AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

M Revan Reddy

M Revan Reddy

Senior Staff Reporter - TV9 Telugu

revan.muppa@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆంధ్రప్రభలో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2000 నుంచి 2002 వరకు హైదరాబాద్ లో ఆంధ్రప్రభ రిపోర్టర్ గా, 2002 నుంచి 2003 జూలై వరకు ఆంధ్రప్రభలో మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ గా పని చేశారు. 2003 ఆగస్టులో టివి9 సంస్థలో అడుగు పెట్టారు. ప్రస్తుతం టివి9 ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై అనేక ప్రత్యేక కథనాలు రాశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. నల్లగొండ జిల్లాను పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్య, గిరిజన తండాల్లో శిశు విక్రయాలపై ప్రత్యేక కథనాలు రాసి జాతీయ స్థాయిలో ప్రాచూర్యం తీసుకువచ్చారు. 2005లో జరిగి ఘోర డెల్టా రైలు ప్రమాద సమయంలో అనేక మానవీయ కథనాలు రాశారు. 2009లో కృష్ణా నదికి వచ్చిన వరదలను కవర్ చేశారు. 2016లో జిల్లాలో కృష్ణ పుష్కరాలను కవర్ చేశారు. 2004 నుండి వరసగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను కవర్ చేస్తూ ప్రత్యేక కథనాలు రాశారు. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలరు. రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.

Read More
లక్ష్మీనారసింహుడికే నామం పెట్టారు.. యాదాద్రి ఆలయంలో బంగారు, వెండి డాలర్ల మాయం..!

లక్ష్మీనారసింహుడికే నామం పెట్టారు.. యాదాద్రి ఆలయంలో బంగారు, వెండి డాలర్ల మాయం..!

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజుల్లుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఇంటి దొంగలు ఎక్కువయ్యారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో రోజురోజుకూ అవినీతి పెరుగుతోంది. చింతపండు చోరీ ఘటన మరువకముందే మరో బాగోతం వెలుగు చూసింది. దేవస్థాన ఆదాయానికి కొంతమంది అధికారులు, సిబ్బంది గండికొడుతున్నారు.

Telangana: తండ్రి లాంటి మేనమామనే హత్య చేశాడు.. విషయం తెలిసి అంతా షాక్..!

Telangana: తండ్రి లాంటి మేనమామనే హత్య చేశాడు.. విషయం తెలిసి అంతా షాక్..!

నేటి సమాజంలో మానవ సంబంధాలు నానాటికి దిగజారి పోతున్నాయి. మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి అని అంటారు. తండ్రి లేకపోయినా మేనమామ ఉండాలని అంటారు. తోడబుట్టిన సోదరి పిల్లలను మేనమామ ఎంతో గారాబంగా చూసుకుంటూ ఉంటారు. మేనమామపై కూడా సోదరి పిల్లలకు అంతే అభిమానం ఉంటుంది. కానీ ఓ మేనల్లుడు మాత్రం తన మేనమామను ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

శంభో హరహర శంభో.. కణకణలాడే అగ్ని కణకాలపై నడిచి మొక్కులు చెల్లించుకున్న భక్తులు..!

శంభో హరహర శంభో.. కణకణలాడే అగ్ని కణకాలపై నడిచి మొక్కులు చెల్లించుకున్న భక్తులు..!

సాధారణంగా కోరిన కోరికలు తీరిన తర్వాత దేవుళ్లకు కొబ్బరికాయ కొట్టడం, తలనీలాలు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం కణకణలాడే నిప్పుల్లో నడిచి భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటారు. చిన్న, పెద్ద తేడా లేకుండా భక్తులు.. శివనామ స్మరణతో అగ్ని కీలలపై నడిచి భక్తిని చాటుకుంటున్నారు. ఈ ఆలయం ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

డ్రైవరన్నకు సెల్యూట్.. హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్తుండగా గుండెపోటు.. చివరకు..

డ్రైవరన్నకు సెల్యూట్.. హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్తుండగా గుండెపోటు.. చివరకు..

వ్యాపారస్తులకు వినియోగదారుడే దేవుడు. అలానే ఆర్టీసీ సిబ్బందికి కూడా ప్రయాణికులే దేవుళ్ళుగా భావిస్తుంటారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్టీసీ డ్రైవర్ల విధి. అయితే తన విధి ధర్మాన్ని పాటించి చాతి నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలనే బాధ్యతతో ఉన్నాడు.

Telangana: పక్కా ప్లాన్‌తో అనసూయమ్మను హోటల్‌కు పిలిచారు.. పట్టపగలే దృశ్యం సినిమాను మించిన సీన్..

Telangana: పక్కా ప్లాన్‌తో అనసూయమ్మను హోటల్‌కు పిలిచారు.. పట్టపగలే దృశ్యం సినిమాను మించిన సీన్..

నాగరిక సమాజంలో జనం జల్సాలకు అలవాటు పడి అప్పుల పాలవుతున్నారు. దీంతో ఈజీ మనీ అడ్డదారులు తొక్కుతున్నారు. డబ్బులు, బంగారం కోసం ఎంతవరకైనా తెగబడుతున్నారు. హత్యలకు కూడా వెనకాడడం లేదు. డబ్బుల కోసం ఓ మహిళను హత్య చేసి ఏం చేశారో.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: ఈజీగా మనీ సంపాదిద్దామని ఆశపడ్డాడు.. కానీ.. కథ అడ్డం తిరిగింది.. చివరకు అలా..

Telangana: ఈజీగా మనీ సంపాదిద్దామని ఆశపడ్డాడు.. కానీ.. కథ అడ్డం తిరిగింది.. చివరకు అలా..

Yadadri Bhuvanagiri district: ఈజీ మనీ కోసం డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ కేటుగాళ్లు విజృంభిస్తుండగా.. ఆన్ లైన్ బెట్టింగ్‌లో చిక్కుకొని యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు యువత ఆన్ లైన్ బెట్టింగ్‌కు ఆకర్షితులవుతున్నారు. బెట్టింగ్‌లో లక్షల రూపాయల పోగొట్టుకొని యువత అప్పుల పాలవుతున్నారు. చివరికి అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ.. అక్కడ సీన్ చూసి అంతా షాక్..

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ.. అక్కడ సీన్ చూసి అంతా షాక్..

వాళ్లంతా సంక్రాంతి పండుగ సెలవులను ఎంజాయ్ చేసి పాఠశాలకు ఉత్సాహంగా బయలుదేరారు. పాఠశాల తెరిచే సమయానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా వచ్చారు. కానీ పాఠశాల గేటుకు తాళం వేసి ఉండడంతో షాక్ తిన్నారు. పాఠశాల గేటుకు ఎందుకు తాళం వేసారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: కెనాల్‌లో అలికిడి శబ్దం.. ఏంటా అని వెళ్లి చూసి బిత్తరపోయారు

Telangana: కెనాల్‌లో అలికిడి శబ్దం.. ఏంటా అని వెళ్లి చూసి బిత్తరపోయారు

వారంతా యధావిధిగా రోజు వారి వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. పక్కనే ఉన్న కెనాల్‌లో అలికిడి శబ్దం వినిపించింది. ఇలాంటి శబ్దాలు మామూలేనని అనుకొని ఎవరికి వారే వెళ్ళిపోతున్నారు. కానీ కొద్దిసేపటి తర్వాత ఆ కెనాల్‌లో శబ్దం పెద్దగా వినిపించింది. కెనాల్‌లోకి చూస్తే అందరూ షాక్. ఆ కెనాల్‌లో మొసలి ప్రత్యక్షమై కలకలం రేపింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాలి.

తండ్రిపై రీల్స్ చేస్తూ ఆలయం గుడి మెట్లు ఎక్కిన కూతురు.. అంతలోనే..!

తండ్రిపై రీల్స్ చేస్తూ ఆలయం గుడి మెట్లు ఎక్కిన కూతురు.. అంతలోనే..!

తండ్రి కూతురు మధ్య బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే..! నాన్నకు పిల్లలు అందరూ ఒక్కటే.. అయితే కూతురు అంటే కొంచెం ఎక్కువ ప్రేమ. తండ్రికి తన కూతురే ప్రాణం.. ఆ కూతురికి నాన్నే ఇలలో నడిచే దైవం.. హీరో.. నవ మాసాలు మోసి జననం ఇవ్వక పోయినా.. తన జన్మకు కారణమైన తండ్రి అంటే కూతురికి పంచప్రాణాలు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు తండ్రితో కూతురు చేసిన రీల్ ను చూసి జనం కంటతడి పెడుతున్నారు.

అన్నో పులొచ్చింది.. రాత్రి వేళల్లో ఇళ్లలో నుంచి బయటకు రావద్దు.. ఆ ప్రాంతంలో భయం భయం..

అన్నో పులొచ్చింది.. రాత్రి వేళల్లో ఇళ్లలో నుంచి బయటకు రావద్దు.. ఆ ప్రాంతంలో భయం భయం..

యాదాద్రి జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది. వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ఆవుల మంద పై దాడి చేసి ఆరునెలల లేగ దూడను చంపేసింది. ఇరవై రోజుల లేగ దూడను లాక్కెళ్ళింది. పశువుల మందపై పులి దాడి చేయడంతో పలు గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటున్నారు.

Nalgonda: టైర్ పేలి గింగిరాలు కొట్టిన టీచర్స్ ప్రయాణిస్తున్న కారు.. ఇద్దరు దుర్మరణం.. మరో..

Nalgonda: టైర్ పేలి గింగిరాలు కొట్టిన టీచర్స్ ప్రయాణిస్తున్న కారు.. ఇద్దరు దుర్మరణం.. మరో..

ముచ్చటైన మూడు రోజుల సంక్రాంతి పండుగను వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకున్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత తొలి రోజు పాఠశాలలకు ఐదుగురు టీచర్లు కలిసి వెళ్తున్నారు. రోడ్డు ప్రమాదం రూపంలో ఇద్దరిని మృత్యువు కబళించింది. పూర్తి వివరాలు కథనం లోపల ...

Nalgonda: నేను US, ఆస్ట్రేలియా రిటన్.. మీకు జాబ్ కన్ఫామ్ అంటాడు.. డబ్బు తీసుకున్నాక

Nalgonda: నేను US, ఆస్ట్రేలియా రిటన్.. మీకు జాబ్ కన్ఫామ్ అంటాడు.. డబ్బు తీసుకున్నాక

నేటి యువతలో చాలా మంది జల్సాలకు అలవాటు పడి.. ఈజీ మనీ కోసం ప్లాన్ వేస్తుంటారు. ఇందుకోసం కొందరు కేటుగాళ్లు తమ పరిచయాలు, తేలివితేటలనే పెట్టుబడి పెడుతున్నారు. అమాయక నిరుద్యోగులను టార్గెట్‌గా చేసుకొని మోసం చేస్తుంటారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ కేటుగాడు ఎలా బురిడి కొట్టించాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.