తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆంధ్రప్రభలో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2000 నుంచి 2002 వరకు హైదరాబాద్ లో ఆంధ్రప్రభ రిపోర్టర్ గా, 2002 నుంచి 2003 జూలై వరకు ఆంధ్రప్రభలో మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ గా పని చేశారు. 2003 ఆగస్టులో టివి9 సంస్థలో అడుగు పెట్టారు. ప్రస్తుతం టివి9 ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై అనేక ప్రత్యేక కథనాలు రాశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. నల్లగొండ జిల్లాను పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్య, గిరిజన తండాల్లో శిశు విక్రయాలపై ప్రత్యేక కథనాలు రాసి జాతీయ స్థాయిలో ప్రాచూర్యం తీసుకువచ్చారు. 2005లో జరిగి ఘోర డెల్టా రైలు ప్రమాద సమయంలో అనేక మానవీయ కథనాలు రాశారు. 2009లో కృష్ణా నదికి వచ్చిన వరదలను కవర్ చేశారు. 2016లో జిల్లాలో కృష్ణ పుష్కరాలను కవర్ చేశారు. 2004 నుండి వరసగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను కవర్ చేస్తూ ప్రత్యేక కథనాలు రాశారు. పాలిటిక్స్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్, బిజినెస్కు సంబంధించిన కంటెంట్ను రాయగలరు. రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.
Telangana: ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామనుకున్నారు.. కట్ చేస్తే.. గవర్నమెంట్ జాబ్ వచ్చేసరికి.!
నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ముకు చెందిన పులికంటి శ్రీను అదే గ్రామానికి చెందిన యువతి కలిసి చదువుకున్నారు. ఒకే సామాజిక వర్గం కావడంతో రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. శ్రీనుకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రియుడికి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ప్రియురాలు ఎంతో సంతోషపడింది. తమ పెళ్లి చేసుకుని హాయిగా ఉండవచ్చని భావించింది.
- M Revan Reddy
- Updated on: Dec 25, 2025
- 12:30 pm
పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సంతోషం లేకుండా పోయింది.. కొడుకు మృతిని తట్టుకోలేక తండ్రి మృతి!
యాదాద్రి జిల్లా రాజాపేట మండలం నెమిల గ్రామానికి చెందిన మోత్కుపల్లి ఐలయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక్క కుమార్తె ఉన్నారు. ఐలయ్య చిన్న కుమారుడు బాలకృష్ణ కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో అనారోగ్యం బారిన పడుతున్నాడు. అయితే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాలకృష్ణ భార్య జ్యోతిని వార్డు ఎన్నికల్లో పోటీ చేయించాడు ఐలయ్య. అందరూ ఊహించినట్లే జ్యోతి వార్డు సభ్యురాలిగా విజయం సాధించింది.
- M Revan Reddy
- Updated on: Dec 21, 2025
- 5:32 pm
ఆ నవ దంపతులు రైలు నుంచి జారిపడ్డారా..? ఆత్మహత్య చేసుకున్నారా.. ఏం జరిగిందంటే..?
ఆ నవ దంపతులు. రెండు నెలల క్రితమే వివాహమైంది. ఈ నవ దంపతులు రైలు నుంచి జారి కిందపడి చనిపోయారు. ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి కిందపడి చనిపోయారని అందరూ భావించారు. కానీ ఈ నవ దంపతుల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Dec 20, 2025
- 8:18 pm
బ్యాంక్ మేనేజర్ సమయస్పూర్తి.. సైబర్ కేటుగాళ్ల ఉచ్చు నుంచి బయటపడ్డ రిటైర్డ్ టీచర్..!
డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు రోజురోజుకు విజృంభిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహించినా జనం మోసానికి గురవుతూనే ఉన్నారు. మహిళలు, వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగుల టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు వినూత్న పద్ధతుల్లో మోసాలు చేస్తున్నారు. తాజాగా మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.
- M Revan Reddy
- Updated on: Dec 20, 2025
- 4:47 pm
Telangana: అద్భుతం.. యాదాద్రీశుడికి అగ్గిపెట్టలో బంగారు పట్టుచీర.. ఔరా అనాల్సిందే
చేనేత కళాకారుల కాణాచి తెలంగాణ రాష్ట్రం. ఒకనాటి వైభవంగా మిగిలిపోయిన అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీరలను తయారీనీ చేనేత కార్మికుల వారసులు మళ్లీ ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. తాజాగా భక్తుల కోరికలను తీర్చే మహిమాన్విత స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహుడి సన్నిధిలోని అమ్మ వారికి అగ్గిపెట్టెలో ఇమిడే బంగారు చీరను కానుకగా సమర్పించారు.
- M Revan Reddy
- Updated on: Dec 18, 2025
- 10:31 am
అక్క వరుసయ్యే మహిళతో ఆ యవ్వారం.. కట్ చేస్తే, ఆమె భర్త ఎంట్రీతో..
వివాహేతర సంబంధాలు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. వరుసకు సోదరి అయ్యే మహిళతో ఓ యువకుడు అక్రమ బంధాన్ని కొనసాగించాడు. చివరికి ప్రాణాలనే కోల్పోయాడు. తన భార్యతో వివాహేతర బంధం పెట్టుకున్న యువకుడిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Dec 18, 2025
- 10:02 am
Telangana: ఊరంతా కరెంట్ షాక్.. ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా..
విద్యుత్ షాక్ గురై యువకుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామంలో నివాస గృహాలకు ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో తండా వాసులు ఉలిక్కిపడ్డారు. తండాలోని పలు ఇళ్లలో గృహోపకరణాలు టీవీలు, ఫ్రిజ్లు కాలిపోయి భారీ నష్టం వాటిల్లింది.
- M Revan Reddy
- Updated on: Dec 17, 2025
- 4:07 pm
Telangana: ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందే.. పాపం.! ఈ ఎస్సై పరిస్థితి చూస్తే
కన్నతల్లిని పుట్టినరోజు మరవకూడదని అంటారు. కన్నతల్లి లాంటి ఊరికి సేవ చేయాలనే భావించాడు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పులి వెంకటేశ్వర్లు. కానిస్టేబుల్గా కెరీర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎస్సై స్థాయికి ఎదిగాడు. తన ఉన్నతికి తోడ్పాటు అందించిన..
- M Revan Reddy
- Updated on: Dec 15, 2025
- 4:33 pm
అదిరిందయ్యా చంద్రం.. 95 ఏళ్ల వయస్సులోనూ సర్పంచ్గా విజయం.. రాష్ట్రంలో ఆయనొక్కరే..
ప్రస్తుత జీవన విధానంలో 60 ఏళ్లకే చాలా మంది అనారోగ్యానికి గురి అవుతున్నారు. కనీసం నడవలేక పోతున్నారు. కానీ ఇక్కడో 95 ఏళ్ల వయస్సులో ప్రజాసేవ చేయాలనుకున్నాడో నవ యువకుడు. ఆ వయసులోనూ ఆయన గ్రామ అభివృద్ధిని బాధ్యతగా తీసుకున్నాడు. అభివృద్ధి అనే పదాన్ని నినాదంగా ఎత్తుకొని పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి సర్పంచ్గా ఘన విజయం సాధించారు. ఇంతకు ఆయనెవరు.. ఇది ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం పదండి.
- M Revan Reddy
- Updated on: Dec 13, 2025
- 3:15 pm
Telangana: ఎన్నికలు అయిపోయాక మళ్లీ ఇంటింటికి ఓడిన అభ్యర్థి.. ఎందుకంటే..?
తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు సంబరాల్లో మునిగిపోయారు. కానీ ఓడిపోయిన కొందరు అభ్యర్థులు మాత్రం కన్నీరు మున్నీరవుతున్నారు. ఎన్నికల్లో తాము పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని దేవుడి ఫోటోతో ఇళ్లు.. ఇళ్ళు తిరుగుతూ వేడుకుంటున్నారు. అలాంటి ఓ వ్యక్తి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
- M Revan Reddy
- Updated on: Dec 13, 2025
- 3:08 pm
Telangana: సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్త దారుణ హత్య..
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేళ సూర్యాపేట జిల్లా ఉద్రిక్తంగా మారింది. నూతనకల్ మండలం లింగంపల్లిలో బీఆర్ఎస్కు చెందిన ఉప్పల మల్లయ్య అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో దారుణ హత్యకు గురయ్యారు. ప్రచారం ముగిసిన తర్వాత కాంగ్రెస్–బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరినొకరు రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది.
- M Revan Reddy
- Updated on: Dec 10, 2025
- 8:40 pm
Telangana: 10 బంగారు బిస్కెట్లు రూ. 18 లక్షలే.! లచ్చలు లచ్చలు పోశారు.. సీన్ కట్ చేస్తే
సామాన్యులకు అందనంత ఎత్తుకు బంగారం ధరలు నింగి నంటూతున్నాయి. కేటుగాళ్ళు మాత్రం ఇదే మంచి అవకాశంగా నకిలీ బంగారంతో జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. తక్కువ ధరకు అసలైన బంగారం ఇస్తామంటూ అమాయకులను మోసం చేస్తూ నకిలీ బంగారం అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ బంగారు బిస్కెట్లు అంటగట్టి మోసం చేస్తున్న ముఠాకు సూర్యాపేట పోలీసులు చెక్ పెట్టారు.
- M Revan Reddy
- Updated on: Dec 9, 2025
- 12:47 pm