Tech Tips: ఫోన్ ఛార్జర్ను ఎప్పుడూ ప్లగ్లో ఉంచుతున్నారా? ఏమవుతుందో తెలుసా..?
Tech Tips: ఇప్పటి ఆధునిక స్మార్ట్ఫోన్ ఛార్జర్లలో భద్రతా ఫీచర్లు ఉంటాయి. ఫోన్ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత అవి ఆటోమేటిక్గా తక్కువ విద్యుత్ వినియోగించే మోడ్కు మారిపోతాయి. అందువల్ల వెంటనే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం తక్కువే. అయినప్పటికీ అవసరం..

Tech Tips: చాలామందికి ఒక సాధారణ అలవాటు ఉంటుంది. మొబైల్ ఫోన్ను ఛార్జ్ చేసిన తర్వాత కూడా ఛార్జర్ను ప్లగ్ నుంచి తీసేయకుండా అలాగే సాకెట్లో ఉంచేస్తారు. అవసరం వచ్చినప్పుడు వెంటనే ఉపయోగించుకోవచ్చని భావించి చాలా మంది ఇలా చేస్తుంటారు. అయితే ఈ అలవాటు నిజంగా సురక్షితమా? ఎప్పుడూ ఛార్జర్ను ప్లగ్లో ఉంచితే ఏమైనా ప్రమాదమా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. టెక్నాలజీ నిపుణుల ప్రకారం.. ఆధునిక ఛార్జర్లు భద్రతా ఫీచర్లతో రూపొందించినప్పటికీ, నిరంతరం ప్లగ్లో ఉంచడం వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉండే అవకాశం ఉంది.
ఫోన్ లేకపోయినా విద్యుత్ వినియోగం:
ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే ఫోన్ కనెక్ట్ చేయకపోయినా కూడా ఛార్జర్ కొద్దిగా విద్యుత్ను వినియోగిస్తూనే ఉంటుంది. దీనిని స్టాండ్బై పవర్ లేదా ఫాంటమ్ ఎనర్జీ అని అంటారు. ఒక్క ఛార్జర్ వినియోగించే విద్యుత్ పరిమాణం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఇంట్లో అనేక ఛార్జర్లు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు ఇలా ప్లగ్లో ఉండిపోతే మొత్తం విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో ఇది విద్యుత్ బిల్లుపై కూడా ప్రభావం చూపవచ్చు.
ఇది కూడా చదవండి: Multibagger: కేవలం 1 లక్ష రూపాయలే రూ.65 లక్షలుగా మారింది.. ఇన్వెస్టర్లను లక్షాధికారులుగా చేసిన స్టాక్!
ఛార్జర్ జీవితం తగ్గే అవకాశం:
ఛార్జర్ను ఎప్పుడూ ప్లగ్లో ఉంచితే లోపల ఉన్న ఎలక్ట్రానిక్ భాగాలు నిరంతరం విద్యుత్ ప్రవాహానికి గురవుతాయి. దీంతో కాలక్రమంలో అవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఛార్జర్ పనితీరు తగ్గిపోవడం లేదా ఆయుష్షు తగ్గిపోవడం వంటి సమస్యలు రావచ్చు. ఉపయోగం లేనప్పుడు ఛార్జర్ను ప్లగ్ నుంచి తీసేయడం ద్వారా దీని జీవితకాలాన్ని పెంచుకోవచ్చు.
వేడెక్కడం, అగ్ని ప్రమాదం:
కొన్ని సందర్భాల్లో ఛార్జర్లు వేడెక్కే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా పాతవి, నాసిరకం నాణ్యత కలిగినవి లేదా దెబ్బతిన్న ఛార్జర్లు అయితే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అత్యంత అరుదైన పరిస్థితుల్లో ఈ వేడి కారణంగా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇంట్లో లేకపోయినప్పుడు లేదా రాత్రి సమయంలో ఉపయోగం లేకపోతే ఛార్జర్ను ప్లగ్ నుంచి తీసేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
వోల్టేజ్ మార్పుల ప్రభావం:
వర్షాలు, విద్యుత్ లోపాలు లేదా ఇతర కారణాల వల్ల విద్యుత్ సరఫరాలో వోల్టేజ్ మార్పులు సంభవిస్తుంటాయి. అప్పుడు ప్లగ్లో ఉన్న ఛార్జర్లపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఇలా తరచూ జరిగితే ఛార్జర్ లోపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉపయోగం లేనప్పుడు ప్లగ్ తీసేయడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
ఆధునిక ఛార్జర్లు సురక్షితమే:
ఇప్పటి ఆధునిక స్మార్ట్ఫోన్ ఛార్జర్లలో భద్రతా ఫీచర్లు ఉంటాయి. ఫోన్ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత అవి ఆటోమేటిక్గా తక్కువ విద్యుత్ వినియోగించే మోడ్కు మారిపోతాయి. అందువల్ల వెంటనే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం తక్కువే. అయినప్పటికీ అవసరం లేనప్పుడు ఛార్జర్ను ప్లగ్ నుంచి తీసేయడం మంచి అలవాటు. మొత్తానికి ఛార్జర్ను ఎప్పుడూ ప్లగ్లో ఉంచడం పెద్ద ప్రమాదం కాకపోయినా, కొద్దికొద్దిగా విద్యుత్ వృథా కావడం, ఛార్జర్ ఆయుష్షు తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ఉపయోగం పూర్తయ్యాక ఛార్జర్ను ప్లగ్ నుంచి తీసేయడం ఒక చిన్న అలవాటు అయినా, ఇది విద్యుత్ ఆదా, భద్రత, పరికరాల ఆయుష్షు పెరగడానికి సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: Gold Price Today: భారీగా పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే..
మరిన్ని టెక్ వార్తల కోసం ఇ క్కడ క్లిక్ చేయండి




