AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

M Revan Reddy

M Revan Reddy

Senior Staff Reporter - TV9 Telugu

revan.muppa@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆంధ్రప్రభలో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2000 నుంచి 2002 వరకు హైదరాబాద్ లో ఆంధ్రప్రభ రిపోర్టర్ గా, 2002 నుంచి 2003 జూలై వరకు ఆంధ్రప్రభలో మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ గా పని చేశారు. 2003 ఆగస్టులో టివి9 సంస్థలో అడుగు పెట్టారు. ప్రస్తుతం టివి9 ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై అనేక ప్రత్యేక కథనాలు రాశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. నల్లగొండ జిల్లాను పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్య, గిరిజన తండాల్లో శిశు విక్రయాలపై ప్రత్యేక కథనాలు రాసి జాతీయ స్థాయిలో ప్రాచూర్యం తీసుకువచ్చారు. 2005లో జరిగి ఘోర డెల్టా రైలు ప్రమాద సమయంలో అనేక మానవీయ కథనాలు రాశారు. 2009లో కృష్ణా నదికి వచ్చిన వరదలను కవర్ చేశారు. 2016లో జిల్లాలో కృష్ణ పుష్కరాలను కవర్ చేశారు. 2004 నుండి వరసగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను కవర్ చేస్తూ ప్రత్యేక కథనాలు రాశారు. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలరు. రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.

Read More
Suryapet: ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన బ్యాంక్ మేనేజర్..

Suryapet: ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన బ్యాంక్ మేనేజర్..

సంతకం అనేది కేవలం పేరు రాసే గుర్తు కాదు.. ఒక వ్యక్తి అంగీకారానికి, అధికారానికి, బాధ్యతకు చట్టబద్ధమైన ముద్ర. ఒప్పందాలు, బ్యాంకింగ్ పత్రాలు,ఆస్తి పత్రాలు వంటి వాటిలో సంతకం కీలకంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో సంతకానికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఇటీవల కొందరు కేటుగాళ్లు సామాన్యుల నుంచి ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ జిల్లా అత్యున్నత పాలనాధికారి సంతకాన్ని ఓ కేటుగాడు ఫోర్జరీ చేశాడు చివరికి పోలీసుల రంగ ప్రవేశంతో కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

సూపర్ సర్పంచ్ సాబ్.. బడికి.. ఇక సైకిల్‌పై..! పేద విద్యార్థుల నడక కష్టాలకు చెక్..

సూపర్ సర్పంచ్ సాబ్.. బడికి.. ఇక సైకిల్‌పై..! పేద విద్యార్థుల నడక కష్టాలకు చెక్..

ప్రతిరోజూ బడికి వెళ్లాలంటే కిలోమీటర్ల కొద్దీ నడక..! ఉదయం ఇంటి నుంచి బయలుదేరితే.. తిరిగి ఇంటికి చేరే వరకు కాళ్లకు విశ్రాంతి ఉండదు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు రవాణా సౌకర్యం లేకపోవడంతో.. చదువుపై ఆసక్తి ఉన్నా నడక కష్టం వారి విద్యకు అడ్డంకిగా మారింది. వారి నడక కష్టాలను చూసి ఓ ప్రజాప్రతినిధి చలించిపోయారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా.. తన దాతృత్వంలోవారి నడక కష్టాలకు చెక్ పెట్టారు. ఓ ప్రజాప్రతినిధి తీసుకున్న చిన్న నిర్ణయం.. విద్యార్థుల జీవితాల్లో తెచ్చిన పెద్ద మార్పు. ఆ మార్పు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే

Telangana: ఫ్లెక్సీలు లేవు.. సోషల్ మీడియా పోస్ట్‌లు లేవు.. ప్లాస్టిక్‌పై వార్డు మెంబర్ వినూత్న పోరాటం!

Telangana: ఫ్లెక్సీలు లేవు.. సోషల్ మీడియా పోస్ట్‌లు లేవు.. ప్లాస్టిక్‌పై వార్డు మెంబర్ వినూత్న పోరాటం!

ప్లాస్టిక్‌.. చూస్తే చిన్న వస్తువే.. కానీ పర్యావరణానికి మాత్రం పెను ముప్పు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలంటూ ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా.. ప్రజల్లో మాత్రం ఆశించిన స్థాయిలో మార్పు రావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఓ గ్రామ వార్డు సభ్యుడు వినూత్నంగా ఆలోచించారు. ఫ్లెక్సీలు కాదు.. మైకులు కాదు.. సోషల్‌ మీడియా పోస్టులు అంతకంటే కాదు.. అతడు చేసిన వినూత్న ప్రయత్నమెంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

దేశభక్తికి నిలువెత్తు సాక్ష్యం.. ఆ గ్రామంలో 80 ఏళ్లుగా నిరంతరం రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా..

దేశభక్తికి నిలువెత్తు సాక్ష్యం.. ఆ గ్రామంలో 80 ఏళ్లుగా నిరంతరం రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా..

ఎక్కడైనా జాతీయ జెండా.. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున ఎగురుతుంది.. కానీ ఓ గ్రామంలో మాత్రం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు నుంచి మువ్వన్నెల జెండా నిరంతరం రెపరెపలాడుతూనే ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు.. దశాబ్దాలు దాటిపోయాయి. ఆ జెండా వెనుక మూడు రంగులే కాదు.. ముగ్గురు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగగాథ ఉంది. దేశభక్తిని తరతరాలకు అందించాలనే సంకల్పం ఉంది. ఇంతకీ.. 80 ఏళ్లుగా జాతీయ జెండాను అవనతం కానివ్వని ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఏ స్టోరీ చదవాల్సిందే.

ఉదయం సాయి స్మరణ.. మధ్యాహ్నం జనగణమన.. ఈ ఆలయంలో రోజూ ఇదే ప్రత్యేకత!

ఉదయం సాయి స్మరణ.. మధ్యాహ్నం జనగణమన.. ఈ ఆలయంలో రోజూ ఇదే ప్రత్యేకత!

సాధారణంగా ఆలయాల్లో మంత్రాలు, భజనలు, హారతులు వినిపిస్తాయి. కానీ నల్గొండ జిల్లా చింతపల్లిలోని సాయిబాబా ఆలయంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 12.30 గంటలకు ‘జనగణమన’ మార్మోగుతుంది. భక్తితో పాటు దేశభక్తిని పెంపొందించే ఈ ప్రత్యేక సంప్రదాయం గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పంచాయితీ కోసం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన మహిళతో ఎఫైర్.. భక్షకుడిగా మారిన రక్షకుడు..

పంచాయితీ కోసం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన మహిళతో ఎఫైర్.. భక్షకుడిగా మారిన రక్షకుడు..

సూర్యాపేట జిల్లా మోతె మండలంలో దంపతుల హత్య కేసు సంచలనం సృష్టించింది. బీక్యా తండాకు చెందిన నాగు, బూబా దంపతులను మోతె పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ షరీఫ్‌, మరో వ్యక్తి సుందరయ్య కలిసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. రూ.3 లక్షల అప్పు, వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్యకు కుట్ర పన్నినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Telangana: పంద్రాగస్ట్‌ సంబరాల్లో గుండెలు పిండేసే విషాదం.. గేమ్స్ ఆడుతుండగా ఊహించని ప్రమాదం!

Telangana: పంద్రాగస్ట్‌ సంబరాల్లో గుండెలు పిండేసే విషాదం.. గేమ్స్ ఆడుతుండగా ఊహించని ప్రమాదం!

ఆగస్ట్‌ 15 దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు.. ఆరోజును ఆనందంగా జరుపుకునేందుకు రెండ్రోజుల ముందునుంచే అందరూ ఏర్పాటు చేస్తుంటారు. కొన్ని స్కూళ్లలో ఆటల పోటీలు కూడా నిర్వహిస్తారు. ఇలానే ఓ స్కూల్‌లో కూడా ఇండిపెండెన్స్ డే సందర్భంగా గేమ్స్ పెట్టారు. చిన్నారులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. కానీ క్షణాల్లోనే వారి ఉత్సాహం విషాదంగా మారింది. ఊహించని ఓ ప్రమాదం ఓ చిన్నారి తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. అసలు ఆ స్కూల్‌లో ఏ జరిగిందో తెలుసుకోవాలి అంటే ఆ స్టోరీ చదవాల్సిందే!

ట్రెండ్ మారింది గురూ..! బస్టాండ్‌లో అందరిచూపు ఆ బోర్డుపైనే..

ట్రెండ్ మారింది గురూ..! బస్టాండ్‌లో అందరిచూపు ఆ బోర్డుపైనే..

సూర్యాపేట కొత్త ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన ఓ బోర్డు ఇప్పుడు ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇన్నాళ్లూ మహిళలు, వృద్ధులు, దివ్యాంగులను గౌరవించాలనే సందేశాలు కనిపించగా.. తాజాగా **“పురుషులను గౌరవించండి”** అంటూ కనిపించిన బోర్డు ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే దీని ఉద్దేశం పురుషులకు మాత్రమే ప్రత్యేక గౌరవం ఇవ్వడం కాదని అధికారులు చెబుతున్నారు.

Suryapet: ఆవులను తోలుకెళ్లిన దంపతులు.. తెల్లారేసరికి విగతజీవులు

Suryapet: ఆవులను తోలుకెళ్లిన దంపతులు.. తెల్లారేసరికి విగతజీవులు

రోజూ మాదిరిగానే ఆవులను తోలుకుని పొలం వద్దకు బయల్దేరిన ఆ దంపతులకు అదే చివరి ప్రయాణమైంది. రాత్రి పది గంటల సమయంలో సీసీ కెమెరాల్లో కనిపించిన భార్యాభర్తలు.. ఆ తర్వాత ఏమయ్యారో ఎవరికీ తెలియలేదు. తెల్లారేసరికి ఓ మట్టి రోడ్డు పక్కన గుంతలో విగత జీవులుగా పడి ఉన్నారు. పూడ్చిపెట్టిన రెండు మృతదేహాలు తీవ్ర కలకలం రేపాయి. తల వెనుక భాగంలో బలమైన గాయాలు.. రక్తపు మరకలు.. మృతదేహాలను పాతిపెట్టిన ఆనవాళ్లు.. అసలు ఈ దంపతులను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? మిస్టరీగా మారిన డబుల్ మర్డర్ ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే తనువు చాలించిన తల్లి..

ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే తనువు చాలించిన తల్లి..

పండంటి మగబిడ్డ కోసం ఎదురు చూసిన ఆ కుటుంబానికి చివరకు కొడుకు పుట్టాడు. ఇంట్లో ఆనందం వెల్లివిరియాల్సిన వేళ.. ఊహించని విషాదం ఆ కుటుంబాన్ని కుదిపేసింది. ఎనిమిది రోజుల పసిబిడ్డను తల్లి ఒడికి దూరం చేసింది. ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలకు తల్లిగా ఉన్న ఆమె.. నాలుగోసారి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ ఆనందం ఆ కుటుంబంలో ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ కుటుంబంలో నెలకొన్న విషాదమెంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

తెలంగాణ ఉపాధ్యాయుడికి అరుదైన గుర్తింపు.. మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ టీచర్ సాహిత్యం..!

తెలంగాణ ఉపాధ్యాయుడికి అరుదైన గుర్తింపు.. మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ టీచర్ సాహిత్యం..!

తెలంగాణ మట్టిలో పుట్టిన ఉపాధ్యాయుడి కలం నుంచి జాలువారిన అద్భుతమైన కథకు పక్క రాష్ట్రంలో అరుదైన గౌరవం దక్కింది. నాణ్యమైన సాహిత్యానికి, చిన్నారులను ఆకట్టుకునే సృజనాత్మకతకు భాషా భేదాలు అడ్డుకావని నిరూపిస్తూ.. పొరుగు రాష్ట్ర విద్యాశాఖ ఈ కథను తమ పాఠ్యాంశంగా ఎంపిక చేసింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో వేలాది మంది పాఠశాల విద్యార్థులు మన తెలంగాణ గురువు రాసిన అమృతమైన కథను చదువుకోబోతున్నారు.

ఉపాధి హామి పనిలో భాగంగా మట్టి తవ్వుతుండగా ఏం బయటపడ్డాయో తెలుసా..?

ఉపాధి హామి పనిలో భాగంగా మట్టి తవ్వుతుండగా ఏం బయటపడ్డాయో తెలుసా..?

వేల ఏళ్ల క్రితం మనిషి ఎలా జీవించాడు..? ఎక్కడ నివసించాడు..? వేట ఎలా సాగింది..? ప్రకృతిని ఎలా చిత్రించాడు..? అనే విషయాలను తెలుసుకోవడానికి మనం చరిత్ర పుస్తకాలను తిరగేస్తుంటాం. కానీ.. తెలంగాణ నేలపై వెలుగు చూస్తున్న పురాతన ఆనవాళ్లు.. చరిత్రను మన కళ్ల ముందే నిలబెడుతున్నాయి. జిల్లాలో బయట పడుతున్న కొండ గుహలు, రాతి పనిముట్లు, వర్ణచిత్రాలు, పురాతన ఆవాసాల ఆనవాళ్లు ఆసక్తి రేపుతున్నాయి.