AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

M Revan Reddy

M Revan Reddy

Senior Staff Reporter - TV9 Telugu

revan.muppa@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆంధ్రప్రభలో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2000 నుంచి 2002 వరకు హైదరాబాద్ లో ఆంధ్రప్రభ రిపోర్టర్ గా, 2002 నుంచి 2003 జూలై వరకు ఆంధ్రప్రభలో మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ గా పని చేశారు. 2003 ఆగస్టులో టివి9 సంస్థలో అడుగు పెట్టారు. ప్రస్తుతం టివి9 ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై అనేక ప్రత్యేక కథనాలు రాశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. నల్లగొండ జిల్లాను పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్య, గిరిజన తండాల్లో శిశు విక్రయాలపై ప్రత్యేక కథనాలు రాసి జాతీయ స్థాయిలో ప్రాచూర్యం తీసుకువచ్చారు. 2005లో జరిగి ఘోర డెల్టా రైలు ప్రమాద సమయంలో అనేక మానవీయ కథనాలు రాశారు. 2009లో కృష్ణా నదికి వచ్చిన వరదలను కవర్ చేశారు. 2016లో జిల్లాలో కృష్ణ పుష్కరాలను కవర్ చేశారు. 2004 నుండి వరసగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను కవర్ చేస్తూ ప్రత్యేక కథనాలు రాశారు. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలరు. రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.

Read More
ఉంగరాల యాదగిరి.. రజాకార్లతో పోరాడి.. కుమారుల చేతిలో ఓడిపోయాడు..

ఉంగరాల యాదగిరి.. రజాకార్లతో పోరాడి.. కుమారుల చేతిలో ఓడిపోయాడు..

అతనో స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు. కానీ కొడుకుల చేతిలో మాత్రం ఓడిపోయాడు. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కన్న కొడుకులు.. ఆస్తిని కాజేసి ఇంటి నుండి గెంటేశారు. దిక్కుతోచని స్థితిలో ఆ వృద్ధుడు రోడ్డున పడ్డారు. ఏడాది కాలంగా వృద్ధాశ్రమాల్లో ఉంటూ న్యాయ పోరాటం చేస్తున్నాడు.

Telangana: ఛీ.. ఛీ.. ఏం మనుషులురా..! ఆస్తులు పంచుకున్నారు.. అమ్మను గెంటేశారు..!

Telangana: ఛీ.. ఛీ.. ఏం మనుషులురా..! ఆస్తులు పంచుకున్నారు.. అమ్మను గెంటేశారు..!

కాలం మారుతుందంటే ఇదేనేమో.. బంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారుతున్నాయనడానికి ఇదే మచ్చు తునక. అడ్డాల నాడు బిడ్డలు కానీ.. గడ్డాల నాడు బిడ్డలు కాదు అనే నానుడి నిజమవుతోంది. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కన్నా బిడ్డలు తల్లిదండ్రులను టార్చర్ పెడుతున్నారు. ఆస్తిని తీసుకుని కడుపున మోసి, కని పెంచిన కన్నతల్లిని కొడుకులు ఇంటి నుండి గెంటేశారు.

పచ్చని తోరణాలు.. చల్లని వాతావరణం..  ఔరా అనిపించే విందు భోజనాలు.. మైమరిచిన అతిథులు!

పచ్చని తోరణాలు.. చల్లని వాతావరణం.. ఔరా అనిపించే విందు భోజనాలు.. మైమరిచిన అతిథులు!

ఆధునిక సమాజంలో వివాహం అంటే అతిపెద్ద వేడుక. అలాంటి వేడుకను రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. డెస్టినేషన్ వెడ్డింగ్, వెడ్డింగ్ టూరిజాల పేరుతో దూర ప్రాంతాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పెళ్లి పేరుతో ఆడంబరాలకు పోయి భారీ సెట్టింగులు, ఫాస్ట్ ఫుడ్, విదేశీ ఆహారంతో రూ. కోట్లలో ఖర్చు చేస్తున్నారు. కొంతమంది వినూత్నంగా ఆలోచనలు చేసి పది మందికి ఆదర్శంగా నిలుస్తారు.

కొండముచ్చుకు గుండెపోటు.. సీపీఆర్‌తో పునర్జన్మ.. నిమిషాల్లోనే అద్భుతం..

కొండముచ్చుకు గుండెపోటు.. సీపీఆర్‌తో పునర్జన్మ.. నిమిషాల్లోనే అద్భుతం..

మనుషులకు గుండెపోటు వచ్చినప్పుడు సిపిఆర్ చేస్తుంటారు. గోల్డెన్ అవర్ లో చికిత్స అందిస్తే బతుకుతారు. అయితే సిపిఆర్‌తో మనుషుల ప్రాణాలే కాదు మూగ జీవుల ప్రాణాలు కూడా రక్షించవచ్చని నిరూపతమైంది. అనారోగ్యానికి గురై గుండెపోటు వచ్చిన కొండముచ్చుకు సిపిఆర్ చేసి పునర్జన్మను ప్రసాదించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

యాదగిరిగుట్టలో భక్త ఝరి.. ఎన్ని కోట్ల మంది దర్శించుకున్నారో తెలుసా..? టాప్-2,3లో ఈ టెంపుల్స్..!

యాదగిరిగుట్టలో భక్త ఝరి.. ఎన్ని కోట్ల మంది దర్శించుకున్నారో తెలుసా..? టాప్-2,3లో ఈ టెంపుల్స్..!

Yadadri Temple Visitors: గత ఏడాది రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పునర్నిర్మాణం కంటే ముందు సాధారణ రోజుల్లో రోజుకు 15 వేల మంది వరకు భక్తులు మాత్రమే దర్శనానికి వచ్చేవారు. ప్రస్తుతం రోజుకు సగటున సుమారు 30 నుంచి 50 వేల మంది వరకు వస్తున్నారు. ఇక పండుగలు, సెలవు రోజుల్లో భక్తుల సంఖ్య లక్ష దాటుతోంది. సగటున రోజుకు 40 వేల పైచిలుకు భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. గత ఏడాది ఏకంగా కోటికిపైగా భక్తులు యాదగిరిగుట్ట లక్ష్మినర్సింహస్వామిని దర్శించుకున్నారు.

Telangana: మాయమాటలు చెప్పి మర్పించాడు.. సైలెంట్‌గా పనికానిచ్చాడు.. సీన్ కట్‌చేస్తే..

Telangana: మాయమాటలు చెప్పి మర్పించాడు.. సైలెంట్‌గా పనికానిచ్చాడు.. సీన్ కట్‌చేస్తే..

బెట్టింగ్‌లకు పాల్పడుతున్న యువకులు మోసగాళ్లుగా మారుతున్నారు. బెట్టింగ్‌కు అవసరమైన డబ్బుల కోసం పనిచేసే సంస్థతో పాటు అమాయకులను కూడా మోసం చేస్తున్నారు. తాజాగా బెట్టింగ్‌లకు అలవాటు పడి ఇలా మోసాలకు పాల్పడుతున్న ఓ కేటుగాడికి ఎట్టకేలకు పోలీసులు చెక్ పెట్టి.. కటకటాల పాలు చేశారు. ఇంతకు అతనేం చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే

మద్యం మత్తులో బైక్‌ను ఢీకొట్టిన తాగుబోతులు.. అడ్డుకున్న వారిపై కర్రలు, రాడ్లతో దాడి

మద్యం మత్తులో బైక్‌ను ఢీకొట్టిన తాగుబోతులు.. అడ్డుకున్న వారిపై కర్రలు, రాడ్లతో దాడి

మద్యం మత్తులో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఫుల్లుగా తాగి డ్రైవ్ చేస్తూ.. బైక్‌‌ను ఢీ కొట్టడమే కాదు.. యాక్సిడెంట్ ఎందుకు చేశావని ప్రశ్నించినందుకు ఇనుప రాడ్లతో, కర్రలతో తిరగబడి దాడి చేశారు. మందుబాబుల వీరంగంతో జాతీయ రహదారిపై అర గంటకు పైగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల రంగ ప్రవేశంలో తాగుబోతులు పారిపోయారు.

శభాష్ భయ్యా..! బతుకు పోరాటంలోనూ మానవత్వాన్ని చాటుకుంటున్న ఆటో డ్రైవర్..!

శభాష్ భయ్యా..! బతుకు పోరాటంలోనూ మానవత్వాన్ని చాటుకుంటున్న ఆటో డ్రైవర్..!

మానవ సేవయే మాధవ సేవ' ఈ మాటను చాలా మంది పుస్తకాల్లో చదువుకొని ఉంటారు. కానీ, దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టేవారు తక్కువమంది ఉంటారు. ఉరుకులు పరుగుల జీవితంలో పక్కవాడి కష్టం పట్టించుకునే తీరిక ఎవరికి లేదు. సేవ చేయాలని మనసు ఉండాలే కాని.. ఆస్తులు అంతస్తులు అడ్డుకావు. చేస్తున్న పనిలో కూడా కొందరికి ఉపయోగపడి ఆత్మ సంతృప్తి చెందవచ్చు.

Telangana: ఆ గ్రామంలో హోలీ నాడు రంగులు చల్లుకోరు.. ఆ వింత ఆచారం వెనుక అసలు కథ ఇదే..

Telangana: ఆ గ్రామంలో హోలీ నాడు రంగులు చల్లుకోరు.. ఆ వింత ఆచారం వెనుక అసలు కథ ఇదే..

దేశమంతా రంగుల కేళిలో మునిగిపోతుంటే.. ఆ ఊరి జనం మాత్రం చిటికెడు రంగు కూడా ముట్టుకోరు.. అసలు అక్కడ హోలీ పండుగే జరగదు. ఏంటి.. నమ్మలేకపోతున్నారా? నల్గొండ జిల్లాలోని ఓ గ్రామంలో దశాబ్దాలుగా వస్తున్న ఆ వింత ఆచారం వెనుక ఉన్న అసలు కథేంటి? వీళ్లు వారం రోజుల తర్వాత ఎందుకు రంగులు చల్లుకుంటారు? అనేది తెలుసుకుందాం..

అయ్యో ఎంత కష్టమొచ్చిందో పాపం.. ఇద్దరు పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకన్న తల్లి!

అయ్యో ఎంత కష్టమొచ్చిందో పాపం.. ఇద్దరు పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకన్న తల్లి!

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. రంగులు చల్లుకుంటూ సంతోషంగా హోలీ పండుగను జరుపుకుంటున్నారు. కానీ ఓ గ్రామంలో కుటుంబ కలహాలు విషాదాన్ని నింపాయి. నవమాసాలు మోసిన తల్లి తన కంటిపాపలను చిదిమేసింది. తన గుండెలపై ఆడించాల్సిన తల్లి తన ఇద్దరు పిల్లలకు మరణశాసనం రాసింది. అంతేకాదు తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ అమానవీయ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: అబ్బో.. తెలివిమీరిన దొంగలు.. పోలీసులకే సవాల్.. ఏం చేశారో తెలుసా..?

Telangana: అబ్బో.. తెలివిమీరిన దొంగలు.. పోలీసులకే సవాల్.. ఏం చేశారో తెలుసా..?

యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు సరికొత్త ప్లాన్‌తో పోలీసులకు సవాల్ విసిరారు. కానీ వారి ప్లాన్ చివరకు సైరన్ దెబ్బతో విఫలమైంది. ఈ ఘటన చౌటుప్పల్ మండలంలో తీవ్ర కలకలం రేపింది. దొంగలు వేసిన ఆ ప్లాన్ ఏంటీ..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..

అప్పు తీర్చమంటే.. బంగారం బిస్కెట్లు ఇప్పించాడు.. తీరా చూస్తే మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్..

అప్పు తీర్చమంటే.. బంగారం బిస్కెట్లు ఇప్పించాడు.. తీరా చూస్తే మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్..

నమ్మకంగా అప్పు తీసుకుంటారు.. కానీ తీర్చేటప్పుడు మాత్రం నమ్మకద్రోహానికి పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. తాజాగా అలాంటి ఘటనే తెలంగాణలో వెలుగు చూసింది. అవసరానికి ఇచ్చిన అప్పు తీర్చమని అడిగితే ఓ వ్యక్తి ఫేక్‌ గోల్డ్‌ బిస్కెట్ ఇచ్చి అప్పిచ్చిన వ్యక్తిని బురిడీ కొట్టించాడు. బంగారం షాపు యజమాని, ఓ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ కుమ్మక్కై తీసుకున్న అప్పులకు నకిలీ బంగారు బిస్కెట్లను జనానికి అంటగట్టారు. ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో నకిలీ బంగారు బిస్కెట్లు కలకలం రేపుతున్నాయి.