AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

M Revan Reddy

M Revan Reddy

Senior Staff Reporter - TV9 Telugu

revan.muppa@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆంధ్రప్రభలో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2000 నుంచి 2002 వరకు హైదరాబాద్ లో ఆంధ్రప్రభ రిపోర్టర్ గా, 2002 నుంచి 2003 జూలై వరకు ఆంధ్రప్రభలో మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ గా పని చేశారు. 2003 ఆగస్టులో టివి9 సంస్థలో అడుగు పెట్టారు. ప్రస్తుతం టివి9 ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై అనేక ప్రత్యేక కథనాలు రాశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. నల్లగొండ జిల్లాను పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్య, గిరిజన తండాల్లో శిశు విక్రయాలపై ప్రత్యేక కథనాలు రాసి జాతీయ స్థాయిలో ప్రాచూర్యం తీసుకువచ్చారు. 2005లో జరిగి ఘోర డెల్టా రైలు ప్రమాద సమయంలో అనేక మానవీయ కథనాలు రాశారు. 2009లో కృష్ణా నదికి వచ్చిన వరదలను కవర్ చేశారు. 2016లో జిల్లాలో కృష్ణ పుష్కరాలను కవర్ చేశారు. 2004 నుండి వరసగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను కవర్ చేస్తూ ప్రత్యేక కథనాలు రాశారు. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలరు. రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.

Read More
Telangana: ఫాస్ట్‌ట్యాగ్ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక పంతంగి టోల్‌ప్లాజా దగ్గర దూసుకెళ్లిపోవచ్చు..

Telangana: ఫాస్ట్‌ట్యాగ్ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక పంతంగి టోల్‌ప్లాజా దగ్గర దూసుకెళ్లిపోవచ్చు..

సంక్రాంతి సెలవులొచ్చాయంటే చాలు హైదారాబాద్- విజయవాడ జాతీయ రహదారి వాహనాల జాతర నెలకొంటుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి వాహనాలు పల్లెటూర్లకు బారులు తీరుతుంటాయి. ప్రతి ఏటా వాహన దారులు, ప్రయాణికులు ట్రాఫిక్ లో చిక్కుకొని నరకం చూస్తున్నారు. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతాయి.

Telangana: మీరు వాడుతున్న సబ్బులు, నూనెలు అసలైనవేనా.. ఇది తెలిస్తే మీరు షాక్ అవ్వడం పక్కా..

Telangana: మీరు వాడుతున్న సబ్బులు, నూనెలు అసలైనవేనా.. ఇది తెలిస్తే మీరు షాక్ అవ్వడం పక్కా..

తెలంగాణలో నకిలీ వస్తువుల బెడద తీవ్రమవుతోంది. హుజూర్‌నగర్‌లో రూ.10 లక్షల విలువైన నకిలీ సబ్బులు, కొబ్బరి నూనె, టీ పొడి వంటి బ్రాండెడ్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మైసూర్ శాండిల్, పారాషూట్, రెడ్ లేబుల్ వంటి ప్రముఖ బ్రాండ్ల పేరుతో మోసం చేస్తున్న కేటుగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గుడిలో నుంచి శిశువు ఏడుస్తున్న శబ్దాలు.. అక్కడకు వెళ్ళి చూడగా..!

గుడిలో నుంచి శిశువు ఏడుస్తున్న శబ్దాలు.. అక్కడకు వెళ్ళి చూడగా..!

మాతృ ప్రేమ మలీనమవుతోంది. కొందరు ఆడపిల్లలను భూమి మీదికి రాకుండా కడుపులోనే కడతేరుస్తుండగా, మరికొందరు పురిట్లోనే బంగారు తల్లులను వదిలించుకుంటున్నారు. కడుపున పుట్టిన ఆడపిల్లతో పేగుబంధం తెంచుకుంటున్నారు. కష్టమే వచ్చిందో, భారమని భావించిందో..! ఆడపిల్ల అని వదిలించుకుందో తెలియదు కానీ... అప్పుడే పుట్టిన పసికందును దేవాలయంలో వదిలి వెళ్ళింది ఓ తల్లి. అమ్మతనానికే మాయని మచ్చను తెచ్చిన ఈ అమానుష ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: అమ్మను గెంటేస్తున్న రోజుల్లో.. ఈ కొడుకు ప్రేమ చూస్తే కళ్లు చెమర్చాల్సిందే..

Telangana: అమ్మను గెంటేస్తున్న రోజుల్లో.. ఈ కొడుకు ప్రేమ చూస్తే కళ్లు చెమర్చాల్సిందే..

కోటిరెడ్డి తన మరణించిన తల్లి లక్ష్మీనర్సమ్మపై ఉన్న అంతులేని ప్రేమను వినూత్నంగా చాటాడు. ఆమె ముఖచిత్రాన్ని చేతిపై పచ్చబొట్టు పొడిపించుకుని, షర్ట్స్‌పై ముద్రించుకున్నాడు. తన ఉన్నతికి కారణమైన అమ్మ పేరున అన్నదానాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మాతృప్రేమకు నిదర్శనంగా నిలుస్తున్న ఈ కథ అందరికీ ఆదర్శం.

అయ్యో భగవంతుడా.. తండ్రి ఫొటో వద్ద రోదిస్తూ ప్రాణాలు విడిచిన కూతురు..

అయ్యో భగవంతుడా.. తండ్రి ఫొటో వద్ద రోదిస్తూ ప్రాణాలు విడిచిన కూతురు..

తండ్రి కూతురు మధ్య బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన నాన్న మృతితో కుమార్తె తల్లడిల్లిపోయింది. దశదిన కర్మ రోజు తండ్రి చిత్రపటం వద్ద రోదిస్తూ కూతురు ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: తమ జీవితాల్ని తీర్చిదిద్దిన గురువకు అపూర్వ వీడ్కోలు..

Telangana: తమ జీవితాల్ని తీర్చిదిద్దిన గురువకు అపూర్వ వీడ్కోలు..

ఎవరైనా జీవితంలో స్థిరపడాలంటే.. ముగ్గురు కారణమవుతారు. వారిలో మొదటి ఇద్దరు తల్లిదండ్రులు అయితే మూడోది వ్యక్తి గురువు అందుకే గురుదేవోభవ అంటారు. విద్యాబుద్ధులు చెప్పి తమ ఉన్నతికి కారకులైన పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడికి విద్యార్థులు ఘనమైన వీడ్కోలు పలికారు. ..

అలసిన చేతులతో ఆనందంగా.. వెరైటీగా న్యూ ఇయర్ జరుపుకున్న కూలీలు!

అలసిన చేతులతో ఆనందంగా.. వెరైటీగా న్యూ ఇయర్ జరుపుకున్న కూలీలు!

వాళ్లంతా శ్రమజీవులు.. నిత్యం రెక్కాడితే గానీ డొక్కాడని బడుగులు. వారంతా మట్టి వాసనతోనే నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. ఆధునిక యువతే కాదు నూతన సంవత్సరం సంబరాల్లో తాము తక్కువేమి కాదంటున్నారు. శ్రమతో అలసిన చేతులతో ఆనందంగా కొత్త సంవత్సర వేడుకలను శ్రమజీవులు ఎలా జరుపుకున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామనుకున్నారు.. కట్ చేస్తే.. గవర్నమెంట్ జాబ్ వచ్చేసరికి.!

Telangana: ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామనుకున్నారు.. కట్ చేస్తే.. గవర్నమెంట్ జాబ్ వచ్చేసరికి.!

నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ముకు చెందిన పులికంటి శ్రీను అదే గ్రామానికి చెందిన యువతి కలిసి చదువుకున్నారు. ఒకే సామాజిక వర్గం కావడంతో రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. శ్రీనుకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రియుడికి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ప్రియురాలు ఎంతో సంతోషపడింది. తమ పెళ్లి చేసుకుని హాయిగా ఉండవచ్చని భావించింది.

పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సంతోషం లేకుండా పోయింది.. కొడుకు మృతిని తట్టుకోలేక తండ్రి మృతి!

పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సంతోషం లేకుండా పోయింది.. కొడుకు మృతిని తట్టుకోలేక తండ్రి మృతి!

యాదాద్రి జిల్లా రాజాపేట మండలం నెమిల గ్రామానికి చెందిన మోత్కుపల్లి ఐలయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక్క కుమార్తె ఉన్నారు. ఐలయ్య చిన్న కుమారుడు బాలకృష్ణ కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో అనారోగ్యం బారిన పడుతున్నాడు. అయితే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాలకృష్ణ భార్య జ్యోతిని వార్డు ఎన్నికల్లో పోటీ చేయించాడు ఐలయ్య. అందరూ ఊహించినట్లే జ్యోతి వార్డు సభ్యురాలిగా విజయం సాధించింది.

ఆ నవ దంపతులు రైలు నుంచి జారిపడ్డారా..? ఆత్మహత్య చేసుకున్నారా.. ఏం జరిగిందంటే..?

ఆ నవ దంపతులు రైలు నుంచి జారిపడ్డారా..? ఆత్మహత్య చేసుకున్నారా.. ఏం జరిగిందంటే..?

ఆ నవ దంపతులు. రెండు నెలల క్రితమే వివాహమైంది. ఈ నవ దంపతులు రైలు నుంచి జారి కిందపడి చనిపోయారు. ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి కిందపడి చనిపోయారని అందరూ భావించారు. కానీ ఈ నవ దంపతుల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

బ్యాంక్ మేనేజర్ సమయస్పూర్తి.. సైబర్ కేటుగాళ్ల ఉచ్చు నుంచి బయటపడ్డ రిటైర్డ్ టీచర్‌..!

బ్యాంక్ మేనేజర్ సమయస్పూర్తి.. సైబర్ కేటుగాళ్ల ఉచ్చు నుంచి బయటపడ్డ రిటైర్డ్ టీచర్‌..!

డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు రోజురోజుకు విజృంభిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహించినా జనం మోసానికి గురవుతూనే ఉన్నారు. మహిళలు, వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగుల టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు వినూత్న పద్ధతుల్లో మోసాలు చేస్తున్నారు. తాజాగా మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

Telangana: అద్భుతం.. యాదాద్రీశుడికి అగ్గిపెట్టలో బంగారు పట్టుచీర.. ఔరా అనాల్సిందే

Telangana: అద్భుతం.. యాదాద్రీశుడికి అగ్గిపెట్టలో బంగారు పట్టుచీర.. ఔరా అనాల్సిందే

చేనేత కళాకారుల కాణాచి తెలంగాణ రాష్ట్రం. ఒకనాటి వైభవంగా మిగిలిపోయిన అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీరలను తయారీనీ చేనేత కార్మికుల వారసులు మళ్లీ ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. తాజాగా భక్తుల కోరికలను తీర్చే మహిమాన్విత స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహుడి సన్నిధిలోని అమ్మ వారికి అగ్గిపెట్టెలో ఇమిడే బంగారు చీరను కానుకగా సమర్పించారు.