M Revan Reddy

M Revan Reddy

Senior Staff Reporter - TV9 Telugu

revan.muppa@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.. ఆంధ్రప్రభలో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2000 నుంచి 2002 వరకు హైదరాబాద్ లో ఆంధ్రప్రభ రిపోర్టర్ గా, 2002 నుంచి 2003 జూలై వరకు ఆంధ్రప్రభలో మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ గా పని చేశాను. 2003 ఆగస్టులో టివి9 సంస్థలో అడుగు పెట్టాను. ప్రస్తుతం టివి9 ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను..

Read More
Telangana: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. కాంగ్రెస్ నుంచి పోటీలో కీలక నేత..

Telangana: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. కాంగ్రెస్ నుంచి పోటీలో కీలక నేత..

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ఈ నెల 9 వరకూ కొనసాగనుంది. ఈ నెల13 తేది వరకూ నామినేషన్ల ఉప సంహరణ గడువు ఉండగా, ఈ నెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 5న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.

Telangana: వీడిన మిస్సింగ్ మిస్టరీ.. భార్యాభర్తల పంచాయితీ తీర్చేందుకు వెళితే.. ప్రాణమే పోయింది..!

Telangana: వీడిన మిస్సింగ్ మిస్టరీ.. భార్యాభర్తల పంచాయితీ తీర్చేందుకు వెళితే.. ప్రాణమే పోయింది..!

మాజీ నక్సలైట్, సూర్యాపేట బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. ఎల్లయ్య ప్రత్యర్థులే పథకం ప్రకారం ట్రాప్ చేసి హత్య చేశారని పోలీసులు తేల్చారు. హత్య తర్వాత మృతదేహాన్ని విశాఖపట్నం సముద్రంలో పడేసినట్టు చెబుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీకాంత్ చారిని అరెస్టు చేయగా మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు.

కాంగ్రెస్‎లో గుత్తా అమిత్.. కీలక పదవి ఇచ్చే ఆలోచనలో అధిష్టానం.. తండ్రి చేరికపై కొనసాగుతున్న సస్పెన్స్..

కాంగ్రెస్‎లో గుత్తా అమిత్.. కీలక పదవి ఇచ్చే ఆలోచనలో అధిష్టానం.. తండ్రి చేరికపై కొనసాగుతున్న సస్పెన్స్..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. సీనియర్‌ నాయకుడు, తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఘర్ వాపసీలో పీసీసీ పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తోంది. కొంతకాలంగా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకలాపాలకు అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆపరేషన్లో భాగంగా రాష్ట్ర వ్యవహారాలు ఇన్చార్జి దీప్దాస్ మున్షి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్ చౌదరిలు గుత్తా అమిత్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన గుత్తా అమిత్.. కీలకంగా వ్యవహరించిన మంత్రి ఎవరంటే..

కాంగ్రెస్ పార్టీలో చేరిన గుత్తా అమిత్.. కీలకంగా వ్యవహరించిన మంత్రి ఎవరంటే..

ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్ది వివిధ పార్టీల ముఖ్యనాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు తమ జిల్లాల్లోని ముఖ్యమైన నేతలతో సమావేశమవుతూ తమవైపుకు తిప్పుకుంటున్నారు. ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిన్న మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా.. రారా.. అనే మీమాంసలో ఉన్న నల్గొండ కీలకనేత, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎట్టకేలకు తన కుమారుడికి కాంగ్రెస్ పార్టీ తీర్థం ఇప్పించారు.

Missing Mystery:  పరిచయం లేని వ్యక్తి ఎల్లయ్యను వెతుక్కుంటూ ఎలా వచ్చింది..? ఇంతకీ ఎల్లయ్య జాడ ఎక్కడ?

Missing Mystery: పరిచయం లేని వ్యక్తి ఎల్లయ్యను వెతుక్కుంటూ ఎలా వచ్చింది..? ఇంతకీ ఎల్లయ్య జాడ ఎక్కడ?

మాజీ నక్సలైట్, కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట మండల అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. ఎల్లయ్య అదృశ్యం.. దృశ్యం సినిమాను తలపిస్తోంది. ఎల్లయ్య విరోధులే పథకం ప్రకారం కిడ్నాప్ చేసి హత్య చేశారని కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు చేధించే పనిలో పడ్డారు.

Telangana: ప్రేమ పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. ఆ ప్రేమికులు ఏం చేశారంటే..?

Telangana: ప్రేమ పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. ఆ ప్రేమికులు ఏం చేశారంటే..?

ఇద్దరు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. పెళ్లి చేసుకుని హాయిగా జీవితం కొనసాగించాలని భావించారు. కానీ వారి ప్రేమ పెళ్లికి కులం అడ్డుపడింది. దీంతో ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమికులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

ESI Dispensary: మూతపడుతోన్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు.. తాళాలు వేస్తున్న భవన యజమానులు..!

ESI Dispensary: మూతపడుతోన్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు.. తాళాలు వేస్తున్న భవన యజమానులు..!

నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు అన్నట్టుందీ తెలంగాణలో ఈఎస్‌ఐ ఆస్పత్రుల దుస్థితి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు ఈఎస్‌ఐ ఆసుపత్రుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. రోగుల కంటే చికిత్స అందించాల్సిన దవఖానలే దుర్భరస్థితికి చేరాయి. ఇక ఈఎస్‌ఐ రోగుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. మందులు అందక... తీవ్ర అవస్థలు పడుతున్నారు రోగులు.

Congress: పార్టీ కేడర్‌లో కోల్డ్‌ వార్.. అధిష్టానానికి తలనొప్పిగా మారుతోన్న కాంగ్రెస్ ఘర్ వాపసి

Congress: పార్టీ కేడర్‌లో కోల్డ్‌ వార్.. అధిష్టానానికి తలనొప్పిగా మారుతోన్న కాంగ్రెస్ ఘర్ వాపసి

పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాల గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఘర్ వాపసీ పేరుతో నేతలను ఆకర్షిస్తోంది. ఇదే ఇప్పుడు ఆపార్టీకి తలనొప్పిగా మారుతోంది. పార్టీ కేడర్‌లో కోల్డ్‌ వార్ రాజేస్తోంది. ఘర్‌ వాపసీ నల్గొండ జిల్లాలో మరీ ముఖ్యంగా చిచ్చు రేపుతోంది.

Telangana: ఎన్నికల వేళ కాంగ్రెస్‎లో ఘర్ వాపసీ చిచ్చు.. ఈ నియోజకవర్గ క్యాడర్ నుంచి వ్యతిరేకత..

Telangana: ఎన్నికల వేళ కాంగ్రెస్‎లో ఘర్ వాపసీ చిచ్చు.. ఈ నియోజకవర్గ క్యాడర్ నుంచి వ్యతిరేకత..

రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ఘర్ వాపసీ పేరుతో పార్టీ వీడిన నేతలను తిరిగి ఆహ్వానిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇపుడు ఈ ఘర్ వాపసీ నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్‎లో చిచ్చు పెట్టింది.

Nalgonda Politics: ఇక్కడ పార్టీల మధ్య కంటే ఇద్దరు మంత్రుల మధ్య పోటీ.. ఆసక్తికరంగా మారిన లోక్‌సభ ఎన్నికలు!

Nalgonda Politics: ఇక్కడ పార్టీల మధ్య కంటే ఇద్దరు మంత్రుల మధ్య పోటీ.. ఆసక్తికరంగా మారిన లోక్‌సభ ఎన్నికలు!

సాధారణంగా ఎన్నికల్లో పోటీ అంటేనే పార్టీల మధ్య ఉంటుంది. గెలుపు కోసం పార్టీల అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతారు. కానీ ఆ జిల్లాలో మాత్రం పార్లమెంట్ ఎన్నికల వేళ ఇద్దరు మంత్రుల మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ పార్టీల మధ్య కంటే ఇద్దరు మంత్రుల మధ్య పోటీగా ఆ పార్టీ భావిస్తోంది. దీంతో ఆ మంత్రులకు పార్లమెంటు ఎన్నికలు సవాల్ గా మారాయి.

Dr. Boora Narsaiah Humanity: మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ.. వ్యక్తిని కాపాడిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

Dr. Boora Narsaiah Humanity: మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ.. వ్యక్తిని కాపాడిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

భువనగిరి మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ స్వయానా ఒక డాక్టర్. రాజకీయ నాయకుడిగానే కాదు డాక్టర్‌గా ఎందరికో వైద్యం అందించారు. తాజాగా ఆయనలో మరోసారి డాక్టర్ బయటికి వచ్చారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఒక వ్యక్తి ప్రాణం కాపాడి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు.

YTPS: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు లైన్ క్లియర్.. విద్యుత్‌ ఉత్పత్తి దిశగా అడుగులు..!

YTPS: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు లైన్ క్లియర్.. విద్యుత్‌ ఉత్పత్తి దిశగా అడుగులు..!

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు ఎట్టకేలకు పర్యావరణ అనుమతి లభించింది. పర్యావరణ అనుమతులను సిఫారసు చేస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో చివరి దశకు చేరుకున్న ప్లాంట్‌ పనులతో విద్యుత్‌ ఉత్పత్తి దిశగా అధికారులు అడుగులు వేసే అవకాశం ఉంది.