయి. ఈ మిస్టరీని ఛేదించే పనిలో పోలీసులు పడ్డారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

బాల సాహిత్యానికి అరుదైన గౌరవం.. మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..

బాల సాహిత్యానికి అరుదైన గౌరవం.. మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..

నల్లగొండ జిల్లా కనగల్ మండలానికి చెందిన బాల సాహితీవేత్త, ఉపాధ్యాయుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రచించిన "కంప్యూటర్ పిల్లలం" బాలగేయానికి అరుదైన గౌరవం లభించింది. మహారాష్ట్ర ప్రభుత్వం నాలుగో తరగతి తెలుగు "బాలభారతి" పాఠ్యపుస్తకంలో ఈ గేయాన్ని పాఠ్యాంశంగా చేర్చింది. పిల్లలకు సులభంగా అర్థమయ్యే పదాలు, లయబద్ధమైన శైలి, ఆధునిక సాంకేతికతపై అవగాహన కల్పించే అంశాలతో రూపొందిన ఈ గేయం వేలాది మంది విద్యార్థులకు చేరనుంది.

కన్న కొడుకును గొడ్డలితో నరికి చంపిన తల్లి.. ఎందుకో తెలుసా..?

కన్న కొడుకును గొడ్డలితో నరికి చంపిన తల్లి.. ఎందుకో తెలుసా..?

సూర్యాపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యం, మత్తు పదార్థాలకు బానిసై తరచూ డబ్బు కోసం వేధిస్తున్న కొడుకును ఓ తల్లి గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తొలుత ఎవరో దాడి చేశారని చెప్పిన తల్లి, పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో అరెస్టయ్యింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Telangana: అంత గుడ్డిగా ఎలా నమ్మావ్ భయ్యా.. ఈ కేటుగాళ్లు వేసిన ప్లాన్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

Telangana: అంత గుడ్డిగా ఎలా నమ్మావ్ భయ్యా.. ఈ కేటుగాళ్లు వేసిన ప్లాన్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

డబ్బు సంపాదించడానికి చెమటోడ్చాల్సిన అవసరం లేదనుకున్నారు.. ఒక్క డీల్‌తో లక్షలు వచ్చేస్తాయని కలలు కన్నారు. అసలు నోటుకు నకిలీ జతచేసి మార్కెట్‌లో కొత్త మోసానికి తెరలేపారు. అలా అని నకిలీ కరెన్సీ ఏమి ముద్రించలేదు. కానీ డబ్బు రెట్టింపు పేరుతో అమాయకులను బురిడీ కొట్టించారు.ఆసలు ఈ నకిలీ నోట్లతో ఈ ముఠా జనాలను ఎలా బురిడీ కొట్టించిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.