తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆంధ్రప్రభలో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2000 నుంచి 2002 వరకు హైదరాబాద్ లో ఆంధ్రప్రభ రిపోర్టర్ గా, 2002 నుంచి 2003 జూలై వరకు ఆంధ్రప్రభలో మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ గా పని చేశారు. 2003 ఆగస్టులో టివి9 సంస్థలో అడుగు పెట్టారు. ప్రస్తుతం టివి9 ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై అనేక ప్రత్యేక కథనాలు రాశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. నల్లగొండ జిల్లాను పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్య, గిరిజన తండాల్లో శిశు విక్రయాలపై ప్రత్యేక కథనాలు రాసి జాతీయ స్థాయిలో ప్రాచూర్యం తీసుకువచ్చారు. 2005లో జరిగి ఘోర డెల్టా రైలు ప్రమాద సమయంలో అనేక మానవీయ కథనాలు రాశారు. 2009లో కృష్ణా నదికి వచ్చిన వరదలను కవర్ చేశారు. 2016లో జిల్లాలో కృష్ణ పుష్కరాలను కవర్ చేశారు. 2004 నుండి వరసగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను కవర్ చేస్తూ ప్రత్యేక కథనాలు రాశారు. పాలిటిక్స్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్, బిజినెస్కు సంబంధించిన కంటెంట్ను రాయగలరు. రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.
సినిమాను మించిన క్రైమ్ త్రిల్లర్.. 20 ఏళ్లు దాచుకున్న పగ.. పక్కా స్కెచ్ వేసి మరీ ఖతం!
సినిమా రీళ్లని తలపించే ఘోరమైన పగ ఇది. కళ్లెదుటే తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో, ఆ కొడుకు గుండెల్లో ప్రతీకార జ్వాల రగిలింది. కాలం గడుస్తున్నా కసి చల్లారలేదు. ఏకంగా 20 ఏళ్ల పాటు ఓపికగా వేచి చూశాడు. సరైన సమయం కోసం పక్కాగా స్కెచ్ వేశాడు. చివరకు, తన తండ్రిని చంపిన ప్రత్యర్థిని నడిరోడ్డుపై నరికి చంపి తన కసి తీర్చుకున్నాడు.
- M Revan Reddy
- Updated on: May 26, 2026
- 10:14 am
Minister Komatireddy: పదవ తరగతి విద్యార్థులకు మంత్రి కోమటిరెడ్డి బర్త్ డే సర్ప్రైజ్ గిఫ్ట్..
పరీక్షల్లో విద్యార్థులు సాధించే మార్కులను చూసి శభాష్ అంటే ఎంతో మురిసిపోతుంటారు. వారి ప్రతిభకు బహుమతులు ఇస్తే ఎంతో ఆనంద పడుతుంటారు. మరీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తే.. విద్యార్థుల ఆనందానికి అవధులే ఉండవు. అలాంటి సీనే ఇక్కడ రిపీట్అయింది. పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని ఓ మంత్రి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు.. అన్నట్టుగానే విద్యార్థులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి వాళ్ల కళ్లలో ఆనందం చూశారు. ఇంతకూ ఆ మంత్రి ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: May 23, 2026
- 1:57 pm
ఆధ్యాత్మిక నగరం యాదాద్రికి మరిన్ని హంగులు.. అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, రూ.99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు ఆయన ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట క్షేత్రంలో వేద పాఠశాల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.
- M Revan Reddy
- Updated on: May 23, 2026
- 1:06 pm
40 ఏళ్లనాటి పగ.. మద్యం సెట్టింగ్ వేసి.. ధావత్కు పిలిస్తే వెళ్లిన బీఆర్ఎస్ నేత.. ఇంతలో దారుణం..!
సూర్యాపేట జిల్లాలోని యల్కారం గ్రామంలో రాజకీయ కక్షలు మళ్లీ భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ మౌనిక భర్త, చింతలపాటి మధు దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం (మే 22) సూర్యాపేటలోని తన నివాసం నుండి బయటకు వెళ్లిన మధు, సాయంత్రం నుండి ఫోన్లో అందుబాటులో లేకుండా పోయారు.
- M Revan Reddy
- Updated on: May 23, 2026
- 11:20 am
మన శరీరం ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది..? ఎన్ని డిగ్రీల వద్ద కాలిపోతుంది..?
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. 45 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు మానవ శరీరంపై ఎంత ప్రభావం చూపిస్తాయి? చర్మం ఎంత వేడిని తట్టుకోగలదు? హీట్ స్ట్రోక్ ఎలా వస్తుంది? తీవ్రమైన వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఈ అంశాలను శాస్త్రీయంగా వివరించే ప్రత్యేక కథనం.
- M Revan Reddy
- Updated on: May 22, 2026
- 12:48 pm
భారతీయ సంస్కృతికి ప్రపంచ నీరాజనం.. అంతర్జాతీయ కేన్స్ వేదికపై పోచంపల్లి ఇక్కత్ చారిత్రక అరంగేట్రం!
అంతర్జాతీయ వేదికపై తెలంగాణ చేనేత కళా వైభవం ఉట్టిపడింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) రెడ్ కార్పెట్పై పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు రత్నాలలా మెరిశాయి. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను, ముఖ్యంగా చేనేత కార్మికుల అద్భుత సృజనాత్మకతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ప్రదర్శన సాగింది.
- M Revan Reddy
- Updated on: May 22, 2026
- 9:17 am
Telangana: తోడ పుట్టడమే ఆమె చేసిన పాపమా.. సొంత అన్నే కాలయముడై ఏం చేశాడంటే?
ఒకప్పుడు రక్త సంబంధం అంటే ఆప్యాయత, అనురాగం, అండగా నిలిచే బంధం. కానీ ఈ రోజుల్లో అవన్నీ కేవలం ఆర్థిక బంధాలుగా మారిపోయాయి. డబ్బుల కోసం రక్త సంబంధాలనే తెంచుకునే వరకు వెళ్లిపోయాయి. ఆస్తిపాస్తుల కోసం సొంతవారినే పొట్టనపెట్టుకునే పరిస్థితులు దాపరించాయి. తాజాగా ఇలాంటి ఘటనే నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. ఆస్తికోసం తోబుట్టువునే అంతమెందించాడు ఓ కిరాతకుడు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
- M Revan Reddy
- Updated on: May 18, 2026
- 12:30 pm
Telangana: పొలానికి వెళ్లిన తల్లీకూతుళ్లు.. సడెన్గా వచ్చి కళ్లల్లో కారం చల్లి ఏం చేశారంటే..?
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. భూ వివాదాలు ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. తోడబుట్టిన వారిని, రక్త సంబంధీకులను సైతం లెక్క చేయకుండా హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా 8 ఎకరాల కోసం బంధువులే దారుణానికి ఒడిగ్గట్టారు. తల్లికూతుళ్లను ఏం చేశారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- M Revan Reddy
- Updated on: May 17, 2026
- 5:00 pm
Telangana: అయ్యో తాత.. మనవడిని బతికించి ప్రాణాలు వదిలేశాడు.. అసలేం జరిగిందంటే..?
ప్రాణం పోయినా పర్వాలేదు.. నా కళ్లముందే పుట్టిన మనవడు క్షేమంగా ఉండాలని కోరుకున్నాడు ఆ తాత. బోరు బావిలో పడిపోయిన పిల్లాడిని కాపాడటం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేస్తుంది. మనవడిని మృత్యువు నుంచి క్షేమంగా వెనక్కి తీసుకొచ్చి.. తాను మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
- M Revan Reddy
- Updated on: May 16, 2026
- 1:52 pm
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు నేషనల్ రికగ్నిషన్.. దేనికో తెలుసా?
Yadagiri Lakshmi Narasimha Swamy Temple: ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు మరో అరుదైన గుర్తింపు దక్కింది. భక్తులకు అందిస్తున్న డిజిటల్ సేవలతో ఈ దేవస్థానం కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డుల రేసులో నిలిచింది.
- M Revan Reddy
- Updated on: May 16, 2026
- 12:09 pm
దిష్టి తీస్తానంటూ.. మట్టి గురిగితో ‘మాయ’ చేశాడు.. 21 రోజుల ముందే రట్టయిన గుట్టు..!
సృష్టికి ప్రతి సృష్టి జరుగుతున్న ఆధునిక యుగంలో కూడా పల్లెలు మూఢ నమ్మకాల మత్తులో జోగుతున్నాయి. సామాన్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు క్షుద్ర పూజల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, కుటుంబ సమస్యలతో ప్రాణహాని ఉందంటూ క్షుద్ర పూజల పేరుతో కుచ్చుటోపి పెట్టాడు ఓ కేటుగాడు.
- M Revan Reddy
- Updated on: May 15, 2026
- 8:04 pm
Nalgonda: దేవుడా ఏందయ్యా నీ ఆట.. అమ్మతోటే బిడ్డ కాటికి..
తల్లికి పిల్లలే లోకం.. పిల్లలు ఉన్నత స్థానానికి ఎదగాలని ఆ తల్లి కలలు అంటుంది. ముఖ్యంగా కొడుకుకి తల్లే ధైర్యం.. తల్లి ఆశలను నిజం చేసేందుకు ఆ కొడుకు ఊరు కాని ఊరిలో ఉండి చదువు కుంటున్నాడు. అమ్మను కంటికి రెప్పలా కాపాడుకునే.. కొడుకు ఆమె కంటికి చికిత్స కోసం ఇంటికి వచ్చాడు. తల్లితో హాస్పిటల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తల్లితో పాటే కొడుకు కూడా కాటికి చేరుకున్నాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: May 15, 2026
- 11:50 am