Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బడ్జెట్ 2025

బడ్జెట్ 2025

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2025-26 వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఈ వార్షిక బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తినెలకొంటోంది. బడ్జెట్‌కు ముందే 8వ పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మోదీ సర్కారు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం రూ.1000గా ఉన్న ఈపీఎఫ్ పెన్షన్‌ను నెలకు రూ.5 వేలకు పెంచాలని కేంద్రాన్ని ట్రేడ్ యూనియన్లు కోరుతున్నాయి. అలాగే ఆదాయపు పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలన్న ట్రేడ్ యూనియన్లు కోరుతున్నాయి. గత కొంతకాలంగా రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో క్షీణించడంతో దీన్ని నిరోధించేందుకు బడ్జెట్‌లో దిగుమతులపై అధిక సుంకాలను విధించే అవకాశముంది. రియల్ ఎస్టేట్ రంగానికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కేంద్రానికి వినతులు అందుతున్నాయి.

ఇంకా చదవండి

Income Tax: దేశంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ఎందుకు ప్రవేశపెట్టారు?

Income Tax: దేశంలో ఆదాయపు పన్ను చట్టం-1961 ఇప్పటికే ఉన్నప్పుడు, దేశంలో కొత్త బిల్లు లేదా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏమిటి? ఇప్పుడు దీనికి కారణాన్ని ఆదాయపు పన్ను శాఖ స్వయంగా తెలిపింది.బిల్లులోని జీతాలకు సంబంధించిన నిబంధనలను సులభంగా అర్థం చేసుకోవడానికి వీటిని ఒకే చోట ఉంచారు..

New Income Tax Bill 2025: కొత్త ఐట్టీ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్రం.. అప్పటివరకు ఉభయ సభలు వాయిదా..

విపక్షాల నిరసనల మధ్య వక్ఫ్‌ బోర్డు సవరణ చట్టంపై జేపీసీ నివేదిను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది కేంద్రం. కొత్త ఐటీ బిల్లును సభలో ప్రవేశపెట్టిన తరువాత సెలెక్ట్‌ కమిటీ పంపించారు. ఉభయసభలు మార్చి 10వ తేదీ వరకు వాయిదా పడ్డాయి. వక్ఫ్‌ బోర్డు ఆస్తులను ముస్లింలకు దూరం చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు ఒవైసీ..

Parliament Budget Session: రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యావాద తీర్మానం.. కాంగ్రెస్‌ను చీల్చి చెండాడిన మోదీ

PM Narendra Modi: దివ్యాంగుల సంక్షేమం కోసం తాము ఒక ప్రణాళికను రూపొందించడమే కాకుండా దానిని క్షేత్రస్థాయిలో కూడా అమలు చేశామని ప్రధాని మోదీ అన్నారు. లింగమార్పిడి సమాజం హక్కులకు సంబంధించి, దానికి చట్టపరమైన రూపం ఇవ్వడానికి ప్రయత్నించామని వివరించారు. భారతదేశ అభివృద్ధి..

Parliament: వేలాది మందికి నివాళులు.. ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభ ఛైర్మన్ ధన్‌కర్ అభ్యంతరం.. అసలేం జరిగిందంటే..

రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వేలాది మందికి నివాళులు అంటూ తన స్పీచ్‌లో ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం రేగింది. రాజ్యసభ ఛైర్మన్ ధన్‌కర్..ఖర్గే వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. మీ అంతట మీరే సంఖ్యని పెంచేస్తారా..అని వారించారు.

Income Tax: రూ.13.7 లక్షల వరకు ఆదాయపు పన్ను ఉండదు.. జీరో ట్యాక్స్ ఫార్ములా గురించి మీకు తెలుసా?

Income Tax: ఈ ప్రయోజనం కొత్త పన్ను విధానంలో ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందుకే మీరు రూ.13.7 లక్షల వరకు ఆదాయంపై జీరో ట్యాక్స్ ఎలా చెల్లించవచ్చో తెలుసుకుందాం. గత బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే పన్ను చెల్లింపుదారుల కోసం ఆర్థిక మంత్రి..

Kishan Reddy: బడ్జెట్ సమావేశాల్లో కీలక పరిణామం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి ధన్కర్.. ఎందుకంటే..

బొగ్గు, గనుల రంగంలో తీసుకువచ్చిన ఆవిష్కరణలపై కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రశంసించారు. బొగ్గు, గనుల రంగంలో మరింత పారదర్శకత తీసుకురావడంలో అలాగే సామర్థ్యాన్ని పెంచడంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కృషిచేశారని ధన్కర్ అభినందించారు.

Indian Railways: త్వరలో 100 అమృత్‌ భారత్‌ రైళ్లు.. తెలుగు రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు.. కాజీపేటలో..

2026లోపు దేశమంతా కవచ్‌ టెక్నాలజీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రైల్వే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ముఖ్య స్టేషన్ల పరిధిలో కవచ్‌ టెక్నాలజీని వేగంగా ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో అన్ని చోట్ల పూర్తిచేస్తామని తెలిపారు. అలాగే.. సికింద్రాబాద్‌లో కవచ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Budget 2025: ఈవీ రంగానికి బడ్జెట్‌ బూస్ట్‌.. భారీగా తగ్గనున్న ధరలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ ఈవీ రంగాన్ని బలోపేతం చేయడానికి వివిధ చర్యలు తీసుకుంటున్నాయి. ఈ దారిలోనే భారత్‌ కూడా నడుస్తుంది. ఇటీవల ప్రకటించిన బడ్జెట్‌లో ఈవీ రంగానికి సంబంధించిన కొన్ని వస్తువుల సుంకాల తగ్గింపును ప్రకటించింది. దీంతో భారతదేశంలో ఎలక్ట్రానిక్‌ వాహనాల ధరలు మరింత తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Srinu
  • Updated on: Feb 3, 2025
  • 7:45 am

Budget 2025: బడ్జెట్‌ ఎఫెక్ట్‌.. తగ్గనున్న స్మార్ట్‌ఫోన్‌లు టీవీల ధరలు.. వినియోగదారులకు చేరేనా..?

కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకటన తర్వాత స్మార్ట్‌ఫోన్‌లు, టెలివిజన్‌ల ధరలు తగ్గుతాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కేంద్రం కీలకమైన ఎలక్ట్రానిక్ భాగాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) తగ్గింపును ప్రకటించింది. దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీని పెంచడమే లక్ష్యంగా ఈ తగ్గింపులను ప్రకటిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ ఫోన్‌లు, టీవీల ధరలపై బడ్జెట్‌ ఎఫెక్ట్‌ ఏ స్థాయిలో ఉంటుందో? తెలుసుకుందాం.

  • Srinu
  • Updated on: Feb 3, 2025
  • 7:00 am

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సామాన్యులకు అందుబాటులో లగ్జరీ ట్రెయిన్స్..!

వందేభారత్ స్లీపర్-చైర్ కార్, అమృత్ భారత్, నమో భారత్ 350 రైళ్ల ఉత్పత్తి జరుగుతోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందుకు కేంద్ర బడ్జెట్‌లో ఆమోదం లభించిందన్నారు. దీంతో ఈ రైలు ఉత్పత్తికి మార్గం సుగమమైందన్నా అశ్విని వైష్ణవ్.. ఈ రైళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైళ్లకు భిన్నంగా ఉంటాయన్నారు.