బడ్జెట్ 2024

బడ్జెట్ 2024

వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికను వివరించే కేంద్ర బడ్జెట్‌ను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న దేశ ఆర్థిక మంత్రి పార్లమెంటులో సమర్పిస్తారు. అయితే మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సారి పూర్తి బడ్జెట్‌కు బదులుగా మధ్యంతర బడ్జెట్‌ని సమర్పించనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పిస్తారు.

ప్రస్తుత కేంద్ర బడ్జెట్ 2024 మార్చి 31 వరకు అమలులో ఉంటుంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి అయ్యే సాధారణ ఆదాయవ్యయ అంచనాలు, అలాగే ఆర్థిక లోటు, ఆర్థిక పనితీరుతో ఈ మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. అందుకే దీన్ని తాత్కాలిక బడ్జెట్‌గానే పరిగణించాలి. అందుకే ఇందులో కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో పెద్ద మార్పులు లేదా కొత్త దీర్ఘకాలిక ప్రాజెక్ట్‌లు ఉండే అవకాశం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కొత్త ప్రభుత్వాలు పూర్తిస్థాయి బడ్జెట్‌ జులైలో ఉంటుంది. ఇప్పటి వరకు ఐదుసార్లు బడ్జెట్ సమర్పించిన నిర్మలా సీతారామన్‌కు.. ఫిబ్రవరి 1న సమర్పించే మధ్యంతర బడ్జెట్ ఆరోవది కావడం విశేషం.

ఈ మధ్యంతర బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయడం సహజమే. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ కేటాయింపులు పెంచుతూ మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆ మేరకు రైతులు, మహిళలు, బడుగు, బలహీన వర్గాలు, చిరు వ్యాపారులు ఆకట్టుకునేలా నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్ ఉండే అవకాశముంది. అలాగే దేశీయ ఆవిష్కరణలు, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా ప్రత్యేక రాయితీలను ప్రకటించే అవకాశముంది. ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో ఆదాయ పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచి ఊరట కలిగించాలని వేతన జీవులు కోరుకుంటున్నారు.

ఇంకా చదవండి

Save Taxes: ట్యాక్స్‌ను ఆదా చేసుకోవాలా..? బెస్ట్ పొదుపు మార్గాలివే!

ధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కల్పించినట్లయింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లు మూడు రేట్లు పెరిగాయి. ట్యాక్స్ చెల్లించిన వారి డబ్బులను దేశాభివృద్ధికి వినియోగిస్తున్నట్లు మంత్రి అన్నారు. అలాగే కొన్ని ప్రభుత్వ పథకాల్లో ట్యాక్స్‌ను ఆదా చేసుకోవచ్చు. మరి ఏ పథకంలో ఎంత మొత్తం పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..

One Nation One Income Tax: దేశంలో వన్ నేషన్ -వన్ ఇన్‌కమ్ ట్యాక్స్ అమలులోకి వస్తుందా?

ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ సుల్తా దేవ్ దేశంలో వన్ నేషన్ వన్ GST ప్రబలంగా ఉంటే, వన్ నేషన్ వన్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం కొత్త ఆదాయపు పన్ను, పాత ఆదాయపు పన్ను విధానం అమలులో ఉందని, దీని కారణంగా పన్ను చెల్లింపుదారులలో చాలా గందరగోళం నెలకొందని ఆయన అన్నారు. దేశంలోని మొత్తం..

Plastic Notes: కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ నోట్లను తీసుకువస్తోందా? పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చిన మంత్రి

రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభ ఎంపీ అనిల్ దేశాయ్ ఆర్థిక మంత్రిని ఇతర దేశాలలో చెలామణిలో ఉన్న నోట్లతో ప్రస్తుత పేపర్ కరెన్సీని మార్చే ఆలోచన ఉందా అని అడిగారు. అనేక దేశాల్లో ప్లాస్టిక్ నోట్లు చాలా మన్నికగా ఉన్నాయని నిరూపించారని, ప్లాస్టిక్ నోట్ల నుంచి నకిలీ కరెన్సీని తయారు చేయడం కూడా చాలా కష్టం కదా అని ఆయన ప్రశ్నించారు. అటువంటి పరిస్థితిలో..

Budget Effect: మధ్యంతన బడ్జెట్‌ ఎఫెక్ట్‌.. దేశ ప్రజలకు ఉపశమనం కలిగించే అంశాలేంటి?

ఇది మధ్యంతర బడ్జెట్‌ ఉన్నందున బడ్జెట్‌లో ఊరట కల్పించే అంశాలు ఏమిటి ప్రకటించలేదు మంత్రి. అయితే బడ్జెట్‌కంటే ముందు అంటే జనవరిలో కేంద్రం ఓ ప్రకటన చేసింది. మొబైల్‌ ఫోన్‌లలో వాడే వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మరి ఈ బడ్జెట్‌ సందర్భంగా ఎలాంటి ఉపశమనాలు ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..

Budget 2024: మరింత చవకగా గృహ రుణాలు? వడ్డీ రేట్లు తగ్గిపోతాయా? మధ్యంతర బడ్జెట్‌ ఇస్తున్న సంకేతమదేనా?

గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయా? ఈఎంఐల భారం కూడా తేలికగా మారనుందా? అంటే అవుననే సమధానాన్నే నిపుణులు ఇస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు తమ సొంత ఇళ్లు కొనుక్కోవడం/నిర్మించుకోవడం కోసం ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించాలని చూస్తోంది. వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్లను నిర్మించడంపై దృష్టి సారించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) గ్రామీణ్ కూడా గృహ రుణాలకు ఊతమిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

  • Madhu
  • Updated on: Feb 6, 2024
  • 1:10 am

Budget 2024: బడ్జెట్‌లో కేంద్రం గుడ్‌న్యూస్‌.. రైతుల ఆదాయం రెట్టింపు

పాడి ఉత్ప్తతులను, ఎగుమతులను ప్రోత్సహిస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసేది మన దేశమే. ప్రపంచం మొత్తం పాలలో 24.64 శాతాన్ని మన దేశమే ప్రొడ్యూస్ చేస్తోంది. అంటే నాలుగింట ఒక వంతు మన దగ్గరే రెడీ అవుతోంది. ఇది 2021-2022 నాటి లెక్క. ఇక 2014-15 నుంచి 2022-23 మధ్య.. అంటే 9 ఏళ్ల కాలంలో దేశంలో పాల ఉత్పత్తి 58 శాతం పెరిగింది. మరి రైతుల..

Budget 2024: గ్రామీణ ప్రాంతాలపై కేంద్రం ఫోకస్‌.. గృహ నిర్మాణదారులకు బడ్జెట్‌లో కీలక నిర్ణయం

కోట్లాది ఇళ్ల నిర్మాణం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు బాగా బలం చేకూరుతుంది. అందుకే కేంద్రం.. చాలా ఆలోచనతో ఈ ప్రకటన చేసింది. పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం వల్ల పల్లెల వైపు ప్రజలను ఆకర్షించవచ్చు. వలస పోయినవారిని వెనక్కు రప్పించడానికి, ఆ ప్రాంతాల్లో వారికి చేతి నిండా పని ఉండేట్లు చేయడానికి ఇది ఉపకరిస్తుంది. ఒక్క దెబ్బకు ఎకానమీకి బూస్ట్ ఇవ్వడంతో పాటు..

Budget 2024: నిర్మలమ్మ కీలక ప్రకటన.. గర్భాశయ క్యాన్సర్‌ను నిరోధించేందుకు వ్యాక్సిన్‌

దేశంలో మరిన్ని వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రణాళికను కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశంలో మరిన్ని మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్​ను నివారించడానికి బాలికలకు టీకాలు వేయడాన్ని ప్రోత్సాహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం,

PM Svanidhi Yojana: ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకం.. వారందరికీ ఎటువంటి హామీ లేకుండా రుణాలు!

PM స్వానిధి యోజన కోసం ఏదైనా ప్రభుత్వ బ్యాంకు నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం, మీకు పథకం ఫారమ్ ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు అవసరమైన పత్రాలను ఇవ్వాలి. ఆధార్ కార్డ్, ఖాతా నంబర్ వివరాలు, ఇతర సమాచారాన్ని అందించిన తర్వాత మీకు రుణం మంజూరు చేయడం జరుగుతుంది.

EV Sector: బడ్జెట్‌ ప్రభావంతో ఎలక్ట్రిక్‌ వాహనాల రంగం మరింత బలోపేతం.. 2.5 లక్షల ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా పబ్లిక్ ఛార్జర్ల లభ్యతలో గణనీయమైన వృద్ధి ఉంటుందని రాప్టీ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో దినేష్ అర్జున్ తెలిపారు. EV కంపెనీలు తమ వినియోగదారుల నుండి అధిక మార్కెట్ ఆమోదాన్ని పొందుతాయి. పెట్టుబడిదారుల ఆసక్తి కూడా పెరుగుతుంది. బ్యాటరీ నిర్వహణ విభాగంలో ఇతర సాంకేతికతలో లోతైన ఆవిష్కరణలు చేయడానికి వ్యవస్థాపకులను ప్రోత్సహిస్తుంది.

Gold Price: బడ్జెట్‌ సమావేశాల తర్వాత బంగారం ధరలు పెరగనున్నాయా?

డిసెంబర్ 2023లో, బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటాయి. జనవరిలో విలువైన లోహాలు పడిపోయాయి. జనవరి నెలలో బంగారం ధర రూ.2200 తగ్గింది. గత వారంలో పెరుగుదల కనిపించింది. జనవరి 31న ధర నిలకడగా ఉంది. అంతకు ముందు రెండు రోజుల్లో బంగారం ధర రూ.320 పెరిగింది. ఫిబ్రవరి 1న బంగారం ధర రూ.170 పెరిగింది. గుడ్‌రిటర్న్స్.

Budget-2024: బడ్జెట్‌లో రూ.1111111 కోట్ల కేటాయింపు.. ఈ మేజిక్‌ ఫిగర్‌ ఏంటి?

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో కూడా మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిన మోడీ ప్రభుత్వం.. ఏ కొత్త పథకాన్నిగాని, ఆదాయపు పన్నులో ఎటువంటి మార్పును గాని, ఏ పథకానికి ఎటువంటి పెద్ద బడ్జెట్ కేటాయింపులను గాని ప్రకటించలేదు. అయితే ఆమె ప్రభుత్వ మూలధన వ్యయం, మౌలిక సదుపాయాలపై ఖర్చులను పెంచే లక్ష్యాన్ని పెట్టుకున్నారు.

Budget 2024: పేద మహిళలను లక్షాధికారులను చేసే స్కీమ్ ఇది.. బడ్జెట్లో సీతమ్మ కీలక ప్రకటన..

పేద మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే అనేక పథకాలను వీరి సంక్షేమం కోసం అమలు చేస్తోంది. ఇప్పుడు మరో పథకాన్ని తీసుకొచ్చింది. గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలను లక్షాధికారులను చేసేలా లఖ్ పతి దీదీ అనే పథకాన్ని ప్రకటించారు. దీని సాయంతో ఒక మహిళ ఏడాదిలో కనీసం రూ. లక్ష సంపాదించే విధంగా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.

  • Madhu
  • Updated on: Feb 2, 2024
  • 1:01 am

Dharmendra Pradhan: జై అనుసంధాన్.. వికసిత్ భారత్ వైపు ముందడుగు.. బడ్జెట్‌పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..

2024-25 మధ్యంతర బడ్జెట్‌పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ఈ బడ్జెట్ 'వికసిత్ భారత్' వైపు ఒక ముందడుగు అంటూ పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో అతిపెద్ద ప్రకటన 'జై అనుసంధన్' పథకం. నేటి బడ్జెట్‌లో రూ.లక్ష కోట్లు కార్పస్ ఫండ్‌గా ప్రకటించారు. ఏ ప్రైవేట్ సంస్థ అయినా రుణాన్ని ఎంచుకుంటే వారికి 50 ఏళ్లపాటు వడ్డీ లేని రుణం లభిస్తుంది.

Lakshadweep: లక్షద్వీప్‌ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి.. బడ్జెట్‌లో ప్రత్యేకంగా..

మాల్దీవులకు ఒక్కసారిగా పర్యాటకులు తగ్గిపోయారు. భారత్‌ నుంచి మాల్దీవులకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఎంతలా అంటే అప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న భారత్‌ ఒకేసారి 5వ స్థానంలోకి పడిపోయింది. లక్షద్వీప్‌కు ఒక్కసారిగా బుకింగ్స్‌ పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి బడ్జెట్‌...