AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బడ్జెట్ 2026

బడ్జెట్ 2026

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2026-27 వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఈ వార్షిక బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తినెలకొంటోంది. బడ్జెట్‌కు ముందే 8వ పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మోదీ సర్కారు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం రూ.1000గా ఉన్న ఈపీఎఫ్ పెన్షన్‌ను నెలకు రూ.5 వేలకు పెంచాలని కేంద్రాన్ని ట్రేడ్ యూనియన్లు కోరుతున్నాయి. అలాగే ఆదాయపు పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలన్న ట్రేడ్ యూనియన్లు కోరుతున్నాయి. గత కొంతకాలంగా రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో క్షీణించడంతో దీన్ని నిరోధించేందుకు బడ్జెట్‌లో దిగుమతులపై అధిక సుంకాలను విధించే అవకాశముంది. రియల్ ఎస్టేట్ రంగానికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కేంద్రానికి వినతులు అందుతున్నాయి.

ఇంకా చదవండి

AP Budget: రాష్ట్ర బడ్జెట్‌లో శాఖల వారీగా.. వివిధ సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలకు కేటాయింపులు

ఎన్నో సవాళ్లు ఉన్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో రాష్ట్రం చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి జరిగిందని మంత్రి పయ్యావుల కేశశ్ అన్నారు. ఇప్పటి వరకు ఏం సాధించాం... ఇంకా ఏం సాధించాలనే అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందించామని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ బడ్జెట్‌ను తీర్చిదిద్దామన్నారు.

AP Budget 2026 Highlights: ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ రూ.53,752 కోట్లు

Andhra Pradesh Budget 2026 updates in Telugu: ఉదయం11 గంటలకు ఆర్ధికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

Pralhad Joshi: హైస్పీడ్ రైల్ కారిడార్లలో 3 హైదరాబాద్‌కే.. తెలంగాణకు ఎంతో చేశాం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

ప్రపంచంలోనే భారత్ మూడోవ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని.. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల అభ్యున్నతికి.. దోహదపడుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్.. 2047వరకు వికసిత్ భారత్ నిర్మాణ లక్ష్యంగా ఉందని.. ఇది ఆర్థిక శక్తిని మరింత బలోపేతం చేస్తుందని ప్రహ్లాద్ జోషి వివరించారు.

భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోంది: ప్రధాని మోదీ

ప్రపంచం కొత్త ఆధునిక యుగం వైపు పయనిస్తోందని ప్రధానమంత్ర నరేంద్ర మోదీ అన్నారు. కొత్త శిఖరాలను అధిరోహిస్తున్న మార్గంలో మనం చాలా ముఖ్యమైన దశకు చేరుకున్నాము. ప్రపంచం మన ప్రతిభ, ప్రాముఖ్యతను గుర్తిస్తోంది. భారతదేశం తొమ్మిది ప్రధాన దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసింది. భారత్ అనేక దేశాలకు విశ్వసనీయ భాగస్వామి. మనం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉన్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

22 ఏళ్ళలో ఇదే తొలిసారి.. ప్రధానమంత్రి సమాధానం లేకుండానే ధన్యవాద తీర్మానాన్ని ఆమోదం!

గురువారం (ఫిబ్రవరి 05) పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఏడవ రోజు. బడ్జెట్ సమావేశాల్లో ఏడవ రోజున, రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని లోక్‌సభలో గగ్గోలు మధ్య వాయిస్ ఓటు ద్వారా ఆమోదించారు. దాదాపు 22 సంవత్సరాలలో ప్రధానమంత్రి ప్రసంగం లేకుండా ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించడం ఇదే మొదటిసారి.

Budget 2026: బడ్జెట్‌లో సీనియర్‌ సీటిజన్స్‌కు ఏవైనా ప్రయోజనాలు ఉన్నాయా?

Budget 2026: బడ్జెట్ 2026 సీనియర్ సిటిజన్లకు కొత్త పన్ను మినహాయింపులు, అదనపు ఆరోగ్య తగ్గింపులు లేదా ద్రవ్యోల్బణ సంబంధిత ఉపశమనం అందించలేదు. వైద్య ఖర్చుల కోసం సెక్షన్ 80DDB మారలేదు. లేదా పెన్షనర్లకు లేదా స్థిర ఆదాయం ఉన్నవారికి ఎటువంటి కొత్త..

Nirmala Sitharaman: ఇక జిల్లాకో బాలికల హాస్టల్..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. ప్రజా వైద్యం, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, బాలికల ఉన్నత విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్లు, మూడు కొత్త ఎయిమ్స్‌ల నిర్మాణం, పశువైద్య కళాశాలలకు ఆర్థిక సహాయం, లక్ష మంది అనుబంధ ఆరోగ్య నిపుణుల సృష్టి వంటి కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఈ బడ్జెట్ విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారతకు ఊతమిస్తుంది.

  • Phani CH
  • Updated on: Feb 2, 2026
  • 6:29 pm

Budget 2026: మ్యూచువల్‌ ఫండ్‌ ఆదాయంపై కీలక మార్పులు.. ఏప్రిల్‌ నుంచి అమలు!

Budget 2026: బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ నియమాన్ని పూర్తిగా తొలగించాలని ప్రతిపాదించింది. కొత్త నియమం ప్రకారం, డివిడెండ్‌లు లేదా మ్యూచువల్ ఫండ్ యూనిట్ల నుండి వచ్చే ఆదాయంపై ఏదైనా వడ్డీ ఖర్చు తగ్గింపు ఉండదు. ఈ మార్పు పెట్టుబడిదారుల పన్ను భారాన్ని..

Budget 2026: తక్షణ ఊరట నుంచి భవిష్యత్‌ వృద్ధికి పాలసీ బ్రిడ్జ్

బడ్జెట్‌–2026లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక స్థిరత్వం–వృద్ధి మధ్య సమతుల్యతకు ప్రాధాన్యం ఇచ్చింది. FY27 నాటికి ఆర్థిక లోటును జీడీపీలో 4.3 శాతానికి తగ్గించాలన్న లక్ష్యాన్ని కొనసాగిస్తూనే, మౌలిక సదుపాయాలపై రూ.12.2 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్‌, ఎంఎస్‌ఎంఈలు, హై–వాల్యూ వ్యవసాయ పంటలపై కొనసాగింపు విధానాలతో పాటు, బయోఫార్మా శక్తి, రేర్‌ ఎర్త్‌ కారిడార్లు, ఎస్ఎంఈ గ్రోత్‌ ఫండ్‌ వంటి కొత్త పథకాలతో భవిష్యత్‌ వృద్ధికి పునాది వేసింది.

వేతన జీవులను నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్‌

కేంద్ర బడ్జెట్ 2024లో వేతనజీవులు ఆదాయపు పన్ను తగ్గింపు ఆశించారు. అయితే, కొత్త, పాత పన్ను స్లాబుల్లో మార్పులు లేకపోవడంతో నిరాశ ఎదురైంది. ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫైలింగ్ గడువును జులై 31 వరకు, నాన్-ఆడిట్ బిజినెస్‌లు, ట్రస్టులకు ఆగస్టు 31 వరకు పొడిగించారు. ఆదాయపు పన్ను నిబంధనలు సరళీకరించబడ్డాయి, కొత్త చట్టాన్ని అర్థం చేసుకోవడానికి తగిన సమయం లభిస్తుంది.

  • Phani CH
  • Updated on: Feb 2, 2026
  • 1:55 pm

కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్.. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రకారం, కొన్ని వస్తువుల ధరలు తగ్గుతాయి, మరికొన్ని పెరుగుతాయి. క్యాన్సర్, డయాబెటిస్ మందులు, EV బ్యాటరీలు, మొబైల్స్, తోలు ఉత్పత్తులు చౌకగా మారనున్నాయి. విదేశీ విద్య, వైద్య పరికరాలపై కూడా ఊరట లభిస్తుంది. అయితే, ఆల్కహాల్, సిగరెట్లు, పాన్ మసాలా, లగ్జరీ వస్తువుల ధరలు పెరగనున్నాయి.

  • Phani CH
  • Updated on: Feb 2, 2026
  • 1:50 pm

‘కంటైనర్‌’ వెనక ఇంత కథ ఉందా ??

భారతదేశంలో కంటైనర్ల తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి కేంద్రం ₹10,000 కోట్లను కేటాయించింది. ఇది దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించి, చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. విదేశీ వాణిజ్యం, ఆర్థిక భద్రత, భౌగోళిక-రాజకీయ ప్రాముఖ్యత దృష్ట్యా ఈ నిర్ణయం కీలకం. టాటా స్టీల్ వంటి సంస్థలు కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టడంతో స్వయం సమృద్ధి లక్ష్యం నెరవేరనుంది.

  • Phani CH
  • Updated on: Feb 2, 2026
  • 1:44 pm