బడ్జెట్ 2024

బడ్జెట్ 2024

వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికను వివరించే కేంద్ర బడ్జెట్‌ను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న దేశ ఆర్థిక మంత్రి పార్లమెంటులో సమర్పిస్తారు. అయితే మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సారి పూర్తి బడ్జెట్‌కు బదులుగా మధ్యంతర బడ్జెట్‌ని సమర్పించనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పిస్తారు.

ప్రస్తుత కేంద్ర బడ్జెట్ 2024 మార్చి 31 వరకు అమలులో ఉంటుంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి అయ్యే సాధారణ ఆదాయవ్యయ అంచనాలు, అలాగే ఆర్థిక లోటు, ఆర్థిక పనితీరుతో ఈ మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. అందుకే దీన్ని తాత్కాలిక బడ్జెట్‌గానే పరిగణించాలి. అందుకే ఇందులో కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో పెద్ద మార్పులు లేదా కొత్త దీర్ఘకాలిక ప్రాజెక్ట్‌లు ఉండే అవకాశం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కొత్త ప్రభుత్వాలు పూర్తిస్థాయి బడ్జెట్‌ జులైలో ఉంటుంది. ఇప్పటి వరకు ఐదుసార్లు బడ్జెట్ సమర్పించిన నిర్మలా సీతారామన్‌కు.. ఫిబ్రవరి 1న సమర్పించే మధ్యంతర బడ్జెట్ ఆరోవది కావడం విశేషం.

ఈ మధ్యంతర బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయడం సహజమే. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ కేటాయింపులు పెంచుతూ మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆ మేరకు రైతులు, మహిళలు, బడుగు, బలహీన వర్గాలు, చిరు వ్యాపారులు ఆకట్టుకునేలా నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్ ఉండే అవకాశముంది. అలాగే దేశీయ ఆవిష్కరణలు, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా ప్రత్యేక రాయితీలను ప్రకటించే అవకాశముంది. ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో ఆదాయ పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచి ఊరట కలిగించాలని వేతన జీవులు కోరుకుంటున్నారు.

ఇంకా చదవండి

Gold investment: గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.

ఈసారి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా బంగారం ధర పతనమైంది. బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాలపై సుంకాల్లో సగానికిపైగా కోత పెట్టడంతో వాటి ధరలు మార్కెట్లో భారీగా పతనమయ్యాయి. ఇప్పటివరకూ బంగారం, వెండిపై 10 శాతం బేసిక్ కస్టమ్స్ ఉండగా, దీన్ని 5 శాతానికే పరిమితం చేశారు. దీనికి అదనంగా విధిస్తున్న వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సుంకాన్ని 5 శాతం నుంచి 1 శాతానికి పరిమితం చేశారు.

Budget 2024: ఈ బడ్జెట్ లో.. మహిళలకు ‘బంగారం’ లాంటి శుభవార్త.!

నిర్మలమ్మ బడ్జెట్ లో ఏముంది? మొత్తం బడ్జెట్ గురించి సామాన్యుడికి అవసరం లేదు. నిర్మలమ్మ పద్దులో తనకు వచ్చిన లాభమేంటి? తనపై పడే భారమేంటి? అనే లెక్కేసుకుంటాడు. అలా చూస్తే.. మోదీ 3.oలో వచ్చిన ఈ తొలి బడ్జెట్ లో కొన్ని రంగాలకు నెంబర్స్ భారీగా కనిపించాయి. ముఖ్యంగా ఏపీకి ఈసారి లాభం చేకూర్చేటట్లు కేటాయింపులు జరిపారనే చెప్పాలి. అటు మహిళలకు మాత్రం పెద్దపీట వేశారు. వారికి బంగారంలాంటి శుభవార్త చెప్పారు.

NITI Aayog Meeting: కేంద్ర బడ్జెట్‌పై ఇండియా కూటమి సీఎంల కన్నెర్ర.. రేవంత్ రెడ్డి, స్టాలిన్ బాటలోనే మమతా బెనర్జీ..

కేంద్ర బడ్జెట్‌పై కన్నెర్ర చేస్తున్న ఇండియా కూటమి ముఖ్యమంత్రులు... నీతి ఆయోగ్‌ మీటింగ్‌ని బాయ్‌కాట్‌ చేయడమే కాదు, అదే రోజు పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.

Budget 2024: తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.

బడ్జెట్.. బడ్జెట్ 2024 - 2025 ఆర్ధిక సంవత్సరానికి గాను ఎలా ఉండబోతుంది.. అనేది ముందుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ముందుగా ఏ వస్తువుల యొక్క ధరలు పెరిగాయి.. ఏ ఏ వస్తువుల ధరలు తగ్గాయో ఇక్కడ తెలుసుకుందాం. దానికంటే ముందుగా.. మునుపటి సంవత్సరం బడ్జెట్ సెషన్‌లో, టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, కంప్రెస్డ్ గ్యాస్, రొయ్యల ఫీడ్, వజ్రాలు వంటి వస్తువుల ధరలు తగ్గించబడ్డాయి.  అయితే సిగరెట్లు, విమాన ప్రయాణం, వస్త్రాల ఖర్చులు పెరిగాయి.

Union Budget 2024: ఉపాధి కల్పనే లక్ష్యం.. నైపుణ్య శిక్షణే మార్గం.. కేంద్రం ఏకంగా రూ. 2 లక్షల కోట్లతో కొత్త పథకం

యువ రక్తంతో నిండిన భారతదేశం మాత్రమే కాదు, నిరుద్యోగ సమస్య ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను వేధిస్తోంది. విద్యావకాశాలు పెరగడంతో యూనివర్సిటీల నుంచి పట్టభద్రులు కుప్పలుతెప్పలుగా బయటికొస్తున్నారు. అయితే చాలామంది చేతిలో డిగ్రీ పట్టాలు ఉంటున్నాయి కానీ ఏదైనా ఉద్యోగం చేయడానికి అవసరమైన నైపుణ్యాలు కొరవడుతున్నాయి. నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేయడంలో ఇది కూడా ఒక కీలకాంశంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొన్ని కొత్త పథకాలను ప్రతిపాదించింది.

Watch Video: అసలు, వడ్డీ ఏపీ ప్రజలే కట్టాలి.. కేంద్ర బడ్జెట్‌పై విజయసాయి కీలక వ్యాఖ్యలు

కేంద్ర బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యసభలో ఎన్డీయే, ఇండియా కూటమిపై ఆయన మండిపడ్డారు. బడ్జెట్‌లో మొత్తం రూ. 48 లక్షల కోట్లు ఏపీకే ఇచ్చారా ? అంటూ ప్రశ్నించారు.

AP Budget 2024: ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..

అన్ని ఆశలు.. ఆమెపైనే... ఆమె తీసుకొచ్చే రెడ్ పౌచ్‌లో.. చదివే ట్యాబ్‌లో ఆంధ్రప్రదేశ్ గురించి ఏం చెబుతారా అని..? విభజన జరిగి పదేళ్లయినా ఇంకా అభివృద్ధి బాట పట్టని రాష్ట్రాన్ని ఎలా పట్టాలెక్కిస్తారా అని.. అదృష్టవశాత్తు ఏపీలో అధికారంలోకి ఎన్డీఏ కూటమి రావడం... టీడీపీ-జనసేన సపోర్ట్‌ కేంద్రంలో కీలకం కావడంతో.. గత ఐదేళ్లలో పెద్దగా వినిపించని గుడ్ న్యూస్‌లు ఈ సారి వినిపించే అవకాశం ఉందన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది.

Nirmala Sitharaman: బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే..

ఏటా బడ్జెట్‌ వేళ ఆర్థిక కేటాయింపుల పైనే కాదు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ధరించే చీరల పైనా అందరి దృష్టి ఉంటుంది. దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా, హుందాతనాన్ని ద్విగుణీకృతం చేసేలా ఆమె ఎంచుకునే చీరలంటే ఎంతోమంది మహిళలకు ఆసక్తి. చేనేత చీరలంటే ఎంతో ఇష్టపడే నిర్మలమ్మ ఈసారి కూడా హ్యాండ్లూమ్‌ శారీనే ఎంచుకున్నారు. తెలుపు రంగు, బంగారు మోటిఫ్‌లతో ఉన్న మెజెంటా బోర్డర్‌ కలగలిపిన సిల్క్‌ చీరలో ఆమె కన్పించారు.

Budget 2024: బడ్జెట్‌లో వారికే అగ్రతాంబూలం.. పన్ను ఆదా చేసేలా కీలక చర్యలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్ 2024ను పార్లమెంట్‌లో సమర్పించారు. సాధారణంగా కేంద్ర బడ్జెట్ గురించి భారతదేశంలో అధికంగా ఉండే మధ్య తరగతి ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా కేంద్రం పన్ను విధానాల్లో తీసుకునే చర్యలు ఈ వర్గాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ప్రకటనలో రూ. 3 నుంచి రూ. 7 లక్షల ఆదాయంపై 5 శాతం పన్నుతో సహా కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించడానికి మంత్రి కొన్ని ఉపశమన చర్యలను ప్రవేశపెట్టారు. గతంలో రూ.3 నుంచి 6 లక్షల శ్లాబుపై 5 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఈ మార్పులతో కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులు రూ. 17,500 ప్రయోజనాన్ని పొందుతారు.

  • Srinu
  • Updated on: Jul 25, 2024
  • 3:40 pm

Telangana Budget: అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. అయితే సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత పదేళ్ల అస్తవ్యస్త పాలనకు ప్రజలు చరమగీతం పాడామన్నారు.

Indian Railways: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం భారీ కేటాయింపులు.. మొత్తం ఎన్ని వేల కోట్లంటే..

కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పింది.. రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం భారీగా కేటాయింపులు చేసింది. ఏపీలో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం రూ. 9151 కోట్లు కేటాయించగా.. తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం రూ.5336 కోట్లు కేటాయించింది.

Budget 2024: నిరుద్యోగంపై కేంద్రం సమరం.. కొత్త ఉద్యోగులను ప్రోత్సహించేలా కొత్త పథకాలు

భారతదేశంలోని నిరుద్యోగంపై కేంద్రం దృష్టి సారించింది. ముఖ్యంగా కొత్త ఉద్యోగాలను ప్రోత్సహించేలా బడ్జెట్ 2024-25లో కీలక చర్యలను ప్రతిపాదించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తన ఏడో బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర బడ్జెట్ 2024-25లో మూడు ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాలను ప్రకటించారు. ఈ మూడు పథకాలు ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ఉన్నాయి. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో నమోదు చేసుకోవడంతో పాటు మొదటి సారి ఉద్యోగుల గుర్తింపుపై దృష్టి సారించి ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నారు.

  • Srinu
  • Updated on: Jul 24, 2024
  • 4:35 pm

Budget 2024: ఆస్తి కొనుగోళ్లపై టీడీఎస్ బాదుడు.. తప్పించుకోవడానికి లేకుండా కఠిన నిబంధనలు

కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విషయంలో అందరికీ తెలిసిందే. ఈ బడ్జెట్‌లో ఉద్యోగులకు ఊరటనిచ్చే అనేక అంశాలు ఉన్నాయి. అదే సమయంలో వివిధ నిబంధనలపై కేంద్రం సీరియస్‌గా ఉందని, బడ్జెట్ ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా స్థిరాస్తి కొనుగోళ్లపై పన్ను నిబంధనలను ఇకపై పౌరులు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.

  • Srinu
  • Updated on: Jul 24, 2024
  • 4:20 pm

Budget 2024: వేతన జీవులకు బడ్జెట్‌లో ఊరట.. ఆ విధానం ద్వారా రూ.17,500 ఆదా

బీజేపీ ప్రభుత్వం వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టాక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ మంగళవారం 2024-25 ఆర్థిక సంవత్సర పూర్తి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ప్రజలకు మేలు చేసేలా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా గతేడాది అమల్లోకి తీసుకొచ్చిన కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు చేశారు. వేతన జీవులకు మేలు కల్పించేలా ఉద్యోగులు గరిష్టంగా రూ.17,500 ఆదా చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

  • Srinu
  • Updated on: Jul 24, 2024
  • 4:09 pm

Gold Rate: బడ్జెట్ ఎఫెక్ట్… ఒక్కరోజులోనే భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బడ్జెట్ ఎఫెక్ట్... ఒక్కరోజులోనే బంగారం ధర భారీగా పతనం... అదే బాటలో వెండి ధర కూడా నేల చూపులు చూస్తోంది. పసిడి ప్రియులకి ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఇంతకీ బంగారం, వెండిపై కస్టమ్స్‌ సుంకం తగ్గితే ఎవరికి లాభం? నేరుగా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందా? వ్యాపారులకి మేలు చేస్తుందా?

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!