తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆంధ్రప్రభలో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2000 నుంచి 2002 వరకు హైదరాబాద్ లో ఆంధ్రప్రభ రిపోర్టర్ గా, 2002 నుంచి 2003 జూలై వరకు ఆంధ్రప్రభలో మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ గా పని చేశారు. 2003 ఆగస్టులో టివి9 సంస్థలో అడుగు పెట్టారు. ప్రస్తుతం టివి9 ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై అనేక ప్రత్యేక కథనాలు రాశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. నల్లగొండ జిల్లాను పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్య, గిరిజన తండాల్లో శిశు విక్రయాలపై ప్రత్యేక కథనాలు రాసి జాతీయ స్థాయిలో ప్రాచూర్యం తీసుకువచ్చారు. 2005లో జరిగి ఘోర డెల్టా రైలు ప్రమాద సమయంలో అనేక మానవీయ కథనాలు రాశారు. 2009లో కృష్ణా నదికి వచ్చిన వరదలను కవర్ చేశారు. 2016లో జిల్లాలో కృష్ణ పుష్కరాలను కవర్ చేశారు. 2004 నుండి వరసగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను కవర్ చేస్తూ ప్రత్యేక కథనాలు రాశారు. పాలిటిక్స్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్, బిజినెస్కు సంబంధించిన కంటెంట్ను రాయగలరు. రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.
Telangana: బయటపడ్డ శిల్పం వెనుకు మరుగునపడ్డ చరిత్ర..
రాజులు గతించారు. రాచరికాలు అంతరించినా.. అలనాటి చారిత్రకకు సజీవ సాక్ష్యాలుగా కట్టడాలు, దేవాలయాలు మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయి. ఈలాంటి చారిత్రక సంపద, వారసత్వ విశేషాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పుట్టినిల్లు. ఇటీవల రాచకొండ గుట్టల్లో భైరవ శిల్పం వెలుగు చూసింది. తాజాగా అలాంటిదే మరో చారిత్రక భైరవ శిల్పం మరొకటి వేరే ప్రాంతంలో బయటపడింది.
- M Revan Reddy
- Updated on: Feb 19, 2026
- 4:13 pm
Suryapet: నిజంగా ప్రేమిస్తే ఎవరైనా సుత్తితో దాడి చేస్తారా..? ఇదేం ఉన్మాదం..?
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా.. తెలుగు రాష్ట్రాల్లో ప్రేమోన్మాదుల దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రేమించడం లేదనో, పెళ్లికి నిరాకరించిందనో, వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉందన్న కారణాలతో యువతులను కత్తులు, రాడ్లు, పెట్రోల్ యాసిడ్తో దాడులు చేస్తున్నారు. తనను దూరంగా పెడుతుందని యువతపై.. యువకుడు ప్రేమన్మోది గా మారి దాడి చేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Feb 19, 2026
- 3:15 pm
Telangana: రాచకొండ గుట్టల్లో దొరికిన సాదాసీదా శిల్పం అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే బిత్తరపోతారు
సాధారణంగా రాజుల యుద్ధాలు గెలిచిన తర్వాత విజయ సూచికగా కోటలు నిర్మించడం, సామంత రాజ్యాలకు యుద్ధం పేరు పెట్టడం చేశారు. కొందరు రాజులు యుద్ధంలో శత్రు సైన్యాన్ని క్రూరంగా హతమార్చినట్లు చరిత్ర చెబుతోంది. కానీ మరికొందరు రాజుల క్రూరత్వానికి ప్రతీకగా ఆసక్తిని రేపుతున్న ఓ శిల్పం వెలుగు చూసింది. ఆ శిల్పం ఎక్కడిదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Feb 18, 2026
- 9:01 am
ప్రజా పాలన చేపట్టిన తల్లి కూతుళ్లు.. ఒకరు మేయర్ గా.. మరొకరు గ్రామ సర్పంచ్గా..!
రాజకీయాల పట్ల ఆసక్తిలేకున్నా.. కొందరు మహిళలు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఒకరు గ్రామ సర్పంచ్గా.. మరొకరు నగర మేయర్గా ఎన్నికై పాలనా పగ్గాలు చేపట్టారు. ప్రజా పాలన చేపట్టిన తల్లీకూతుళ్లు.. గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
- M Revan Reddy
- Updated on: Feb 17, 2026
- 9:56 pm
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి.. రహదారిపై ఆపద్బాంధవుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి ఆపద్బాంధవుడు అయ్యాడు. వెంటనే అంబులెన్స్ను పిలిపించి, దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం బైరోని బండకు చెందిన రమేష్ టిఫిన్ చేసి రోడ్డు దాటుతున్నాడు.
- M Revan Reddy
- Updated on: Feb 17, 2026
- 4:00 pm
Telangana: ముళ్లపొదల్లో నుంచి శిశువు ఏడుపు శబ్ధాలు.. వెళ్లి చూడగా ఊహించని సీన్..
అమ్మ ఒడిలో వెచ్చగా నిద్రపోవాల్సిన ఆ చిన్నారిని.. ముళ్లపొదల్లో పడేశారు. నవమాసాలు మోసిన కన్నతల్లే కర్కశంగా ఆడశిశువును వదిలించుకోవాలనుకుంది. కోదాడ మండలంలో మాతృత్వానికే మచ్చతెచ్చే ఘటన వెలుగులోకి వచ్చింది. పొలంలో పనికి వెళ్లిన కూలీలకు ఆ పసిపాప ఏడుపు వినిపించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.
- M Revan Reddy
- Updated on: Feb 17, 2026
- 2:05 pm
భలే పని చేశారు.. ఓడిపోయిన కార్పొరేటర్ అభ్యర్థి గిఫ్టులను ఓటర్లు ఏం చేశారో తెలుసా..?
ఎన్నికల్లో గెలుపోటములు సహజం. గెలుపు కోసం అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతారు. విజయం కొందరిని మాత్రమే వరిస్తుంది. కానీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు.. తాము ఇచ్చిన గిఫ్ట్లను తిరిగి ఇవ్వాలంటూ ఓటర్లను బెదిరిస్తున్నారు. దీంతో ఎన్నికల్లో పంపిణీ చేసిన డబ్బు, బహుమతులను ఓటర్లు తిరిగి ఇచ్చేస్తున్నారు.
- M Revan Reddy
- Updated on: Feb 15, 2026
- 3:44 pm
సరదాగా బీచ్లో తిరిగాడు.. రూ. 30 లక్షల బైక్పై హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యాడు.. కట్ చేస్తే.!
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 25 లక్షల రూపాయల విలువ చేసే బిఎండబ్ల్యూ రేసింగ్ బైక్ ఈ ప్రమాదానికి గురైంది. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలకు చెందిన 30మంది బైక్ రేసర్లతో బయలుదేరిన బృందంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిట్యాల శివారులో జాతీయ రహదారి ప్రమాదంలో బైక్ రేసర్ ప్రాణాలు కోల్పోయాడు.
- M Revan Reddy
- Updated on: Feb 15, 2026
- 2:21 pm
Nalgonda Municipal Election Result: సఫాయి కార్మికురాలుగా సేవ చేసిన చోటే.. నేడు కౌన్సిలర్గా ప్రజా సేవ..!
ఆమె ప్రజారోగ్యాన్ని కాపాడడంలో కీలకంగా పని చేశారు. మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆదేశాల మేరకు పనిచేసింది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30ఏళ్లు తన సేవలు అందించింది. ఆమె ఇపుడు మరో రూపంలో తన సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. తొలుత నేరేడుచర్ల గ్రామ పంచాయతీ, ఆ తర్వాత ఏర్పడిన మున్సిపాలిటీలో సఫాయి కార్మికురాలుగా 30 ఏళ్లుగా చేసింది.
- M Revan Reddy
- Updated on: Feb 14, 2026
- 11:09 am
MLA Komatireddy: మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతా.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యం ఆయన ఏదో సెన్సేషనల్ కామెంట్స్ తో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
- M Revan Reddy
- Updated on: Feb 14, 2026
- 9:19 am
Telangana: పైకి చూసి సాదాసీదా రాళ్లు అనుకునేరు.. అసలు కథ తెలిస్తే బిత్తరపోతారు
ఉమ్మడి నల్లగొండ జిల్లా చారిత్రక సంపద, వారసత్వ విశేషాలకు పుట్టినిల్లు. జిల్లాలో రాతి, మధ్య యుగపు ఆనవాళ్లు ప్రత్యక్షమవుతున్నాయి. పురాతన నాగరికతకు చెందిన కీలక ఆధారాలు కూడా లభిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోనే అరుదైన ఇనుపయుగపు సమాధి గదులు, ఇనుము తయారీ, పలు పురావస్తు విశేషాలు వెలుగు చూశాయి.
- M Revan Reddy
- Updated on: Feb 10, 2026
- 12:06 pm
డాక్టర్ అవతారం ఎత్తిన దోపిడి దొంగ.. వైద్యం పేరుతో బంగారం లూటీ..
సంతానం లేని దంపతులను ఆసరాగా చేసుకుని, యాదాద్రి జిల్లాలో ఓ దొంగ నకిలీ యునానీ డాక్టర్గా అవతారమెత్తాడు. లిక్విడ్ ట్రీట్మెంట్ పేరుతో బంగారు ఆభరణాలను తీయించి, దంపతులు స్నానానికి వెళ్ళిన సమయంలో ఐదు తులాల బంగారంతో పరారయ్యాడు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగ కోసం గాలిస్తున్నారు. ఇటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
- M Revan Reddy
- Updated on: Feb 9, 2026
- 9:29 pm