AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

M Revan Reddy

M Revan Reddy

Senior Staff Reporter - TV9 Telugu

revan.muppa@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆంధ్రప్రభలో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2000 నుంచి 2002 వరకు హైదరాబాద్ లో ఆంధ్రప్రభ రిపోర్టర్ గా, 2002 నుంచి 2003 జూలై వరకు ఆంధ్రప్రభలో మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ గా పని చేశారు. 2003 ఆగస్టులో టివి9 సంస్థలో అడుగు పెట్టారు. ప్రస్తుతం టివి9 ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై అనేక ప్రత్యేక కథనాలు రాశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. నల్లగొండ జిల్లాను పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్య, గిరిజన తండాల్లో శిశు విక్రయాలపై ప్రత్యేక కథనాలు రాసి జాతీయ స్థాయిలో ప్రాచూర్యం తీసుకువచ్చారు. 2005లో జరిగి ఘోర డెల్టా రైలు ప్రమాద సమయంలో అనేక మానవీయ కథనాలు రాశారు. 2009లో కృష్ణా నదికి వచ్చిన వరదలను కవర్ చేశారు. 2016లో జిల్లాలో కృష్ణ పుష్కరాలను కవర్ చేశారు. 2004 నుండి వరసగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను కవర్ చేస్తూ ప్రత్యేక కథనాలు రాశారు. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలరు. రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.

Read More
సర్కార్‌ బడిలో చేరితే బంపర్ గిఫ్ట్స్.. సైకిల్, బియ్యం, బుక్స్, కుక్కర్ అన్నీ Free.. Free! ఆకర్షిస్తున్న ఆఫర్లు

సర్కార్‌ బడిలో చేరితే బంపర్ గిఫ్ట్స్.. సైకిల్, బియ్యం, బుక్స్, కుక్కర్ అన్నీ Free.. Free! ఆకర్షిస్తున్న ఆఫర్లు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఆ ఊరి గ్రామపంచాయతీ వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించే తల్లిదండ్రులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబానికి నెలకు 25 కిలోల రేషన్ బియ్యం, ఒక రైస్ కుక్కర్, విద్యార్థులకు నోట్‌బుక్స్‌, స్కూల్ బ్యాగులు, ఇతర విద్యా సామగ్రిని ఉచితంగా అందజేయనున్నారు. అదేవిధంగా 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు సైకిళ్లు కూడా పంపిణీ చేయనున్నట్లు పోస్టర్‌లో పేర్కొన్నారు..

చేతులెట్లా వచ్చాయిరా..! పసిపిల్లలపై పాశవికం.. చేతులు, కాళ్లు కట్టి వేడి గరిటెతో చిత్రహింసలు!

చేతులెట్లా వచ్చాయిరా..! పసిపిల్లలపై పాశవికం.. చేతులు, కాళ్లు కట్టి వేడి గరిటెతో చిత్రహింసలు!

చిన్నపిల్లలు అంటే దైవంతో సమానం అంటారు. వారికి కావాల్సింది ఆదరణ, ప్రేమ, ఆకలి తీర్చే అన్నం. కానీ ఆకలి తీర్చాల్సిన చేతులు, ఆప్యాయత పంచాల్సిన మనసులే చిన్నారులపై దాష్టీకానికి పాల్పడ్డాయి. పసి పిల్లల కాళ్లు, చేతులు కట్టేసి, వేడి గరిటెతో శరీరాన్ని కాల్చడంతో ఆ చిన్నారులు నరక యాతన భరించలేక చేసిన అరుపులు, గుండెలను పిండేశాయి. మానవత్వానికే మచ్చ తెచ్చేలా దాష్టీకానికి పాల్పడింది ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

Telangana: రూ.10 నాణేల బస్తాతో బైక్ షోరూంకు వ్యక్తి.. అతను చెప్పింది విని సిబ్బంది షాక్

Telangana: రూ.10 నాణేల బస్తాతో బైక్ షోరూంకు వ్యక్తి.. అతను చెప్పింది విని సిబ్బంది షాక్

సాధారణంగా ఎవరైనా కొత్త బైక్ కొనాలంటే నెట్ బ్యాంకింగ్, చెక్కులు లేదా కరెన్సీ నోట్లతో చెల్లిస్తుంటారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచించారు. తన కలల బైక్ 'స్ప్లెండర్ ప్లస్' సొంతం చేసుకోవడానికి ఆయన ఎంచుకున్న మార్గం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ వ్యక్తి చేసిన వినూత్న ప్రయోగం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: అయ్య బాబోయ్.. నూనెను కూడా వదిలిపెట్టరా..? రోడ్డుపై జనం ప్రాకులాట..

Telangana: అయ్య బాబోయ్.. నూనెను కూడా వదిలిపెట్టరా..? రోడ్డుపై జనం ప్రాకులాట..

సూర్యాపేట జిల్లా కోదాడలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వంట నూనె డబ్బాలు కింద పడగా.. రోడ్లుపై పడిన నూనెను పట్టుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. దీంతో రోడ్డంతా నిండిపోయింది. చివరికి యజమాని తెలుసుకుని మిగిలిన నూనెను తిరిగి డబ్బాల్లోకి సేకరించాడు. మరిన్ని వివరాలు చూస్తే..

Video: సోమవారం తెరుచుకున్న క్లాస్ రూమ్.. కనిపించిన సీన్ చూసి విద్యార్థుల పరుగో.. పరుగు!

Video: సోమవారం తెరుచుకున్న క్లాస్ రూమ్.. కనిపించిన సీన్ చూసి విద్యార్థుల పరుగో.. పరుగు!

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పొలుమళ్ల గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం (జూలై 06) ఉదయం పాములు ప్రత్యక్షమవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తరగతి గదిలో ఒకేసారి మూడు పాము పిల్లలు కనిపించడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు.

Telangana: 100 ఏళ్లుగా మద్యం సీసా అడుగుపెట్టని  స్ఫూర్తిదాయక గ్రామం..

Telangana: 100 ఏళ్లుగా మద్యం సీసా అడుగుపెట్టని స్ఫూర్తిదాయక గ్రామం..

మద్యం మనిషిని నాశనం చేస్తుంది... కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తుంది... సమాజాన్ని కలుషితం చేస్తుంది. మద్యపానాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. కానీ ఓ చిన్న గ్రామం మాత్రం... వందేళ్ల క్రితమే ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి నేటికీ తలవంచ లేదు. తరాలు మారాయి... కాలం మారింది... కానీ ఆ గ్రామంలోకి మద్యం సీసా మాత్రం రాలేదు. అక్కడ మత్తుకు బదులు మానవత్వానికి విలువ ఉంది. ఆ గ్రామమేదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: ఆట కోసం వెళ్లారు.. ఎంతకు తిరిగిరాకపోవడంతో ఊర చివర బావిలో చూడగా..

Telangana: ఆట కోసం వెళ్లారు.. ఎంతకు తిరిగిరాకపోవడంతో ఊర చివర బావిలో చూడగా..

ఆ బాల్య స్నేహితులు.. ఒకే దారిలో బడికి వెళ్లేవారు.. ఒకే మైదానంలో ఆడుకునేవారు.. కానీ.. చివరికి ఒకే సారి ప్రాణాలు కోల్పోయారు. ఆట కోసం వెళ్లిన పిల్లల అడుగులు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాయి. ఒక చిన్న సరదా ఆ రెండు కుటుంబాల్లో ఎప్పటికీ తీరని విషాదాన్ని మిగిల్చింది.

పంక్షన్‌‌లో సరదాగా గడిపారు.. తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఘోరం.. కళ్లముందే భార్య, ఇద్దరు పిల్లలు సహా..

పంక్షన్‌‌లో సరదాగా గడిపారు.. తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఘోరం.. కళ్లముందే భార్య, ఇద్దరు పిల్లలు సహా..

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కారును వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఎస్‌బీఐ బ్యాంకు మేనేజర్ వీవీ ప్రసాద్ భార్య, ఇద్దరు పిల్లలు, స్నేహితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఇవేం కష్టాలు.. ఉపాధి కూలీలకు వింత ‘ఫేస్’ పరీక్ష.. బొగ్గు రాసుకుంటేనే పని..!

ఇవేం కష్టాలు.. ఉపాధి కూలీలకు వింత ‘ఫేస్’ పరీక్ష.. బొగ్గు రాసుకుంటేనే పని..!

ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత పేరుతో అమలు చేస్తున్న ఫేస్ రికగ్నిషన్ విధానం గ్రామీణ కూలీలకు కొత్త తలనొప్పిగా మారింది. కొత్తగా ప్రవేశపెట్టిన యాప్ ముఖాన్ని గుర్తించకపోవడంతో కూలీలు నానా కష్టాలు పడుతున్నారు. ఎండలో గంటల తరబడి కష్టపడే ఉపాధి కూలీలు ఇప్పుడు పనికంటే ముందు ఓ పరీక్ష పాస్ కావాల్సి వస్తోంది. ఈ పరీక్ష పాస్ రావడానికి కూలీలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

యాదాద్రి దర్శనం ఇక మరింత ఈజీ.. ఒకే రోజులో ఆధ్యాత్మికం + పర్యాటకం! ఎలాగంటే..

యాదాద్రి దర్శనం ఇక మరింత ఈజీ.. ఒకే రోజులో ఆధ్యాత్మికం + పర్యాటకం! ఎలాగంటే..

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రం.. ఇప్పటి వరకు భక్తుల గమ్యస్థానంగానే ఉంది. ఇకపై పర్యాటకులకు కూడా హాట్ డెస్టినేషన్‌గా మారబోతోంది. ఆలయ దర్శనంతో పాటు చరిత్ర, సంస్కృతి, హస్తకళలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఒకే రోజులో చూపించే వినూత్న టూరిజం ప్యాకేజీని తెలంగాణ టూరిజం తీసుకొచ్చింది. దీంతో యాదాద్రి జిల్లా పర్యాటక మ్యాప్‌పై మరింత బలంగా నిలవబోతోంది.

iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!

iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనను సహాయం కోరిన వారిని తమ్ముడు రాజగోపాల్ రెడ్డి వద్దకు పంపుతున్నారు. తన వద్ద డబ్బులు లేవని, ప్రభుత్వ క్వార్టర్లలో ఉంటున్నానని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి పెద్ద దానకర్ణుడని, ఆయన ఉండగా తాను ఏం చేస్తానని సరదా కామెంట్ చేశారు.

ఘోరం.. కన్నతల్లిని బండరాయితో కొట్టి చంపి.. కొడుకు ఆత్మహత్య! కారణం అదేనా?

ఘోరం.. కన్నతల్లిని బండరాయితో కొట్టి చంపి.. కొడుకు ఆత్మహత్య! కారణం అదేనా?

యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యంత విషాదకరమైన, ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఒక కొడుకు, ఆ తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ చేపట్టారు.