బడ్జెట్ 2026 వార్తలు
కేంద్ర బడ్జెట్ 2026 వ్యక్తిగత ప్రయోజనాలపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, తెలుగు రాష్ట్రాలకు గణనీయమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఐటీ, ఫార్మా, మౌలిక సదుపాయాలు, తీరప్రాంత అభివృద్ధి, పర్యాటకం, ...
ముగిసిన నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం
2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. దాదాపు 80 నిమిషాలకు పైగా ఆమె ప్రసంగం సాగింది.
17 క్యాన్సర్ ఔషధలపై పన్ను తగ్గింపు
కేంద్ర బడ్జెట్లో క్యాన్సర్ రోగులు ఉపయోగించే 17 ఔషధాలపై పన్ను తగ్గించింది. సెంట్రల్ ఎక్సైజ్ నుంచి బయో గ్యాస్ ద్వారా ఉత్పత్తయ్యే సీఎన్జీకి మినహాయింపు ఇచ్చింది. అలాగే మైక్రో అవెన్స్పై పన్ను తగ్గింపు, పౌర విమానాల విడిభాగాలపై పన్ను తగ్గిస్తూ ప్రకటించారు కేంద్ర మంత్రి.
బడ్జెట్ ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు కొనసాగుతున్నాయి. 1600 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ కొనసాగుతుండగా, 700 పాయింట్లతో నిఫ్టి కొనసాగుతోంది. ఫ్యూచర్స్ ట్రేడింగ్పై ఎస్టీటీని పెంచడంతో నష్టాల్లోకి జారుకున్నాయి.
7 రైలు కారిడార్లు ప్రకటన
- ముంబై నుండి పూణే
- పూణే నుండి హైదరాబాద్
- హైదరాబాద్ నుండి బెంగళూరు
- బెంగళూరు నుండి చెన్నై
- హైదరాబాద్ నుండి చెన్నై
- ఢిల్లీ నుండి వారణాసి
- వారణాసి నుండి సిలిగురి
ప్రతి జిల్లాల్లో బాలిక హస్టల్
ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్లను నిర్మించనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. మూడు కొత్త ఎయిమ్స్లను కూడా ప్రకటించారు. బడ్జెట్లో ప్రభుత్వం యువతపై ప్రత్యేక దృష్టి సారిస్తుట్లు మంత్రి తెలిపారు.
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలమ్మ తెలిపారు. సరళతరం చేసిన ఫారాలు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. సామాన్యులు సైతం ఫైల్ చేసేలా మార్పులు ఉంటాయన్నారు.
సామాన్యులకు అనుకూలంగా ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు
సామాన్యులు సైతం ఆదాయపు పన్నును ఫైల్ చేసేలా పన్ను చట్టంలో మార్పులు తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఫైల్ చేసే ఫారాలను త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు.
ఇక పన్ను ఎగవేతదారులకు జైలు శిక్ష లేదు
ఆదాయపు పన్ను రిటర్న్లను వెల్లడించినందుకు ఇకపై ఎటువంటి జైలు శిక్ష ఉండదని, 30 శాతం పెనాల్టీ ఉంటుందని కేంద్ర మంత్రి నిర్మలమ్మ తెలిపారు. అంటే తమ ఆదాయాన్ని దాచిపెట్టే వారికి ఇకపై 30 శాతం వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
మెడికల్ హబ్స్ ఏర్పాటు
- మెడికల్ టూరిజం కోసం 5 రీజినల్ మెడికల్ హబ్స్ ఏర్పాటు
- ప్రతి జిల్లాలో ఒక గర్ల్స్ హాస్టల్ నిర్మాణం
- ఫిజిక్స్, ఆస్ట్రానమీ కోసం – భారీ టెలీస్కోపుల ఏర్పాటు
- వాల్ నట్స్, ఆల్మండ్స్ (బాదాం) పంటల సాగు కోసం ప్రోత్సాహకం
- భారత్ విస్తార్ – AI టూల్ (అగ్రిస్టాక్ పోర్టల్) ఏర్పాటు
- పంట ఉత్పత్తుల కోసం ప్రత్యేక AI టూల్ తో అగ్రిస్టాక్ పోర్టల్ ఏర్పాటు
ఆత్మనిర్భర్ భారత్కు రూ.2 వేల కోట్లు
- ఆత్మనిర్భర్ భారత్కు రూ.2 వేల కోట్లు
- SME రంగానికి రూ.10 వేల కోట్లు
- మైక్రో సెక్టార్కు రూ.2 వేల కోట్లు
- ఆత్మనిర్భర్ భారత్కు రూ.2 వేల కోట్లు
Tax Calculator
Cheaper & Expensive
- స్మార్ట్ ఫోన్లు
- చెప్పులు
- విదేశీ విద్య
- సోలార్, లెదర్ ఉత్పత్తుల ధరలు
- విమాన పరికరాలు
- విదేశాల పర్యటనలు
- బీడీలు, బ్యాటరీ
- మైక్రోవేవ్-ఓవెన్
- క్యాన్సర్ ఔషధం
- సీఎన్జీ, బయోగ్యాస్
- లగ్జరీ వాచ్లు
- విదేశీ మద్యం
- స్క్రాప్
- ఖనిజం
- ఫ్యూచర్స్ ట్రేడింగ్
Know your income tax slab
| Income Tax Slab | Income Tax Rate |
|---|---|
| 0-4 లక్షల రూపాయలు | 0% |
| 4-8 లక్షల రూపాయలు | 5% |
| 8-12 లక్షల రూపాయలు | 10% |
| 12-16 లక్షల రూపాయలు | 15% |
| 16-20 లక్షల రూపాయలు | 20% |
| 20-24 లక్షల రూపాయలు | 25% |
| 24 లక్షల పైన | 30% |
| Income Tax Slab | Income Tax Rate |
|---|---|
| 0-4 లక్షల రూపాయలు | 0% |
| 4-8 లక్షల రూపాయలు | 5% |
| 8-12 లక్షల రూపాయలు | 10% |
| 12-16 లక్షల రూపాయలు | 15% |
| 16-20 లక్షల రూపాయలు | 20% |
| 20-24 లక్షల రూపాయలు | 25% |
| 24 లక్షల పైన | 30% |
Sector Wise Announcements
Photo Gallery
View Moreకేంద్ర బడ్జెట్ 2026-27
మోదీ 3.0 ప్రభుత్వం మూడవ పూర్తి బడ్జెట్ ఫిబ్రవరి 1, 2026న సమర్పించనుంది. దేశ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణ గణాంకాల దృష్ట్యా ఈ బడ్జెట్ ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ప్రభుత్వం సాధారణ ప్రజలకు అనేక ముఖ్యమైన ప్రకటనలు చేస్తుందని ఆశిస్తున్నారు. రైతుల నుండి పని చేసే నిపుణుల వరకు ప్రతి ఒక్కరికీ ఈ బడ్జెట్లో ప్రధాన ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు.. అనేక ముఖ్యమైన ప్రకటనలు దేశ ఆర్థిక వ్యవస్థను పెంచుతాయని మరియు తయారీని పెంచుతాయని కూడా భావిస్తున్నారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనేక ముఖ్యమైన ప్రకటనల గురించి సూచనలు ఇచ్చారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టవచ్చు. 64 ఏళ్ల నాటి ఆదాయపు పన్ను చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇంకా రైతులకు ఉపశమనం కలిగించడానికి ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద అందించే మొత్తాన్ని రెట్టింపు చేయవచ్చు. ప్రాణాలను రక్షించే మందులు, ఔషధ రంగానికి సంబంధించి కూడా కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంతలో దేశంలోని మౌలిక సదుపాయాల కోసం దాని మూలధనాన్ని రూ.11 లక్షల కోట్ల నుండి రూ.15 లక్షల కోట్లకు పెంచాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. గత బడ్జెట్ రూ.50.65 లక్షల కోట్లు. ఈసారి రూ.60 లక్షల కోట్లు దాటవచ్చని తెలుస్తోంది.
బడ్జెట్ చరిత్ర 165 సంవత్సరాల నాటిది. స్వాతంత్ర్యం తర్వాత ఫిబ్రవరి చివరి రోజున సాయంత్రం 5 గంటలకు పార్లమెంటులో బడ్జెట్ చదివేది. 1999 నుండి సమయం ఉదయం 11 గంటలకు మార్చారు. 2014లో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. గతంలో బడ్జెట్ను బ్రీఫ్కేస్లో సమర్పించేవారు. తర్వాత దానిని తోలుతో తయారు చేసిన బ్రీఫ్ కేసుగా మార్చారు. ఇప్పుడు డిజిటల్గా మార్చేశారు.
బడ్జెట్ 2026కి సంబంధించిన ఆసక్తికర ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న – కేంద్ర వార్షిక బడ్జెట్ 2026-27ను ఎప్పుడు ప్రవేశపెడతారు?
జవాబు – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 ఫిబ్రవరి 1న కేంద్ర వార్షిక బడ్జెట్ను సమర్పిస్తారు.
ప్రశ్న – మోడీ 3.0 కోసం ఇది ఏ పూర్తి బడ్జెట్ అవుతుంది? రెండవదా లేదా మూడవదా?
సమాధానం – మోడీ 3.0 కి ఇది మూడవ పూర్తి బడ్జెట్ అవుతుంది. మొదటి పూర్తి బడ్జెట్ జూలై 2024లో సమర్పించారు.
ప్రశ్న – బడ్జెట్లో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఏవైనా ప్రకటనలు చేయగలదా?
సమాధానం – ప్రభుత్వం, ఆర్బీఐ ద్రవ్యోల్బణంపై పని చేశాయి. ఈసారి కూడా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి అనేక ప్రకటనలు చేయవచ్చు.
ప్రశ్న – బడ్జెట్లో ఆదాయపు పన్నుకు సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉందా?
సమాధానం – బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది సాధారణ పన్ను చెల్లింపుదారులకు గణనీయమైన ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.
ప్రశ్న – రైతులకు సంబంధించి బడ్జెట్లో ఎలాంటి ప్రకటనలు చేయవచ్చు?
సమాధానం – ఈసారి రైతులకు ప్రధాన ప్రకటనలు చేసే అవకాశం ఉంది. పీఎం కిసాన్ నిధిని రెట్టింపు చేసే ప్రకటన చేయవచ్చు.
ప్రశ్న – తెలుగింటి కోడలు, ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ఎన్నోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు?
జవాబు – ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా 9వ సారి కేంద్ర బడ్జెట్ను సమర్పించనున్నారు
ప్రశ్న – బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏయే అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు?
జవాబు – బడ్జెట్లో ఈపీఎఫ్ నెల పెన్షన్ను రూ.5 వేలకు పెంచాలని, ఆదాయపు పన్ను మినహాయింపును రూ.10 లక్షలకు పెంచాలని ట్రేడ్ యూనియన్లు కేంద్రాన్ని కోరుతున్నాయి.
ప్రశ్న – రూపాయి మారకం విలువ మరింత పడిపోకుండా బడ్జెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు..?
జవాబు – డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో క్షీణించింది. దీన్ని నియంత్రించేందుకు దిగుమతులపై సుంకాలను పెంచే అవకాశం ఉంది.
ప్రశ్న – బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఆటోమొబైల్ పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఉంటాయా?
జవాబు – బడ్జెట్లో ఆటో మొబైల్ పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఉండొచ్చు. ముఖ్యంగా EV అమ్మకాలను పెంచే దిశగా ప్రత్యేక రాయితీలు ప్రకటించే అవకాశముంది.
ప్రశ్న – బడ్జెట్లో గృహ రుణంపై పన్ను మినహాయింపు పరిమితి పెంచుతారా?
జవాబు – ఈసారి బడ్జెట్లో గృహ రుణంపై పన్ను మినహాయింపు పరిధిని రూ.5 లక్షలకు పెంచాలని సాధారణ ప్రజలు కోరుకుంటున్నారు.
ప్రశ్న – బడ్జెట్లో మొదటిసారిగా వేతన జీవులకు లబ్ధి చేకూర్చింది ఎవరు?
జవాబు – ఇందిరా గాంధీ ప్రభుత్వ హయాంలో 1974 బడ్జెట్లో మొదటిసారి స్టాండర్డ్ డిడక్షన్ ప్రవేశపెట్టారు.
ప్రశ్న – బడ్జెట్కు ముందు హల్వా వేడుకను ఎందుకు జరుపుకుంటారు?
జవాబు – ఏదైనా శుభకార్యం చేసే ముందు, ఏదైనా తీపి తినాలి.. అందుకే బడ్జెట్ వంటి పెద్ద కార్యక్రమాలకు ముందు ఈ వేడుకను నిర్వహించే సాంప్రదాయం ఉంది.
ప్రశ్న – రైల్వే బడ్జెట్ను బడ్జెట్లో ఎప్పుడు విలీనం చేశారు?
జవాబు – 2016లో అప్పటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు చివరి రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2017 నుంచి వార్షిక బడ్జెట్, రైల్వే బడ్జెట్ను విడివిడిగా ప్రవేశపెట్టే సంప్రదాయానికి స్వస్తి పలికారు. రైల్వే బడ్జెట్ను కూడా సాధారణ బడ్జెట్లోనే విలీనం చేశారు.
ప్రశ్న- స్వతంత్ర భారతావనిలో తొలి కేంద్ర బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
జవాబు – దేశంలో తొలి బడ్జెట్ను 1947 నవంబరు 26న నాటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు.
ప్రశ్న- అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినవారు ఎవరు?
జవాబు – కేంద్ర బడ్జెట్ను అత్యధికంగా 10సార్లు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టారు. 1962 నుంచి 69 మధ్య కాలంలో ఆర్థిక మంత్రిగా 10సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. పి.చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్ సిన్హా 8 సార్లు, మన్మోహన్ సింగ్ 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ప్రశ్న- ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు
జవాబు – నిర్మలా సీతారామన్ ఇప్పటి వరకు 8 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2026 ఫిబ్రవరి 1న 9వ సారి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ప్రశ్న – బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీని ఎప్పుడు మార్చారు?
జవాబు – 2016 వరకు కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి చివరి పనిదినం రోజు సమర్పించే సాంప్రదాయం ఉండేది. 2017లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీన్ని ఫిబ్రవరి 1 తేదీకి మార్చారు. అప్పటి నుంచి ప్రతి యేటా ఆ తేదీన బడ్జెట్ సమర్పిస్తున్నారు.
ప్రశ్న- బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళలు ఎవరు?
జవాబు – ఇందిరా గాంధీ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళ. 2019లో నాటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టి ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచారు.