తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆంధ్రప్రభలో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2000 నుంచి 2002 వరకు హైదరాబాద్ లో ఆంధ్రప్రభ రిపోర్టర్ గా, 2002 నుంచి 2003 జూలై వరకు ఆంధ్రప్రభలో మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ గా పని చేశారు. 2003 ఆగస్టులో టివి9 సంస్థలో అడుగు పెట్టారు. ప్రస్తుతం టివి9 ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై అనేక ప్రత్యేక కథనాలు రాశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. నల్లగొండ జిల్లాను పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్య, గిరిజన తండాల్లో శిశు విక్రయాలపై ప్రత్యేక కథనాలు రాసి జాతీయ స్థాయిలో ప్రాచూర్యం తీసుకువచ్చారు. 2005లో జరిగి ఘోర డెల్టా రైలు ప్రమాద సమయంలో అనేక మానవీయ కథనాలు రాశారు. 2009లో కృష్ణా నదికి వచ్చిన వరదలను కవర్ చేశారు. 2016లో జిల్లాలో కృష్ణ పుష్కరాలను కవర్ చేశారు. 2004 నుండి వరసగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను కవర్ చేస్తూ ప్రత్యేక కథనాలు రాశారు. పాలిటిక్స్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్, బిజినెస్కు సంబంధించిన కంటెంట్ను రాయగలరు. రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల్లో సుందరీమణులు ఏ వస్త్రాలు ధరిస్తారో తెలుసా..?
ప్రపంచ సుందరీమణులైన అందాల భామలకు ఆతిథ్యమిచ్చేందుకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఇక్కడ 25 రోజులపాటు అందాల భామలు సందడి చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర పర్యాటక శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరిమణులు ధరించే వస్త్రాలపై అందరి దృష్టి నెలకొంది.
- M Revan Reddy
- Updated on: Apr 20, 2025
- 3:53 pm
Nalgonda: అందులో మీరు ఇన్వెస్ట్ చేశారా?.. అయితే మీ డబ్బులు గోవింద! బోర్డు తిప్పేసిన పూణె కంపెనీ!
ప్రస్తుత రోజుల్లో ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇలాంటి ఘటనలు రోజూ మనం ఎన్నో చూస్తున్నాం. ఆన్ లైన్ యాప్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించినా.. ప్రజలు అవి పట్టించుకోకుండా అధిక వడ్డీకి ఆశపడి మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. తమ యాప్ లో పెట్టుబడి పెడితే రెట్టింపు అవుతుందని నమ్మించిన ఓ సంస్థ.. జనానికి కుచ్చుటోపి పెట్టింది. చైన్ సిస్టమ్ ద్వారా జనాల చేత కోట్లలో పెట్టుబడులు పెట్టించి బురిడీ కొట్టించింది.
- M Revan Reddy
- Updated on: Apr 20, 2025
- 12:43 pm
Telangana: కూతురు కోసం ఆ మాజీ పోలీస్ అధికారి ఏం చేశాడంటే…?
పిల్లల బాగోగుల కోసం తల్లిదండ్రులు పరితపిస్తుంటారు. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతారు. తన కూతురు కోసం ఓ మాజీ పోలీస్ అధికారి.. సినిమాను తలపించేలా మాస్టర్ మైండ్తో స్కెచ్ వేశాడు. ఆ అధికారి ఏం చేశాడు...? చివరికి ఏమైందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Apr 17, 2025
- 11:11 am
Telangana: పెద్ద గాలివాన.. తడిచిపోతున్న ధాన్యం.. పరుగుపరుగున వచ్చి రైతుకు సాయంగా నిలిచిన పోలీస్ అన్నలు
సాధారణంగా పోలీసులు అంటేనే కఠినంగా మానవత్వం లేకుండా ఉంటారని భావిస్తుంటారు. నిందితుల విషయంలో ఎంతో కఠినంగా ఉండే పోలీసులు.. సాధారణ వ్యక్తుల పట్ల అంతే మానవత్వంతో ఉంటారు. పెద్ద మనసును చాటుకున్న పోలీసులకు రైతులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Apr 16, 2025
- 9:04 am
Telangana: ఆలయం ముందు పోలీసుల గస్తీ.. దొంగల భయమో, వీఐపీలు వస్తున్నారనో కాదు..
ఒకప్పుడు రాజ్యాధికారం, ఆధిపత్యం కోసం జరిగిన యుద్ధాల్లో రాజ్యాలే కూలిపోయాయి. ఇప్పుడు ఆధిపత్య రాజకీయలతో గ్రామాలే అట్టుడికి పోతున్నాయి. ఈ రాజకీయ సెగ సామాన్యులకే కాదు.. ఆ గ్రామ ఇలవేల్పైన దేవుడికి కూడా తప్పడం లేదు. రాజకీయ వైరుధ్యాలతో గ్రామంలోని ఆలయానికి తాళం వేశారు. ఆ దేవుడికి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాల నిర్వహణ సందిగ్ధంలో పడిం
- M Revan Reddy
- Updated on: Apr 15, 2025
- 12:36 pm
Telangana: మృత్యువులోనూ వీడని బంధం… భర్త మృతిని తట్టుకోలేక భార్యకు గుండెపోటు..
వివాహ బంధం.. అంటే ఏడడుగుల జన్మల బంధం అంటారు. కష్ట సుఖాల్లో కలకాలం తోడుగా కలిసుంటామని పెళ్లినాడు ప్రమాణాలు చేసుకున్నారు. ఒకరి కోసం ఒకరిగా బతికారు. అన్యోన్య దాంపత్యానికి, అమలిన ప్రేమకు సాక్షులుగా నిలిచిన ఈ దంపతులు మృత్యువులోనూ తమ బంధాన్ని వీడలేదు. భర్త గుండెపోటుతో మృతి చెందగా, ఆ బాధను తట్టుకోలేక భార్య కూడా ప్రాణాలు విడిచింది.
- M Revan Reddy
- Updated on: Apr 15, 2025
- 10:32 am
కూతురి ప్రేమ వివాహం.. తట్టుకోలేక తండ్రి ఏం చేశాడో తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు.!
తండ్రి కూతుళ్ల బంధం అనేది ఒక ప్రత్యేకమైన బంధం. నవమాసాలు మోసి తనకు జన్మనిచ్చిన తల్లి కంటే.. తండ్రి అంటే కూతురికి ఆపేక్ష. తండ్రి-కూతుళ్లు ఫ్రెండ్స్ మాదిరిగా బాండింగ్ ఉంటుంది. తన కూతురు తనకు తెలియకుండా చేసిన ఓ పనికి ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా..? అయితే ఇరుగు పొరుగు జాలి చూపినా.. కన్న కూతురు ఏమాత్రం చలించలేదు.
- M Revan Reddy
- Updated on: Apr 13, 2025
- 11:18 am
Telangana: కూతురిని నిద్రలేపుదామని వెళ్లాడు.. దుప్పటి తీసి చూసి కంగుతిన్నాడు. పక్క గదిలో భార్యను చూసి!..
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని హౌసింగ్బోర్డు కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి కూతురు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. కూతురు బెడ్పై గొంతు కోసి పండి ఉండగా..తల్లి ఇంట్లోని ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
- M Revan Reddy
- Updated on: Apr 13, 2025
- 11:20 am
Telangana: మూఢనమ్మకాల మత్తులో కన్న కూతురిని బలి ఇచ్చిన తల్లి.. కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే
సృష్టికి ప్రతి సృష్టి జరుగుతున్న నేటి ఆధునిక కాలంలో ఇంకా పల్లెలు మూఢ నమ్మకాల మత్తులో జోగుతున్నాయి. మూఢత్వంతో సర్పదోషాన్ని తొలగించుకునేందుకు.. ఓ తల్లి కన్న కూతురిని నర బలి ఇచ్చి మాతృత్వానికే మాయం మచ్చను తీసుకువచ్చింది. కన్న కూతురునీ కడతేర్చిన ఆ తల్లికి కోర్టు ఎలాంటి శిక్ష విధించిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Apr 12, 2025
- 4:29 pm
Andhra: ముసుగేసిన ముగ్గురూ.. మోసగాళ్లు అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంక్
సాధారణంగా ఉన్నత స్థాయి ఉద్యోగులకు లక్షల జీతం, ఏసీ కారు, టీఏ, డీఏలు ఉంటాయి. ప్రైవేట్ రంగంలో కూడా ఉన్నత ఉద్యోగులకు ఇదే రకమైన వేతనాలు ఉంటాయి. మనం కలలో కూడా ఊహించని వీరికి లక్షల్లో వేతనాలు ఉన్నాయి. వీరు ఎవరో..? వీరు ఏం డ్యూటీ చేస్తారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Apr 11, 2025
- 1:19 pm
స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ ముఠా ఏం చేశారో తెలుసుకుంటే షాక్..!.
కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను నల్గొండ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. స్పిరిట్తో మద్యాన్ని కల్తీ చేసి వైన్స్, బార్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. 600 లీటర్ల కల్తీమద్యం, 180లీటర్ల స్పిరిట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాకు పాల్పడుతున్న నిందితులకు కొందరు వ్యాపారులు, బెల్టుషాప్ల నిర్వాహకులు సైతం సహకరిస్తున్నట్లు గుర్తించారు.
- M Revan Reddy
- Updated on: Apr 6, 2025
- 7:26 pm
Telangana: ఒక ఊరిలో నిత్యపూజలు.. మరో ఊరిలో కల్యాణం, బ్రహ్మోత్సవాలు.. ఈ రాములోరు చాలా స్పెషల్
ఏ దేవాలయాల్లోనైనా స్వామి వార్లకు నిత్య పూజలైనా.. పర్వదినాల్లో ప్రత్యేక పూజలైనా.. కళ్యాణం నిర్వహించడమైనా అదే ఆలయంలో జరుగుతాయి. కానీ ఈ దేవుడికి మాత్రం రెండు ఊళ్లలో.. రెండు ఆలయాలు ఉన్నాయి. ఒక గ్రామంలోని ఆలయంలో నిత్య పూజలు జరుగుతుండగా, మరో గ్రామంలోని ఆలయంలో బ్రహ్మోత్సవాలు, కళ్యాణం జరగడం విశేషం.
- M Revan Reddy
- Updated on: Apr 7, 2025
- 1:34 pm