AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

M Revan Reddy

M Revan Reddy

Senior Staff Reporter - TV9 Telugu

revan.muppa@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆంధ్రప్రభలో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2000 నుంచి 2002 వరకు హైదరాబాద్ లో ఆంధ్రప్రభ రిపోర్టర్ గా, 2002 నుంచి 2003 జూలై వరకు ఆంధ్రప్రభలో మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ గా పని చేశారు. 2003 ఆగస్టులో టివి9 సంస్థలో అడుగు పెట్టారు. ప్రస్తుతం టివి9 ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై అనేక ప్రత్యేక కథనాలు రాశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. నల్లగొండ జిల్లాను పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్య, గిరిజన తండాల్లో శిశు విక్రయాలపై ప్రత్యేక కథనాలు రాసి జాతీయ స్థాయిలో ప్రాచూర్యం తీసుకువచ్చారు. 2005లో జరిగి ఘోర డెల్టా రైలు ప్రమాద సమయంలో అనేక మానవీయ కథనాలు రాశారు. 2009లో కృష్ణా నదికి వచ్చిన వరదలను కవర్ చేశారు. 2016లో జిల్లాలో కృష్ణ పుష్కరాలను కవర్ చేశారు. 2004 నుండి వరసగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను కవర్ చేస్తూ ప్రత్యేక కథనాలు రాశారు. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలరు. రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.

Read More
Anvita Reddy: సంకల్పం ముందు తలవంచిన శిఖరం.. గైడ్ లేకుండానే ‘డెనాలి’ని జయించిన భువనగిరి బిడ్డ

Anvita Reddy: సంకల్పం ముందు తలవంచిన శిఖరం.. గైడ్ లేకుండానే ‘డెనాలి’ని జయించిన భువనగిరి బిడ్డ

సాధారణంగా పర్వతారోహణ అంటే పురుషులే ఎక్కువగా కనిపించే రంగం. అయితే ఓ యువతి ఆ అభిప్రాయాన్ని చెరిపేశారు. పర్వతం ఎత్తు ఎంతైనా కావొచ్చు.. సంకల్పం దానికంటే ఎత్తుగా ఉంటే శిఖరం కూడా తలవంచాల్సిందేనని నిరూపించింది. భువనగిరి గడ్డపై పుట్టిన ఓ యువతి.. ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన శిఖరాల్లో ఒకటైన డెనాలీని జయించి మరోసారి తెలంగాణ జెండాను అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించింది.

యాదగిరిగుట్ట నరసన్నకు భక్తుల కానుకల వర్షం.. వరుసగా మూడో ఏడాది రికార్డు ఆదాయం!

యాదగిరిగుట్ట నరసన్నకు భక్తుల కానుకల వర్షం.. వరుసగా మూడో ఏడాది రికార్డు ఆదాయం!

Yadadri Temple: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వరుసగా మూడో ఏడాది రూ.200 కోట్లకు పైగా ఆదాయం సాధించి తెలంగాణలోనే అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయంగా నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.243 కోట్ల ఆదాయం నమోదు కాగా, భక్తుల సంఖ్య కోటి దాటింది. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయాలు, హుండీ కానుకలు, ఆర్జిత సేవలు దేవస్థానం ఆదాయ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

ఇంట్లోనే దుకాణం పెట్టిన భార్యాభర్తలు.. ఆ ఒక్క తప్పుతో అడ్డంగా దొరికిపోయారు..!

ఇంట్లోనే దుకాణం పెట్టిన భార్యాభర్తలు.. ఆ ఒక్క తప్పుతో అడ్డంగా దొరికిపోయారు..!

ఈజీ మనీ కోసం యూట్యూబ్ వీడియోలను చూసి నకిలీ కరెన్సీ నోట్ల తయారీకి దిగిన భార్యాభర్తలను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లోనే ప్రింటర్, ప్రత్యేక పేపర్లతో రూ.500 నోట్లను ముద్రించి మార్కెట్‌లో చలామణి చేస్తున్న రాజీవ్, పావని దంపతులను అదుపులోకి తీసుకుని నకిలీ నోట్లు, ప్రింటర్, స్కానర్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. చిన్న అనుమానంతో వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు ఈ కిలాడీ దంపతుల బండారం బయటపెట్టింది.

చదువుల పండుగలో చేదు ఘటన.. స్కూల్ గేటు వద్ద కుప్పకూలిన విద్యార్థి!

చదువుల పండుగలో చేదు ఘటన.. స్కూల్ గేటు వద్ద కుప్పకూలిన విద్యార్థి!

పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి.. కొత్త పుస్తకాలు, కొత్త యూనిఫాం, కొత్త ఆశలతో విద్యార్థులు స్కూల్ బాట పట్టారు. పాఠశాల తొలి రోజు పిల్లల్లో ఆనందాన్ని నింపాల్సిన వేళ... ఓ కుటుంబంలో ఆందోళన నింపింది. సంతోషంగా పాఠశాలకు వచ్చిన తొలి రోజే ఓ విద్యార్థి జీవితంలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ గేటుకు మామిడి తోరణం కడుతున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఉదయం ఆనందంగా స్కూల్‌కు వచ్చిన బాలుడు... క్షణాల్లో ఆసుపత్రి మంచంపై చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

అరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. కట్ చేస్తే, ఊరు చివర పొదల్లో..

అరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. కట్ చేస్తే, ఊరు చివర పొదల్లో..

దొంగిలించిన బైక్‌ను గుర్తుపట్టకుండా ఉండేందుకు రంగు మార్చి కొత్త రూపం ఇచ్చిన దొంగల ప్లాన్ చివరకు బెడిసికొట్టింది. మహబూబ్‌నగర్‌కు చెందిన గొర్రెల కాపరి బైక్‌ను చోరీ చేసిన దుండగులు, దానికి బ్లాక్ నుంచి రెడ్ కలర్ వేసి ఆచూకీ దాచాలని ప్రయత్నించారు. అయితే పోలీసుల సీసీటీవీ దర్యాప్తుతో భయపడి బైక్‌ను చెరువుకట్ట పొదల్లో వదిలేసి పరారయ్యారు. ప్రస్తుతం పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

కలికాలం.. ఇలాంటి ఫ్రెండ్స్‌తో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని వెంచర్‌కు తీసుకెళ్లి..

కలికాలం.. ఇలాంటి ఫ్రెండ్స్‌తో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని వెంచర్‌కు తీసుకెళ్లి..

నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.30 వేల అప్పు ఇవ్వలేదనే కోపంతో ఇద్దరు స్నేహితులు కలిసి తమ మిత్రుడు సాయికుమార్‌ను హత్య చేశారు. మద్యం తాగుదామని పిలిచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితులు బండరాయితో తలపై దాడి చేసి చంపారు. అనంతరం అతని వద్ద ఉన్న బంగారం, సెల్‌ఫోన్‌తో పరారయ్యారు.

Password: మీ ఫోన్‌కు ఈజీ పాస్వర్డ్స్‌ పెట్టుకుంటున్నారా? ఇది తెలిస్తే.. ఇప్పుడే ఛేంజ్ చేస్తారు

Password: మీ ఫోన్‌కు ఈజీ పాస్వర్డ్స్‌ పెట్టుకుంటున్నారా? ఇది తెలిస్తే.. ఇప్పుడే ఛేంజ్ చేస్తారు

మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా.. ? గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి మనీ ట్రాన్స్‌ఫర్ యాప్‌ల లాకింగ్ కోడ్స్ కోసం 1234 , 0000 లేదంటే మీ పుట్టిన రోజు వంటి సులువైన నంబర్లను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకున్నారా..? అయితే అంతే సంగతులు. తక్షణమే అలర్ట్ అవ్వండి.. మీ అజాగ్రత్తే దొంగలకు వరంగా మారే ప్రమాదం పొంచి ఉంది. మీ అకౌంట్లలోని డబ్బులు క్షణాల్లో మాయం చేసే కేటుగాళ్ళు దాపురించారు. ఇటీవల సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసిన షాకింగ్ ఘటనే దీనికి నిదర్శనం.

Hyderabad: శరణార్థులుగా వచ్చారు.. ఇక్కడే సెటిల్ అయ్యారు.. సీన్ కట్‌చేస్తే.. రాత్రికి రాత్రే..

Hyderabad: శరణార్థులుగా వచ్చారు.. ఇక్కడే సెటిల్ అయ్యారు.. సీన్ కట్‌చేస్తే.. రాత్రికి రాత్రే..

తమ దేశాల్లో యుద్ధం, హింస నుంచి తప్పించుకుని ఆశ్రయం కోసం భారత్‌కు వచ్చని కొందరు రోహింగ్యాలు. ఇక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేక అక్రమ మార్గాల వైపు మళ్ళారు. ఈ క్రమంలో దొంగతనాలు, దోపిడీలు చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ల టార్గెట్ ఏంటి, వీళ్లు మన దేశంలో ఎలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Viral: టీ తాగుదామని బైక్ ఆపాడు.. వచ్చి బండి చూస్తే గుండె ఆగినంత పనైంది..

Viral: టీ తాగుదామని బైక్ ఆపాడు.. వచ్చి బండి చూస్తే గుండె ఆగినంత పనైంది..

సూర్యాపేటలో ఓ వ్యక్తి టీ తాగి తిరిగి వెళ్లేందుకు బైక్ స్టార్ట్ చేయబోతుండగా ఇంజిన్ భాగంలో పాము కనిపించి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. స్థానికులు గంటపాటు శ్రమించి బైక్‌లోని భాగాలు తొలగించి పామును బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే అది మరో బైక్‌లోకి దూరడంతో ఉద్రిక్తత నెలకొంది.

చరిత్రను దాచలేకపోయిన మసి.. కొలనుపాక గోడలపై వెలుగుచూస్తున్న వేల ఏళ్ల రహస్యాలు!

చరిత్రను దాచలేకపోయిన మసి.. కొలనుపాక గోడలపై వెలుగుచూస్తున్న వేల ఏళ్ల రహస్యాలు!

తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కళా సంపదలకు నిలయంగా పేరొందిన కొలనుపాక మరోసారి వార్తల్లో నిలిచింది. శతాబ్దాలుగా మసి, సున్నం, రంగుల పొరల వెనుక మరుగున పడిపోయిన అపురూప కుడ్యచిత్రాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న శుభ్రపరిచే పనుల ఫలితంగా ఈ అరుదైన చిత్రాలు బయటపడుతుండటంతో చరిత్రకారులు, కళాభిమానులు, పురావస్తు పరిశోధకులు ఆసక్తి చూపుతున్నారు.

ఊరెళ్లిన భార్య.. సాయంత్రం వచ్చి చూసేసరికి ఘోరం.. స్థానికంగా కుదిపేసిన దారుణ ఘటన!

ఊరెళ్లిన భార్య.. సాయంత్రం వచ్చి చూసేసరికి ఘోరం.. స్థానికంగా కుదిపేసిన దారుణ ఘటన!

ఆడుకుంటూ, చదువుకుంటూ భవిష్యత్తు వైపు అడుగులు వేయాల్సిన 13 ఏళ్ల బాలుడు.. సొంత తండ్రి చేతిలోనే అత్యంత పాశవికంగా ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత అదే తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కన్న కొడుకును గుండెల్లో పెట్టుకుని పెంచాల్సిన తండ్రే.. అతని పాలి కాలయముడుగా మారడం ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి మహార్దశ.. ప్రపంచ పర్యాటక కేంద్రంగా యాదగిరిగుట్ట!

శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి మహార్దశ.. ప్రపంచ పర్యాటక కేంద్రంగా యాదగిరిగుట్ట!

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక-పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి ప్రత్యేక సాయం పథకం” కింద రూ.500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. దీంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి మహార్దశ పట్టనుంది.