అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రులు ఎవరంటే?

samatha 

01 february 2025

Credit: Instagram

నేడు ఫిబ్రవరి 1న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.  ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్ ప్రవేశ పెడుతుంది.

అయితే 1947 నుంచి బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరుగుతుంది. కాగా, బడ్జెట్‌ను ఎక్కువ సార్లు ప్రవేశ పెట్టిన వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1947 షణ్ముఖం చెట్టి నుంచి నిర్మలా సీతారామన్ వరకు అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రులు వీరేనంట.  

మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.1959 నుంచి 1963 వరకు. అలాగే 1967 నుంచి 1969 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది.

మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం కూడా9ఏళ్లపాటు బడ్జెట్ ప్రవేశ పెట్టాడరు. దేవె గౌడ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఈయన బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది.

ప్రణబ్ ముఖర్జీ 8సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 1982 నుంచి 1984 వరకు,2009 నుంచి 2012 వరకు బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది.

యశ్వంత్ సిన్హా  7సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలాగే భారత దేశపు మొదటి గవర్నర్ సీ.డీ దేశ్ ముఖ్ 1951 నుంచి 1956 వరకు బడ్జెట్ ప్రవేశ పెట్టారు.

నిర్మలా సీతారామన్ మోదీ నేతృత్వంలో ఇప్పటి వరకు ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇది ఆమెకు 8వ బడ్జెట్.