తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆంధ్రప్రభలో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2000 నుంచి 2002 వరకు హైదరాబాద్ లో ఆంధ్రప్రభ రిపోర్టర్ గా, 2002 నుంచి 2003 జూలై వరకు ఆంధ్రప్రభలో మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ గా పని చేశారు. 2003 ఆగస్టులో టివి9 సంస్థలో అడుగు పెట్టారు. ప్రస్తుతం టివి9 ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై అనేక ప్రత్యేక కథనాలు రాశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. నల్లగొండ జిల్లాను పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్య, గిరిజన తండాల్లో శిశు విక్రయాలపై ప్రత్యేక కథనాలు రాసి జాతీయ స్థాయిలో ప్రాచూర్యం తీసుకువచ్చారు. 2005లో జరిగి ఘోర డెల్టా రైలు ప్రమాద సమయంలో అనేక మానవీయ కథనాలు రాశారు. 2009లో కృష్ణా నదికి వచ్చిన వరదలను కవర్ చేశారు. 2016లో జిల్లాలో కృష్ణ పుష్కరాలను కవర్ చేశారు. 2004 నుండి వరసగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను కవర్ చేస్తూ ప్రత్యేక కథనాలు రాశారు. పాలిటిక్స్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్, బిజినెస్కు సంబంధించిన కంటెంట్ను రాయగలరు. రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.
పనికిరాని విషయంపై గొడవ.. ఒకరి ప్రాణం బలి
Nalgonda news today in Telugu: నల్లగొండ జిల్లా కనగల్ మండలం దర్వేశిపురం రేణుక ఎల్లమ్మ ఆలయానికి ఆది, గురు వారాల్లో భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు.దర్వేశిపురంలోని ఫంక్షన్ హాల్ లో సైదులు (56), మేగావత్ గోపిలు నైట్ వాచ్మెన్ లుగా పని చేస్తున్నారు.
- M Revan Reddy
- Updated on: Apr 20, 2026
- 5:11 pm
Telangana: ఛీ.. ఛీ.. నువ్వేం చెల్లివమ్మా.. ఆస్తికోసం కళ్లులేని అన్ననే నడి రోడ్డుపై…
ఆధునిక సమాజంలో మానవ సంబంధాలన్నీ.. ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. ఆస్తుల కోసం ఆప్తులు, తోడబుట్టిన వారిని కాదనుకుంటున్నారు కొందరు వ్యక్తులు.. తాజాగా ఇలాంటి ఘటనే యాదాద్రి జిల్లాలో వెలుగు చూసింది. డబ్బుపై ఉన్న మోజుతో ఓ మహిళ ఏకంగా త తనను,తల్లిని మోసం చేసి ఆస్తి మెత్తం కాజేసిందని అంధ దంపతులు సోదరి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు.
- M Revan Reddy
- Updated on: Apr 20, 2026
- 2:47 pm
ఛీ ఛీ.. నువ్వేం మనిషివిరా.. భార్యపై కోపంతో కూతురిని చంపాడు.. బైక్పై తీసుకెళ్లి..
కుటుంబ కలహాలు, భార్యభర్తల మధ్య గొడవలకు చిన్నారులు బలి అవుతున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లిదండ్రులే.. ఆవేశంతో అభం శుభం తెలియని చిన్నారులను అంతమొందిస్తున్నారు. ముక్కు పచ్చలారని పసికందులు ప్రాణాలను మొగ్గలోనే తుంచేస్తున్నారు. భార్యపై కోపంతో ఓ తండ్రి తన రెండేళ్ల కుమార్తెను ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
- M Revan Reddy
- Updated on: Apr 16, 2026
- 9:34 am
Telangana: రూ.కోటి విలువైన పాన్ మసాలాతో పరారైన డ్రైవర్.. వాటితో ఏం చేశాడో తెలిస్తే..
ఇటీవల కాలంలో అన్నం పెడుతున్న సంస్థలు, యజమానులను కొందరు ఉద్యోగులు మోసం చేస్తున్నారు. ఉపాధి కల్పిస్తున్న సంస్థ కార్యకలాపాలపై కన్నేసి యాజమానికే కుచ్చుటోపీలు పెడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఏకంగా తన ఓనర్కు తెలియకుండా కోటి రూపాయల సామాగ్రిని మాయం చేశాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
- M Revan Reddy
- Updated on: Apr 15, 2026
- 4:32 pm
వామ్మో వీడు మాములోడు కాదు.. అటెండర్ ‘అప్-డేట్’ అయ్యాడు.. బ్యాంకును ‘అవుట్-డేట్’ చేశాడు!
అతను ఓ బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగి. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డాడు. ఎలాగైనా భారీగా సంపాదించాలనుకున్నాడు. పథకం వేశాడు. తాను పని చేసే బ్యాంకునే బురిడీ కొట్టించాడు. 2.65 కోట్ల రూపాయలు స్వాహా చేశారు. ఆ బ్యాంకు ఉద్యోగి.. బ్యాంకును ఎలా బురిడీ కొట్టించాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
- M Revan Reddy
- Updated on: Apr 15, 2026
- 3:05 pm
మళ్లీ వచ్చారోయ్.. మాయదారి VIPS.. పేరు మార్చి మరో మోసానికి తెర..!
పేద మధ్యతరగతి ప్రజలకు అధిక వడ్డీ, పెట్టుబడులు పెట్టండి అధిక లాభాలు ఇస్తామంటే జనం గుడ్డిగా నమ్మేస్తారు. పెట్టిన ప్రతి రూపాయికి భారీ లాభం, అదనంగా క్యాష్ బ్యాక్, కమిషన్ల వర్షం ఇలాంటి మాయ మాటలతో అమాయక ప్రజలను నేరగాళ్ల బురిడీ కొట్టిస్తున్నారు. మల్టీ లెవల్ మార్కెటింగ్, పిరమిడ్ స్ట్రక్చర్ తరహాలో జనానికి కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి పెట్టిన ఓ సంస్థ.. మరో రూపంలో జనాన్ని మోసం చేసేందుకు చేసిన ప్రయత్నానికి పోలీసులు చెక్ పెట్టారు.
- M Revan Reddy
- Updated on: Apr 12, 2026
- 6:49 pm
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే టెర్రర్..
తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి (ఎన్హెచ్ 65) ప్రమాదాలమయంగా మారింది. నాలుగు లేన్లుగా అభివృద్ధి చెంది దశాబ్దం గడిచినా, ఈ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, గూడ్స్ వాహనాలు మితిమీరిన వేగం, సరైన ఫిట్నెస్ లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా నడపడం వంటి కారణాలతో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి
- M Revan Reddy
- Updated on: Apr 12, 2026
- 12:43 pm
హైవేపై అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన DCM వాహనం.. తనిఖీ చేయగా..
రాష్ట్రంలోని హైవేలపై ప్రయాణించే వాహనదారులకు అలర్ట్. అర్ధరాత్రి వేళ.. ఆదమరిస్తే అంతే సంగతులు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై డీజిల్ దొంగలు రెచ్చిపోతున్నారు. హైవే పై పార్క్ చేసిన వాహనాలే టార్గెట్ గా డీజిల్ చోరీకి తెగబడుతున్నారు. డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాకు నల్లగొండ పోలీసులు చెక్ పెట్టారు.
- M Revan Reddy
- Updated on: Apr 12, 2026
- 12:34 pm
చిన్నారి స్వాతికకు కలెక్టర్ భరోసా.. నల్లగొండ జిల్లాలో మనసున్న అధికారి మానవీయ కోణం!
అధికారి అంటే కేవలం చట్టాలను అమలు చేయడం, ఫైళ్లకు పరిమితం కాకుండా సామాన్యుల కష్టాలను స్వయంగా విని పరిష్కరించే వారు కొందరు మాత్రమే ఉంటారు. మరికొందరు ప్రజా సమస్యల పరిష్కారంలో మానవీయ కోణంతో పనిచేస్తుంటారు. నిత్యం జిల్లా సమస్యల పరిష్కారంలో బిజీగా ఉండే ఆఫీసర్.. ఓ ఘటనతో మానవత్వాన్ని చాటుకున్నారు. అధికారి ఎవరు..? ఆయన మానవత్వమెంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Apr 9, 2026
- 1:52 pm
గజదొంగగా మారిన గోల్డ్ మెడలిస్ట్.. మానవత్వం ఉన్న మంచి దొంగ.. గురుడి కథ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
మాస్టర్ డిగ్రీ చదివాడు.. గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. పార్ట్ టైమ్ ఆన్లైన్లో వ్యాపారం చేస్తూ కానీ దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. క్రమంగా గజదొంగగా మారాడు. దొంగల్లో గజదొంగ వేరేయ్యా అన్నట్లుగా.. ఈ దొంగలో మానవత్వం కూడా ఉందండోయ్. ఆ గజదొంగ ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Apr 9, 2026
- 9:25 am
Telangana: ఈ జనమంతా ప్రభుత్వ స్కూల్లో తమ పిల్లల అడ్మిషన్ కోసం ఆరాటపడుతున్న వాళ్లు..
సాధారణంగా తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేందుకు ఇష్టపడడం లేదు. అరకొర వసతులు ఉండే ప్రభుత్వ పాఠశాలల కంటే అప్పులు చేసైనా సరే.. ప్రైవేటు స్కూళ్లకు పంపించాలనే ఆలోచనలో తల్లిదండ్రులు ఉంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లను పెంచేందుకు ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతుంటారు. కానీ నల్లగొండలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు ఎగబడుతున్నారు. ఆ ప్రభుత్వ పాఠశాలకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Apr 8, 2026
- 12:21 pm
Telangana: హైవేపై ప్రయాణం ఇక నుంచి అంత ఈజీ కాదు.. ఈ కార్డు చేతుల్లో ఉండాల్సిందే
భారతీయ రహదారుల వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను నిలిపివేసిన హైవే అథారిటీ.. హైవేల నిర్వహణలో కొత్త నిబంధనలను తీసుకువస్తోంది. ఈ కొత్త నిబంధనలను ఈనెల 10వ తేదీ నుంచి అమలు చేసేందుకు హైవే అథారిటీ సన్నాహాలు చేస్తోంది.
- M Revan Reddy
- Updated on: Apr 7, 2026
- 12:33 pm