AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

M Revan Reddy

M Revan Reddy

Senior Staff Reporter - TV9 Telugu

revan.muppa@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆంధ్రప్రభలో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2000 నుంచి 2002 వరకు హైదరాబాద్ లో ఆంధ్రప్రభ రిపోర్టర్ గా, 2002 నుంచి 2003 జూలై వరకు ఆంధ్రప్రభలో మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ గా పని చేశారు. 2003 ఆగస్టులో టివి9 సంస్థలో అడుగు పెట్టారు. ప్రస్తుతం టివి9 ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై అనేక ప్రత్యేక కథనాలు రాశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. నల్లగొండ జిల్లాను పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్య, గిరిజన తండాల్లో శిశు విక్రయాలపై ప్రత్యేక కథనాలు రాసి జాతీయ స్థాయిలో ప్రాచూర్యం తీసుకువచ్చారు. 2005లో జరిగి ఘోర డెల్టా రైలు ప్రమాద సమయంలో అనేక మానవీయ కథనాలు రాశారు. 2009లో కృష్ణా నదికి వచ్చిన వరదలను కవర్ చేశారు. 2016లో జిల్లాలో కృష్ణ పుష్కరాలను కవర్ చేశారు. 2004 నుండి వరసగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను కవర్ చేస్తూ ప్రత్యేక కథనాలు రాశారు. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలరు. రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.

Read More
దొంగతనంలోనూ రూల్స్.. 17 ఏళ్ల చరిత్ర.. ఈ డిఫరెంట్ దొంగ గురించి తెలుసా..?

దొంగతనంలోనూ రూల్స్.. 17 ఏళ్ల చరిత్ర.. ఈ డిఫరెంట్ దొంగ గురించి తెలుసా..?

దొంగతనాల్లోనూ తనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకున్న వ్యక్తి కథ ఇది. హైదరాబాద్‌కు చెందిన కారు డ్రైవర్‌ పట్నంశెట్టి రాజు 2009లో సైకిల్‌ చోరీతో మొదలుపెట్టి పలుమార్లు జైలుకు వెళ్లినా తీరు మార్చుకోలేదు. కోదాడలో 10 ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అవసరానికి సరిపడే నగదు, బంగారం, వెండిని మాత్రమే తీసుకునేవాడని, ఆధారాలు దొరకకుండా జాగ్రత్తపడేవాడని పేర్కొన్నారు. పోలీసుల తనిఖీల్లో అతడి నుంచి 10 తులాల బంగారం, 47 తులాల వెండి, రూ.3.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ తెలిపారు.

Nalgonda: 2014లో మిస్సింగ్.. 11 ఏళ్ల తర్వాత కన్నవారికి చేరిన కుమార్తె.. ఎలాగంటే..?

Nalgonda: 2014లో మిస్సింగ్.. 11 ఏళ్ల తర్వాత కన్నవారికి చేరిన కుమార్తె.. ఎలాగంటే..?

ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ చిన్నారి. రోజులు గడిచాయి.. నెలలు గడిచాయి.. ఏళ్లు గడిచాయి. కానీ ఆచూకీ మాత్రం దొరకలేదు. కన్నవారు ఎన్నిసార్లు వెతికినా ఫలితం లేకుండా పోయింది. అప్పటి నుండి కన్న బిడ్డ కోసం కన్నీరు అవుతూనే ఉన్నారు. కాలం గడిచేకొద్దీ తమ బిడ్డ తిరిగి వస్తుందన్న ఆశ కూడా సన్నగిల్లిపోయింది. కానీ.. ఒక కార్డు ఆ కుటుంబంలో మళ్లీ వెలుగులు నింపింది.

మద్యం మత్తు.. స్నేహితుల మధ్య చిచ్చు.. యువకుడిపై యాసిడ్‌ దాడి, పరిస్థితి విషమం!

మద్యం మత్తు.. స్నేహితుల మధ్య చిచ్చు.. యువకుడిపై యాసిడ్‌ దాడి, పరిస్థితి విషమం!

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో స్నేహితులతో మద్యం తాగుతుండగా జరిగిన ఘర్షణ యువకుడి ప్రాణంపైకి తెచ్చింది. షేక్ గౌస్ అనే 19 ఏళ్ల యువకుడిపై స్నేహితులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలతో హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Telangana: శివలింగంపై గొడ్డలి గుర్తు.. అమావాస్య రాత్రి ఆ కొండపై నిద్రిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

Telangana: శివలింగంపై గొడ్డలి గుర్తు.. అమావాస్య రాత్రి ఆ కొండపై నిద్రిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

అమావాస్య రాత్రి ఆ కొండపై ఒక్క నిద్ర చేస్తే చాలు.. ఏళ్ల తరబడి పీడిస్తున్న రోగాలు, దోషాలు మటుమాయమవుతాయా? అడుగు దూరంలో మూడు భారీ బండరాళ్ల సందుల్లోంచి దూరితే సకల పాపాలు హరించుకుపోతాయా? త్రేతాయుగంలో సాక్షాత్తూ పరశురాముడే ప్రతిష్ఠించిన 108వ శివలింగ విశిష్టత ఏంటి? నల్లగొండ జిల్లాలో తెలంగాణ శ్రీశైలంగా విరాజిల్లుతున్న చెర్వుగట్టు జడల రామలింగేశ్వర స్వామి క్షేత్ర మహిమలు, ఆ లింగం వెనుక దాగి ఉన్న పరశురాముడి ఆయుధపు రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Telangana: క్యాన్సర్‌ చికిత్సకు వెళ్తే.. కిడ్నీ మాయం..

Telangana: క్యాన్సర్‌ చికిత్సకు వెళ్తే.. కిడ్నీ మాయం..

క్యాన్సర్‌ చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లింది.. కానీ ఆపరేషన్‌ తర్వాత ఊహించని షాక్‌ ఎదురైంది. కడుపునొప్పి తగ్గకపోవడంతో మరో ఆస్పత్రిలో స్కానింగ్‌ చేయించగా.. ఒక్కటే కిడ్నీ ఉందని తేలింది. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు రెండో కిడ్నీ ఏమైంది? ఎప్పుడు తొలగించారు?

El Nino: రైతన్నలకు శాపంగా మారిన ఎల్‌నీనో.. వర్షాలు లేక నల్గొండలో నెర్రెలు వారిన నేలలు..

El Nino: రైతన్నలకు శాపంగా మారిన ఎల్‌నీనో.. వర్షాలు లేక నల్గొండలో నెర్రెలు వారిన నేలలు..

వర్షాలు, పచ్చని పంటలతో కళకళలాడాల్సిన ప్రస్తుత వాతావరణాన్ని ఎల్ నినో ప్రభావం అస్తవ్యస్తంగా మార్చింది. వర్షాకాలం నాలుగో నెలలోకి అడుగుపెట్టినా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాను కరువు ఛాయలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఆకాశం వైపు రైతన్న ఆశగా చూస్తుంటే.. నేల మాత్రం నెర్రలు బారుతోంది. ఒకవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు పడిపోతున్న భూగర్భజలాలు.. ఇంకోవైపు చేతికొచ్చే దశలో ఎండిపోతున్న పంటలు. ఎల్‌నినో ప్రభావంతో అన్నదాతలు బిక్కబిక్కుమంటున్నారు.

మ్యాట్రీమోనీలో సంబంధాలు చూసే పేరెంట్స్‌కు బిగ్‌ అలర్ట్.. ఇలాంటి వారిని నమ్మారో అంతే..

మ్యాట్రీమోనీలో సంబంధాలు చూసే పేరెంట్స్‌కు బిగ్‌ అలర్ట్.. ఇలాంటి వారిని నమ్మారో అంతే..

తమ పిల్లలకు మంచి సంబంధం తేవాలనేది తల్లిదండ్రుల జీవత కల! కానీ అదే ఇప్పుడు కేటుగాళ్లకు కాసుల పంటగా మారింది. పెళ్లి సంబంధం కోసం వెతుకుతున్న పేరెంట్సే టార్గెట్‌గా కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు కేటుగాళ్లు. మ్యాట్రిమోనీ సంస్థల పేరుతో ఫోన్‌ కాల్స్, ఆకర్షణీయమైన ప్రొఫైల్స్, నమ్మించే మాటలు చెప్పి వారిని నట్టేట ముంచుతున్నారు. ఇదే ఈ కొత్త మోసాల పక్కా స్కెచ్.

Telangana: పంది మాసం కోసం భార్య ప్రాణం తీసిన భర్త.. అసలు ఏం జరిగిందంటే?

Telangana: పంది మాసం కోసం భార్య ప్రాణం తీసిన భర్త.. అసలు ఏం జరిగిందంటే?

కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం, సర్దుకపోవడం సర్వసాధారణం. కానీ ఇక్కడ ఇష్టమైన ఆహారం కోసం భార్యభర్తల మధ్య మొదలైన గొడవ.. చివరికి ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. చిన్న విషయంగా మొదలైన గొడవ క్షణాల్లో వివాదంగా మారింది.. ఇరుగుపొరుగు వారు సర్దిచెప్పినా.. భర్త మాత్రం ఆ గొడవను పక్కన పెట్టలేదు.. దాన్ని అలానే మనసులో పెట్టుకున్నాడు. అందరూ వెళ్లిపోయాక రాత్రివేళ ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై దాడి చేసి హతమార్చాడు. ఒక్క గొడవతో 66 ఏళ్ల జీవితం ముగిసింది. ఇంతకీ కట్టుకున్న భార్యను ఎందుకు హత్య చేశాడు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

వినాయకుడి బొజ్జలో సైబర్ సీక్రెట్..! గణపయ్య రూపంలో పోలీసుల వినూత్న వార్నింగ్..!

వినాయకుడి బొజ్జలో సైబర్ సీక్రెట్..! గణపయ్య రూపంలో పోలీసుల వినూత్న వార్నింగ్..!

గణేష్‌ నవరాత్రులు వచ్చాయంటే సందడి మామూలుగా ఉండదు.. మండపాలు, పూజలు, విరాళాల సేకరణతో ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. అయితే ఇదే సందడిని సైబర్‌ కేటుగాళ్లు క్యాష్‌ చేసుకునే ప్రమాదం ఉంది. ఫేక్‌ విరాళాల నుంచి నకిలీ QR కోడ్‌ల వరకు.. పండగ వేళ జరిగే సైబర్‌ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

పూజారి లేని కృష్ణాలయం.. భక్తుడే అర్చకుడు! తెలంగాణలోని ఈ ఆలయం ప్రత్యేకత ఇదే

పూజారి లేని కృష్ణాలయం.. భక్తుడే అర్చకుడు! తెలంగాణలోని ఈ ఆలయం ప్రత్యేకత ఇదే

సాధారణంగా ఆలయానికి వెళ్లామంటే.. స్వామి దర్శనం.. పూజారి పూజలు.. తీర్థప్రసాదాలు.. ఇలా ఓ పద్ధతి ఉంటుంది. కానీ ఈ ఆలయం.. మిగతా ఆలయాల్లా కాదు.. ఇక్కడ గంట మోగుతుంది, భక్తి వినిపిస్తుంది.. కానీ పూజారి కనిపించరు.. ఎందుకంటే మనసులో భక్తి ఉంటే చాలు.. స్వామిని స్వయంగా దర్శించుకోవచ్చు.. పూజించుకోవచ్చు. ఇక్కడ భక్తుడే పూజారి.. భక్తుడే అర్చకుడు. దేవుడికి దగ్గరవ్వడానికి పెద్ద పెద్ద ఆచారాలు అవసరం లేదని.. భక్తితో కూడిన మనసే ముఖ్యమని ఈ ఆలయం చాటుతోంది. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: వెయ్యికే సూపర్ ట్రిప్.. ఒక్క రోజులోనే సాగర్ అందాలు, బౌద్ధ చరిత్ర.. ఆర్టీసీ అదిరే ప్లాన్..

Telangana: వెయ్యికే సూపర్ ట్రిప్.. ఒక్క రోజులోనే సాగర్ అందాలు, బౌద్ధ చరిత్ర.. ఆర్టీసీ అదిరే ప్లాన్..

వీకెండ్‌ వచ్చిందంటే.. ఎక్కడికి వెళ్లాలి? ఎంత ఖర్చవుతుంది? అన్న లెక్కలే ఇక అవసరం లేదని తెలంగాణ టూరిజం శాఖ అంటుంది. కేవలం వెయ్యి రూపాయలు.. ఒక రోజు సమయం.. హైదరాబాద్‌ నుంచి బయలుదేరితే చాలు.. చరిత్రను పలకరిస్తూ.. బౌద్ధ వారసత్వాన్ని చూస్తూ.. సాగర్‌ అందాలను ఆస్వాదిస్తూ తిరిగొచ్చే అవకాశం కల్పిస్తోంది.

ఎంబీఏ చదివి.. మార్కెటింగ్ మేనేజర్‌గా మంచి ఆదాయం.. ఈ ఒక్క తప్పుతో దొంగగా మాారాడు..

ఎంబీఏ చదివి.. మార్కెటింగ్ మేనేజర్‌గా మంచి ఆదాయం.. ఈ ఒక్క తప్పుతో దొంగగా మాారాడు..

బెట్టింగ్ వ్యవసం ఓ యువకుడిని దొంగగా మార్చింది. ఏంబీఏ చదివి మార్కెటింగ్ మేనేజర్‌గా మంచి ఉద్యోగం చేస్తే బెట్టింగ్‌కు బానిసయ్యాడు. బెట్టింగ్‌లో లక్షలు పొగోట్టుకున్నాడు. దీంతో ఆ అప్పులు తీర్చేందుకు దొంగగా అవతారమెత్తాడు. చివరికి పోలీసులకు పట్టుబడటంతో కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే..