తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆంధ్రప్రభలో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2000 నుంచి 2002 వరకు హైదరాబాద్ లో ఆంధ్రప్రభ రిపోర్టర్ గా, 2002 నుంచి 2003 జూలై వరకు ఆంధ్రప్రభలో మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ గా పని చేశారు. 2003 ఆగస్టులో టివి9 సంస్థలో అడుగు పెట్టారు. ప్రస్తుతం టివి9 ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై అనేక ప్రత్యేక కథనాలు రాశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. నల్లగొండ జిల్లాను పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్య, గిరిజన తండాల్లో శిశు విక్రయాలపై ప్రత్యేక కథనాలు రాసి జాతీయ స్థాయిలో ప్రాచూర్యం తీసుకువచ్చారు. 2005లో జరిగి ఘోర డెల్టా రైలు ప్రమాద సమయంలో అనేక మానవీయ కథనాలు రాశారు. 2009లో కృష్ణా నదికి వచ్చిన వరదలను కవర్ చేశారు. 2016లో జిల్లాలో కృష్ణ పుష్కరాలను కవర్ చేశారు. 2004 నుండి వరసగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను కవర్ చేస్తూ ప్రత్యేక కథనాలు రాశారు. పాలిటిక్స్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్, బిజినెస్కు సంబంధించిన కంటెంట్ను రాయగలరు. రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.
Telangana: యూట్యూబ్లో వీడియో చూశాడు.. ఏటీఎంలోకి దూరాడు.. సీన్ కట్చేస్తే..
జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చాలామంది యువకులు అడ్డదారులను తొక్కుతున్నారు. ఆధునిక టెక్నాలజీ, యూట్యూబ్లో వీడియోల స్ఫూర్తితో యువత దొంగతనాలు, నేరాలకు పాల్పడుతున్నారు. ఈజీ మనీ కోసం యూట్యూబ్ చూసి ఓ దొంగతనానికి స్కెచ్ వేశారు. కానీ చివరికి ఏమైందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: May 10, 2026
- 12:02 pm
ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకుందాం అనుకున్నాడు.. కట్ చేస్తే, ఫోన్ హ్యాక్.. క్షణాల్లోనే..
ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే వాహనదారులే టార్గెట్గా సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లు, యాప్ల ద్వారా భారీ మోసాలకు పాల్పడుతున్నారు. AI, APK ఫైల్స్ ఉపయోగించి బ్యాంకు ఖాతాలను నిమిషాల్లో ఖాళీ చేస్తున్నారు.
- M Revan Reddy
- Updated on: May 8, 2026
- 5:52 pm
Telangana: ప్రేమించి పెళ్లాడాడు.. కట్ చేస్తే.. వన్ ఫైన్ డే ఆటో ఎక్కుతుండగా భార్యను..
అనుమానం పెనుభూతమైంది. ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే బలి తీసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడలో అందరూ చూస్తుండగానే ఓ భర్త తన భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. గొడవల నేపథ్యంలో పోలీసు స్టేషన్కు వచ్చి వెళ్తుండగా జరిగిన ఈ ఘోర ఘటన స్థానికంగా కలకలం రేపింది.
- M Revan Reddy
- Updated on: May 7, 2026
- 8:04 am
తల్లి మరణంతో అనాథైన 50 రోజుల పసిపాప.. కష్టకాలంలో స్నేహితుడికి పూర్వ విద్యార్థుల భరోసా!
"స్నేహం" అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు యువకులు. ఆపదలో ఉన్న మిత్రుడిని చూసి అయ్యో పాపం అని వదిలేయకుండా, మేమున్నామంటూ భరోసానిచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. రక్తసంబంధం కంటే స్నేహమే గొప్పదని నిరూపిస్తూ వారు చేసిన సాయం అందరినీ కలచివేస్తోంది.
- M Revan Reddy
- Updated on: May 5, 2026
- 3:00 pm
Telangana: జల్సాల కోసం దారి తప్పిన మైనర్లు.. ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు..
మొదట్లో నాటుకోళ్లు, సైకిళ్లు దొంగిలించిన ఆ చేతులు.. జల్సాలకు డబ్బు సరిపోకపోయేసరికి ఏకంగా బైక్ చోరీలకు స్కెచ్ వేశాయి. మార్కెట్లో డిమాండ్ ఉన్న పల్సర్ బైక్లనే టార్గెట్ చేస్తూ మిర్యాలగూడ, హుజూర్ నగర్, ఏపీలోని దాచేపల్లి ప్రాంతాల్లో హల్చల్ చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
- M Revan Reddy
- Updated on: May 5, 2026
- 2:19 pm
యాదాద్రిలో తిరుమల వైభవం.. పంచనారసింహ క్షేత్రంలో కొలువుదీరిన దివ్య పాదాలు..!
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దేవస్థానం అదిరిపోయే ఆధ్యాత్మిక కానుకను అందించింది. తెలంగాణ తిరుపతిగా వెలుగొందుతున్న ఈ పుణ్యక్షేత్రంలో, తిరుమల తరహాలోనే 'నృసింహ పాదాల'ను ప్రతిష్ఠించారు. లోక సంరక్షణార్థం ఉగ్ర నరసింహుడు ఐదు రూపాలలో వెలసిన ఈ పంచ నారసింహ క్షేత్రంలో, భక్తుల సౌకర్యార్థం ఈ నూతన ఘట్టాన్ని ఆవిష్కరించారు.
- M Revan Reddy
- Updated on: May 3, 2026
- 3:36 pm
అరేయ్.. ఏంట్రా ఇది.. హుండీ లెక్కింపు ఉద్యోగాలు.. అంటూ ఉన్నది మొత్తం ఊడ్చేశాడు.. చివరకు
నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాలను ఎరగా వేస్తూ ఆర్థికంగా నిలువునా ముంచుతున్నారు. సేవా కార్యక్రమాన్ని ఉద్యోగంగా నమ్మించిన కేటుగాళ్ళు.. నిరుద్యోగులకు కొట్లాది రూపాయల కుచ్చుటోపి పెట్టారు. నిరుద్యోగులను ఈ కేటుగాళ్లు ఎలా మోసం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: May 3, 2026
- 12:27 pm
Alert Test: ఒక్కసారిగా మీ సెల్ఫోన్లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్ వద్దు.. ఎందుకంటే?
దేశంలో కోట్లాదిమంది సెల్ ఫోన్ లు వినియోగిస్తున్నారు. తమ అవసరాలకు సమాచార మార్పిడికి సెల్ ఫోన్లను వాడుకుంటున్నారు. సాధారణంగా ఎవరైనా కాల్ చేస్తేనే ఫోన్ రింగ్ అవుతుంది. కానీ మే 2న శనివారం మాత్రం దేశవ్యాప్తంగా లక్షల ఫోన్లలో ఒక్కసారిగా సైరన్ శబ్దం వినిపించబోతోంది. ఈ సైరన్ శబ్దం ఎందుకు వినిపించబోతుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: May 2, 2026
- 12:01 am
కారు రిపేర్ కోసం కక్కుర్తి.. ఈజీ మనీ కోసం దారితప్పిన డ్రైవర్.. చివరకు కటకటాల్లోకి..!
నేటి కాలంలో కొందరు యువత విలాసాలకు అలవాటు పడి, కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేరాల బాట పడుతున్నారు. మరికొందరు తమ అవసరాల కోసం అడ్డదారులు తొక్కి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా మిర్యాలగూడలో చోటుచేసుకున్న ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది.
- M Revan Reddy
- Updated on: May 1, 2026
- 8:54 am
కోదాడలో నకిలీ వస్తువుల గుట్టురట్టు.. బ్రాండెడ్ పేరిట ప్రాణాలతో చెలగాటం.. ముగ్గురు కంత్రీగాళ్ల అరెస్ట్!
తెలంగాణలో నకిలీ వస్తువులు రాజ్యమేలుతున్నాయి. ఏదీ నకిలీయో ఏదీ అసలు అనేది అంతుపట్టడం లేదు. తినే తిండి నుంచి వాడే సబ్బుల వరకు అన్నీ నకిలీవే. బ్రాండెడ్ కంపెనీల పేరిట నకిలీ కాఫీ, సిగరెట్లుతో వినియోగదారుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న రాకెట్ ను కోదాడ చేధించారు. కంత్రీగాళ్ళు చేస్తున్న అక్రమ వ్యాపారంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.
- M Revan Reddy
- Updated on: Apr 29, 2026
- 9:08 pm
Telangana: విజయవాడ హైవేపై ‘వీకెండ్’ నరకం.. ప్రయాణమా.. ప్రయాసనా?
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65) ఇప్పుడు ప్రయాణికుల పాలిట నరకప్రాయంగా మారింది. ఒకప్పుడు కేవలం సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండుగల సమయంలోనే కనిపించే ట్రాఫిక్ రద్దీ, ఇప్పుడు ప్రతి వారాంతంలోనూ (వీకెండ్) సర్వసాధారణమైపోయింది. అసంపూర్తిగా సాగుతున్న నిర్మాణ పనులు, పెరుగుతున్న వాహనాల సంఖ్య ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
- M Revan Reddy
- Updated on: Apr 26, 2026
- 7:37 am
లక్కీ డ్రాప్ కోసం ఫ్రెండ్స్ డిష్యుం..డిష్యుం.. పోయిన ప్రాణం..!
బొమ్మలరామారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన రాగీర్ మధు, గాంధారి చరణ్, ఊట్ల నవీన్ అనే ముగ్గురు స్నేహితులు ఏప్రిల్ 21వ తేదీ (మంగళవారం) రాత్రి శామీర్పేట వాగు సమీపంలోని ఒక వెంచర్లో మద్యం తాగడానికి కూర్చున్నారు. రాత్రంతా కలిసి నాలుగు ఫుల్ బాటిళ్లను ఖాళీ చేశారు. చివరి చుక్కతో మొదలైన గొడవ ప్రాణాలు తీసుకునే దాకా వెళ్లింది.
- M Revan Reddy
- Updated on: Apr 25, 2026
- 12:00 pm